మనసున్న ముఖ్యమంత్రి జగన్‌ | Sakshi
Sakshi News home page

మనసున్న ముఖ్యమంత్రి జగన్‌

Published Mon, May 6 2024 4:25 AM

-

ప్రమాద, విపత్కర పరిస్థితుల్లోను చేతికి ఎముక లేదు అన్న చందంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు సహాయం అందిస్తూ వస్తున్నారు. చంద్రబాబులా ప్రమాదాలలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడకుండా.. బాధితులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయా ప్రాంతానికి వెళ్లి హడావుడి, ప్రచార ఆర్భాటాలు చేయకుండా యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తూ.. బాధితులకు పరిహారం కూడా రెండు, మూడు రోజుల్లోనే అందించారు. ఆ తరువాతే సీఎం జగన్‌ బాధితులను పరామర్శిస్తూ వారికి పరిహారం అందిందా? లేదా? అని మరోసారి వాకబు చేస్తూ మనసున్న ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పటి టీడీపీకి.. ఇప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మేలుపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement