బీజేపీని పక్కన పెట్టండి | Sakshi
Sakshi News home page

బీజేపీని పక్కన పెట్టండి

Published Mon, May 6 2024 7:05 AM

బీజేపీని పక్కన పెట్టండి

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను పక్కన పెట్టినట్లుగా కేంద్రంలో బీజేపీని పక్కకు పెట్టి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మా ట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నా రు. మేరు సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపి, ఆది శ్రీనివాస్‌ను సత్కరించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బింగి మహేశ్‌, మేరు జేఏసీ చైర్మన్‌ మునిగల రాము, సంఘం జిల్లా అధ్యక్షుడు ఓదెల శ్రీనివాస్‌, పట్టణాధ్యక్షుడు మంతెన దుర్గేశ్‌, మహేశ్‌, అనిల్‌, శంకర్‌, సాయికృష్ణ పాల్గొన్నారు.

హరీశ్‌రావు నోరు అదుపులో పెట్టుకో..

చందుర్తి(వేములవాడ): అబద్దాల హరీశ్‌రావు నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. మండలంలోని కట్టలింగంపేట, లింగంపేట, మల్యాల గ్రామాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మీ నాయకుని మాదిరిగా గెలిచి విదేశాలకు పారిపోకుండా.. ఇక్కడే ప్రజల్లో ఉంటున్నానని స్పష్టం చేశారు. గతంలో మంత్రి హోదాలో వచ్చి నువ్వు ప్రారంభించిన కలికోట సూరమ్మ చె రువు ప్రాజెక్టు ఎటు పోయిందని ప్రశ్నించారు. కుడి, ఎడమ కాల్వలకు శంకుస్థాపన చేసి తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. నాయకులు నాగం కుమార్‌, చింతపంటి రామస్వామి, సంటి ప్రసాద్‌, గండ్ర లక్ష్మణ్‌రావు, సత్తయ్య, చంద్రం, బొజ్జ మల్లేశం, ముస్కు పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement