● వైఎస్సార్సీపీ ఉదయగిరి అభ్యర్థి
రాజగోపాల్రెడ్డి
వింజమూరు(ఉదయగిరి): తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వైఎస్సార్సీపీ ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి తెలిపారు. మండలంలోని బుక్కాపురం, చవటపాళెం, చంద్రపడియ, చింతలపాళెంలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయసాయిరెడ్డి సహకారంతో ఉదయగిరి ప్రాంతాన్ని డెల్టాతో సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి మేకపాటి కుటుంబం విద్య, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ఇది మరింత ముందుకు సాగాలంటే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. పేదల పక్షాన పోరాడే జగనన్నకు మద్దతివ్వాలో.. పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్న చంద్రబాబుకు అవకాశమివ్వాలో ఆలోచించాలని కోరారు. పొరపాటున బాబుకు అవకాశమిస్తే పేదలు అన్యాయమైపోతారని, పెత్తందారులు దోపిడీ చేస్తారన్నారు. పేదల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని రెండోసారి సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రేవునూరు శ్రీనివాసులురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఆనంగి రమణయ్య, స్థానిక నేతలు పల్లాల కొండారెడ్డి, ఎం.విజయ్రెడ్డి, కాటంరెడ్డి రమణారెడ్డి, సర్పంచ్ రసూల్, కాటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మీరెడ్డి, రవికుమార్రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.