తిరుత్తణి: తమ గ్రామంలో నీటి సమస్య పరిష్క రించలేదని వీసీఆర్ కండ్రిగ మహిళలు శనివారం నొచ్చిలి రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తిరుత్తణి యూనియన్ చిరుగుమి పంచాయతీలో ని వీసీఆర్ కండ్రిగలో వందకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలోని బోర్వెల్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో ఎండల తీవ్రత పెరిగిన నేపఽథ్యంలో భూగర్భజలా లు అడుగంటి పోయాయి. దీంతో బోర్వెల్ ఎండి పోయి తాగునీటి సమస్య నెలకొంది. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విషయమై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినా పంచాయ తీ సర్పంచ్ నీటి సమస్య పరిష్కారం గురించి ప ట్టించుకోలేదు. దీంతో నీటి సమస్య మరింత తీ వ్రం అయ్యింది. దీంతో ఆగ్రహించిన మహిళలు 100 మంది గ్రామానికి సమీపంలోని కేజీ కండ్రిగ, నొచ్చిలి రాష్ట్ర రహదారిలో రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోతో ఆ మార్గంలో అర్ధగంట పాటు రాక పోకలు స్తంభించాయి. పంచాయతీ సర్పంచ్ లక్ష్మి భర్త వడివేలు గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అతనితో మహిళలు వాగ్వాదానికి దిగా రు. బీడీఓ కార్యాలయ అధికారులు హామీ మేరకు మహిళలు రాస్తారోకో విరమించారు.
నొచ్చిలి రహదారిపై మహిళల రాస్తారోకో
Published Sun, May 5 2024 6:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement