మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది | Sakshi
Sakshi News home page

మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది

Published Mon, May 6 2024 7:05 AM

మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది

● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి

వేములవాడ: మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ వేములవాడకు వస్తున్న సందర్భంగా బాలాజీనగర్‌లోని స భాస్థలి వద్ద ఆదివారం భూమిపూజ చేశారు. ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ వేములవా డ కు చేరుకుంటున్న ప్రధాని మోదీ రాజన్నను దర్శించుకుంటారని తెలిపారు. ప్రధాని బహిరంగ జనసభను విజయవంతం చేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రశేఖర తివారి, మనోహర్‌రెడ్డి, ప్రతాప రామకృష్ణ, వికాస్‌రావు, రాణీరుద్రమ, కుమ్మరి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement