-
పది పరీక్షలకు 941 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి రెండో రోజు శనివారం హిందీ పరీక్ష జరిగింది. మొత్తం 1,090 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా కేవలం 149 మంది మాత్రమే హాజరయ్యారు. 941 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ రామారావు రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, అధికారులు కలిపి మొత్తం 18 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఊరూరా పోలీసుల జల్లెడ ● కార్డన్ సెర్చ్లో 80 బైక్లు స్వాధీనం నెల్లూరు (క్రైమ్): జిల్లాలో పోలీసులు ఊరూరా జల్లెడ పట్టుతున్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్, నెల్లూరురూరల్ పోలీసుస్టేషత్తో పాటు సంగం, అనంతసాగరం, సోమశిల, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, కలువాయి, బిట్రగుంట, జలదంకి, రాపూరు, కలిగిరి పోలీసుస్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక, శివారు ప్రాంతాల్లో శనివారం పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఇంట్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? తదితర వివరాలను సేకరించారు. రికార్డులు లేని 80 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు. -
ఇంటర్ పరీక్షలకు 421 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం రెండో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్కు జనరల్ విద్యార్థులు 9,635 మంది హాజరు కావాల్సి ఉండగా 9,214 మంది పరీక్షలు రాశారు. 421 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 271 మందికి గానూ 33 మంది పరీక్షకు హాజరు కాలేదు. మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 433 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 386 మంది హాజరయ్యారు. 47 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 113 మందికి గానూ 14 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 6 కేంద్రా లను, డీవీఈఓ 3 కేంద్రాలను, స్క్వాడ్ బృందం 32 కేంద్రాలను తనిఖీ చేశారు. -
తీరంలో అలజడి
ఇందుకూరుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత శనివారం సాయంత్రానికి తుఫాన్గా మారింది. తుఫాన్కు ‘రెమాల్’ అని నామకరణం చేశారు. తుఫాన్ ప్రభావంగా తీరం వెంబడి అలలు ఎగిసి పడుతున్నాయి. పర్యాటకులతో పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి సముద్రం సాధారణంగా ఉంది. వారాంత సెలవు రోజు కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు మైపాడు బీచ్కు తరలివచ్చారు. రాత్రి సమయంలో సముద్రం కసురుగా మారి అలలు ఎగిసి పడుతున్నాయి. తీరం వెంబడి గాలుల ప్రభావం కూడా పెరగడంతో, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మైరెన్ పోలీసులు మైపాడు సముద్ర తీ రానికి వచ్చిన సందర్శకులను అప్రమత్తం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లడం లేదు. -
ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్ష
● 62.61 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరు నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టల భర్తీ కోసం ఏపీపీఎస్సీ శనివారం ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించింది. ఇందు కోసం కావలిలో పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల, రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, కోవూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టెపాళెం సమీపంలోని అయాన్ డిజిటల్ జోన్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,070 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 670 మంది హాజరు కాగా 400 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 62.61 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. -
పశుగ్రాసంపై దృష్టి సారించాలి
ఉదయగిరి: జిల్లాలో వశుగ్రాసానికి కొరత ఉన్న తరుణంలో వీటి పెంపకంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని జేడీ మహేశ్వరుడు కోరారు. పట్టణంలోని ఆర్బీకే – 1లో పశుసంవర్థక శాఖ అధికారులు, సిబ్బంది, రైతులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలకరి వర్షాలు త్వరలో కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరారు. పశువులకు వ్యాధులు సోకే అవకాశం ఉండటంతో టీకాలను వేయాలని సూచించారు. వివిధ రాయితీలు, పథకాలు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావలి, కందుకూరు డీడీలు రమేష్కుమార్, చంద్రశేఖర్, ఏడీలు శశిధర్, రఘునాథ్, సురేష్, మంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
ప్ర: గత ఎన్నికల్లో కంటే అధిక శాతం పోలింగ్ నమోదైంది. అందుకు ఏం చర్యలు చేపట్టారు జ: ఎన్నికల నిబంధనల మేరకు ఓటర్లు జాబితా పకడ్బందీగా తయారు చేశాం. స్వీప్ కార్యక్రమం, డిజిటల్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అందులో భాగంగా యూ ట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లో విస్తతంగా ప్రచారం చేశాం. ప్రతి ఒక్క ఓటరుకి ఓటరు స్లిప్తో పాటు అవగాహన కల్పించాం. గిరిజన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు పెట్టి చైతన్య వంతం చేశాం. ప్ర: ఈవీఎంల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు జ: జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్కు జరిగిన పోలింగ్కు సంబంధించి ఈవీఎంలను నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచాం. ఈవీఓంలకు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. స్థానిక పోలీసులు, స్పెషల్ ఫోర్స్, ఆర్మీ పోలీసులు మూడంచెలుగా విధుల్లో ఉంటారు. స్ట్రాంగ్ రూమ్లను 130 పైగా సీసీ కెమెరాల పర్యవేక్షిస్తున్నాం. కౌంటింగ్ రోజు వరకు నిరంతరం నిఘా ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంపై డ్రోన్లు ఎగరకుండా రెడ్జోన్గా ప్రకటించాం. ప్ర: కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు జ: పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నాం. పారదర్శకంగా, అప్రమత్తంగా చేపట్టేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 14 మంది, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 115 మంది బరిలో నిలిచా రు. జిల్లాలో మొత్తం 19,44,285 ఓట్లు ఉండగా, 15,48,183 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్ బూత్ లు, అత్యల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 248 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది. ఇందు కోసం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 14 టేబుళ్లు, నెల్లూరు రూరల్కు 6 టేబుళ్లు ఏర్పాటు చేశాం. మిగిలిన నియోజకవర్గాలకు 2 టేబుళ్లు ఏర్పాటు చేశాం. ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు 8.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లు వంతున ఈవీఎంల లెక్కింపు జరుగుతోంది. వెయ్యి మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి టేబుల్కు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఉంటారు. వాళ్లు తుది నిర్ణయం తీసుకుంటారు. ప్ర: ఫలితాల ప్రకటన ఎలా ఉంటుంది జ: 14 టేబుళ్లు ఒక రౌండ్గా నిర్ణయించాము. ప్రతి టేబుల్కు ఒక ఈవీఎం లెక్కన కేటాయించి లెక్కింపు చేస్తారు. ప్రతి రౌండ్కు మెజార్టీలను వెల్లడిస్తాం. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి నలుగురు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును అబ్జర్వర్ సంతకం చేసిన తర్వాత మాత్రమే రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తాం. ప్ర: కౌంటింగ్ రోజు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు జ: ఇందుకు సంబంధించి పోలీసు అధికారులకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచనలు చేసింది. కౌంటింగ్ కేంద్రానికి దూరంగా కనుపర్తిపాడు వద్దనే జనాలు ఉండిపోవాలి. కేవలం కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే కళాశాల వద్దకు అనుమతిస్తాం. ఏజెంట్లతో పాటు సిబ్బంది, అధికారులకు రిలీవర్స్, రిజర్వ్ సిబ్బంది అందరికీ పాస్లు ఏర్పాటు చేస్తున్నాం. వీరు తప్ప కౌంటింగ్ కేంద్రానికి ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదు. ఇటీవల పోలింగ్ సమయంలో గొడవలు జరిగిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసులు కార్డన్ సెర్చ్ కూడా నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.వాహనాలు, ఆయుధాలు గుర్తించి పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతులు లేవని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జా రీ చేసింది. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి. ప్ర: కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేశారా? జ: లెక్కింపు కేంద్రంలో వసతులు ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. ఎన్నికల సిబ్బందితో పాటు, మీడియాకు తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేశాం. సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టం మాత్రమే మిగిలింది. ప్రధాన పార్టీలు ఇప్పుడు ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఓట్ల లెక్కింపునకు ఎన్ని టేబుల్స్ ఉంటాయి.. ఎంత మంది ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందనే అంశాలపై ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు తెలియజేశారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఇతర అధికారులకు శిక్షణ ప్రారంభించారు. కౌంటింగ్ చేపట్టే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు, ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ 8:30 నుంచి ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు జిల్లాకు నలుగురు అబ్జర్వర్లు -
నిమ్మ ధరలు పొదలకూరు (కిలో)
పెద్దవి : రూ.70 సన్నవి : రూ.35 పండ్లు : రూ.25 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.172 లేయర్ లైవ్ రూ.120 బ్రాయిలర్ చికెన్: రూ.300 స్కిన్లెస్ చికెన్: రూ.330 లేయర్ చికెన్: రూ.204 -
పరికరాల కోసం చెరువులోకి దిగి..
● మహిళ మృతి ఉదయగిరి: ఉపాధి పనులకు అవసరమైన పరికరాల కోసం చెరువులోకి దిగి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడిన ఘటన ఉదయగిరి కొత్త చెరువు వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక కొత్త చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి పనులకు ఉదయగిరిలోని యాదవవీధికి చెందిన పెరుమాళ్ల వెంకటలక్ష్మి, ప్యారీ, వెంకటసుబ్బు కొద్దిరోజులుగా వెళ్తున్నారు. పనులకు ఉపయోగించిన పరికరాలను చెరువులో దాచారు. అయితే వర్షం రావడంతో చెరువులో నీరు చేరి పరికరాలు మునిగిపోయాయి. అప్పటి నుంచి ఉపాధి పనులు జరగలేదు. ఈ క్రమంలో పనులు ప్రారంభం కావడంతో ఈ ముగ్గురూ కొత్త చెరువు వద్దకెళ్లి పరికరాల కోసం నీటిలోకి దిగారు. పెద్ద గుంతలు తీసిన ప్రాంతంలో నీరు చేరడం, లోతును గ్రహించలేక వీరు మునిగిపోయారు. దీంతో పెరుమాళ్ల వెంకటలక్ష్మి (40) మునిగిపోగా, మిగిలిన ఇద్దరూ బయటపడి పెద్దగా కేకలేశారు. పక్కనే ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఘటన స్థలానికి వచ్చి వెంకటలక్ష్మిని బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఐ గిరిబాబు, ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు. యాదవవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకటి నుంచి రాష్ట్రస్థాయి ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఎఫ్ 2 బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో జూన్ 1, 2వ తేదీల్లో రాష్ట్ర స్థాయి ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని నిర్వహించనున్నారని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. టోర్నీ వాల్ పోస్టర్లను తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇలాంటి పోటీలను నిర్వహించడం ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ఒక మంచి అవకాశమన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో పోటీలను నిర్వహిస్తున్న ఎఫ్ 2 బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు. జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, టోర్నీ నిర్వాహకులు ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికం మాటున అశ్లీలం
ఆత్మకూరు: ఎన్నికల వేళ పోలీస్ వ్యవస్థ మరీ బరితెగించింది. అధికారం కోసం తల్లడిల్లుతున్న టీడీపీ నేతలు సాగించే అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓ వైపు ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఈ తరుణంలో గ్రామాల్లో ఉత్సవాల పేరిట అశ్లీల నృత్యాలతో టీడీపీ నేతలు అశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్పేట ప్రాంతాల్లో దైవ ఉత్సవాల్లో ఆధ్యాత్మికం మాటున అశ్లీల నృత్యాలను టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల క్రితమే నిషేధించిన అశ్లీల నృత్యాలు (రికార్డింగ్ డ్యాన్స్లు)కు ఆత్మకూరు డివిజన్ పోలీస్ యంత్రాంగం అధికారికంగా అనుమతులిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరినా ససేమిరా అంటున్న పోలీసులు.. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అశ్లీల నృత్యాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండలం ఆరవేడు జంగాలపల్లిలో రాములోరి ఉత్సవాల ముగింపు సందర్భంగా సాంస్కృతిక నృత్యాలకు శుక్రవారం రాత్రి అనుమతులు పొందిన టీడీపీ వారు అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు వేశారని గ్రామస్తులు తెలిపారు. గడిచిన వారం వ్యవధిలో ఏఎస్పేట మండలం గుంపర్లపాడు, అక్బరాబాద్, తెల్లపాడు గ్రామాల్లో అశ్లీల నృత్యాలను విచ్చలవిడిగా వేశారని గ్రామస్తులు ఆరోపించారు. తెల్లపాడులో గ్రూప్ డ్యాన్స్లను విచ్చలవిడిగా చేశారని, దీనిపై పోలీసులకు ఫోన్ చేస్తే పూర్తి స్థాయిలో సిబ్బంది లేరని సమాధానం చెప్పారని గ్రామస్తులు పేర్కొన్నారు. గుంపర్లపాడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకొని విద్యుత్ వైర్లు, ఫ్యూజ్ లింకులను సైతం పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మరుసటి రోజు టీడీపీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నిర్వహించిన అశ్లీల నృత్యాలపై సమాచారం పోలీసులకు తెలియదానని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డిని సంప్రదించగా.. పోలీస్ యాక్ట్ 30, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో నృత్య ప్రదర్శనలకు అనుమతులివ్వడంలేదని చెప్పారు. పలు గ్రామాల నుంచి నిర్వాహకులు అనుమతులు కోరిన మాట వాస్తవమేనని, అయితే ఎవరికీ మంజూరు చేయలేదన్నారు. గ్రామాల్లో మైకుల్లేకుండా ఇలాంటి డ్యాన్స్లను నిర్వహిస్తున్నారనే విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో ఆర్ఐఓ తనిఖీ
నెల్లూరు(టౌన్): జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు ఉదయం ప్రారంభమయ్యాయి. జనరల్ విద్యార్థులు 5,615 మందికి 5,313 మంది హాజరయ్యారు. 302 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 149 మందికి 126 మంది హాజరు కాగా, 23 మంది గైర్హాజరయ్యారు. రెండో సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు మధ్యాహ్నం నుంచి జరిగాయి. జనరల్ విద్యార్థులు 640 మందికి 57 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 162 మందికి గానూ 18 మంది హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు నారాయణ, శ్రీచైతన్య, కృష్ణచైతన్య తదితర 5 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి 2 సెంటర్లను, స్క్వాడ్ బృందాలు 30 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఆర్ఐఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఎలాంటి మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షలు పూర్తయ్యే వరకు రోజు వారి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. -
కౌంటింగ్ ప్రక్రియకు నలుగురు అబ్జర్వర్లు
నెల్లూరు (దర్గామిట్ట): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నలుగురు అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. నగరంలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం జరగనుంది. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం అబ్జర్వర్లను నియమించింది. కందుకూరు, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అబ్జర్వర్గా రామ్కుమార్ గౌతమ్, కావలి, ఆత్మకూరులకు టీజీ అభిలాష్కుమార్, కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు నితిన్సింగ్ బదారియ, సర్వేపల్లికి జయేంద్రకుమార్ విజయవత్ అబ్జర్వర్లుగా వ్యవహరించనున్నారు. సమర్థంగా కౌంటింగ్ కలెక్టర్ ఎం.హరినారాయణన్ నెల్లూరు (దర్గామిట్ట): కౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం. హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవా రం సాయంత్రం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఆర్వోలు, ఏఆర్వోలతో సమవేశమై కౌంటింగ్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ ఆర్వోలు ఏఆర్వోలు సమన్వయంతో పనిచేసి నిష్పక్షపాతంగా పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు అవసరమైన టేబుల్స్, ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు అన్ని వాహనాలు కనపర్తిపాడులోని హైస్కూల్ వరకు మాత్రమే అనుమతించ బడతాయని, ఏజెంట్లు, కౌంటింగ్ అధికారులు, సిబ్బందిని తరలించడానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి డీఆర్ఓ ఎస్.లవన్న, నుడా వీసీ బాపిరెడ్డి, ఆర్వోలు ఓబులేసు, ప్రేమ్కుమార్, మాలోల, మధులత, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఏఆర్వోలు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన నెల్లూరు (దర్గామిట్ట): కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఎం.హరినారాయణన్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లను సీసీటీవీ ద్వారా మానిటరింగ్ చేస్తున్న కంట్రోల్ రూమ్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
No Headline
జిల్లా పోలీసులు పచ్చనేతల సేవలో తరిస్తున్నారు. ఆ పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాబలం లేని టీడీపీ నేతలు ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో తప్పుడు కేసులను అస్త్రాలుగా చేసుకుని పోలీసుల అండదండలతో వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ ఏఆర్హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్తో ‘ఖాకీ’ల పచ్చపాతం తేటతెల్లమైంది. సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కొందరు ‘ఖాకీ’ బాస్లు.. ‘పచ్చ’ ముసుగేసుకున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో విధులు నిర్వర్తిస్తూ.. పోలీస్శాఖ ప్రతిష్టను ఆ పార్టీకి తాకట్టు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో జిల్లాలో టీడీపీ సాగించిన అరాచకాలకు అంతేలేదు. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతలు బరితెగించి వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాయులతో దాడులకు పాల్పడినా కనీసం కేసు నమోదు చేసిన దాఖాలు లేవు. వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేశారు. అయితే టీడీపీ నేతలు చేసిన తప్పుడు ఫిర్యాదులపై మాత్రం కనీసం విచారణ లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ ఏఆర్హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ పోలీసు ఉన్నతాధికారుల ‘పచ్చ’పాత ధోరణికి అద్దం పడుతోంది. కార్పొరేటర్ భర్త కావడమే.. ప్రలోభాలు, బెదిరింపులు, తప్పుడు కేసులను అ స్త్రాలుగా చేసుకున్న పచ్చనేతలు పోలీసుల అండదండలతో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నెల్లూరు నగరంలోని 41వ డివిజన్ కార్పొరేటర్ కె.విజయలక్ష్మి గతంలో నెల్లూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచర వర్గంలో ఉండేవారు. శ్రీధర్రెడ్డి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కొందరు టీడీపీలో చేరారు. ఆమె మాత్రం వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నారు. పలుమార్లు పార్టీ మారాలని కోటంరెడ్డి ఆమైపె ఒత్తిడి తెచ్చినా.. ఆమె నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఆమె టీడీపీలో చేరేలా చేయాలని భావించిన కోటంరెడ్డి ఆమె భర్త ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మధుసూదన్రావును లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకపోవడంతో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ‘పక్కా స్కెచ్’ వేసి కక్ష సాధింపు చర్యలకు దిగారు. అందులో భాగంగా గతంలో మధుసూదన్రావు ఆదాల ప్రభాకర్రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాఽధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై విచారించడంతో పాటు సదరు హెడ్కానిస్టేబుల్ సంజాయిషిని తీసుకుని చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ఏకపక్షంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు గత నెల 30వ తేదీ నుంచి విధులకు గైర్హాజరయ్యారంటూ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం మధుసూదన్రావు వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్ భర్త కావడంతోనే ఆయన్ను సస్పెండ్ చేశారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చేతికి శస్త్ర చికిత్సతో మెడికల్ లీవ్ వాస్తవానికి మధుసూదన్రావు చేతికి శస్త్ర చికిత్స జరగడంతో గత నెల 30వ తేదీ వరకు మెడికల్ లీవ్లో ఉన్నారు. డాక్టర్లు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచించడంతో మెడికల్ లీవ్ను ఎక్స్టెన్షన్ చేయాలని ఆయన ఏఆర్ ఉన్నతాధికారులను లిఖిత పూర్వకంగా కోరారు. ఈ విషయాన్ని సైతం పోలీసు ఉన్నతాఽధికారులు పరిగణలోకి తీసుకోకుండా సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ కాపీ పచ్చనేతలకు చేరింది. వారు తమకు అనుకూల మీడియాల్లో, సామాజిక మాద్యమాల్లో వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ నేతలు గతంలోని ఫొటోలను, ఎన్నికల ప్రచార ఫొటోలుగా చూపించిన వెంటనే చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాఽధికారులు, టీడీపీ నేతలపై పలు ఫిర్యాదులు అందినప్పటికి కనీస చర్యలు తీసుకోకపోవడం వారికి అండగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ కాపీ.. టీడీపీ చేతుల్లో.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు సదరు బాధితుడి కంటే ముందు టీడీపీ నేతలు, పచ్చమీడియా, ఆ వర్గ సోషల్ మీడియాకు చేరాయంటే.. పోలీసు ఉన్నతాధికారులు ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. తనను సస్పెన్షన్ చేసిన విషయం తన శాఖ ద్వారా కాకుండా టీడీపీ నేతలు, పచ్చమీడియా ద్వారా తెలుసుకుని ఆ పోలీస్ అవాక్కయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి పది రోజులు గడిచినా వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి టీడీపీ నేతలు నిరాధార ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఏ కేసైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తే.. పోలీసులు ‘పచ్చకాప్’లుగా పనిచేస్తున్నారని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ ఉదంతంతో తేలిపోయింది. పచ్చనేతల కనుసన్నల్లో పోలీస్ యంత్రాంగం నిరాధార ఫిర్యాదులపై విచారణ లేకుండానే చర్యలు ఏఆర్హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్తో తేటతెల్లం సస్పెన్షన్ కాపీ ముందుగానే పచ్చనేతలకు చేరిన వైనం -
పరిపూర్ణం.. ‘కోన’ సంబరం
రాపూరు: పెంచలకోనలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు ఉదయం శ్రీవారి చక్రస్నాన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లతోపాటు చక్రతాళ్వార్ను పల్లకిలో కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీవారి నందనవనంలోని పుష్కరిణి వద్ద మండపంలోకి వేంచేపు చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ పుష్కరిణిలో చక్రతాళ్వార్కు స్నానం చేయించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ●స్వామివారి అలంకార మండపంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా పెంచలస్వామిని కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా వసంతోత్సవం నిర్వహించారు. దేవదేవేరులకు ప్రత్యేక పూజలు చేపట్టి విశేష అభిషేకాలు జరిపించారు. తెప్పోత్సాహం శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నృసింహస్వామి ఉభయనాంచారులతో కలిసి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 10 గంటలకు స్వామిని అశ్వవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిపించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. కార్యక్రమాల్లో డీసీ విజయసాగర్బాబు, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు. నేడు గోనుపల్లెలో గ్రామోత్సవం స్వామి అమ్మవార్లు శనివారం ఉదయం పెంచలకోన నుంచి బయలుదేరి గోనుపల్లె గిరిజనకాలనీకి చేరుకుంటారు.రాత్రి 8 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముగిసిన పెనుశిల బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా చక్రస్నానం తెప్పపై ఊరేగిన దేవదేవరులు -
జ్యూస్ ఫ్యాక్టరీలకు మామిడి ఎగుమతులు
ఉలవపాడు: ఉలవపాడు నుంచి మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. జ్యూస్ తయారు చేయడానికి బెంగళూరు రకాన్ని ఉపయోగిస్తారు. ప్రతి ఏడాది ఉలవపాడు నుంచి ఈ రకాన్ని ఫ్యాక్టరీలకు తరలిస్తారు. స్థానిక తోటల్లో కాయలను కోసి కాటాల వద్దకు తీసుకొచ్చి తూకం వేసి లారీల్లోకి లోడింగ్ చేసి తరలిస్తున్నారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మామిడి జ్యూస్ తయారు చేసే ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఉలవపాడు పరిసర ప్రాంతాల నుంచి వాటికి బెంగళూరు రకం కాయల ఎగుమతి ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది. రోజుకు సుమారు 100 టన్నులకు పైగా పంపుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే బెంగళూరు రకం టన్ను రూ.20 వేలు పలుకుతోంది. ఈ మామిడిలో పీచు అధికంగా ఉంటుంది. అందువల్ల జ్యూస్ తయారీకి బాగుంటుంది. ప్రస్తుతం కాపు తక్కువగా ఉండడంతో కాయలకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రతి ఏడాది రూ.10 వేల నుంచి ప్రారంభమై రూ.20 వేలు, రూ.25 వేల వరకు రేటు వెళ్తుంది. కానీ సీజన్ ప్రారంభంలోనే టన్ను రూ.20 వేల వరకు ఉంది. కాయలు తక్కువగా ఉండడంతో రేటు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
38 మోటార్బైక్లు, ఆటో స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక, శివారు ప్రాంతాల్లో పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్ పేరిట నిరంతర సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాల్లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రగతినగర్, గౌతమినగర్లో స్థానిక ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ తన సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. సరైన పత్రాల్లేని 12 మోటార్బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇందుకూరుపేట, ముత్తుకూరు, సంగం, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, కావలి రెండో టౌన్, కావలి రూరల్, కొండాపురం, గుడ్లూరు పోలీసుస్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ పోలీసు అధికారులు సోదాలు నిర్వహించి సరైన ధ్రువీకరణపత్రాలు లేని 26 బైక్లును స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ సెర్చ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. -
బతుకుదెరువు కోసం వచ్చి..
● అద్దాలు బిగిస్తూ కింద పడి యువకుడి మృతి ఆత్మకూరు: బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. భవనంలో కిటికీలకు అద్దాలు బిగిస్తుండగా అదుపుతప్పి కాలుజారి కిందపడి చనిపోయిన ఘటన ఆత్మకూరులో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని పెద్ద మసీదు సెంటర్ సమీపంలో నూతన భవనం నిర్మిస్తున్నారు. ఆ భవనం కిటికీలకు అద్దాలు బిగించే వర్క్ను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. అతడి వద్ద పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కి చెందిన కార్మి కుడు హుస్సేన్ (26) గురువారం సాయంత్రం అద్దాలు బిగిస్తుండగా పైనుంచి కింద పడ్డాడు. బావి దిమ్మెలపై హుస్సేన్ పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతుడు అవివాహితుడు. -
నేడు ఏపీపీఎస్సీ పరీక్ష
నెల్లూరు (దర్గామిట్ట) : జిల్లా వ్యాప్తంగా శనివారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్ఓ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లో ఎస్ఆర్ శంకరన్ హాల్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్ఓ లవన్న, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు జి అశోక్, రామాంజి సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాల్లో శనివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,070 మంది అభ్యర్థులు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల పోటీ పరీక్షకు హాజరవుతున్నారన్నారు. కావలిలో పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ, రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో, కోవూరులోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, ముత్తుకూరు రోడ్లోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టెపాళెం సమీపంలోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నందున ఇంటర్నెట్, కంప్యూటర్ సాంకేతిక సమస్యలు లేకుండా ముందుగానే చూసుకోవాలన్నారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలకు అనుమతించవద్దని, విద్యార్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని, ఏపీపీఎస్సీ మార్గదర్శకాలను తప్పని సరిగా పాటిస్తూ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అభ్యర్థులు నిర్ణీత సమయాని కంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని చెప్పారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లైజనింగ్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సమన్వయ అధికారులు బ్రహ్మయ్య, గోపికృష్ణ, ఇలియాజ్, గయాజ్, ప్రదీప్, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జిల్లాలో 5 కేంద్రాల్లో పరీక్ష హాజరుకానున్న 1,070 మంది అభ్యర్థులు అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి హాల్ టికెట్తో పాటు, ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి డీఆర్ఓ లవన్న వెల్లడి -
పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ
నెల్లూరు (దర్గామిట్ట): కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులను పారదర్శకంగా, అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరినారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 4న ఉదయం 8 గంటలకు కను పర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది అందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా అందించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్కు కేటాయించిన రిజర్వ్ సిబ్బంది అందరూ కౌంటింగ్ కేంద్రంలోనే అందుబాటు లో ఉండాలన్నారు. కౌంటింగ్ సమయంలో అవసరమైన అన్నిరకాల ఫామ్స్, రబ్బరు స్టాంపు ముద్రల ను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఫాం–17సీ లో పొందుపరిచి కౌంటింగ్ సూపర్వైజర్ ద్వారా రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు. ఫాం–17సీ జెరాక్స్ కాపీని ఏజెంట్లకు అందజేసి అకనాలెడ్జ్మెంట్ కాపీని తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానికల్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైందన్నారు. ఈ విషయంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సందేహం ఉంటే ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలు పెట్టాలన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుళ్లతో పాటు రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్ మొత్తం 17 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈవీఎంల్లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే వెంటనే బెల్ ఇంజినీర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేసి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నుడా వీసీ బాపిరెడ్డి, ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం (ఈటీపీబీఎస్) ఓట్ల లెక్కింపు ప్రక్రియపై నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారి సురేష్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు సేతు మాధవన్, వికాస్ మర్మత్, విద్యాధరి, చిన్నఓబులేసు, మలోల, ప్రేమ్కుమార్, మధులత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు తప్పనిసరి రిజర్వు సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ -
‘పొదుపు పెట్టుబడి’ పక్కదారి
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్ద పీట వేసింది. పొదుపు మహిళల సారథ్యంలో జగనన్న మహిళా మార్ట్ (సూపర్ మార్కెట్)లకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి పొదుపు మహిళ నుంచి పెట్టుబడి నిధి కోసం సమీకరించిన నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా మార్ట్ ఊసే లేకపోవడంతో పొదుపు మహిళలు అనుమానిస్తున్నారు. ఏపీఎం ఆ నిధులు స్వాహా చేసినట్లు సంఘ బంధాల సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు నేను స్వాహా చేయలేదుపొదుపు సంఘాలు చెల్లించిన పెట్టునిధి డబ్బులు తాను స్వాహా చేలేదని ఏపీఎం సుజన తెలిపారు. మండలంలో మొత్తం 770 పొదుపు సంఘాలు ఉన్నాయని, ఒక్కొక్క సంఘం రూ.3,100 పెట్టుబడి నిధిగా చెల్లించాలన్నారు. మొత్తం రూ.23,87,000 వసూలు కావాల్సి ఉండగా, కేవలం రూ.4,15,000 మాత్రమే వచ్చాయన్నారు. ఈ మొత్తం కూడా సంఘం నుంచి సంఘ బంధం, సంఘ బంధం నుంచి సంఘమిత్రకు బదిలీ అయిందన్నారు. జగనన్న మహిళా మార్ట్ పేరుతో రూ.23 లక్షలు స్వాహా అయిందని ఆరోపణల్లో నిజం లేదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం చేజర్ల మండలంలో జగనన్న మహిళా మార్ట్ నిమిత్తం వసూలు చేసిన నిధులు స్వాహా అయినట్లు నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. గతంలో ఇలాంటి ఘటనలు నా దృష్టికి వచ్చినప్పుడు విచారించి స్వాహా చేసిన వారిపై కేసులు నమో దు చేయించాం. ప్రస్తుతం అందరూ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నాం.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే చేజర్లలో మార్ట్ పేరుతో వసూలు చేసిన నిధులపై విచారణ జరిపిస్తాను. అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకొంటాం. – సాంబశివారెడ్డి, డీఆర్డీఏ పీడీ ● మహిళా మార్ట్ నిమిత్తం ఒక్కొక్కరు రూ.300 వంతున పెట్టుబడి నిధి చెల్లింపు ● 8,052 మంది మహిళలు చెల్లించిన రూ.24 లక్షల స్వాహా? ● 18 నెలలుగా మార్ట్ ఊసే లేని వైనం చేజర్ల: జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు నిమిత్తం ఏడాదిన్నర క్రితం పొదుపు మహిళల వద్ద సేకరించిన పెట్టుబడి నిధి దాదాపు రూ.24 లక్షలు డీఆర్డీఏ అధికారులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరగా మార్ట్ ఊసే లేకపోవడం, దీనికి సంబంధించి పొదుపు సంఘాల సమన్వయకర్తగా పనిచేస్తున్న ఏపీఎం సుజన (అడిషనల్ ప్రాజెక్ట్ మేనేజర్) పొంతన లేని సమాధానాలు చెబుతుండడంపై పొదుపు మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పొదుపు రుణాలతో పాటు వ్యక్తిగతంగా బ్యాంక్ రుణాలు మంజూరు చేయించి సొంతగా వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు, పాడి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రతి మండలం కేంద్రంలో జగనన్న మహిళా మార్ట్లు ఏర్పాటు చేసి తద్వారా వారి ఆదాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చేజర్ల మండలంలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలతో పాటు ప్రభుత్వం అందించే సున్నా వడ్డీ రుణాలు, ఇతర పొదుపు సంఘాల రుణాలతో ఏర్పాటు చేసే చిన్న చిన్న షాపులు, దుకాణాలు ఏర్పాటు ప్రక్రియ ఏపీఎం సుజన పర్యవేక్షిస్తోంది. ఒక్కొక్కరు రూ.300 పెట్టుబడినిధి చెల్లింపు చేజర్ల మండలం 26 గ్రామ పంచాయతీల్లో 26 సంఘ బంధాలు, 777 పొదుపు గ్రూపులు ఉన్నాయి. 8,052 మంది పొదుపు సభ్యులు ఉన్నారు. చేజర్లలో ఏడాదిన్నర క్రితం జగనన్న మహిళా మార్ట్ నిమిత్తం ప్రతి పొదుపు మహిళ నుంచి రూ.300 పెట్టుబడి నిధి కింద ఏపీఎం సుజన వసూలు చేసినట్లు పొదుపు మహిళలు చెబుతున్నారు. దాదాపు రూ.24 లక్షలకుపైగా సొమ్ము వసూలు చేసినా.. ఇంత వరకు మార్ట్ ఊసే లేకపోగా, ఏపీఎం లెక్కలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు పొదుపు మహిళలు చెబుతున్నారు. ఈ నిధులు పక్కదారి పట్టాయని అనుమానాలను వ్యక్త పరిచారు. -
బ్లడ్ శాంపిలా?.. ప్రమాణమా?
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.క్లబ్కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. -
‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’
నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్ ఓనర్ గోపాల్రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. -
అరాచకాలను ఏమార్చేందుకు..
ఎన్నికల్లో పరాజయం తప్పదనే అంశం టీడీపీ నేతలకు అవగతమైంది. తమదే విజయమంటూ నిన్నామొన్నటి వరకు బీరాలు పలికిన ఆ పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ తరుణంలో ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారంటే వారి పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. వీరి నిరాధార ఆరోపణలకు పచ్చ మీడియా వంతపాడుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కళ్ల ముందే ఓటమి కనిపించినా.. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికారులనే కాకుండా ఓటర్లను పచ్చమూకలు ప్రలోభపెట్టారు. పోలింగ్ రోజున అనేక బూత్లలో దౌర్జన్యాలు చేశారు. టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలపై గూండాయిజం చెలాయించారు. ఇవన్నీ పోలింగ్ బూత్లలో వెబ్ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఎన్నికల అధికారులకు ఇవి కనిపిస్తున్నా.. నిస్సహాయ స్థితిలో మౌనం దాల్చారు. పచ్చమీడియాను అడ్డంపెట్టుకొని.. జిల్లాలో పచ్చమీడియాను అడ్డం పెట్టుకొని పోలింగ్ రోజున దౌర్జన్యాలకు టీడీపీ తెగబడింది. ప్రధానంగా నెలూరు రూరల్, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కందుకూరు, కోవూరు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దాడులకు పాల్పడిన విషయం విదితమే. అయితే ఆది నుంచి ఎన్నికల ప్రక్రియను టీడీపీ ప్రభావితం చేస్తూ వచ్చింది. ఓటమి భయంతో సదరు అధికారి వైఎస్సార్సీపీకి అనుకూలమంటూ.. ఏదో జరిగిపోతోందంటూ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తూ ఈసీకి టీడీపీ ఫిర్యాదులు చేసింది. దీంతో పచ్చమీడియా సైతం చెలరేగిపోయింది. భయంతో నిరాధార ఆరోపణలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లలో టీడీపీ ఏజెంట్లు, స్థానిక నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. విషయాన్ని తెలుసుకున్న విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి అక్కడికెళ్లి పచ్చమూకల దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. ఇదంతా సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. దీనిపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో సిట్తో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ దాష్టీకాలు బయటకొస్తాయనే భయంతో నిరాధార ఫిర్యాదులు చేసేందుకు టీడీపీ నేతలు తెగబడ్డారు. అవాస్తవాల వ్యాప్తి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు బూత్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, కార్పొరేటర్లు దౌర్జన్యాలు చేశారంటూ ప్రిసైడింగ్ అధికారికి బూత్ ఏజెంట్లతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయించారు. పల్నాడు తరహాలో ఇక్కడా దారుణాలు జరిగిపోయాయంటూ పచ్చమీడియా అవాస్తవాలను వ్యాప్తి చేసింది. ఒకవేళ వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడి ఉంటే అప్పుడే ఎన్నికల అధికారికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సైతం టీడీపీ అభ్యర్థి కాకుండా.. పోలింగ్ ఏజెంట్లతో ఫిర్యాదు చేయించారంటే వాస్తవాలేమిటో అర్థమవుతోంది. వెంటాడుతున్న భయం ఎన్నికల్లో టీడీపీ అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే భయంతో టీడీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రోజున సీసీ టీవీ ఫుటేజీలను బయటకు తీస్తే దోషులెవరో తెలుస్తుందని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ దాష్టీకాలకు అడ్డేదీ..? ఎన్నికల పర్యవేక్షణాధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ పోలింగ్ను తమకు అనుకూలం చేసుకునేందుకు టీడీపీ తొక్కని అడ్డదారుల్లేవు. దీంతో పోలింగ్ రోజున పోలీసులు సైతం టీడీపీ అరాచకాన్ని వదిలేశారు. ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలాల్లేవు. కావలిలోని ముసునూరు, అల్లూరు మండలం బీరంగుంట, దగదర్తి మండలం తడకలూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు వద్ద వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్యాదవ్పై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజున జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల గూండాగిరి ఫుటేజీలను పరిశీలిస్తే తమ పరిస్థితి ఏమిటనే గుబులు నిరాధార ఫిర్యాదులతో పబ్బం ఎన్నికలైన పది రోజుల తర్వాత వైఎస్సార్సీపీపై ఆరోపణలు -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలను శుక్రవారం నుంచి వచ్చే నెల ఒకటి వరకు నిర్వహించనున్నారు. మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షలను ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు.. ద్వితీయ సంవత్సర పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరపనున్నారు. ప్రథమ సంవత్సరానికి గానూ 20,317.. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5612 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు గానూ జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 0861 – 2320312 నంబర్కు ఫిర్యాదు చేస్తే సమస్యలను వెంటనే పరిష్కరించనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాను 27 జోన్లుగా విభజించారు. పకడ్బందీగా నిర్వహణ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు జిల్లా పరీక్షల కమిటీ విభాగం పరిశీలించనుంది. కమిటీలో కన్వీనర్గా ఆర్ఐఓ శ్రీనివాసులు, సభ్యులుగా దీన్దయాళ్, వేణుగోపాల్, కొండయ్యను నియమించారు. 80 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 80 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు మెడికల్ కిట్ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 80 కేంద్రాల్లో నిర్వహణ హాజరుకానున్న 25,929 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాలకు గంట ముందే విద్యార్థులు చేరుకోవాలి. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. – శ్రీనివాసులు, ఆర్ఐఓ -
పెట్రోల్, డీజిల్ లూజు విక్రయాలపై నిషేధం
నెల్లూరు(క్రైమ్): జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజల్ లూజు విక్రయాలు నిషేధమని, ఈ మేరకు జిల్లాలోని పెట్రోల్ బంకు యజమానులకు నోటీసులను జారీ చేశామని వివరించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఉదయగిరిలో లూజు విక్రయాలకు పాల్పడిన పెట్రోల్ బంకు యజమాని, కొనుగోలు చేసిన బండగానిపల్లికి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమనీయం ప్రసన్న విశ్వేశ్వరుడి కల్యాణం ఇందుకూరుపేట: మైపాడులో కొలువైన అన్నపూర్ణాంబ సమేత ప్రసన్న విశ్వేశ్వరుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కల్యాణోత్సవాన్ని కనులపండువగా గురువారం నిర్వహించారు. ఆలయ అర్చకుడు బండారు ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో వేడుకను జరిపారు. ఉభయకర్తలుగా గంపల రామసుబ్బయ్య, వారి కుమారులు వ్యవహరించారు. అనంతరం గజవాహనసేవ వేడుకగా సాగింది. ఆలయ చైర్మన్ కనుపూరు సురేంద్రబాబు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్లో పరిశీలన నెల్లూరు (దర్గామిట్ట): కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లను సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న కంట్రోల్ రూమ్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కనులపండువగా రథోత్సవం నెల్లూరు సిటీ: నరసింహకొండపై వెలసిన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రథోత్సవాన్ని వేడుకగా గురువారం నిర్వహించారు. ప్రధానార్చకుడు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను జరిపారు. ఉభయకర్తలుగా భారతిరెడ్డి, శ్రీకళ, మాధవీలత వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేవదాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఈఓలు గిరికృష్ణ, కృష్ణప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో చండీహోమం నెల్లూరు(బృందావనం): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని మూలాపేటలోని శంకరమఠంలో చండీహోమాన్ని కంచికామకోటి పీఠానికి చెందిన వేదపండితుడు సోమేశ్వరశర్మ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఉభయకర్తలుగా సోమేశ్వర దీక్షిత్ దంపతులు వ్యవహరించారు. మఠం నిర్వాహకులు కొర్రపాటి నందకిషోర్, ఉషాకుమారి దంపతులు పర్యవేక్షించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
- హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- సీఎం రేవంత్పై మంత్రి ఉత్తమ్కు అనుమానం: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement