మోసం చేస్తున్న కాంగ్రెస్
మాదిగలను కాంగ్రెస్పార్టీ మోసం చేస్తోందని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీ ఆరోపించారు.
వరుసగా కొత్తకోట, ఎర్రవల్లిలో జనజాతర సభలు
వివరాలు IIలో u
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/అలంపూర్:
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ అగ్రనేతల వరుస పర్యటనలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా శనివారం కొత్తకోటలో రోడ్షో, కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల జిల్లా ఎర్రవళ్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో నేతలు పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం.. సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎర్రవల్లి చౌరస్తాలో జరిగిన సభలో నాయకులు ఏమన్నారో వారి మాటల్లోనే..
అభివాదం చేస్తున్న రాహుల్గాంధీ
● భారీగా తరలివచ్చిన
పార్టీ శ్రేణులు, అభిమానులు
● అగ్రనేత రాహుల్గాంధీ,
సీఎం రేవంత్రెడ్డి ప్రసంగానికి
విశేష స్పందన
● పాలమూరుకు ఏం చేస్తారో
వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు