-
పాల్ ల్యాబ్ ట్యాబులను వినియోగించుకోవాలి ●
● పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ ఒంగోలు: పాల్ ల్యాబ్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో పాల్ ల్యాబ్ ట్యాబులను విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ అన్నారు. స్థానిక బండ్లమిట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని పాల్ ల్యాబ్లు ఉన్న 72 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాలకు సంబంధించి మరో ఇద్దరు ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్ ల్యాబ్ ఆవశ్యకత, వాటిని విద్యార్థులు వినియోగించుకునేలా చేయడంపై ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతామని చెప్పారు. డీఈవో డి.సుభద్ర మాట్లాడుతూ పాల్ట్యాబులను విద్యార్థులు ఎక్కువ సమయం సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలల ప్రగతిని సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి కిషోర్, సమగ్రశిక్ష మాధవీలత తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలకు మాత్రమే పెట్రోలు, డీజిల్ విక్రయించాలి
● కలెక్టర్ దినేష్కుమార్ ఒంగోలు అర్బన్: ఎన్నికల నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు జిల్లాలోని పెట్రోలు బంకుల నిర్వాహకులు జూన్ 10వ తేదీ వరకు కేవలం వాహనాలకు నింపేందుకు మాత్రమే పెట్రోలు, డీజిల్ విక్రయించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెట్రోలు, డీజిల్ ఎట్టి పరిస్థితిలోను సీసాలకు, డ్రమ్ములకు, ఇతర పాత్రలకు సరఫరా చేయకూడదన్నారు. అలా చేస్తే షాపుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో పెట్రోలు బంకులపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు కూడా గమనించి కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోలు, డీజిల్ పట్టించుకుకోవాలన్నారు. -
ఐదేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ అందించిన వైనం ఇలా..
సంవత్సరం నష్టపోయిన ఎకరాలు విలువ (లక్షల్లో) రైతులు 2019 1510 2,197.4 55.49 2020 1,34,623 2,30,876.05 1,0338.12 2021 18,715 29,966.82 1647.57 2022 28,727 63,147.08 2563.41 2023 341 606.52 34.77 2023 మిచాంగ్ 3775 4,975.9 282.32 మొత్తం 1,87,691 3,31,769.77 14921.67 పంట నష్టపోయిన వివరాలు ఇలా ... పంట నష్టపోయిన రైతుల సంఖ్య ఇన్పుట్ సబ్సిడీ పంట విస్తీర్ణం రూ.లక్షల్లో వరి 2799.2 2584 190.34 జొన్న 518.52 394 25.93 కంది 4.15 1 0.17 అలచందలు 12.5 3 0.50 మినుము 817.37 492 32.7 పొగాకు 749.4 266 29.98 వేరుశనగ 5 1 0.34 నువ్వులు 69.75 34 2.37 మొత్తం 4975.9 3775 282.32 నియోజకవర్గాల వారీగా అందిన నష్ట పరిహారం ఇలా.. నియోజకవర్గం విస్తీర్ణం రైతుల ఇన్పుట్ సబ్సిడీ ఎకరాల్లో సంఖ్య రూ.లక్షల్లో దర్శి 510.57 360 33.49 గిద్దలూరు 360.87 287 22.16 కనిగిరి 219.8 189 14.67 కొండపి 2 1 0.10 మార్కాపురం 402.62 631 27.37 ఒంగోలు 129.62 55 5.185 ఎస్.ఎన్.పాడు 1647.2 834 69.20 వై.పాలెం 1703.17 1418 110.11 మొత్తం 4975.9 3775 282.320 నూతన అధ్యాయానికి శ్రీకారం గతంలో ఎప్పుడూ పాలకులు తమ పాలనలో సైతం ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత లేదు. అయితే అందుకు భిన్నంగా ఎన్నికలు ముగిసినా సరే రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ముందే ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, విద్యాదీవెన నగదు ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా ఇవ్వటం రాజకీయాల్లో నూతన అధ్యాయం. సీఎం వైఎస్ జగన్కు ఆయా వర్గాలపై ఉన్న ప్రేమకు ఇది మచ్చుతునక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు ఎంతో ధైర్యంగా వ్యవసాయం చేశారు. పండితే పంట ఇంటికి వస్తుంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో ఏ సీజన్లో పంటకు ఇబ్బంది అయితే అదే సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఉచిత పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకున్నారు. మిచాంగ్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ సైతం ఎన్నికలకు ముందు ఇవ్వాల్సి ఉండగా, కూటమి పరోక్షంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపివేయించారు. ఎన్నికలు ముగిసినా సరే ప్రభుత్వ రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పంపటం జగనన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. – మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
పిడుగు పడి వ్యక్తి మృతి
త్రిపురాంతకం: గాలివాన బీభత్సానికి పిడుగులు పడటంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పాటు విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచింది. దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. త్రిపురాంతకం మండలం డీవీఎన్ కాలనీకి చెందిన అలగసాని నారాయణ (32) మృతి చెందాడు. అదేవిధంగా కంకణాలపల్లి గ్రామానికి చెందిన పేరయ్య గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. అదే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. త్రిపురాంతకంలో చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రూ.311 పలికిన పొగాకు ధర ఒంగోలు సెంట్రల్: ఒంగోలు పొగాకు బోర్డు రీజియన్ పరిధిలో ఈ సీజన్లో వేలం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు శనివారం గరిష్టంగా పొగాకు కేజీ రూ.311 పలికినట్లు టుబాకో బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు తెలిపారు. శనివారం వరకు 2,05,996 పొగాకు చెక్కులను వేలం పాట ద్వారా బయ్యర్లు కొనుగోలు చేశారని చెప్పారు. గరిష్టంగా కేజీ రూ.311, కనిష్టంగా రూ.211 పలికినట్లు చెప్పారు. వేసవి విజ్ఞాన శిబిరాలు ఉపయోగించుకోవాలి ● జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ఒంగోలు సెంట్రల్: విద్యార్థులు వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కోరారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ చదువుతో పాటు వేసవి విజ్ఞాన శిబిరాల్లో పిల్లలకు పలు రకాలైన కళల్లో సైతం ఉచితంగా శిక్షణ ఇస్తారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కవి జాలాది మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కోసం నిర్వహించే ప్రేరణ తరగతుల్లో మంచి పుస్తకాలు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ఉప గ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, సీహెచ్ సుధాకర్, మంచికంటి వెంకటేశ్వర రెడ్డి, మరో గ్రంథాలయ ఉద్యమం వారు పిల్లలతో పుస్తక పఠనం, ఇంటరాక్షన్, మోటివేషన్ ఆఫ్ రీడింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పీ పేరయ్య, గ్రంథాలయ సిబ్బంది డీ సందీప్, పీ ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చేరిన పోస్టల్ బ్యాలెట్లు ఒంగోలు అర్బన్: ఎన్నికల విధుల్లో మన జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన ఆయా జిల్లాల్లో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం జిల్లాకు చేరాయి. ఒంగోలు పార్లమెంట్ ప్రత్యేక అధికారి ఝన్సీ, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి విశ్వేశ్వరరావు జిల్లాకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను స్పందన హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో రిసీవ్ చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ల సీళ్లు తీసి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విభజించారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు పార్లమెంట్ నియోజకవర్గానికి 2330 ఓట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 2343 ఓట్లు వచ్చాయి. దీనిలో ఒంగోలు ఆర్డీవో సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు రసూల్, రాజశేఖర్, స్వరూప్, అభ్యర్థులు రాయపాటి జగదీష్, కొండారెడ్డి, యోహాన్, కోటేశ్వరరావు, డీ బాలాంజనేయులు, హరిప్రసాద్, ఏడుకొండలు, శ్రీకాంత్, ఆమని తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జైలు పరిశీలన
● జైలును పరిశీలించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ భారతి ఒంగోలు: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎ.భారతి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు శనివారం జిల్లా జైలును సందర్శించారు. ఖైదీలకు ఏర్పాటు చేసిన వసతులు, సదుపాయాలు, పరిశుభ్రత వంటి అన్ని అంశాలను పరిశీలించారు. ఎండ తీవ్రతను అధిగమించేందుకు ఖైదీల బ్లాకుల్లో ఏర్పాటు చేసిన వట్టివేరు చాపలు, మంచినీటి కుండలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను, ఖైదీలకు అందుతున్న ఆహార సదుపాయాలను పరిశీలించారు. ఖైదీల కోసం వండిన పదార్థాల నాణ్యత, పరిమాణాలు, దుస్తులు, దుప్పట్ల నాణ్యతను, పరిసరాల శుభ్రత, తాగునీటి పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య వివరాలను కారాగారం వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడి వారికి అందుతున్న ఉచిత న్యాయ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైళ్లశాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకును పరిశీలించి అందులో పనిచేస్తున్న జీవిత ఖైదీలను పరామర్శించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి పి.వరుణ్రెడ్డి, జైలు వైద్యాధికారి కేఎస్వీఎస్ బ్రహ్మతేజ, జైలర్ వి.రమేష్, ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ జైలరు బి.శ్రీనివాసరావు, కేవీ వసంతరావు, సిబ్బంది ఉన్నారు. -
నేనున్నానంటూ..
ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు సీఎం జగన్మోహన్రెడ్డి. ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ రైతుల చేయి విడవడంలేదు. ఏ సీజన్లో ఏర్పడిన నష్టాన్ని అదే సీజన్లో ఇస్తూ ఆదుకుంటున్నారు. అదే రీతిలో ఎన్నికల ముందే రైతుల ఖాతాల్లో నగదు జమచేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డంపడ్డాడు. ఎన్నికల కమిషన్ను అడ్డంపెట్టుకుని కుట్రలు చేశాడు. పోలింగ్ ముగిసిందే ఆలస్యం జిల్లాలో 3775 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.2.82 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లో జమచేసి రైతు పక్షాన సీఎం జగన్ నిలిచారు. దెబ్బతిన్న మిరపను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ (ఫైల్) ఒంగోలు సెంట్రల్: తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. గడిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో మొదటి రోజు నుంచి చివరి వరకు ఇదే పద్ధతిలో బాధిత అన్నదాతలకు బాసటగా నిలుస్తోంది. ఖరీఫ్ సీజన్లో మిచాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు కూడా సీజన్ ముగియకుండానే పరిహారం జమ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం తేదీలను కూడా ప్రకటించింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని రైతులకు పరిహారం అందకుండా అడ్డుకున్నాడు. అయినా సరే సీఎం వైఎస్ జగన్ వారి కుయుక్తులను బహిరంగ సభల్లో విమర్శించి రైతన్నలకు ఆదుకోవటానికి ఎన్నికలు ముగిసిన వెంటనే నష్టపరిహారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో శనివారం, సోమ, మంగళవారాల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నాడు చంద్రబాబు పాలనలో .. చంద్రబాబు పాలనలో తుఫాన్లు వస్తే రైతులు వణికిపోయేవారు. పంట దెబ్బతింటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవారు. తెలుగు తమ్ముళ్లు చెప్పిన రైతుల పేర్లతోనే జాబితా తయారయ్యేది. నష్టం అంచనాలు రూపొందించాక సీజన్లు గడిచిపోయినా పరిహారం అందుకోవటం గగనమయ్యేది. ఏడాదికో.. ఎడాదిన్నరకో పరిహారం విడుదలైనా పది నుంచి 20 శాతం జన్మభూమి కమిటీలకు కమీషన్ ముట్టచెప్పాల్సి వచ్చేది. ఎన్నికలకు ముందు మొక్కుబడిగా పసుపు కుంకుమ, పింఛన్లు పెంచేవారు. నేడు... వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చినా రైతులు నిశ్చింతగా ఉంటున్నారు. టీడీపీ ప్రభుత్వానికి భిన్నంగా పూర్తి పారదర్శకంగా పంట నష్టం అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రతి రైతు పంట చేనుకు వెళ్లి ఫొటోలు తీసి జాబితాను రూపొందిస్తున్నారు. జాబితాలో లోపాలుంటే సరిదిద్దేందుకు వీలు కల్పిస్తున్నారు. సామాజిక తనిఖీ తర్వాతే తుది జాబితా విడుదలవుతోంది. ప్రభుత్వానికి వెంటనే నివేదికలు పంపుతున్నారు. సీజన్ దాటక ముందే పంట నష్ట పరిహారాన్ని రైతులకు అందించి రైతులను ఆదుకుంటున్నారు. దీంతో అన్నదాతలు సీఎంకు జేజేలు చెబుతున్నారు. గతంలోను ఆదుకున్న వైనం ఇలా... 2019 ఆగస్టులో, అక్టోబర్లలో సంభవించిన భారీ వర్షాలకు, 2020 జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నివార్ తుఫాన్ నష్టాలకు, 2021లో నవంబర్లో 2020 సెప్టెంబర్లో, 2022 డిసెంబర్లో మాండూస్ తుఫాన్, 2023 మార్చిలో అకాల వర్షాలకు సంభవించిన నష్టాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం స్పందించి ఇన్పుట్ సబ్సిడీ అందించారు. ఎన్నికల అనంతరం మిచాంగ్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ సైతం అందించటానికి సిద్ధమయ్యారు. విపత్తు కష్టంలో రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన సీఎం జగన్ ఎన్నికలు అడ్డంపెట్టుకుని సాయం అందకుండా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ ముగిసిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ 3775 మంది రైతులకు రూ.2.82 కోట్లు జమ రెండు రోజుల పాటు ఖాతాల్లోకి నగదు ఆనందంలో అన్నదాతలు -
డీలర్లు నిబంధనలు పాటించాలి
ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయ డీలర్లు నియమ నిబంధనలు పాటించి నిర్ణయించిన ధరలకు అమ్ముకోవాలని జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ ఎస్ శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లకు సమావేశం ఏడీఏ రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల లైసెన్సులు పొందగోరు డీలర్లు తప్పనిసరిగా తగిన విద్యార్హత కలిగి ఉండాలని చెప్పారు. పొందిన లైసెన్సు రైతులకు కనిపించేలా దుకాణంలో పారదర్శకంగా ఉంచాలని అన్నారు. స్టాక్, బిల్లు రిజిస్టర్లు సంబంధిత అధికారిచే ధ్రువీకరించుకోవాలని చెప్పారు. కంపెనీ ఫామ్–ఓ ఎప్పటికప్పుడు లైసెన్స్లో నమోదు చేసుకుంటూ ఉండాలన్నారు. ఎరువుల బస్తాలు తూకం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని, ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ అమ్మటానికి లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే యూరియాను వ్యవసాయేతర, పారిశ్రామిక అవసరాలకు విక్రయించకూడదన్నారు. రైతులు వారు సాగు చేయటానికి ఎంత యూరియా అవసరమో తెలుసుకుని అంత మొత్తం మాత్రమే అమ్మాలని ఆదేశించారు. అమ్మిన ప్రతి బస్తాకు కచ్చితంగా ఎప్పటికప్పుడు ఐఎఫ్ఎంఎస్, డీబీటీలో నమోదు చేయాలన్నారు. ప్రతి నెలా మూడో తేదీ లోపు మీ వ్యాపారాలకు సంబంధించిన స్టాక్ రిపోర్టులను సంబంధిత మండల వ్యవసాయాధికారికి అందజేయాల్సి ఉంటుందని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు విక్రయించేవారు లైసెన్సులు కలిగి ఉండాలని చెప్పారు. గోడౌన్ వద్ద స్టాకు వివరాలు ప్రదర్శించాలని, విత్తన సంచులు లేదా ప్యాకెట్స్పై పూర్తి సమాచారం ఉండాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్టీ పత్తి విత్తనాలు అమ్మరాదన్నారు. రాబోవు ఖరీఫ్, రబీలో తగిన జాగ్రత్తలు పాటించి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించాలని కోరారు. టెక్నికల్ వ్యవసాయాధికారి వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించారు. ఒంగోలు ఏడీఏ రమేష్ బాబు మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మే సమయంలో కచ్చితంగా బిల్లులు ఇవ్వాలని చెప్పారు. ఎరువుల డీలర్ల సంఘ అధ్యక్షుడు దేసు వీరయ్య, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాలు నిర్ణీత ధరలకు విక్రయించాలి జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ ఎస్ శ్రీనివాసరావు -
చేపల చెరువులో విష ప్రయోగం
పెద్దదోర్నాల: చేపల చెరువులో విష ప్రయోగం జరిగి చెరువులోని చేపలన్నీ మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని ఎగువ చర్లోపల్లిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. చెరువులోని చేపలన్నీ చనిపోవడంతో సుమారు రూ.4 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని యజమాని భోరున విలపించాడు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై అంకమరావు కథనం మేరకు.. ఎగువచర్లోపల్లి కొత్తపాలేనికి చెందిన పరిశపోగు ఇశ్రాయేల్కు గ్రామంలో 2 ఎకరాల 75 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఎకరాల్లో జామ సాగు చేస్తుండగా, మరో 75 సెంట్లలో చేపల చెరువును గత ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసి చేపలు పెంచుతున్నాడు. ఈ నెల 16వ తేదీ వేకువజామున చెరువు దగ్గరకు వెళ్లి చూడగా, చేపలు మొత్తం చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంకమరావు తెలిపారు. చనిపోయిన చేపల శ్యాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపనున్నట్లు ఎస్సై తెలిపారు. కొందరు గ్రామస్తులపై బాధితుడు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చనిపోయి నీటిపై తేలియాడుతున్న చేపలు రూ.4 లక్షల నష్టం -
గ్యాస్ ఏజెన్సీలో చోరీ
కొమరోలు: కొమరోలులోని చెక్పోస్టు వద్ద ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీలో దొంగతనం జరిగింది. స్థానిక ఎలీషా ఇండియన్ డీవీకే గ్యాస్ ఏజెన్సీలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. శనివారం ఉదయాన్నే నిర్వాహకులు ఏజెన్సీ ఆఫీసును తెరవడానికి రాగా ఆఫీసు షట్టర్ గడ్డపార సహాయంతో పైకి ఎత్తి గ్లాసు అద్దాలను పగులగొట్టి లోపలికి చొరబడి దొంగతనం చేసినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానిక ఎస్సై మధుసూదన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏజెన్సీ ఆఫీసులో గ్యాస్ కౌంటర్లో ఉన్న రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. వీధికుక్కల దాడిలో 30 మేకపిల్లలు మృతి అర్థవీడు (బేస్తవారిపేట): వీధికుక్కల దాడిలో 30 మేకపిల్లలు మృతి చెందిన సంఘటన మండలంలోని అంకభూపాలెంలో జరిగింది. చింతలపూడి నాగేశ్వరరావుకు చెందిన మేకపిల్లల దొడ్డిపై వీధి కుక్కలు దాడి చేశాయి. 30 మేకపిల్లలు తీవ్రంగా గాయపడగా, పశువైద్యాధికారి బీ శ్రీధర్కు నాగేశ్వరరావు సమాచారం అందించారు. మేక పిల్లలకు వైద్యం చేసినా ఫలితం దక్కలేదు. వాటి మృతితో రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశాడు. రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు ఉద్యోగి మృతి తర్లుపాడు: తర్లుపాడు మండలం సీతానాగులవరం వద్ద శనివారం ఉదయం బైకును బొలేరో వాహనం ఢీకొన్న సంఘటనలో బేస్తవారిపేట టైలర్స్ కాలనీకి చెందిన మహబూబ్ సుభానీ (31) మృతి చెందాడు. ఎస్సై వేముల సుధాకర్ కథనం ప్రకారం.. సుభానీ శనివారం ఉదయం మార్కాపురం పట్టణంలో పనిముగించుకుని తన టూ వీలర్పై బేస్తవారిపేటకు తర్లుపాడు మీదుగా బయలుదేరాడు. సీతానాగులవరం గ్రామం వద్దకు రాగానే అతివేగంతో వచ్చిన బొలేరో వాహనం సుభానీ టూ వీలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే సుభానీ మృతి చెందాడు. మృతుడు విజయవాడలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తండ్రి దూదేకుల సైదు కాశిం తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పకడ్బందీగా నిర్వహించాలి
సప్లమెంటరీ పరీక్షలను ఒంగోలు అర్బన్: ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్, పదో తరగతి పరీక్షలను, జూన్ 1వ తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శనివారం ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల సమయాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 15,291 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం పరీక్షలకు 7,075 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఎంపిక చేసిన 43 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12–45 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకు 22 పరీక్ష కేంద్రాల్లో 3,871 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటర్కు పది పరీక్ష కేంద్రాల్లో 2,612 మంది, పదో తరగతి పరీక్షలకు 6 కేంద్రాల్లో 898 మంది విద్యార్థులు హజరవుతారని తెలిపారు. పరీక్షల్లో మాస్కాపీయింగ్ అవకాశం లేకుండా పక్కాగా నిర్వహించాలన్నారు. అధికారులు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు, డీఈఓ సుభద్ర, ఆర్ఐఓ సైమన్ విక్టర్, డీఎంహెచ్ఓ సురేష్, ఆర్టీసీ, విద్యుత్, తపాలా, ఖజానా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేయాలి అధికారులతో కలెక్టర్ దినేష్కుమార్ -
దర్శిలో హైడ్రామా..!
