కోడుమూరు: మండలంలోని అనుగొండ గ్రామానికి చెందిన ఎదురూరు విష్ణువర్దన్రెడ్డి అనుచరులు 100మంది శనివారం కోడుమూరులో కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుగొండ గ్రామానికి చెందిన విష్ణు అనుచరులు రామక్రిష్ణారెడ్డి, సర్వేశ్వరరెడ్డి, మధుసూధన్రెడ్డిల ఆధ్వర్యంలో బోయ భాస్కర్, నరసింహులు, పరమేష్, రామాంజినేయ, సుధాకర్, మౌలాలి, మహేష్, వెంకటేష్, కంకణ, పాపన్న, బజారి, సాయిపతి, సోమన్న, కురువ నాగేష్, రాఘవేంద్రలు వైఎస్సార్సీపీలో చేరగా, వారికి కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్లు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
కోడుమూరుకు చెందిన అద్దుగల కల్యాణ్ రామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీడీపీకి చెందిన 50మంది యువకులు వైఎస్సార్సీపీ చేరగా, వారికి కుడా మాజీ చైర్మన్ అభ్యర్థి కోట్ల హర్షవర్దన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్లు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్రెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్కుమార్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్నాయుడు, స్థానిక నాయకులు సాజిత్ ఆలీ, మల్లారెడ్డి, మగ్బుల్, సాయి, జగదీష్, మాసుమ్ తదితరులు పాల్గొన్నారు.