గోదావరి వరదల సమయంలోను.. | Sakshi
Sakshi News home page

గోదావరి వరదల సమయంలోను..

Published Mon, May 6 2024 4:25 AM

గోదావరి వరదల సమయంలోను..

భారీ వర్షాలు కారణంగా గోదావరి పోటెత్తింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తాను పర్యటనకు వచ్చేలోగా సహాయక చర్యలతో పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని చెప్పారు. దీంతో పాక్షికంగా దెబ్బతిన్న సుమారు 20 వేల ఇళ్లకు రూ.2 వేలు చొప్పున మూడు రోజుల్లోనే పరిహారం అందించారు. నాలుగో రోజు సీఎం చింతూరులో పర్యటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ పరిహారం అందిందని జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

Advertisement
Advertisement