పసుపు–కుంకుమ తప్ప ఏమీ ఇచ్చింది లేదు: మహిళలు | Sakshi
Sakshi News home page

పసుపు–కుంకుమ తప్ప ఏమీ ఇచ్చింది లేదు: మహిళలు

Published Mon, May 6 2024 10:25 AM

పసుపు–కుంకుమ తప్ప ఏమీ ఇచ్చింది లేదు: మహిళలు

ఉదయం 7 గంటల సమయంలో హైవే పక్కనే దుంపలగట్టు వద్ద కనకాంబరాలు పూలు కోస్తున్న మహిళలను సాక్షి బృందం పలకరించింది. ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా అంటే బ్రహ్మాండమని టక్కున ముక్త కంఠంతో జవాబు చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ ఆసరా డబ్బు మూడు సార్లు వచ్చింది. అమ్మఒడి వచ్చింది. మా అత్త సుబ్బమ్మకు పింఛన్‌ వచ్చింది...ఇలా చెకచెక నందిరెడ్డి స్వరూప చెప్పుకొచ్చింది. ఆడోళ్లకు ప్రభుత్వ పథకాలు జగన్‌ ప్రభుత్వంలోనే వచ్చాయని, చంద్రబాబు హయాంలో పసుపు–కుంకుమ పథకం తప్పా ఇంకేమీ రాలేదని నాగులు, శివమ్మ అనే మహిళలు గొంతు కలిపారు. అది కూడా ఎన్నికల ముందు ఇచ్చారన్నారు. మళ్లీ జగనే రావాలని చెప్పారు.

Advertisement
Advertisement