బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక | Sakshi
Sakshi News home page

బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక

Published Mon, May 6 2024 1:20 AM

-

కందుకూరు: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కందుకూరు పట్టణంలోని 13వ వార్డుకు చెందిన 25 కుటుంబాలు టీడీపీని వీడాయి. వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ సమక్షంలో ఆదివారం పార్టీలో చేరాయి. వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో బుర్రా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుమ్మడి వెంకట్రావు, గుమ్మడి భాస్కర్‌, చెంచయ్య, షేక్‌ షంషీర్‌ బాబు, కాలేషా, ఎస్‌కే మహబూబ్‌బాషా, షాహిద్‌, మన్సూర్‌, షామినా, ఫాతిమా, జరీమా, కరిమున్నీషా తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే గుడ్లూరు మండలం రాళ్లపాడులో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు బుర్రా సమక్షంలో పార్టీలో చేరాయి. గొల్లప్రోలు రవి, కొల్లూరు కొండయ్య, పాపబోయిన మహేంద్ర, దగ్గుమాటి రవి తదితరులు చేరిలో వారిలో ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించి ఓట్లు వేయించాలని ఈ సందర్భంగా బుర్రా వారికి సూచించారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement