కన్నీటి సుడులు.. కరిగె సూరీడు | Sakshi
Sakshi News home page

కన్నీటి సుడులు.. కరిగె సూరీడు

Published Mon, May 6 2024 4:25 AM

-

విశాఖ సిటీ : చంద్రబాబుకు అరచేతిలో వైకుంఠం చూపించడంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఏ సంఘటనైనా, ప్రమాదన్నైనా తన రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాద బాధితులకు సత్వర సాయం అందించాలని పరితపించారు. టీడీపీ హయాంలో సంభవించిన విపత్కర పరిస్థితుల్లో హడావుడి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమైతే.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలపై దృష్టి సారించింది. అప్పట్లో నష్టపరిహారం కోసం బాధితులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రాగా.. ఈ ప్రభుత్వం ప్రమాదం జరిగిన గంటల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమచేసింది. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రమాద సమయాల్లో గత, ప్రస్తుత ప్రభుత్వాలు స్పందించి సహాయం అందించిన తీరుపై ఓటర్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో హుద్‌హుద్‌ తుపాను సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ ఐదేళ్లలో ఎల్‌జీ పాలిమర్స్‌, హార్బర్‌ ఘటనల్లోను, అలాగే వరదలతో పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా అల్లూరి జిల్లాలో నాలుగు మండలాలు నీట మునిగిన సమయంలో ప్రభుత్వం కేవలం 72 గంటల్లోనే బాధితులకు నష్ట పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement
Advertisement