-
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించేదుకు రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను బడుల్లో చేర్పించడం వలన ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు పొందుతారు. జాతీయ ఉపకార వేతనం కింద ఏడాదికి రూ.9 వేల నుంచి రూ.11 వేలు మంజూరు అవుతాయి. వీటికి తోడు పింఛన్లు, రాయితీలకు అవసరమైన సర్టిఫికెట్స్, అలవెన్స్లు, ఉచిత ఉపకరణాలు ఇలా ప్రతి ఒక్కటి ప్రభుత్వమే అందజేస్తుంది. వైకల్యం ఉందని బాధపడకుండా పిల్లలను బడులకు పంపాలి. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల పట్ల పిల్లల తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి. – జి.మహేశ్వరరావు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష -
విస్తృతంగా ఇంటింటి సర్వే
సాధారణ విద్యార్థులతో సమానంగా దివ్యాంగులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రజల్లో అవగాహన లేక ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వీటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అంగవైకల్యంతో పుట్టిన తమ పిల్లల కర్మ ఇంతేనంటూ బడికి పంపలేకపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో వైకల్యానికి తోడు విద్య లోపించి ఇళ్లలోనే మగ్గిపోతున్నారు. ఇలాంటి వారందరినీ పాఠశాలలో చేర్చేందుకు విస్తృతంగా ఇంటింటి సర్వే చేస్తున్నాం. ప్రత్యేక అవసరాల పిల్లల్లో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు. ప్రతి ఒక్కరూ బడిలో ఉండేలా చూస్తున్నాం. – యు.వి.సుబ్బారావు, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి -
బంగారు భవితకు బాసట
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించి వారిని బడిబాట పట్టించే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చదువులకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. సహిత విద్య రిసోర్స్ పర్సన్లు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సర్వే వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు పాఠశాలలో చేరని పిల్లలతో పాటు మధ్యలో విద్యకు దూరమైన వారి వివరాలను సేకరిస్తున్నారు. చదువు వల్ల ప్రయోజనాలు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాల గురించి పిల్లల తల్లిదం డ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. వైకల్యంతో బాధపడే పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి వారిని బడి బాట పటిస్తున్నారు. సమగ్ర శిక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హిస్తున్న భవిత కేంద్రాలు విభిన్న ప్రతిభా వంతుల బంగారు భవిష్యత్కు బాసటగా నిలుస్తున్నాయి. జిల్లాలో 20 భవిత కేంద్రాలు జిల్లాలో 20 భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్లో కొత్తగా విజయవాడ నగరంలో మూడు భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 2,725 మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారులు ఉన్నారు. వారిలో 342 మంది జిల్లాలోని 20 భవిత సెంటర్లలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటికి 288 మంది ప్రత్యేక అవసరాలుగల వారిని గుర్తించారు. వారిని అంగన్వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చేర్పిస్తారు. తద్వారా వారికి సాధారణ విద్యార్థులతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లను భవిత కేంద్రానికి ఇద్దరు చొప్పున నియమించారు. భవిత కేంద్రాలతో బహుళ ప్రయోజనాలు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ చట్టం 2016 ద్వారా 21 రకాల వైకల్యాలను గుర్తించారు. సమగ్ర శిక్ష ద్వారా ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాల్లో వారానికి నాలుగు రోజుల చొప్పున ఫిజియోథెరపీ చేయిస్తారు. ఉచిత పరికరాల పంపిణీకి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. భవిత కేంద్రాల్లో చేరిన వారికి రూ.25 వేలు విలువ చేసే ట్యాబ్లు అందజేస్తారు. రూ.10 వేల విలువ చేసే టీఎల్ఎం కిట్లు పంపిణీ చేస్తారు. ఒక్కో కిట్లో రూ.1500 నుంచి రూ.15 వేలు ఖరీదు చేసే ఉపకరణాలను ఉచితంగా అందజేస్తారు. ఒకటి నుంచి 12 తరగతుల వారికి స్టైఫండ్ అందిస్తారు. నడవలేని విద్యార్థులను స్కూల్కు తీసుకువచ్చేవారికి ఎస్కార్ట్ అలవెన్స్ అందజేఽస్తారు. భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ట్రాన్స్ పోర్టు ఎలవెన్స్ ఇస్తారు. చదవ లేని విద్యార్థులకు చదివి వినిపించే వారికి రీడర్ అలవెన్స్ రూ.300 అందజేస్తారు. సదరం సర్టిఫికెట్స్ జారీ చేయించి ప్రభుత్వ పెన్షన్, రాయితీలు వచ్చేలా చూస్తారు. ఇన్సూరెన్స్ వర్తింపజేస్తారు. భవిత కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు విద్యాబుద్ధులు జిల్లాలో ఇంటింటికీ భవిత కేంద్రాల ఐఈఆర్పీలు ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపునకు ప్రత్యేక సర్వే 288 మంది ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు -
జిల్లాలో 13.42 మి.మీ. వర్షపాతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో పలు చోట్ల శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరపి లేకుండా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ఏలూరు రోడ్డులోని చుట్ట్టుగుంట, బెంజ్ సర్కిల్, భవానీపురం ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. రోహిణీ కార్తె తీవ్రమైన ఎండలు ఉంటాయని నగర ప్రజలు భావించారు. తుపాను ప్రభావంతో చల్లని వాతావరణం ఏర్పడింది. జిల్లాలో వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. 13.42 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ మండలాల్లో 34.6 మిల్లీమీటర్లు, నార్త్ మండలంలో 34.2, తూర్పు మండ లంలో 34, విజయవాడ రూరల్లో 32.8 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. మైలవరం మండలంలో 24.2 మిల్లీమీటర్లు, విస్సన్నపేటలో 15.2, జి.కొండూరులో 14.2, ఎ.కొండూరులో 14.0, రెడ్డిగూడెంలో 10.4, ఇబ్రహీంపట్నంలో 8.4, తిరువూరులో 2.8, వీరులపాడులో 2.8 మిల్లీమీటర్లు, గంపలగూడెంలో 2.4, కంచికచర్లలో 2.4, నందిగామలో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
కృష్ణా తీరంలో ప్రారంభమైన వజ్రాల వేట
నందిగామ: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభమైంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాలను అన్వేషించేందుకు అనేక ప్రాంతాల నుంచి వజ్రాల అన్వేషకులు చందర్లపాడు మండలం గుడిమెట్ల ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా వర్షాకాలం ఆరంభం నుంచే వజ్రాల వేట మొదలవుతుంది. ప్రస్తుతం కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండ డంతో వేసవిలో సైతం వజ్రాల వేట కొనసాగు తోంది. ముఖ్యంగా శనివారం అనేక ప్రాంతాల నుంచి గుడిమెట్ల అటవీ ప్రాంతానికి వజ్రాలు అన్వే షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. -
ఓట్ల లెక్కింపులో అప్రమత్తతే కీలకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధికారులు, సిబ్బంది సరైన అవగాహన, సమగ్ర కార్యాచరణతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆదేశించారు. కౌంటింగ్ ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్, మైలవరం ఆర్వో పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఆర్వో స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి కలెక్టర్ శనివారం కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, ఏఆర్వోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రో ఇన్చార్జులు, సీలింగ్ ఇన్చార్జులు, ఫారం–20 ఇన్చార్జులు తదితరులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణనిచ్చారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి దశనూ కలెక్టర్ ఢిల్లీరావు క్షుణ్ణంగా వివరించారు. వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించే విధానంపై అవగాహన కల్పించారు. 4న ఉదయం 8 గంటల నుంచి.. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. నోవా, నిమ్రా కళాశాలల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో జూన్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఉదయం ఆరు గంటలకల్లా రిపోర్ట్ చేయాలని సూచించారు. సరైన ప్రణాళికతో సన్నద్ధత, సమన్వయంతో ఓట్లలెక్కింపు ప్రక్రియ సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రో ఇన్చార్జుల పాత్ర కీలకమన్నారు. డేటాను సరైన విధంగా పట్టిక రూపంలో పొందుపరచడంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడికి ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు ఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, తిరువూరు ఆర్వో కె.మాధవి, నందిగామ ఆర్వో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్వో జి.వెంకటేశ్వర్లు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, ఎన్నికల సిబ్బంది నోడల్ అధికారి ఎం.రజనీ కుమారి, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి ఎన్.వి.శివప్రసాద్యాదవ్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు -
29న పొంగలి షెడ్డు నిర్వహణ హక్కుల వేలం
జగ్గయ్యపేట అర్బన్: మండలం లోని వేదాద్రి గ్రామంలో వేంచేసిన శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి షామియానా పొంగలి షెడ్డు నిర్వహించే హక్కుల కోసం ఈ నెల 29వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎస్.హేమలతాదేవి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్తు ఆధ్వర్యంలో దేవదాయశాఖ అధికారుల సమక్షంలో ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి వేలంపాట నిర్వహి స్తామని పేర్కొన్నారు. సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం జరుగుతాయని వివరించారు. వేలంలో పాల్గొనేవారు లక్ష రూపాయలను ధరావతుగా చెల్లించాలని శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఈఓ హేమలతాదేవి తెలిపారు. ఆసక్తిగల వారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. -
అక్రమ మద్యం పట్టివేత
లబ్బీపేట(విజయవాడతూర్పు): హర్యానా రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకు వచ్చిన 64 ఫుల్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీఆర్కే ప్రసాద్ తెలిపారు. నగరంలోని భానునగర్ బీఆర్టీఎస్ రోడ్డులో అక్రమ మద్యం సమాచారం రాగా, తమ సిబ్బంది వెళ్లి తనిఖీలు చేశారన్నారు. ఆ తనిఖీల్లో హర్యానా నుంచి తీసుకు వచ్చిన 64 సీసాలు స్వాధీనం చేసుకుని, నిందితులు కుంచాడ మోహనరావు, మహంకాళి మురళిను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వెస్ట్ ఎస్ఈబీ స్టేషన్ సీఐ ఎస్.శ్రీనివాసరెడ్డి, ఎం.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెదడు వాపు..అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం
● ఇన్ఫెక్షన్, శరీరంలో యాంటీబాడీలు పెరగడమే కారణం ● తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు ● పెరుగుతున్న మెదడువాపు వ్యాధి రోగులు ● ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్న వైనం లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవ శరీరంలో అతి ముఖ్యమైనది మెదడు. దాని పనితీరు బాగుంటేనే ఎవరైనా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇటీవల కాలంలో పలు రకాల ఎన్సెఫలైటిస్(మెదడువాపు వ్యాధి)లతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అలా వస్తున్న వారిలో ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్, హెర్పిస్ ఎన్సెఫలైటీస్, జపనీస్ ఎన్సెఫలైటిస్లతో పాటు, రెసిస్టెన్స్ ఎపిలెప్సీ, అటాక్సియా వంటి సమస్యలతో వస్తున్నారు. వీరిలో ఎక్కువగా పరిస్థితి విషమించిన తర్వాతే వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు నెలలో 20 నుంచి 30 మంది వరకూ ఈ సమస్యలతో వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో ఆస్పత్రిలో చేరితే ప్రాణాపాయం లేకుండా చూడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల సోకుతున్న ఎన్సెఫలైటిస్లు, వాటి లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకుందాం.. ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్.. శరీరంలోని యాంటీబాడీస్ ఒక్కోసారి కండరాలతో పాటు మెదడుపై ప్రభావం చూపుతాయి. దీంతో ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారిలో కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్న వారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పలు రకాల కీళ్లవాతం సమస్యలు, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ రావచ్చు. ఇది సోకిన వారికి మొదటి స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబలిన్ ఇంజక్షన్స్తో పాటు, అవసరమైతే డయాలసిస్ చేసి యాంటీబాడీస్ను అదుపు చేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. హెర్పిస్ ఎన్సెఫలైటీస్ ఇది తీవ్రమైన మెదడువాపు వ్యాధి. ఇది పిల్లలు, పెద్దలు ఎవరికై నా రావచ్చు. హెర్పిస్ వైరస్ కారణంగా ఈ జబ్బు సోకుతుంది. ఇది సోకిన వారు తీవ్రమైన జ్వరంతో ప్రారంభమై, ఫిట్స్ రావడం, 24 గంటల్లోనే స్పృహ కోల్పోతారు. దీనిని వెంటనే గుర్తిస్తే నయం చేసేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. వ్యాధి సోకితే కోలుకోవడానికి వారం నుంచి పదిరోజుల వరకూ సమయం పడుతుంది. తొలిదశలో గుర్తించక పోతే ప్రాణాపాయం కూడా కావచ్చు. రెసిస్టెన్స్ ఎపిలెప్సీ సరిగా మందులు వాడని ఫిట్స్ రోగులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి మెదడు మొద్దుబారి పోవడంతో మందులు సరిగా పనిచేయక ఫిట్స్ వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. మందులు వేసినా పనిచేయని పరిస్థితి తలెత్తుతుంది. స్పృహ కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వారికి ఎక్కువ సమయం పనిచేసే మందులు ఇవ్వడంతో పాటు, బ్రెయిన్ స్కాన్ చేసి, మెదడు ఎంతవరకూ డ్యామేజీ అయిందో నిర్ధారిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా అవసరం అవుతుంది. అందువలన ఫిట్స్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిది. అటాక్సియా ఇది సోకిన వారు నడిచేటప్పుడు, నిల్చున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంటారు. నడవడం కష్టంగా మారుతుంది. పిల్లలు, పెద్దవారిలో ఎవరికై నా రావచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, జన్యులోపం, క్రోమోజోముల్లో తేడాలతో ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ రకమైన జన్యుపరమైన లోపం ఉంటుంది. దీనిని గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చు. తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు మెదడు వాపు వ్యాధులకు సంబంధించి లక్షణాలను తొలిదశలో గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. ప్రస్తుతం మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్లో ప్రెజర్ పెరిగి ఫిట్స్ రావడం, మాట కోల్పోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ డి.అనిల్కుమార్, న్యూరాలజిస్ట్, విజయవాడ -
ఇరువర్గాల దాడిలో ఐదుగురు అరెస్ట్
పరారీలో మరో నలుగురు కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకీరుగూడెంలో ఇరువర్గాల మధ్య దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ దాడిలో ఒక వర్గానికి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వర్గానికి చెందిన నలుగురు పరారీలో ఉండగా కీలక సూత్రధారుడు గుండుబాస్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గిరిపురానికి చెందిన రాచేటి సత్యకుమార్ అలియాస్ గుండుబాస్ సుమారు నెలన్నర క్రితం ఫకీరుగూడెంకు చెందిన కె.నానితో ఏకవచనంతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం దమ్ముంటే ఫకీరుగూడెం రావాలని నాని వర్గంలోని మణి, మధు, వసంత్, టెర్రస్ గుండుబాస్ వర్గంలోని రాజేష్, శ్యామ్, తిమ్ము, అఖిల్, గోపీలకు సవాల్ విసిరారు. అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో గుండుబాస్ వర్గం ద్విచక్ర వాహనాలపై ఫకీరుగూడెంకు వచ్చారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి గొడవ పడి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. నాని వర్గంలోని మణిపై రాజేష్ దాడి చేసి గాయపరచగా గుండుబాస్ వర్గంలో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సీఐ మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విద్యార్థుల సమగ్ర వికాసానికి నూతన విద్యా విధానం
జంగారెడ్డిగూడెం: విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దేలా డిగ్రీ కళాశాలల్లో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. రానున్న విద్యాసంవత్సరంలో డిగ్రీ కళా శాలల్లో అదనపు గ్రూపులు ప్రారంభించాలా? కళాశాలల పరిస్థితి ఏమిటనే విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో మూడు సంవత్సరాల డిగ్రీలో అవలంభించిన విద్యా ప్రణాళికను మార్పు చేసి, ఐదు రకాల అంశాలతో నూతన ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లంలో పట్టు సాధించేలా ఇప్పటికే ఉన్న రెండు పేపర్లతో పాటు మరో రెండు పేపర్లు ప్రవేశపెడుతున్నామని, దీని ద్వారా ఇంగ్లిష్ స్కిల్స్ పెంపొంది, ఎలాంటి పోటీలోనైనా గెలిచేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 50 వేల పైచిలుకు సీట్లు ఉండగా, 30 వేలు మాత్రమే అడ్మిషన్లు అవుతున్నాయని, మిగిలిన 20 వేల సీట్లు సైతం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగం, ఉపాధి సాధించేలా.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను పట్టభద్రులుగా తీర్చిదిద్దడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించేలా చర్యలు తీసుకున్నాని తెలిపారు. ఉద్యోగాలు సాధించేలా మాత్ర మే కాకుండా పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు రూపొందించామన్నారు. డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాలేజీ ఎడ్యుకేషన ఆర్జేడీ డాక్టర్ ఎస్.శోభారాణి, అకడమిక్ గైడెన్స్ అధికారి డాక్టర్ సీహెచ్ తులసి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.ప్రసాద్బాబు, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్ -
మహాకాళి, లక్ష్మి, సరస్వతి పరదేవత స్వరూపాలే
ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు భవానీపురం(విజయవాడపశ్చిమ): అమ్మవారి భక్తులు కొలిచే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పరదేవతామూర్తి కనకదుర్గమ్మ స్వరూపాలేనని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు ‘శ్రీమాత వైభవం’ అంశంపై నిర్వహించిన ఆయన ప్రవచనాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి విరచితం, శ్రేష్ఠి లక్ష్మీసీతారామాంజనేయ శర్మ పరిశోధించి రచించిన శ్రీశైలతీరర్థసారః ఆధ్యాత్మిక గ్రంథం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈఓ కేఎస్ రామరావు ప్రధాన సంపాదకత్వంలో దేవస్థానం ముద్రించగా చాగంటి ఆవిష్కరించారు. అనంతరం చాగంటి ప్రవచిస్తూ మనిషిని కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వంటి దుర్గుణాలు పట్టి పీడిస్తుంటాయని, పరదేవత రూపంలో దుర్గమ్మ వాటన్నింటిని తొలగించి సద్గుణాలను ప్రసాదిస్తుందని తెలిపారు. నేను, నాది అన్న అహంకారం నుంచి బయటపడాలంటే పరదేవత అనుగ్రహం ఉండాలన్నారు. మహాకాళిని మూడు రోజులపాటు ఉపాసిస్తే దుర్గుణాల స్థానంలో సద్గుణాలను నింపుతుందని తెలిపారు. వాక్కు శాంతిని కలిగిస్తుందని, అటువంటి స్వరపేటికను దుర్వినియోగం చేస్తే పరదేవత సహించదని పేర్కొన్నారు.భూమి కొన్న ప్రతి ఒక్కరూ దాని కొలతలు కొలుస్తుంటారని, చివరికి వారంతా ఆ భూమిలోనే కలిసిపోక తప్పదన్నారు. నేను, నాది అనుకుని తపనపడే మనిషి శ్మశానంలో బూడిద అయినప్పుడు ఒంటరిగా ఉండే జీవుడికి తోడుగా తాను ఉంటానని శివుడు పార్వతితో చెబుతాడని అన్నారు. కష్టపడి సంపాదించడమే జీవితం కాదని, దానధర్మాలు కూడా చేయాలని, పుచ్చుకునేవారు అమ్మవారి రూపంలో వచ్చి పుణ్యాన్ని ప్రసాదిస్తారని తెలిపారు. సరస్వతి కటాక్షం వలన మనిషి మనసుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. గత జన్మలో మనం చేసే పుణ్యాలబట్టే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరాం సత్యనారాయణ, దుర్గగుడి ఈఓ కెఎస్ రామరావు సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు. -
ఐఎఫ్ఎస్కు రంగన్నగూడెం యువకుడు
హనుమాన్జంక్షన్ రూరల్: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్–2023లో బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన యువకుడు తుమ్మల కృష్ణ చైతన్య జాతీయ స్థాయిలో 74వ ర్యాంకు సాధించాడు. కృష్ణ చైతన్య తండ్రి వీర రాజారావు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగి కాగా, తల్లి గృహిణి. ప్రాథమిక స్థాయి నుంచి మెరిట్ విద్యార్థిగా ఉన్న కృష్ణ చైతన్య 2008లో పదో తరగతి పరీక్షల్లో 528 మార్కులు, 2010లో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో 937 మార్కులు సాధించి, ఆ తర్వాత ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకుతో జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్లో సీటు సాధించాడు. కెమికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడైన కృష్ణ చైతన్య చిన్నతనం నుంచి సివిల్ సర్వీసెస్పై ఉన్న మక్కువతో ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2018లో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కృష్ణ చైతన్య ప్రస్తుతం ఏపీ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్–2023కు దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా, వివిధ దశల్లో యూపీఎస్సీ ఎంపిక చేసిన 150 మందిలో తుమ్మల కృష్ణ చైతన్య 74వ ర్యాంకు సాధించటం విశేషం. ఐఎఫ్ఎస్కు ఎంపిక అయినప్పటికీ సివిల్ సర్వీసెస్ సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నట్లుగా కృష్ణ చైతన్య చెప్పారు. ఐఎఫ్ఎస్కు ఎంపికై న తుమ్మల కృష్ణ చైతన్యను గ్రామానికి చెందిన ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ తుమ్మల దశరథరామయ్య అభినందించారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
గుడివాడటౌన్: ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో తమ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించినట్లు ఎన్టీఆర్ స్టేడియం మేనేజర్ ఎం. సత్యనారాయణ గురువారం తెలిపారు. ఈనెల 20వ తేదీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పోటీలలో తమ క్రీడాకారులు ఎం.కుమార్ రాజా 59 కిలోల విబాగంలో 367.5 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించాడు. అలాగే కె.వరుణ్ రుత్విక్ 66 కిలోల విభాగంలో 208 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, వి. రాజా 59 కిలోల విభాగంలో 310 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎం. సాయి 85 కిలోల విభాగంలో 310 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం అందుకున్నాడు. వి. భగత్ బాలాజి 74 కిలోల విబాగంలో 365 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎం. అజయ్దేవాన్ 83 కిలోల విభాగంలో 435కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, వి. లక్ష్మణ్బాబు 105 కిలోల విభాగంలో 475 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, నక్కా వీరనాగు అను 47 కిలోల విభాగంలో 210 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, పి. స్వాతిశ్రీ 84 కిలోల విభాగంలో 197.5 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారులతో పాటు జిమ్ కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కోచ్ జంపా ఉషాకుమారిలను స్టేడియం యాజమాన్యం అభినందించింది. -
No Headline
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ చాంబర్లో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపులో పాల్గొనే కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు 403 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 504 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 364 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 1271 మంది కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఉపయోగించి పారదర్శకంగా ఆన్లైన్లో పూర్తిచేశామని వివరించారు. జేసీ పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావు, ఎన్ఐసీ డీఐఓ రేవతి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం. దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. అమరేశ్వరుని సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి రవికుమార్ గురువారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మీ అనుమతితో మీకే టోపీ!
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ లబ్బీపేటకు చెందిన 16 ఏళ్ల కుర్రాడికి ఆన్లైన్ గేమ్స్ ఆడడం హాబీ.. వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనాలని, లోన్ యాప్స్లో డబ్బులు ఇస్తామని, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని.. ఇలా పలు ఆకర్షణలతో వంచించడానికి ప్రయత్నించారు. తెలివిగా ఆలోచించి, తనకు ఈ ఫేక్ కాల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయా? అని ఆరా తీశాడు. దాదాపు 15 యాప్స్ వరకు తనకు తెలియకుండానే తన మొబైల్లో ఇన్స్టాలై ఉన్నాయి. ఈ యాప్స్ ఇన్స్టాల్ సమయంలో తానిచ్చిన పర్మిషన్స్తోనే ఫోన్లోని కాల్ డేటా, కాంటాక్ట్ లిస్ట్, కెమెరా యాక్సెస్, లొకేషన్ పూర్తిగా యాప్ నిర్వాహకుల చేతిలోకి వెళ్లిపోయిందని, యాప్ నిర్వాహకులు.. మొబైల్లో నిక్షిప్తమైన వివరాలను పలు కంపెనీలకు విక్రయించారని పోలీసుల ద్వారా తెలుసుకుని కంగుతిన్నాడు. సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా ముందుగానే తేరుకుని ఫోన్లో అవసరం లేని యాప్స్ను వెంటనే అన్ఇన్స్టాల్ చేశాడు. అప్రమత్తంగా లేకుంటే సమస్యలే.. మొబైల్ అప్లికేషన్స్కు ఇచ్చే అనుమతుల విషయంలో అప్రమత్తంగా లేకుంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. యాప్స్కు పర్మిషన్స్ (లొకేషన్, కాల్ డేటా, కాంటాక్ట్స్, గ్యాలరీ, మైక్రోఫోన్, కెమెరా) ఇవ్వడం ఇబ్బందులను కొని తెచ్చుకోవడమేనని.. వ్యక్తిగత సమాచారాన్ని నేరగాళ్లు, సంఘ విద్రోహ శక్తులు, స్వార్థ పరులకు ఇస్తున్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. కెమెరా, మైక్రో ఫోన్ పర్మిషన్ అన్నింటికంటే ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. లోన్ యాప్స్ సృష్టించిన విధ్వంసం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఆర్బీఐ గుర్తింపు లేని 150కి పైగా లోన్ యాప్స్ చేసిన మోసానికి, తెగబడిన బెదిరింపులకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. యువత అమితంగా డౌన్లోడ్ చేసుకుని వాడుతున్న డేటింగ్ యాప్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి.. కొన్ని యాప్స్కు ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉండదు. అలాంటి యాప్స్ను వాడే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వాడని యాప్స్కు ఉన్న పర్మిషన్స్ను తొలగించాలి. లేదంటే యాప్స్ను అన్ ఇన్స్టాల్ చేయాలి. అవసరం లేకపోయినా గ్యాలరీ పర్మిషన్ అడిగినప్పుడు ‘డినై’ చేయాలి. డినై చేసిన తరువాత ఆ యాప్ పని చేయలేదంటే.. మిమ్మల్ని మోసం చేసేందుకు యాప్ సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. కొంపముంచుతున్న యాప్ పర్మిషన్స్ వివిధ యాప్ల ద్వారా మీ ఫోన్ యాక్సెస్ పొందుతున్న నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీ మన అజ్ఞానమే సైబర్ నేరగాళ్ల వంచనావకాశం యాప్స్ పట్ల అప్రమత్తత లేకుంటే అనర్ధాలే!అప్రమత్తంగా ఉండాలి.. అవసరం లేని యాప్స్ మీ ఫోన్లో ఎన్నో ఉంటాయి. వాటిని ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నారో.. మీకే తెలీదు. అలాంటి వాటితోనే చిక్కులు వస్తుంటాయి. ఆ యాప్స్ చేసే మానిటరింగ్తో మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని గుర్తించండి. అనాలోచితంగా మీరు ఇచ్చే సమాచారంతోనే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి మీ నంబర్లు, మీ వ్యక్తిగత సమాచారం చేరుతుంది. దాని ఆధారంగానే నేరగాళ్లు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. కొందరు నేరగాళ్లు.. మీతోనే మీ న్యూడ్ వీడియో తీయించి బ్లాక్మెయిల్కు తెగబడుతున్నారు. – కోమాకుల శివాజీ, సీఐ, సైబర్ క్రైం, విజయవాడ -
27న ఓట్ల లెక్కింపుపై శిక్షణ..
ఈనెల 27వ తేదీన ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. నోవా, నిమ్రా కళాశాలలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ హాల్స్లో పార్లమెంట్, అసెంబ్లీకి వేర్వేరుగా 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్, మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు అన్ని విధాలా సన్నద్ధం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాతో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ఉన్న నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఒక కంపెనీ సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్, 156 మంది స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, 477 మంది సివిల్ పోలీస్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. 149 సీసీ కెమెరాలను మోనిటరింగ్ రూమ్కు అనుసంధానం చేసి రోజు వారీ నిరంతర పర్యవేక్షణతో భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా మీడియా సెంటర్తో పాటు, అభ్యర్థులు, ఏజెంట్లకు తెలిపే విధంగా పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్నకు అడిషనల్ ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీరావు -
బంగారు తాపడం పనులకు విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు గురువారం హైదరాబాద్కు చెందిన భక్తులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ మేడ్చల్ చెంగిచర్లకు చెందిన అనంతాల శంకర్ గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కేఎస్ రామరావును కలిసి బంగారు తాపడం పనులకు విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈవో రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
కమనీయం.. నరసింహుని కల్యాణం
జగ్గయ్యపేట అర్బన్: నరసింహుని కల్యాణోత్సవం నయనానందకరంగా సాగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వందలాది భక్తుల సమక్షంలో కల్యాణ వేడుక అంబరాన్నంటింది. వేదాద్రిలో వేంచేసియున్న యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 12 గంటలకు నరసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించారు. మేళతాళాలతో, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం వాసుదేవాచార్యులు, యోగానందాచార్యులు, శ్రీధరాచార్యులు పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణలతో స్వామి వారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. సుమనోహర దృశ్యం.. కృష్ణా నది ఒడ్డున ఆలయం ఉండటంతో పండు వెన్నెల్లో భక్తుల హర్షధ్వానాల మధ్య దాదాపు రెండు గంటల పాటు స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్వకర్త వెలగపూడి ఇందిరా దత్ ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ హేమలతాదేవి పర్యవేక్షణలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా బాలాత్రిపుర సుందరీ అమ్మవారి ట్రస్ట్, కేసీపీ, హేమాద్రి, రామ్కో సిమెంట్స్, ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, మధ్యాహ్నం అన్నదానం ప్రసాదాలు పంపిణీ చేశారు. సీఐ జానకీరామ్ పర్యవేక్షణలో మూడు మండలాల ఎస్ఐలు పాల్గొని పోలీస్ బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఉరేసుకొని లారీ డ్రైవర్ ఆత్మహత్య
షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్(జగ్గయ్యపేట అర్బన్):చెట్టుకు ఉరి వేసుకొని లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్ రావికంపాడు రెవెన్యూ పరిధిలోని పొలంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలియజేసిన వివరాల ప్రకారం... షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్లో నివాసం ఉంటున్న యలక గోపిరెడ్డి (35) లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి డ్యూటీకి అనిచెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన గోపిరెడ్డి షేర్ మహ్మద్పేట అడ్డరోడ్డు సమీపంలోని రావికంపాడు రెవెన్యూ పరిధిలోని పొలంలో ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. గురువారం ఉదయం పొలం సమీపంలోని వారు చూసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపిరెడ్డి మృతికి గల కారణాలు తెలియరాలేదు. భార్య విజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంఈవో పుష్పలత అవినీతిపై విచారణ
ఇబ్రహీంపట్నం: ఎంఈవో సీహెచ్ పుష్పలతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వీసెస్) జి.రాజేశ్వరి గురువారం ఎంఈవో కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంఈవో పుష్పలత ఐదు మండలాలకు ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఉపాధ్యాయులు ఇన్కామ్ ట్యాక్స్ చెల్లింపులు ఈ–ఫైలింగ్ చేసే నిమిత్తం డబ్బులు డిమాండ్ చేసినట్లు వివిధ యూనియన్ నాయకులు జగ్గయ్యపేట ప్రాంతంలో ఓ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. అప్పట్లో దీనిపై విచారణ చేపట్టిన నందిగామ డీవైఈవో వెంకటసుబ్బయ్య జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక అందించారు. డీవైఈవో నివేధికపై విచారణ అధికారిగా జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ రాజేశ్వరితో మరోసారి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమక్షంలో విచారణ చేపట్టిన రాజేశ్వరి పూర్తి నివేదిక జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఎంఈవో పుష్పలత ఏపని చేయాలన్నా డబ్బులు ఇవ్వనిదే చేయదని ఉపాధ్యాయులు బహిరంగా చెప్పడం గమనార్హం. -
పామర్రులో 2 కిలోల గంజాయి పట్టివేత
పామర్రు: మండల పరిధిలోని పెదమద్దాలి గ్రామంలో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పెదమద్దాలి గ్రామంలో గంజాయి నిల్వలపై సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రెండు కిలోల ఎండు గంజాయిని పట్టుకోవడంతో పాటు నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది ఎక్కడ అమ్ముతున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement