సొంతగూటికి కాశీనగర్‌ ఎన్‌ఏసీ చైర్‌పర్సన్‌ సుధారాణి | Sakshi
Sakshi News home page

సొంతగూటికి కాశీనగర్‌ ఎన్‌ఏసీ చైర్‌పర్సన్‌ సుధారాణి

Published Mon, May 6 2024 5:00 AM

సొంతగూటికి కాశీనగర్‌ ఎన్‌ఏసీ చైర్‌పర్సన్‌ సుధారాణి

పర్లాకిమిడి: ఇటీవల బీజేపీలో చేరిన గజపతి జిల్లా కాశీనగర్‌ ఎన్‌ఏసీ చర్‌పర్సన్‌ మేడిబోయిన సుధారాణి తిరిగి ఆదివారం బీజేడీ పార్టీలో చేరారు. ఏప్రిల్‌ 23న కాశీనగర్‌లో జరిగిన బీజేపీ మిశ్రణ్‌ పర్వ్‌లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రదీప్‌ పాణిగ్రాహి సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. అనంతరం పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు నామినేషన్‌ ర్యాలీలో ప్రముఖంగా కనిపించారు. ఆమెతో పాటు కాశీనగరం బీజేడీ ఉపాధ్యక్షులు రోక్కం సతీష్‌, రోక్కం రాంప్రసాద్‌ (జ్యోతి) తదితరులు కూడా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఇంతలోనే ఆదివారం సాయంత్రం బీజేడీ పార్టీ మిశ్రణ్‌ పర్వ్‌లో సుధారాణి పాల్గొని శంఖం చేతబట్టింది. బీజేడీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని అధిష్టానం చెప్పడంతో తిరిగి సొంతగూటికి చేరినట్టు సమాచారం. మిశ్రణ్‌ పర్వ్‌లో బీజేడీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి ప్రదీప్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతి రావు, కాశీనగరం ఎన్‌ఏసీ వైస్‌ చైర్మన్‌ రఘురాం సాహు, పార్టీ సమితి అధ్యక్షులు సీహెచ్‌ లోకనాథం, తిరుపతి పాణిగ్రాహి, బసంత్‌ దాస్‌, వి.ఎస్‌.ఎన్‌.రాజు ఉన్నారు.

Advertisement
Advertisement