దర్శి: దాడులు చేసింది వాళ్లే. రెచ్చగొట్టేదీ వాళ్లే. మళ్లీ వచ్చి బూతులు తిట్టి ప్రెస్మీట్లు పెట్టి పోలీసులను తిట్టేదీ వాళ్లే. టీడీపీకి పోలీసుల మద్దతును కప్పిపుచ్చేందుకు ఆ పార్టీ జిల్లా నేతలు దర్శి వచ్చి హైడ్రామా ఆడి వెళ్లారు. బాధితులను పరామర్శించే పేరుతో పోలీసులను, వైఎస్సార్ సీపీ నేతలను బూతులు తిట్టి హైడ్రామాను రక్తి కట్టించారు. బొట్లపాలెంలో ఇరువర్గాలు ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. అయితే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ శుక్రవారం ఒంగోలు నుంచి బొట్లపాలెం వచ్చి టీడీపీ నాయకులను పరామర్శించే వంకతో మళ్లీ రెచ్చగొట్టి వెళ్లారు. పరామర్శించి గొడవలు లేకుండా చూడాల్సిన బాలాజీ.. వారిని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు. మళ్లీ ఇలాగే జరిగితే వైఎస్సార్ సీపీ వాళ్లకు ఒక్కొక్కరికి తోలు తీస్తామంటూ రెచ్చగొట్టారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామంటూ ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను రాక్షస జాతి అని అవమానించారు. గ్రామంలోకి వచ్చి ఎన్నిమాటలు అన్నా.. బూతులు తిట్టినా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం సంయమనం పాటించి ఓర్పుగా ఉన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి.. ఒల్లు బలిసిన చేష్టలు చేస్తే డోంట్ కేర్.. తగిన మూల్యం చెల్లించుకోవాలని పోలీసులకు నూకసాని బాలాజీ వార్నింగ్ ఇచ్చారు. నాటకాలొద్దు, వేషాలు వెయ్యొద్దు, ఇలాగే చేసి ఎస్పీలు, కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు, ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు ఖబడ్దార్ అంటూ పోలీసులను హెచ్చరించారు. ఈ తతంగమంతా తెలిసి కూడా వీడియోలు బయటకు వచ్చినా నూకసాని బాలాజీపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం టీడీపీ వారితో పోలీసులకు ఉన్న లాలూచీని స్పష్టం చేస్తోంది. ఖబడ్దార్ అంటూ పోలీసులను వీధిరౌడీలా రెచ్చగొట్టినా.. బాలాజీపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, కనీసం నోరు మెదపకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. పోలీసులే హైడ్రామా వేయించారనే అనుమానాలు... జరిగిందంతా చూస్తుంటే నూకసాని బాలాజీతో పోలీసులే హైడ్రామా క్రియేట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొట్లపాలెం గ్రామంలో ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. కానీ, దేవవరంలో టీడీపీ అభ్యర్థి భర్త లలిత్సాగర్ గొడవలు జరిగేటప్పుడు పక్కనే ఉన్నారు. టీడీపీ వారిని రెచ్చగొట్టారు. అయినా లలిత్సాగర్పై ఎటువంటి కేసులు పెట్టలేదు. దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం బూత్లో జరిగిన ఘటనను పరిశీలిస్తే పోలీసుల పచ్చపాతం ఇట్టే అర్థమవుతోంది. ఎస్సై కళ్లెదుటే సమయం ఆరుగంటలు దాటిన తర్వాత పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు నరసరావుపేట రౌడీల సాయంతో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రయత్నించారు. అక్కడున్న ఓటర్లు పోలీసులకు చెప్పినా.. పోలీసులు మాత్రం వారిని అడ్డుకోలేదు. బలవంతంగా 6 గంటలు తర్వాత అభ్యర్థి లక్ష్మి, కడియాల వెంకటేశ్వరరావు, కడియాల లలిత్సాగర్, గొట్టిపాటి భరత్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించినా వారిపై ఎటువంటి కేసులు పెట్టలేదు. అసలు నరసరావుపేటకు చెందిన వ్యక్తులపై పోలీసులు ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారన్న విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. దగ్గరుండి టీడీపీ కార్యకర్తలతో పోలీసులపై, పోలింగ్ బూత్పై రాళ్లు రువ్వించిన వారిపై ఎటువంటి కేసులు పెట్టకపోవడం ఏంటని స్థానికంగా చర్చ నడుస్తోంది. నూకసాని బాలాజీ మాత్రం టీడీపీ నేతలపై కేసులు పెట్టారంటూ ఒక్క బొట్లపాలెం గురించి మాట్లాడారేగానీ.. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసిన దేవవరం గురించిగానీ.. పోలీసులపై, పోలింగ్ బూత్పై రాళ్లు రువ్విన ఘటనలపైగానీ నోరుమెదపలేదు. దేవవరం, దర్శిలో జరిగిన ఘటనల్లో ప్రధాన నాయకులపై, నరసరావుపేట రౌడీలపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలీసులు వారిపై కేసులు ఎందుకు పెట్టలేదన్న దానిపై అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నరసరావుపేటకు చెందిన రౌడీలకు ఇక్కడి పోలీసులకు సంబంధం ఏంటనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. సిట్ దర్యాప్తు చేపడితేనే ఇక్కడ జరిగిన లోగుట్టు బయటకు వస్తుందని ప్రజలు కోరుతున్నారు. రక్తి కట్టిస్తున్న టీడీపీ నేతలు, పోలీసులు పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శలు చేసేదీ టీడీపీ నేతలే రెచ్చగొట్టి దాడులు చేసిందీ వాళ్లే తాజాగా కూడా బొట్లపాలెంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ సమన్వయంతో ఉన్న బొట్లపాలెం వైఎస్సార్ సీపీ నేతలు ఇరువర్గాలు కొట్టుకున్నా.. బొట్లపాలెం గురించి మాత్రమే ప్రెస్మీట్ పెట్టిన టీడీపీ వైఎస్సార్ సీపీ నేతలు, పోలీసులపై జరిగిన దాడులపై నోరెత్తని వైనం దర్శిలో రాళ్లు రువ్విన కేసు, దేవవరంలో కర్రలతో దాడి ఘటన ఊసే లేదు పోలీసులను బూతులు తిట్టినా మిన్నకుండిపోయిన ఖాకీలు ఇదంతా టీడీపీ నేతలు – పోలీసుల హైడ్రామా అంటున్న ప్రజలు -
సూపర్ మార్ట్లో చోరీ
కంభం: పట్టణంలోని ఓ సూపర్ మార్ట్లో దొంగలు పడి నగదు, నిత్యావసర వస్తువులు అపహరించుకెళ్లిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అనంతపురం – అమరావతి హైవే ఆనుకుని రావిపాడు రోడ్డు సమీపంలో ఉన్న సిందూరి సూపర్ మార్ట్లో శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి షట్టర్ను గడ్డపారతోపైకి లేపి లోపలికి ప్రవేశించాడు. కౌంటర్లో ఉన్న సుమారు రూ.80 వేల నగదు, నిత్యావసర సరుకులు, తినుబండారాలు, సీసీ కెమేరాలకు సంబంధించిన డీవీఆర్, హార్డ్ డిస్క్ అపహరించుకెళ్లాడు. ఉదయం మార్ట్ తెరవడానికి వచ్చిన సిబ్బంది షట్టర్ తెరిచి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. మార్ట్లోపల రెండు సీసీ కెమేరాలు ఉండగా లోపలికి ప్రవేశించిన దొంగ ఒక సీసీ కెమెరాకు సంబంధించిన డీవీఆర్, హార్డ్ డిస్క్ను అపహరించుకెళ్లగా మరో సీసీ కెమెరాకు చెందిన హార్డ్ డిస్క్లో దొంగ లోపలికి ప్రవేశించిన దృశ్యాలు, మార్ట్లోపల తిరుగుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. స్థానిక ఎస్సై పులి రాజేష్ మార్ట్ను పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ బృందం మార్ట్లో వేలిముద్రలు సేకరించింది. నగదు, పోయిన వస్తువులు కలిపి సుమారు లక్షన్నర రూపాయలు ఉంటాయని మార్ట్ యజమాని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడలిలో ఉండే మార్ట్లో దొంగతనం జరగడంతో చుట్టుపక్కల వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నగదు, వస్తువుల అపహరణ -
ఆటోను ఢీకొన్న మినీ లారీ..ఒకరు మృతి
పొదిలి: ఎదురుగా వస్తున్న ఆటోను మినీ లారీ ఢీకొనటంతో ఆటోలో ఉన్న వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారిపై పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన రమాదేవి, ఇద్దరు కుమారులు మధురోహిత్, అరుణ్కుమార్, కోడలు పుష్పాలు కలిసి విజయవాడ కనక దుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో నంద్యాల వెళుతున్నారు. ఈ క్రమంలో ఆటో కంభాలపాడు సమీపంలోకి వచ్చేసరికి పొదిలి వైపు ఎదురుగా వస్తున్న మినీలారీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో దెబ్బతిని ఆటోలో ఉన్న మధు రోహిత్ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న రమాదేవి, కుమారుడు అరుణ్కుమార్, కోడలు పుష్పకు గాయాలయ్యాయి. అరుణ్కుమార్ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, పుష్పకు ఎడమ కాలు, చేయి విరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అరుణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కోటయ్య సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన మినీ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు. ముగ్గురికి గాయాలు -
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా వెంకట్రావు
ఒంగోలు: ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా బి.వెంకట్రావు నియమితులయ్యారు. స్థానిక హెడ్మాస్టర్స్ సంఘ భవనంలో శుక్రవారం నూతన జిల్లా కమిటీ ఎంపిక జరిగింది. ఈ ఎంపిక జిల్లా అధ్యక్షుడు కేవీజీ కీర్తి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఎ.అమ్మయ్య, జిల్లా అధ్యక్షునిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా బి.అశోక్కుమార్, సహాయ అధ్యక్షులుగా ఎన్.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా పీవీ ప్రభాకరరావు, కె.వెంకటేశ్వర్లు, యం.విశ్వభారతి, టి.పాండురంగస్వామి, అదనపు కార్యదర్శిగా ఎస్హెచ్ కబీర్, కార్యదర్శులుగా బి.నాగార్జున, విక్రమ్, జి.పాండు, ఎస్.శ్రీదేవి, కె.పెద్దన్న, యం.సురేష్ బాబు, ఎ.గురులింగం, టి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్లుగా బి.వెంకట్రావు, బి.అశోక్కుమార్, పీవీ సుబ్బారావు, వై.శ్రీనివాసులు, కేవీజీ కీర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా పి.ఆంజనేయులు, అకడమిక్ కమిటీ కన్వీనర్గా సీహెచ్వీ చలపతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యారంగాన్ని పరిరక్షించుకుని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
ఖరీఫ్, రబీ సీజన్లకు ప్రణాళిక సిద్ధం
● జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు ● ‘తరుముకొస్తున్న కాలం..కదులుతుందా యంత్రాంగం’ కథనానికి ఖండన ఒంగోలు సెంట్రల్: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్కు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని అందుకు అనుగుణంగా పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక పత్రికలో (సాక్షి కాదు) శుక్రవారం ‘తరుముకొస్తున్న కాలం–కదులుతుందా యంత్రాంగం’ పేరుతో ప్రచురితమైన కథనాన్ని ఆయన ఖండిస్తూ... శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగలు 667, పెసర 390, జనుములు 1716 క్వింటాళ్లు జిల్లాకు కేటాయించారని చెప్పారు. ఖరీఫ్లో సాగు చేయటానికి వరి 4000, పెసర 120, మనుము 500, కంది 1500 క్వింటాళ్లు కేటాయించారని, సదరు విత్తనాలు ఏపీ సీడ్స్ ద్వారా సాధారణ రాయితీపై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆయా మండలాలకు ఇప్పటికే కేటాయించామని రైతులు తమ పరిధిలోని ఆర్బీకేల ద్వారా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుని వారికి కావాల్సిన విత్తనాలు రాయితీపై పొందవచ్చన్నారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద (ఎన్ఎఫ్ఎస్ఎం) ద్వారా గత సంవత్సరం 31,600 మినీ కిట్స్ పూర్తి రాయితీపై రైతులకు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ సంవత్సరం 35,00 కంది కిట్స్ కేటాయింపునకు ప్రతిపాదనలు పంపారన్నారు. అవి కూడా అందుబాటులోకి వస్తాయని, రైతులు తమ వద్ద ఉన్న స్వంత విత్తనాలు కూడా సాగుకు సిద్ధం చేసుకుని ఉన్నారని వివరించారు. -
పోల్డ్ ఈవీఎంలకు పటిష్ట భద్రత
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి శుక్రవారం ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్ట్రాంగ్ రూమ్లకు భద్రతా చర్యలు, కౌటింగ్ కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్లు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పోల్డ్ ఈవీఎంల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. కలెక్టర్, ఎస్పీలు స్ట్రాంగ్ రూమ్లను ప్రతి రోజు సందర్శించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు, దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు సుబ్బారెడ్డి, లోకేశ్వరరావు, నాగజ్యోతి, జాన్ ఇర్విన్, కుమార్, కలెక్టర్ పరిపాలన అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ శుక్రవారం స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలో పరిశీలించారు. కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూముల వద్ద పటిష్టమైన భద్రతా ఉండాలన్నారు. భద్రతా చర్యల్లో ఉన్న అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సీళ్లను పరిశీలించారు. -
ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం పోలింగ్ బూత్ల వద్ద కూడా అల్లర్లు...
దర్శి పట్టణంలో కొత్తరెడ్డిపాలెం, పొదిలి రోడ్డుకు చెందిన పోలింగ్ బూత్లను స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ బూత్లు వైఎస్సార్ సీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చేవి కాగా, సాయంత్రానికి టార్గెట్ చేసుకుని ఈవీఎంలు ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో 6 గంటల తర్వాత వంద మందికిపైగా అనుచరులతో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానిక నాయకులు, ఓట్లేసే వారు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లి చూడాలంటే అభ్యర్థికి మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన వారు వెళ్లడానికి లేదని అడ్డుకున్నప్పటికీ.. వాళ్లని నెట్టుకుని బూత్లలోకి ప్రవేశించేందుకు లక్ష్మి ప్రయత్నించారు. లక్ష్మితో పాటు నిబంధనలకు విరుద్ధంగా కడియాల వెంకటేశ్వరరావు, గొట్టిపాటి భరత్, కడియాల లలిత్ సాగర్లు కూడా వారి అనుచరులు 100 మందితో బూత్లలోకి ప్రవేశించి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓటర్లు, ఏజెంట్లు అడ్డుగా నిలబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లకుండా తలుపులు వేసి ఈవీఎంలను కాపాడుకున్నారే తప్ప ఏ ఒక్క పోలీసు వారిని ఆపిన పాపానపోలేదు. కడియాల వెంకటేశ్వరరావు అనుచరులు అక్కడి ఓటర్లను, బూత్ ఏజెంట్లను తోసివేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర మాత్రమే వహించారు. దీంతో వారి మధ్య గొడవలు పెద్దవి కావడంతో ప్రత్యేక బలగాలు వచ్చి వారిని పంపించి వేశారు. బూత్లో తాము ఏమీ చేయలేకపోయామనే ఆక్రోశంతో కడియాల కుటుంబబం అక్కడి కార్యకర్తలను రెచ్చగొట్టి తమ అనుచరులను తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వి బూత్పైకి రాళ్లు విసిరేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి చెదరగొట్టాయి. ఇంత గందరగోళం జరిగినా గొడవలకు కారణమైన అసలు వారిపై కేసులు నమోదు చేయకుండా కేవలం స్థానిక టీడీపీ నాయకులపై మాత్రమే కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తునారు. -
వేగంగా ఎకో టూరిజం పార్కు పనులు
హనుమంతునిపాడు: మండల పరిధిలోని హాజీపురం ఫారెస్టు ఎత్తు రోడ్డు వద్ద రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఎకో టూరిజం పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు కేంద్ర అటవీ శాఖ నుంచి రూ.2 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. దీంతో ఫారెస్టు అధికారులు టూరిజం పార్కు, జిమ్ పార్కు, వాచింగ్ టవర్, రోడ్డు, ఇతర పనులను వేగంగా చేస్తున్నారు. ఈ పార్కులో జిమ్ పార్కు, క్యాంటీన్, వాచ్టవర్, నీటి కుంటలు, సోలార్ విద్యుత్ లైట్లు, బోరు మోటార్లు, రోడ్డు, జింకల పార్కు, వాకింగ్ పార్కు, ఆర్చి, కారు పార్కింగ్ తదితర పనులు జరుగుతున్నట్లు ఫారెస్ట్ డీఆర్ఓ రామిరెడ్డి తెలిపారు. ఈ పనులు రెండు సంవత్సరాలకు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత వాసులకు టూరిజం పార్కులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
మల్లవరం వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మద్దిపాడు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మల్లవరం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి 8 గంటల నుంచి అకురారోహణ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. 19 ఉదయం స్వామివారికి అగ్ని ప్రతిష్టాపనలో నిత్యహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి ధ్వజారోహణ సమయంలో సంతానంలేని దంపతులకు గరుడ ప్రసాదం అందిస్తారు. రాత్రికి శేష వాహన సేవ, 20వ తేదీ సాయంత్రం హంసవాహన సేవ, 21వ తేదీ సింహవాహన సేవ, 22వ తేదీ హనుమద్వాహన సేవ, 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడ సేవ 24వ తేదీ రాత్రికి గజోత్సవం, 25వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం, కల్యాణం అనంతరం భక్తులకు అన్న సంతర్పణ, రాత్రికి రథోత్సవం, 26వ తేదీన అశ్వవాహనం, 27వ తేదీ ధ్వజావరోహణ పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీ ఉదయం 8 గంటలకు చక్రతీర్థం, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ కాగడా సేవ నిర్వహిస్తున్నట్లు పలువురు ఉభయ దాతలు బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు, నారాయణం రాజశేఖరాచార్యులు ఆధ్వర్యంలో ప్రముఖ యాజ్ఞీకులు ఆగమ ప్రవర దివి వెంకట శేషాచార్యులు స్వామివారి కల్యాణ కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ నారా నాగిరెడ్డి తెలిపారు. పటిష్టంగా బందోబస్తు మల్లవరం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నట్లు మద్దిపాడు ఎస్ఐ వీ మహేష్ తెలిపారు. వాహనాల పార్కింగ్కు దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూరల్ సీఐ టీఎక్స్ అజయ్కుమార్లో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించినట్లు తెలిపారు. కల్యాణం సమయంలో రద్దీని తట్టుకోవడానికి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. -
బీజేపీ పాలనలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు
ఒంగోలు టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ విధానాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్లచట్టాలను తెచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలకులు దేశంలోని భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగం చేపట్టిన ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు నిర్బంధాన్ని ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో వేయి మందికిపైగా రైతులు ఆశువులు బాసారని, నల్లచట్టాల ఫలితంగా వ్యవసాయం కుదేలై అప్పుల పాలైన రైతులు 1,50,000 మంది ఆత్మహత్యలు చేసుకుని మరణించారని చెప్పారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎన్నికలలో దేశంలోని రైతులు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఓట్లేస్తున్నారని చెప్పారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వమేనని అన్నారు. గతేడాది వచ్చిన కరువు, తుఫాన్లతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, జిల్లా నాయకులు వీరారెడ్డి, పావులూరి అంజయ్య, పోలవరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ -
నేడు హెచ్ఎం, ఉపాధ్యాయులకు అవగాహన తరగతులు
ఒంగోలు: జిల్లాలో పాల్ ల్యాబ్ సౌకర్యం ఉన్న 33 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒక గణితం, ఒక ఆంగ్ల సబ్జక్టు టీచర్లకు శనివారం ఒకరోజు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశిక్షణ స్థానిక బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాతోపాటు బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని 74 పాఠశాలల నుంచి 222 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరవుతారన్నారు. శిక్షణ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని, శిక్షణకు కేటాయించిన ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరికీ మినహాయింపు లేదన్నారు. సంబంధిత డివిజన్ విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శిక్షణకు కేటాయించిన వారిని రిలీవ్ చేయాలన్నారు. ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఒంగోలు: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో కంప్యూటర్ అండ్ ట్యాలీ కోర్సులో శిక్షణ, ఉద్యోగం కల్పిస్తారని ఫౌండేషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్ పాస్/ ఫెయిల్, డిప్లొమా పాస్/ఫెయిల్, డిగ్రీ పాస్ / ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని, 35 రోజులపాటు జరిగే ఈ శిక్షణ కాలంలో భోజనం, ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. 35 రోజుల కోర్సులో ట్యాలీ జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ప్లేస్ ఎథిక్స్ లో అత్యుత్తమ శిక్షణ ఉచితంగా ఇస్తారన్నారు. శిక్షణ తదనంతరం వంద శాతం వివిధ సంస్థల్లో కనీస నెల జీతం రూ.15 వేలు పైన కల్పిస్తారన్నారు. పూర్తి వివరాలకు హరిప్రసాద్ 9000487423 ను సంప్రదించాలన్నారు. కలెక్టర్కు స్వీప్ అధికారుల అభినందనలు ఒంగోలు అర్బన్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ను స్వీప్ నోడల్ అధికారులు బీ రవి, వీఎస్ జ్యోతి శుక్రవారం ప్రకాశం భవనంలో కలిసి అభినందనలు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 87.06 శాతం ఓటింగ్తో మొదటి స్థానం నిలవడంతో పాటు దర్శి అసెంబ్లీ స్థానం 90.91 శాతంతో మొదటి స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో మన జిల్లా 87.9 శాతంతో మొదటి స్థానంలో నిలిచేందుకు కలెక్టర్ సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్వీప్ అధికారులు తెలిపారు. దీనిలో సూపరింటెండెంట్ నాగజ్యోతి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మారుతి ఇతర స్వీప్ బృందం సభ్యులు పాల్గొని కలెక్టర్కు అభినందనలు తెలిపారు. -
వెలుగొండస్వామి ఆలయంలో కూలిన ధ్వజస్తంభం
కొనకనమిట్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వెలుగొండస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం కూలిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగినట్లు దేవస్థాన ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆలయంలోని ధ్వజస్తంభం అడుగు భాగం పూర్తిగా కుళ్లిపోయిందని, ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూలిపోయిందని ఈఓ తెలిపారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారన్నారు. కూలిన ధ్వజస్తంభం ఆలయ గర్భగుడి అంచులపై పడటంతో అంచు కొంతమేర దెబ్బతిందని చెప్పారు. ఈ విషయాన్ని దేవస్థానం ఉన్నతాధికారులకు, ఉభయ దాతలైన గార్లదిన్నె గ్రామస్తులకు తెలియజేశామన్నారు. పడిపోయిన ధ్వజస్తంభాన్ని తొలగించి త్వరలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తామని ఈఓ తెలిపారు. పిల్లర్ గుంతలో పడి బాలుని మృతి హస్తినాపురం: ఆడుకుంటూ వెళ్లిన పసిబాలుడు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన పిల్లర్ గుంతలోని నీళ్లలో పడి మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలానికి చెందిన మదాల అచ్చమ్మ, మాల్యాద్రి దంపతులు మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. అతనికి ఒక కుమారుడు మనోజ్ ఉన్నాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బహిరంగ ప్రదేశంలో ఉన్న పిల్లర్ గుంత వర్షపు నీటితో నిండి ఉండడంతో మనోజ్ (08) ఆడుకుంటూ వెళ్లి ఆగుంతలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని గుంతలోంచి బయటికి తీసి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాలుని తల్లిదండ్రులు, వారి బంధువులు బహిరంగ ప్రదేశంలో వేసిన గుంత మూలంగా తమ బాలుడు చనిపోయాడని ఆందోళనకు దిగారు. బాలుని కుటుంబ సభ్యులకు బిల్డర్ నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిల్డర్ మృతుని కుటుంబ సభ్యులు రాజీకి వచ్చి నష్టపరిహారం చెల్లించడంతో ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లు బాలుని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెచ్చగొట్టారు.. రెచ్చిపోయారు..!
దర్శి: నరసరావుపేట నుంచి టీడీపీ రౌడీ నేతలు వచ్చారు. ఆ పార్టీ దర్శి నాయకులను రెచ్చగొట్టారు. వారితో కలిసి రెచ్చిపోయిన స్థానిక నేతలు ఎన్నికల పోలింగ్ సందర్భంగా దర్శి మండలంలో గొడవలకు కారణమయ్యారు. ఈ గొడవల్లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రధాన అనుచరులపై మాత్రం ఎటువంటి కేసులు పెట్టకుండా పోలీసులు వదిలేశారు. కేవలం స్థానిక నాయకులపై మాత్రమే కేసులు పెట్టి నరసరావుపేట నుంచి వచ్చిన టీడీపీ రౌడీలను వదిలేయడం పట్ల ఖాకీల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శిలో గొడవలు సృష్టించేందుకు నరసరావుపేట నుంచి టీడీపీ సామాజికవర్గానికి చెందిన అల్లరి మూకలను తీసుకొచ్చి ఒక్కరిపై కూడా కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడి ఆ పార్టీ స్థానిక నాయకులను బలి చేయడంపై దర్శిలో జోరుగా చర్చ నడుస్తోంది. కేసులు నమోదైన వారంతా స్థానికులే... దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో జరిగిన గొడవల్లో ఇరువర్గాలకు సంబంధించి ఒక్కో వర్గంలో 11 మంది చొప్పున కేసులు పెట్టారు. వారంతా స్ధానికులే కావడం గమనార్హం. దేవవరంలో జరిగిన దాడి విషయానికి వస్తే శేషంవారిపాలేనికి చెందిన ఓట్ల చేర్పులు, మార్పుల్లో సుమారు 25 ఓట్ల వరకు దేవవరం బూత్లోకి వచ్చాయి. అయితే, వాళ్లు 50 మందికిపైగా బూత్లోకి ప్రవేశించి దొంగ ఓట్లు వేసేందుకు లలిత్సాగర్తో కలిసి వచ్చారు. దీంతో స్థానికులు ఓటు ఉన్న వాళ్లు మాత్రమే లోపలికి వెళ్లాలని, మిగతావాళ్లు బయట ఉండాలని అడ్డుకున్నారు. దీంతో లలిత్ సాగర్ తెలివిగా పక్కకు వెళ్లి తమ రౌడీలను ఉసిగొల్పారు. వారు లోపలకు వెళ్లాల్సిందేనని గొడవలకు దిగడంతో తోపులాట జరిగింది. వాళ్లు ముందస్తు ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కర్రలతో అడ్డువచ్చిన వారందరినీ చితకబాదారు. మహిళలు అని కూడా చూడకుండా వారిని కూడా కొట్టి బీభత్సం సృష్టించారు. ఆ తర్వాత లలిత్ సాగర్ వెంటనే వచ్చి మళ్లీ తన అనుచరులతో వారిని తీసుకుని బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. లలిత్ సాగర్ బూత్లోకి వెళ్లాలంటే మీరొక్కరే వెళ్లండి.. మీతో వచ్చిన వారందరూ ఇక్కడే ఉండాలని అడ్డుకున్నారు. 20 నిముషాలకుపైగా గ్రామంలో మహిళలు లలిత్సాగర్ను నిలదీశారు. మీ ఊరు నుంచి రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇవేం రాజకీయాలు.. మీ వాళ్లు వచ్చి మా గ్రామంలో కర్రలతో తల పగులగొట్టారు.. దీనికి మీరేం సమాధానం చెప్తారని పదే పదే నిలదీయడంతో మొహం చాటేసి పోలీసులను అడ్డుపెటుకుని జారుకున్నారు. ఆ గొడవ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన సీఐకి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. లలిత్ సాగర్ కొత్తవ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యం చేసి దొంగ ఓట్లు వేయించాలని చూశారని, అడ్డుకున్నందుకు గొడవలు సృష్టించారని, రౌడీలు, స్థానికులు కలిసి తమను విచక్షణారహితంగా కొట్టారని అక్కడున్న వారు సీఐతో చెప్పి మొత్తుకున్నారు. కానీ, ఆ రౌడీలపై మాత్రం ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కేసులు పెట్టిన ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే దేవవరంలో ఓటు ఉంది. మిగతా వారికి ఓటు కూడా లేదు. టీడీపీ దర్శి నాయకులను రెచ్చగొట్టిన ఆ పార్టీ నరసరావుపేట నేతలు రెచ్చిపోయి ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన స్థానిక నేతలపై కేసులు రెచ్చగొట్టి వెళ్లిపోయిన నరసరావుపేట రౌడీ నేతలను వదిలేసిన పోలీసులు ఖాకీల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు -
జూనియర్ కళాశాలలుగా జెడ్పీ పాఠశాలలు
పుల్లలచెరువు: గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇంటర్ విద్య కోసం హైస్కూల్ ప్లస్ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. మండలానికి జూనియర్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 11 జెడ్పీ పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. వీటిలో జిల్లాలోని కామేపల్లి, పందువనాగులవరం, ముండ్లపాడు, బేస్తవారిపేట, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, కొత్తపట్నం, కురిచేడు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, తర్లుపాడు జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేవలం ఆంగ్ల మాద్యమంలో మాత్రమే విద్యా బోధన ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యా సంస్థలు తక్కువగా ఉండటంతో కళాశాల విద్యలో ప్రైవేట్ విద్యాసంస్థలదే పైచేయిగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాణ్యతతో కూడిన విద్యా బోధన... కొత్తగా ఏర్పాటయ్యే కళాశాలలకు బోధకుల కోసం ఆయా పాఠశాలల్లో పీజీ అర్హత కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి వారితో విద్యా బోధన చేయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐఎఫ్పీ ద్వారా ఆధునిక పద్ధతుల్లో బోధనకు చర్యలు తీసుకుంటున్నారు. అదనపు అర్హతలు కలిగిన ఉపాధ్యాయుల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. వీరితో పాటు వర్క్లోడ్ లేని జూనియర్ కళాశాలల నుంచి రెగ్యులర్ అధ్యాపకులతో పాటు కాంట్రాక్టు అధ్యాపకులను సర్దుబాటు చేసి బోధన చేసేలా కార్యచరణ జరిగిందని ఇంటర్ అధికారులు తెలిపారు. ప్రవేశాలన్నీ మాన్యువల్గానే జరగనున్నాయి. విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినట్లుగా సర్టిఫికెట్లు తీసుకెళ్తే.. వారికి ఇంటర్లో ప్రవేశం లభిస్తుంది. గరిష్టంగా 80 మందిని చేర్చుకోవచ్చని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జెడ్పీ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం శుభపరిణామమని విద్యావేత్తలు అంటున్నారు. 11 జెడ్పీ పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు విద్యాభివృద్ధికి సీఎం జగన్ సంస్కరణలపై సర్వత్రా హర్షం ఎంతో గొప్ప విషయం : గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో శుభపరిణామం. గ్రామాల్లో పదో తరగతి చదువుకుని ఇంటర్ చదివేందుకు అవకాశాలు లేక.. దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడలేక చదువు మానుకునే వారు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది చదువుకోవడానికి వీలు కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జి.గురు నాథం, విద్యా కమిటీ మాజీ చైర్మన్, పుల్లలచెరువు -
చెప్పాడంటే.. చేస్తాడంతే..!
సంక్షేమ శాఖల వారీగా విడుదలైన నిధులు... సంక్షేమశాఖ విద్యార్థుల విద్యార్థుల విడుదలైన సంఖ్య తల్లుల సంఖ్య నిధులు (రూ.లో) ఎస్సీ 12,460 11,196 8,54,04,869 ఎస్టీ 1,107 1,009 75,24,724 బీసీ 15,774 14,297 11,38,71,905 ఈబీసీ 12,250 10,985 11,40,52,489 ముస్లిం 3,006 2,725 2,10,41,998 కాపు 2,768 2,534 2,20,06,142 క్రిస్టియన్ 57 51 5,27,624 మొత్తం 47,422 42,797 36,44,29,757 నియోజకవర్గాల వారీగా నిధుల విడుదల ఇలా... నియోజకవర్గం విద్యార్థుల విద్యార్థుల విడుదలైన సంఖ్య తల్లుల సంఖ్య నిధులు (రూ.లో) దర్శి 6,247 5,657 1,21,52,075 గిద్దలూరు 6,049 5,498 1,57,65,392 కనిగిరి 6,223 5,586 1,52,87,210 కొండపి 6,482 5,847 1,51,32,550 మార్కాపురం 5,357 4,861 1,19,11,323 ఒంగోలు 6,387 5,691 1,85,79,073 ఎస్.ఎన్.పాడు 5,288 4,731 1,31,07,315 వై.పాలెం 5,389 4,926 1,19,36,967 మొత్తం 47,422 42,797 36,44,29,751 ఎన్నికల అనంతరం సైతం ప్రజా సంక్షేమంపైనే సీఎం జగన్ దృష్టి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల 2023–24 విద్యా సంవత్సరం మొదటి విడత నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 42,797 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.36.44 కోట్లు జమ ఎన్నికలకు ముందే జమకావాల్సి ఉండగా, ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న టీడీపీ కూటమి పోలింగ్ పూర్తయిన వెంటనే నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్క తుక్కయిన కారు!
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement