కాంగ్రెస్‌తోనే పేదలకు సంక్షేమ ఫలాలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదలకు సంక్షేమ ఫలాలు

Published Mon, May 6 2024 6:15 AM

కాంగ్రెస్‌తోనే పేదలకు సంక్షేమ ఫలాలు

డిచ్‌పల్లి: రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్‌తోనే సంక్షేమ ఫలాలు అందుతాయని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. మండలంలోని మెంట్రాజ్‌పల్లి, నడిపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొని ప్రసంగించారు. ఆగస్ట్‌ 15 లోపే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనిదినాలు పెంచుతామన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డెలిగేట్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ చింత శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆనంద్‌, ధర్మాగౌడ్‌, శ్యాంసన్‌, దేవకరుణ, వాసుబాబు, నవీన్‌రెడ్డి, శ్రీనివాస్‌, సాగర్‌, వెంకటస్వామి, సుదర్శన్‌ పాల్గొన్నారు.

రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

పలు గ్రామాల్లో కార్నర్‌ మీటింగ్స్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement