-
Palnadu: పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ, సస్పెన్షన్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచి్చంది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ, పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దాడిచేసింది వారు.. మాపై కేసులా?
మాచవరం: వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించామన్న కోపంతో మా ఇళ్లపై దాడులు చేసి... బీభత్సం సృష్టించిన టీడీపీ వర్గీయులను వదిలేసి... బాధితులైన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాచవరం పోలీస్స్టేషన్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజున ఓట్లు వేసేందుకు వచ్చిన మమ్ములను అడ్డుకున్నారనీ, ఇదేమని ప్రశ్నించిన వారిపై దూషణకు దిగి, పోలింగ్ అనంతరం మీ సంగతి చూస్తామంటూ బెదిరించారని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఇతర గ్రామాలకు చెందిన టీడీపీ రౌడీలను కార్లలో తీసుకువచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళలను దూషిçస్తూ, భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బైకులు, ఆటోలు, ఇతర వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని, భయాందోళనతో మేమంతా పొలాల వెంట పరుగులు తీశామని, మహిళలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని చెప్పారు. అక్కడకు కూడా వెళ్లి గుడి గేటు తాళాలు బిగించి ఇబ్బందులు పెట్టారని, సుమారు నాలుగు గంటల పాటు టీడీపీ గూండాలు గ్రామంలో వీరంగం చేస్తుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా గ్రామానికి రాలేదన్నారు. విషయం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించేందుకు గ్రామానికి మరునాడే చేరుకుని మహిళలను ఇళ్ల వద్దకు చేర్చి, విధ్వంసానికి గురైన ఇళ్లను, ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారిపైనా దాడికి యత్నించారని చెప్పారు. రాళ్లతో దాడిచేసి, కార్లను సైతం పగలగొట్టారని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు గాలిలోకి కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాము భయంతో వేరే ఊళ్లో తలదాచుకుంటే తమపై కేసులు పెట్టడం దారుణమన్నారు.మాపై కేసులు పెట్టడం అన్యాయంగ్రామంలో టీడీపీ వాళ్లు సృష్టించిన బీభత్సానికి భయంతో గ్రామాన్ని విడిచి పొరుగూరిలో బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నాం. భార్యాపిల్లలు ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామంలో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊళ్లో లేని మాపై పోలీసులు కేసులు పెట్టడం అన్యాయం. – అంబటి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీకి ఓటేశామనే మాపై కక్షవైఎస్సార్సీపీకి ఓటేశామని మాపై కక్ష పెంచుకున్నారు. బీసీలకు పార్టీలు ఎందుకురా అంటూ పలుసార్లు అవమానించారు. అయినా ఓర్చుకొని పార్టీకోసం నిలబడ్డాం. వారి దాడులతో ఊరు వదిలి వెళ్లి ఐదు రోజులైంది. మాపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. – మేకల హనుమంతుపోలీసులు రక్షణ కల్పించాలిఎన్నికల రోజు టీడీపీ గూండాలు చేసిన దాడులకు భయపడి పారిపోయాం. భార్యా పిల్లలతో బంధువుల వద్ద తలదాచుకుంటున్నాం. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే మాపై కేసులు పెట్టారు. ఇదేమి న్యాయం. గ్రామంలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలి. – బొంతా ప్రసాద్ -
శిక్షణలో నేర్పించే అంశాలు
● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్. -
వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహంలో చేరేందుకు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు గురువారం ఓప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను బృందావన్గార్డెన్స్ సెంటర్ కుందుల రోడ్డులోని సమితి కార్యాలయంతోపాటు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కమ్మజనసేవాసమితి.కామ్ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ధ్రువపత్రాలను జతపరిచి, ఈనెల 27లోపు సమితి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఎంపికై న విద్యార్థినుల జాబితాను ఈనెల 31న విడుదల చేసి నోటీసు బోర్డులో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. -
విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాల, కళాశాలల బస్సుల ఫిట్నెస్ గడువు ఈనెల 15తో ముగిసిందని, రెన్యూవల్ చేయించుకోవాలని డీటీసీ షేక్ కరీమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500లకుపైగా విద్యా సంస్థల బస్సులు కచ్చితంగా 32 నిబంధనలు పాటిస్తూ ఫిట్నెస్ కలిగి ఉండాలని వెల్లడించారు. పాఠశాల బస్సు డ్రైవర్ 60 సంవత్సరాల వయో పరిమితి దాటిన వ్యక్తి అయితే అనర్హుడని పేర్కొన్నారు. డ్రైవర్ ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆ రికార్డులు భద్రపరచాలని వివరించారు. డ్రైవర్ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తెలియజేయడంతోపాటు, ఐదేళ్ల అనుభవం, హెవీడ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతినెలా వాహనానికి సంబంధించి స్థితిగతులను నమోదు చేయాలని తెలిపారు. బస్సులో అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భద్రపరుచుకునే బాక్స్లు తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వాహనాలను సరైన కండీషన్లో ఉంచుకుని రూల్ 185 (జీ) నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. ఫిట్నెస్ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పకూడదని స్పష్టం చేశారు. అలా తిరిగే వాహనాలు సీజ్ చేయడంతోపాటు, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీటీసీ షేక్ కరీమ్ -
‘దివ్య’మైన ప్రతిభతో రాణింపు
● అంతర్జాతీయ పోటీలకు దివ్యాంగ క్రీడాకారుడు ● ఈ నెల 28 నుంచి జూన్ 3 వరకు చైనాలో అంతర్జాతీయ బీచ్ పారా వాలీబాల్ పోటీలు ● రాష్ట్రం నుంచి పందిళ్లపల్లికి చెందిన పిచ్చుక నాగరాజు ఎంపిక ● చైనా వెళ్లేందుకు దాతల ఆర్థిక సహకారం కోరుతున్న క్రీడాకారుడు వేటపాలెం: మండలంలోని పందిళ్లపల్లికి చెందిన క్రీడాకారుడు పిచ్చుక నాగరాజు దివ్యాంగుల బీచ్ వాలీబాల్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. మే 5న చైన్నెలో జాతీయ స్థాయి మెన్స్ దివ్యాంగ వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి నాగరాజు అంతర్జాతీయ పోటీలకు ఎంపియ్యాడు. ఈ నెల 28 నుంచి జూన్ 3 వ తేదీ వరకు చైనాలో అంతర్జాతీయ బీచ్వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. అయితే, పేద కుటుంబంలో జన్మించిన నాగరాజు ఈ పోటీలకు వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పోటీలకు వెళ్లడానికి రూ. 2.25 లక్షలు ఖర్చవుతుందని, దాతలు అర్థిక సహకారం అందించాలని కోరుతున్నాడు. జాతీయ స్థాయిలో మూడుసార్లు సత్తా నాగరాజు చిన్నతంలోనే ప్రమాదవశాత్తు ఒక చెయ్యి కోల్పోయాడు. అయితే, చిన్నతనం నుంచి వాలీబాల్పై మక్కువ. పట్టుదలతో నేర్చుకున్నాడు. స్కూల్, కాలేజీ స్థాయిల్లో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ● తొలుత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో జరిగిన దివ్యాంగ బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు. 2009లో చైన్నెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి రాష్ట్రం తరఫున పాల్గొన్నాడు. ● ఆ తరువాత కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ● 2010లో రెండోసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఇందులో సిల్వర్ మెడల్ సాధించాడు. ● 2011లో జర్మనీలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు . ● అనంతరం బెంగుళూరులో జరిగిన శ్రీలంకతో జరిగిన ఫ్రెండ్లీ వాలీబాల్ పోటీల్లోనూ పాల్గొన్నాడు. ● అనంతరం ఆర్థిక ఇబ్బందులతో పోటీల్లో పాల్గొనడం నిలిపివేశాడు. 2013లో జరిగిన వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున జాతీయ పోటీలకు ఎంపికై నాలుగో స్థానం సాధించాడు. దాతలు సహకారం అందించాలి చైనాలో జరగనున్న జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు రూ. 2.25 లక్షలు ఖర్చవుతుంది. నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. దాతలు సహకారం అందించాలి. ఆర్థిక సహకారాన్ని అందించే దాతలు 8712165734ను సంప్రదించాలి. – పిచ్చుక నాగరాజు -
భట్టిప్రోలు మండలంలో భారీ వర్షం
భట్టిప్రోలు: మండలంలో గురువారం ఉదయం నుంచి వాతావరణంలో నెలకొన్న అనూహ్య మార్పుతో భారీ వర్షం కురిసింది. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్షాలకు కృష్ణానదీ పఈవాహక లంక గ్రామాల్లోని వాణిజ్య పంటలకు కొంత మేర నష్టం వాటిల్లింది. మునగ చెట్లు నేల వాలాయి. మామిడి, సపోట తోటల్లో పక్వానికి వచ్చిన కాయలు కూడా నేల రాలాయి. అయితే ఇటీవల నాటిన అరటి పిలకలతో పాటు బొప్పాయి, తమలపాకు, కూరగాయలు, ఆకు కూరల పంటలకు వర్షం జీవం పోసింది. రోహిణీకార్తె రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎండ తీవ్రంగా ఉంటుందా ? అనే సందిగ్ధంలో ప్రజలున్నారు. -
క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
యడ్లపాడు: వచ్చే ఏడాది నాటికి క్షయ (టీబీ)వ్యాధి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె అర్జునరావు పిలుపునిచ్చారు. యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలోని అన్ని వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించారు. అవి సరిపడా ఉన్నాయా లేదా..అనే విషయాలపై ఆరా తీశారు. అక్కడ నుంచి వంకాయలపాడు గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలను కలిసి క్షయ వ్యాధి లక్షణాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీసీజీ వ్యాక్సిన్ ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 18–60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు, ఐదేళ్లలో క్షయ వ్యాధికి గురైన వ్యాధిగ్రస్తుల కుటుంబీకులను బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉన్న, పొగత్రాగడం అలవాటు కల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు వెల్లడించారు. మండల పరిధిలో 464 మందికి బీసీజీ వ్యాక్సిన్లు వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 16వ తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 2025 నాటికి పూర్తిగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ బి గీతాంజలి, యడ్లపాడు పీహెచ్సీ వైద్యాధికారి ఎం ప్రభాకరరావు, డాక్టర్ బి భరద్వాజ, సీహెచ్వో ఎస్ పున్నారావు, సూపర్వైజర్లు వి రాజశేఖర్, బి గంగానమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె అర్జునరావు యడ్లపాడు పీహెచ్సీ ఆకస్మిక సందర్శన క్షయవ్యాధిపై వంకాయలపాడు వాసులకు అవగాహన -
అరుణాచలం గిరిప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అరుణాచలం పుణ్యక్షేత్రం ఈనెల 23న పౌర్ణమి పురస్కరించుకుని గిరిప్రదక్షిణ మహోత్సవానికి హాజ రయ్యే భక్తులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో–2 మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం గురువారం తెలిపారు. 23న గిరిప్రదక్షిణ జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ హైటెక్ 2+2 ఫుష్ బ్యాక్ బస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 21న రాత్రి 9.15 గంటలకు గుంటూరులో బయల్దేరి 22న కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని, అదేరోజు రాత్రి అరుణాచ లం చేరుకుంటారని తెలిపారు. గిరిప్రదక్షిణ అనంతరం 23న సాయంత్రం బయల్దేరి 24వ తేదీ ఉదయం గుంటూరు చేరుకుంటారని వివరించారు. ఆన్లైన్ ద్వా రా రిజర్వేషన్ కల్పించామని, బస్సులో సీట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో టికెట్టు ధర రూ.2,420 అని తెలి పారు. మరిన్ని వివరాల కోసం 7382897459, 7382896403 నంబర్లలో సంప్రదించాలన్నారు. డివైడర్ను ఢీకొట్టిన కారు అద్దంకి: కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలోని చక్రాయపాలెం గ్రామ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్లోని కొండాపూ ర్కు చెందిన భానూ శరత్శర్మ ఒంగోలులోని స్నేహితుడ్ని కలిసేందు కు కారులో ఒంగోలు బయలుదేరా రు. మండలంలోని చక్రాయపాలెం గ్రామ సమీపంలోకి రాగానే అ దుపు తప్పి రోడ్డు పక్కనున్న దిమ్మెలను ఢీకొట్టడంతో కారు గాల్లోకి లేచి, పొలాల్లోకి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో భానూశరత్శర్మకు తీవ్ర గాయాలయ్యాయి. -
వైఎస్సార్సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ!
వినుకొండ (నూజెండ్ల): పోలింగ్ ముగిసినప్పటికీ టీడీపీ నేతల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని ఓ ఎస్సీ కాలనీ వాసులను సామాజిక బహిష్కరణ చేయడమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని గ్రామంలో మంచినీటి ప్లాంట్ వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు వినుకొండ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడును గురువారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మాశిపోగు వసంతరావు, దూపాటి లింగయ్య, పాలెపోగు యోబు, మాణిక్యరావుతోపాటు పలువురు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద తాగునీరు పట్టుకోవడానికి వీలులేదని, పొలం పనులకు పిలవబోమని, కౌలుకు భూములు ఇవ్వబోమని, కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ఎస్సీ కమిషన్ తో పాటు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సామాజిక బహిష్కరణ చేయడం దారుణం : ఎమ్మెల్యే బొల్లా గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీ వాసులకు తాగునీరు ఇవ్వకుండా, పనులకు పిలవకుండా బహిష్కరించడం దారుణమని ఎమ్మెల్యే బొల్లా అన్నారు. కాలనీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది. -
ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత
‘అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క సారిగా దఢేల్ మని పే..ద్ద శబ్ధం.. కళ్లు తెరిచి చూసేలోగా మంటలు.. నిప్పు రవ్వలు మీద పడి అంటుకుంటున్న దుస్తులు.. కేకలు, అరుపులు.. కాపాడండని ఆర్తనాదాలు.. కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు.. డోర్ తెరుచుకుని మరికొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు అక్కడికక్కడే క్షణాల్లో కాలి బూడిదయ్యారు.. అంతా కలలోలాగా జరిగింది. నిజంగా కల అయితే బాగుండు’ అని ఆ ప్రమాదం నుంచి బయట పడిన వారుఅంటున్నారు. వారింకా షాక్ నుంచి తేరుకోలేదు.చినగంజాం/చిలకలూరిపేట : ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న చినగంజాం, చీరాల వాసులు నలుగురు, రెండు వాహనాల డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటున్న చాలా మందికి పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. దీంతో పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి, ఆదివారం రాత్రి వారిని పర్చూరుకు తరలించారు. ఇందులో భాగంగా చినగంజాంకు చెందిన ఓటర్లు సైతం హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరంతా సోమవారం ఓట్లు వేసి, మంగళవారం రాత్రి ఏలూరు సాంబశివరావు ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. చినగంజాంకు చెందిన 42 మంది చీరాలకు చెందిన ట్రావెల్స్ బస్సు (ఏపీ 27 టీటీ 6577)లో రాత్రి 11 గంటలకు బయలు దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ బస్సు.. పల్నాడు జిల్లా ఈవూరుపాలెం వద్ద ఎదురుగా కంకర మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ (ఆర్జే 23 జీసీ 2452)ను ఆయిల్ ట్యాంక్ వద్ద బలంగా ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు టిప్పర్, ఇటు బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సులో బ్యాటరీ ఫెయిల్ అవడంతో చీకటి అలముకొంది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తప్పించుకొని వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో బస్సు డోర్ వద్ద ఉన్న చినగంజాంకు చెందిన యువకుడు సింగోతు సాయి కేకలు వేస్తూ ప్రయాణికులను నిద్ర లేపాడు. చాలా మంది ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ డోర్ ద్వారా బయటకు రాగా, మరికొంత మంది కిటికీ అద్దాలను పగులగొట్టి, అత్యవసర ద్వారాన్ని తెరచుకొని బయటకు దూకేశారు. అప్పటికే మంటలు అంటుకొని కొందరు ప్రయాణికులు హృదయ విదారకంగా కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు భారీగా చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు నలుగురు బస్సులోనే కాలి బూడిదయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు..ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు, అతని భార్య లక్ష్మీ బస్సు వెనుక భాగంలో కూర్చొన్నారు. వీరు వృద్ధులు కావడంతో త్వరగా బయట పడలేకపోయారు. పైగా మనవరాలు ఖ్యాతి సాయి నిద్రలో ఉండటంతో ఆ పాపను లేపి.. బయటకు రాలేకపోయారు. అంతలోనే మంటలు చుట్టు ముట్టడంతో తప్పించుకోలేని స్థితిలో ఆహుతై ప్రాణాలు విడిచారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి భావన హైదరాబాద్లో, చిన్నమ్మాయి పూజ ఒంగోలులో ఉంటున్నారు. ఓటు వేసేందుకని పెద్ద కుమార్తెతో కలిసి నీలాయపాలెం వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి చిన్న కుమార్తె కూతురు ఖ్యాతి సాయిని వెంట తీసుకుని చినగంజాం నుంచి టీడీపీ వారు ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు. పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న దావులూరి శ్రీను కూడా ఓటు వేసేందుకే వచ్చారు. 20 మంది క్షతగాత్రులు చినగంజాం వాసులేదుర్ఘటనలో గాయపడిన 30 మందిని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన 108 వాహనాల ద్వారా చిలకలూరిపేట ఏరియా ఆçస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎన్.కీర్తి, కె.వెంకటరావు, సీహెచ్.శంకర్రావు, ఎన్.రాజ్యలక్ష్మి, ఎస్.కళావతి, డి.భువన, సీహెచ్.ఆదిలక్ష్మి, పి.లక్ష్మి, కె.లిప్సికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరో 20 మందికి ప్రా«థమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా చినగంజాం మండల వాసులే. మృతి చెందిన పాప పెద్దమ్మ భావన తన వారిని రక్షించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైంది. శరీరం బాగా కాలిపోవడంతో గుంటూరులో చికిత్స పొందుతోంది. కడవకుదురుకు చెందిన తాటి రాజీ (సాఫ్ట్వేర్), గొల్లపూడి ఉదయభాను(సాఫ్ట్వేర్), చినగంజాంకు చెందిన తాటి సాయిలక్ష్మి (సాఫ్ట్వేర్), మమత (కోచింగ్), అడివీధిపాలెంకు చెందిన రాయని బాలాజీ (ఫొటోగ్రాఫర్), పెదసింగు నాగరాజు, పెదసింగు తిరుపతమ్మ, పెదసింగు నాగరాజు కుమారుడు ఈశ్వరసాయి, కుమార్తె జస్వంతి, బొమ్మిడి మాలతి, గొనసపూడికి చెందిన కందిమళ్ల తేజీ, యలమల ఆకాష్, నీలాయపాలెంకు చెందిన దంపతులు అంజిబాబు, సామినేని సింధూజ, చినగంజాం అంబేడ్కర్ నగర్కు చెందిన బొలిమెర సుధాకర్, మేడికొండ చినఅంకయ్య, అతని భార్య సౌజన్య, కుమార్తె అక్షయ, బడుగు సంజన తదితరులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల వివరాలివీ..ఈ దుర్ఘటనలో చీరాలలోని పేరాలకు చెందిన బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్ షరీఫ్ (47), టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్కు చెందిన హరిసింగ్ (39), బస్సులో ప్రయాణిస్తున్న చినగంజాం మండలం నీలాయపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉప్పుగుండూరు కాశీబ్రహ్మేశ్వరరావు (65), ఉప్పుగుండూరు లక్ష్మీ(55), వీరి మనవరాలు ఒంగోలు పట్టణానికి చెందిన బొప్పిరాజు ఖ్యాతి సాయి (9), చినగంజాం మండలం గోనెపూడి గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (54) సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిందిలా..చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం డొంక సమీపానికి బస్సు రాగానే, అదే సమయంలో పసుమర్రు వైపు నుంచి గ్రావెల్తో కూడిన టిప్పర్ ( చీరాల వైపు వెళుతూ) ఎదురుగా వస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రోడ్డు మార్జిన్ కనిపించక వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొంది. టిప్పర్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ దిగినప్పటికీ, బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జి.రవికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా∙స్థలం వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి రజినిరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పోలీస్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి, గుంటూరు ఎస్పీ తుషార్ డూడి, నరసరావుపేట డీఎస్పీ వర్మ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించి ప్రభుత్వం నుంచి తగు సహాయం అందేలా చూస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నరసరావుపేట డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ.. బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నామని, డ్రైవర్లు మద్యం సేవించారా లేదా అనే విషయం ల్యాబ్ రిపోర్టుల తర్వాత తెలుస్తుందని చెప్పారు. చిట్టితల్లికి అప్పుడే నూరేళ్లు నిండాయిఒంగోలు టౌన్: ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉంటున్న సుబ్బారావు, పూజ దంపతుల గారాల పట్టి, ఏకైక పుత్రిక ఖ్యాతి సాయి. పెద్దయ్యాక పెద్ద డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాపకు ఖ్యాతి అని పేరు పెట్టుకున్నారు. ప్రాణంగా పెంచుకున్నారు. చిట్టి తల్లిని చూసి మురిసిపోయారు. స్కూలులో మీ పాపే ఫస్ట్ అని టీచర్లు చెప్పిన మాటలు విని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాపకు మంచి చదువులు చదివించుకోవచ్చని దర్శి మండలం వీరాయపాలెం నుంచి ఒంగోలుకు వచ్చి ఉంటున్నారు. నగరంలోని లంబాడిడొంకలో ఒక స్కానింగ్ సెంటర్లో సుబ్బారావు పీఆర్ఓగా, పూజ రిసెప్షనిస్టుగా పని చేస్తున్నారు. ఇద్దరి సంపాదనతో ఖ్యాతిని బాగా చదివించుకోవాలని కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. కన్నకూతురు కాలి బూడిదైందన్న వార్త విన్న ఆ దంపతుల గుండె పగిలిపోయింది. గుండెలవిసేలా రోధించారు. స్కూలుకు సెలవులు కావడంతో అవ్వా తాతల వెంట హైదరాబాద్కు పంపారు. ఖ్యాతి ఇక లేదన్న వార్త విని చుట్టుపక్కల వారంతా కంట నీరు పెట్టుకున్నారు. పాప తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. -
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు. -
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పారు. కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్లో ఉన్న సమయంలో టిప్పర్ను ఢీకొట్టింది. -
పచ్చ ముఠా మంటల్లో ‘పల్నాడు’
పల్నాడు, సాక్షి: పోలింగ్ రోజున చెలరేగిన హింస మూడు రోజులైనా చల్లారడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ.. టీడీపీ శ్రేణులు అవకాశం దొరికినప్పుడల్లా దాడులకు తెగబడుతున్నాయి. దీంతో.. మూడు రోజులుగా జిల్లా అట్టుడుకి పోతోంది.హింసను కట్టడి చేయడంలో తొలి రెండు రోజులు విఫలమైన పోలీస్ యంత్రాంగం.. ఆలస్యంగా మేల్కోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. పల్నాడు కేంద్రంలో 800 మందితో కూడిన కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అయినా కూడా టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ‘‘ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారా?’’.. అంటూ దాడులు చేస్తూ పల్నాట మంటల్ని రాజేస్తున్నాయి.మరోవైపు టీడీపీ నేతలను, శ్రేణుల్ని కట్టడి చేయలేని పోలీసులు.. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలను మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారు. మాచర్లలో ఇప్పటికీ షాపులుతెరచుకోలేదు. అక్కడ 2 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని అడుగడుగునా మోహరించారు. అంతటా వాహనాలను పోలీసులు జల్లెడ పుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. మాచర్లలోనే మకాం వేసిన డీఐజీ త్రిపాఠి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చినగంజాం నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుల వివరాలు..అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా -
కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ ముగిసినా పల్నాడులోటీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్ïపీకి ఓటేశారన్న అక్కసుతో జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం నుంచి అమాయకులపై టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. ఇళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తుండటంతో పురుషులు గ్రామాలు వదిలి ప్రాణాలు దక్కించుకోగా, మహిళలు, పిల్లలు దేవాలయంలో తలదాచుకుంటున్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి నాయకులను గ్రామాలు దాటించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ బాధితులను రక్షించే చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.కొత్త గణేశునిపాలెంలో యథేచ్ఛగా దాడులుమాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీ రౌడీలను, గూండాలను తీసుకువచ్చి దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లపై దాడులు చేశారు. మోటారు బైకులు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామాన్లు, టీవీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ, భౌతికదాడులకు పాల్పడ్డారు. భయానక పరిస్థితుల్లో పురుషులంతా పొలాల్లోకి పరుగులు పెట్టి, అర్ధరాత్రి వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని తెలిసి, దేవాలయంపైకి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. చేతులెత్తేసిన పోలీసులు...గ్రామంలో టీడీపీ చేస్తున్న దాడులపై పోలీసులకు ఫోన్ద్వారా, వీడియో సందేశాల ద్వారా బాధిత మహిళలు సమాచారం అందించినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫోర్సు తక్కువగా ఉందన్న నెపంతో తప్పించుకున్నారని మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన మీడియాకు వారు తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డి మంగళవారం మ«ధ్యాహ్నం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు చూసి వారు చలించిపోయారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది టీడీపీ మూకలు వారిని చుట్టిముట్టి, వాహనాలపై రాళ్లు రువ్వారు. గ్రామం నుంచి బయటకు వెళ్లనీయకుండా రహదారిని దిగ్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మరింత రెచ్చిపోయిన టీడీపీ మూక దాడులను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారుఓట్లు వేసి ఇంటికి వచ్చాం. అంతా బాగుంది అనుకున్నాం. ఒక్కసారిగా టీడీపీ వాళ్లు గుంపులు, గుంపులుగా వచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇంటిపైనున్న రేకులు పగులగట్టారు. ఇంట్లోని టీవీ, ప్రిడ్జ్ కూలర్, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. బూతులు తిడుతూ మగవాళ్లను బతకనీయమంటూ బెదిరించారు. మేము బెదిరిపోయి గంగమ్మ గుడిలో తలదాచుకున్నాం.– అంబటి శ్రీలక్ష్మి, బాధిత మహిళవైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే...గ్రామంలో టీడీపీ బలంగా ఉండేది. 2019 ఎన్నికల నుంచి జగనన్నపై నమ్మకంతో మేము వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉంటున్నాం. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగనన్నను గెలిపించాలని బాగా పని చేశాం. దానిని తట్టుకోలేక మా ఇంటిపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు వేశారు. బూతులు తిట్టారు. భయంతో మా వాళ్లు రాత్రంతా పొలాల్లో తలదాచుకున్నారు. చాలా భయమేçస్తోంది. – చల్లగుండ్ల కోటేశ్వరమ్మ బాధిత మహిళకనీసం స్పందించని ఎస్పీగ్రామంలో ఇంత అరాచకం జరుగుతుంటే జిల్లా ఎస్పీ బింధుమాదవ్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు, వైఎస్సార్సీపీ నాయకులు వాపోతున్నారు. ఆయన గ్రామాన్ని సందర్శించలేదు. అవసరమైన బలగాలను పంపలేదు. వారి వైఖరి ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైందని తెలియగానే వెళ్లిన ఎస్పీ కొత్త గణేషునిపాడుకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
దాడులు.. లూటీలు.. విధ్వంసం
సాక్షి, నరసరావుపేట/వినుకొండ(నూజెండ్ల)/కారెంపూడి/పెదకూరపాడు/మాచవరం : పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో చేస్తున్న అరాచకపర్వం రెండో రోజూ కొనసాగింది. సోమవారం పోలింగ్ రోజు వైఎస్సార్సీపీకి ప్రజలు భారీ స్థాయిలో ఓటు వేస్తున్నారని తెలుసుకొని మధ్యాహ్నం నుంచే దాడులు ప్రారంభించారు. మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఓవైపు వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కేంద్ర బలగాలు ఏవని ప్రశ్నిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామ శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీ గూండాలు సుమారు 70 మంది సోమవారం రాత్రి వారి ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావ బాదారు. ఇళ్లలోని సామాన్లు, ఫ్యాన్లు, బల్బులను పగులగొట్టారు. చిల్లర కొట్టునూ లూఠీ చేశారు. సామాన్లు, నగదును దోచుకెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి బిక్షంకు చెందిన బైక్ను, మక్కెన శేషుకు చెందిన బైక్ను మరో ఇద్దరి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో అందరూ ప్రాణభయంతో ఇంటి నుంచి పారిపోయి వేరే చోట తల దాచుకున్నారు. ఏరా.. టీడీపీకి ఓటు వేయమంటే వేయకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారా.. నా కొడకల్లారా.. అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచకపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జూన్ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అంతు చూస్తామని బెదిరించారన్నారు. ‘ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్లు కర్రలతో కొట్టారు. ఇళ్లలోకి జొరబడి సామాన్లన్నీ చిందవందర చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. భయమేసింది. పిల్లలు పరారయ్యారు. ఎటూ పోలేని మమ్మల్ని చితకబాదారు. బూతులు తిట్టారు’ అంటూ గొర్ల సైదులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా చేయి విరగ్గొట్టారు. నేను పని చేస్తేనే పిల్లలను పోషించుకునేది. ఇప్పుడు ఎలా పని చేయాలి? ఇన్నాళ్లూ మా బాగోగులు పట్టించుకున్నారా.. కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా.. అలాంటి వారు మాపై దౌర్జన్యం ఏమిటి? మా లాంటి బీదోళ్లపై పడి కొట్టడం ఏమిటి? ఓటు వేయలేదని కొడతారా?’ అంటూ కప్పెర లక్ష్మి వాపోయింది. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు » సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసినప్పటి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి కొనసాగింది. తిరిగి మంగళవారం ఉదయం తొండపి గ్రామంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతి పరులు ఆడ, మగ బేధం లేకుండా మూకుమ్మడిగా చొరబడ్డారు.» మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంట్లోని సామగ్రి పగలకొట్టారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను భయబ్రాంతులకు గురి చేశారు. దాడికి పాల్పడుతున్న తరుణంలో ముస్లిం కుటుంబాల్లోని మగ వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు.» ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి మండలంలోని తొండపి, మాదల గ్రామాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. రెండు గ్రామాల్లోనూ ముస్లిం వర్గీయులే వైఎస్సార్సీపీ మద్దతు దారులుగా ఉండగా, టీడీపీకి మాత్రం బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లిం వర్గీయులంతా గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లోను వైఎస్సార్సీపీ కి అండగా ఉంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారు. కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి » గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు బొల్లా శ్రీనివాసరావు, చుండు రామారావు ఇళ్లపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నాయకులు రాళ్లు విసిరారు. దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. » వైఎస్సార్సీపీ నేత చుండు రామారావు తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి లచ్చమ్మతో పాటు మరో ఇద్దరిపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. టీడీపీ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తంగెడ, ఇరికేపల్లి, దాచేపల్లి గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్సీలపై దాష్టీకం » చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ 211లో ఉదయం 7.30 గంటలకు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఓట్లు కొన్ని పోల్ కావాల్సినవి మిగిలి ఉన్నాయి. దీనికోసం సమయం పెంచాల్సిందిగా వైఎస్సార్సీపీ తరుఫున బూత్ ఏజెంటుగా ఉన్న నలమాల కాంతయ్య అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇది నచ్చని టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కాంతయ్యపై దాడి చేశారు. దీంతో ఇతను తల పగిలి పడిపోయాడు. » దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కట్టెం ఆనందరావు, మరి కొందరికి కూడా గాయాలయ్యాయి. కాంతయ్య, ఆనందరావులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కావూరులోని మంచినీటి ప్లాంట్ నుంచి ఎస్సీ వర్గీయులు మంగళవారం మంచి నీరు తీసుకువెళ్లకుండా కట్టడి చేసి వారి దాష్టీకాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు గ్రామానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. కంభంపాడులో పచ్చ మూకల విధ్వంస కాండ» పెదకూరపాడు నియోజకవర్గంలోని కంభంపాడులో వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. సోమవారం పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య) సతీమణి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఆర్తిమళ్ల ఆంజమ్మ లక్ష్యంగా సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. » పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన పచ్చమూకలు.. నాగేశ్వరరావు, అతని కుమారులు రాజశేఖర్, ప్రవీణ్, ఆర్తిమళ్ల తిరుపతిరావు, ఎస్సీ కాలనీకి చెందిన సురేష్, బీసీ కాలనీకి చెందిన బ్రహ్మం, పల్లపాటి కృష్ణవేణిలపై దాడులకు పాల్పడ్డారు. పలువురి తల, కాళ్లు, చేతులు, ఛాతీపై రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టీడీపీ గూండాలు పలు మార్లు ఎస్సీ, బీసీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. కారెంపూడిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి» కారెంపూడిలో టీడీపీ గూండాలు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బీభత్సం సృష్టించారు. సుమారు 500 మంది రౌడీలు స్థానిక టీడీపీ నేతల నాయకత్వంలో బస్టాండ్ సెంటర్కు చేరుకుని వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ కరీంకు చెందిన వాచ్ షాపును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లతో భయానక వాతావరణం సృష్టిస్తూ గ్రామం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేశారు. » కారెంపూడి ఎంపీపీ బొమ్మిన సావిత్రికి చెందిన పాల కేంద్రాన్ని ధ్వంసం చేసి తగల బెట్టారు. తర్వాత మాచర్ల రోడ్డులో ఉన్న పోలిరెడ్డికి చెందిన టీస్టాల్పై దాడి చేసి ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో లూధరన్ చర్చి వద్ద ఎస్సీ కాలనీలో బీభత్సం సష్టించారు. తర్వాత వైఎస్సార్సీపీ కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అక్బర్ నివాసంపై దాడి చేశారు. » స్టేట్ బ్యాంక్ సెంటర్లో ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు వేముల పద్మావతి భర్త నిర్వహిస్తున్న ఆటో కన్సల్టెన్సీపై దాడి చేశారు. అక్కడ ఉన్న 40 బైక్లకు నిప్పు పెట్టారు. బైక్లకు ఉన్న బ్యాటరీలు పేలడంతో దానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అపార్ట్మెంట్లో నిలిపి ఉంచిన వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి కారును ధ్వంసం చేశారు. » టీడీపీ రౌడీ గ్యాంగ్ మరొకటి.. ఆర్య వైశ్య వీధి ముస్లిం ఏరియాలో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. తర్వాత గ్రామ శివారులో ఉన్న ఆదినారాయణ కాలనీలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్ నివాసానికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తలకు బలౖమెన గాయం అయింది. జెడ్పీ హైస్కూల్ వద్ద పార్క్ చేసి ఉన్న టీడీపీ నాయకుని స్కార్పియోను దుండగులు ధ్వంసం చేశారు. » మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేయగా, వైఎస్సార్సీపీ వర్గీయులు ప్రతిఘటించారు. ఓ దశలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడులలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్యనాయక్, మూఢావత్ కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావునాయక్ , మూఢావత్ నాగేశ్వరరావు నాయక్ గాయపడ్డారు. క్షతగాత్రులు గురజాల, పిడుగురాళ్ల ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నూజెండ్లలో టీడీపీ మూకల దాడులు» వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మంగళవారం పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాన సెంటరులోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మహిళలను వెంటాడి దాడి చేశారు. గ్రామంలో అందరూ కలసి కట్టుగా ఎన్నికల్లో పాల్గొన్నారనే అక్కసుతో టీడీపీ నాయకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కాజా ఆదిశేషమ్మ, అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కిరెడ్డి గోవిందరెడ్డి, అమ్మిరెడ్డి సంజీవరెడ్డి, భవనం సంజీవరెడ్డి, మల్లంపాటి చెంచిరెడ్డి, నక్కా ఆదిలక్ష్మి, కాజా జయమ్మ, వంగూరి ప్రసాద్ సహా 15 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, గొడవను అదుపు చేయలేక పోవటం పలు విమర్శలకు తావిచ్చింది. క్షతగాత్రులను వినుకొండ ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. » బొల్లాపల్లి మండలం పేరూరుపాడులో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన స్వల్ప వివాదంతో కావాలనే టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. -
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్ జరపాల్సిందే: మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు జిల్లా: సీఎం జగన్ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారన్నారు. ‘‘పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది’’ అంబటి రాంబాబు అన్నారు.టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కైయ్యారా?’’ అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు’’ అని అంబటి చెప్పారు.ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు. పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు’’ అంబటి దుయ్యబట్టారు.దాడులు జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు వచ్చారు. నకిరేకల్ ఎస్ఐ నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు. మీ అంతు తేల్చుతా అంటూ కన్నా కుమారుడు ఓటర్లను బెదిరించారు. రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.‘‘దమ్మాలపాడు బూత్లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాను. రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను. నా అల్లుడు ఉమేష్ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అథారిటీస్కి ఫిర్యాదు చేశాను. చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన మొనగాడు జగన్. మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
నల్లజర్ల/మండపేట/ఆవులవారిపాలెం(క్రోసూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్లలో సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై అవగాహనలేని ఓటర్లకు సహకారం అందించేందుకు వెళ్లి ఓటర్లు చెప్పినవారికి కాకుండా తమకు నచ్చినవారికి ఓట్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్లో దివ్యాంగురాలు బిరుదుగడ్డ నందెమ్మ ఓటు వేసేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ సహాయం కోరారు. తాను చెప్పిన పార్టీకి ఓటు వేయకుండా అంగన్వాడీ టీచర్ సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసినట్లు నందెమ్మ గుర్తించి, బయటకు వచ్చి అధికారులకు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆమెను విధులు నిర్వర్తించకుండా బయట కూర్చోబెట్టారు. ఇదేవిధంగా తెలికిచెర్ల గ్రామంలోని 166వ నంబర్ పోలింగ్ బూత్లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న జానకి కూడా పలువురికి సహాయంగా వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేశారు. ఈ బూత్లో పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు ఓటు వేయడానికి పీవో సహాయం కోరారు. వారు చెప్పినట్లు కాకుండా ఆమె టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేసినట్లు ఆ ఓటర్లతోపాటు ఏజెంట్లు గమనించారు. ఈ విషయాన్ని వారు బయటకు వచ్చి స్థానికులకు వివరించడంతో పీవో జానకిని నిలదీశారు. దీంతో తప్పయిపోయిందని ఒప్పుకున్న ఆమె... నాయకులను పక్కకు పిలిచి ‘పోయిన ఓట్లు భర్తీ చేసే విధంగా మీకు ఓట్లు వేయిస్తా’ అని నమ్మబలికారు. వారు ఒప్పుకోకపోవడంతో ప్లేటు ఫిరాయించి తనను ఒత్తిడి చేయడం వల్లే ఆవిధంగా ఒప్పుకున్నానని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆమె స్థానంలో సెక్టోరియల్ అధికారి వై.సత్యనారాయణను అక్కడ పీవో విధులకు నియమించారు. పీవో జానకిని పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి పీవో జానకి ఇదేవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్కు వృద్ధుడు ఫిర్యాదు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేట రావులచెరువు గట్టు వద్ద తొమ్మిదో నంబర్ సచివాలయంలో ఉన్న పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిపై ఓ వృద్ధుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ బూత్లో ఓటు వేసేందుకు గోకరకొండ సత్యనారాయణ(70) తన మనవడి సాయంతో వెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి పీఎన్వీవీ సత్తిబాబు జోక్యం చేసుకుని సత్యనాయణ మనవడిని బయటకు పంపించారు. అనంతరం సత్యనారాయణ వేలితోనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై సత్తిబాబు నొక్కించారు. తాను ఫ్యాన్ గుర్తుకు వేయమంటే సైకిల్కు ఎందుకు మీట నొక్కించారని సత్యనారాయణ ప్రశ్నించగా, ఆయన్ను బలవంతంగా బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గోకరకొండ ప్రసాద్కు తెలియజేయగా, రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.ఫ్యానుకు ఓటు వేయాలని చెబితే సైకిల్కు వేసిన ఓపీఓపల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పోలింగ్ బూత్లో వృద్ధుడు చిన్న అల్లీసా తన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని వోపీవో వెంకటరమణను కోరగా, ఆమె సైకిల్ గుర్తుపై వేశారు. వీవీ ప్యాట్లో సైకిల్ గుర్తు చూసిన వృద్ధుడు తీవ్ర ఆగ్రహానికి గురై వోపీవోపై తిరగబడ్డాడు. దాదాపుగా కర్రతో కొట్టేంత పనిచేశాడు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఆమె చేసిన తప్పిదాన్ని సరిచేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆర్వోకు, ఏఆర్వోలకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం స్పందించలేదు. -
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్ బూత్కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement