-
No Headline
నాని అరాచకాలు● ఎన్నిక అనంతరం టీడీపీ అభ్యర్థి నాని కూచువారిపల్లెకు చెందిన చంద్రగిరి ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తల్లిని పక్కకు తోసేసి, ఆ ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యే వరకూ నాని, నాని అనుచరులు అక్కడే ఉన్నారు. ● కూచువారిపల్లిలో ఓ బాలుడిని స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి అతనిపై యూరినేషన్ చేసి అమానవీయంగా చితకబాదారు. ● కూచువారిపల్లెలో రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డిని రక్షించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చుట్టుముట్టారు. ఆయన రెండు కార్లను పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ● మోహిత్రెడ్డి అంగరక్షకుడుగా ఉన్న ఈశ్వర్రెడ్డిని ఓ ఇంట్లో కట్టేసి కొట్టారు. మోహిత్ రెడ్డితోపాటు ఉన్న వేణురెడ్డిని బలవంతంగా కొటాల గ్రామం వద్దకు తీసుకెళ్లి చెప్పులతో కొట్టారు. వళ్లంతా వాతలు పడేలా చితకబాదారు. ● కూచువారిపల్లి రోడ్డుపై నిలబడి ఉన్న బాలుడు కవలికరెడ్డి మర్మాంగాలపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన్ని గాయపరిచారు. ● తిరుపతి రూరల్ పరిధిలోని రామానుజంపల్లి పోలింగ్ కేంద్రం సమీపంలో నిలబడి ఉన్న ఉపేందర్రెడ్డి, మాధవరెడ్డి, ప్రదీప్రెడ్డిపై దాడికి తెగబడ్డారు. ● తిరుచానూరు ఎంపీటీసీ నరేష్రెడ్డిపై పులివర్తి నానీతోపాటు చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ● పులివర్తి నానితో వచ్చిన రౌడీలు తిరుపతి రూరల్ మండలం, కుంట్రపాకం గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి కొడుకు అవినాష్రెడ్డిని ఒళ్లంతా బ్లేడ్లతో కోశారు. ● పాకాల మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ నంగా నరేష్ రెడ్డి కొడుకు లవంత్రెడ్డి రెండు చేతుల వేళ్లు రక్తం కారేలా కోసేశారు. బీటెక్ చదువుతున్న ఇతను ప్రస్తుతం పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి. ● చెవిరెడ్డి మోహిత్రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తిచేసుకుని తిరుపతి నుంచి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ● అగరాల గ్రామంపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ● ‘తమ ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తాం. రోడ్లపై కూడా తిరగనివ్వం’ అంటూ పులివర్తి నాని, అతని అనుచరులు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను నిత్యం ఫోన్లు చేసి భయపెట్టడం రివాజుగా మారుతోంది. ● పులివర్తి నాని భార్య సుధా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దాడులకు పిలుపునిచ్చారు. దీనిపై సిట్ బృందం విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
బ్రహ్మోత్సవ కాంతులు
రాపూరు: లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం అంకురార్పణ నిర్వహించనున్నారు. తిరుమలలో శ్రీపద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు శనివారం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి, భూదేవి అనుసరించారు. అనంతరం బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. – తిరుమలతిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం దొర వేషధారణలో భక్తులు సందడి చేశారు. కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు స్థానికులను ఉర్రూతలూగించాయి. – తిరుపతి కల్చరల్ -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలోకార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయిసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జూన్ 25వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు ● బ్రైడల్ మేకప్స్●● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటి యేజింగ్, థర్మో హెర్బ్ ఫేషియల్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్● త్రె డ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్ కేర్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు24–05–2024 నుంచి 22–06–2024 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకురిజిస్ట్రేషన్స్ మరియు శిక్షణా స్థలం : Ananga Beauty Studio @ institute, Biragipatteda, Arch Road, Above Canara Bank, Tirupatiసంప్రదించాల్సిన నంబర్లు : 95534 54335, 96666 97219 -
జగన్ ముఖ్యమంత్రి కావాలని పూజలు
వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్కు మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుతూ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్, ఆయన సతీమణి చైతన్య భాను ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం ఆయన తన మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి కుటుంబీకులతో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పేదలకు మేలు చేసిన జగనన్న మళ్లీ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా తైలాభిషేకం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని శనీశ్వరస్వామికి శనివారం శాస్త్రోక్తంగా తైలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి నువ్వుల నూనె, మంచి నూనె, పాలు, పెరుగు, చందనం, నారికేళం, కలశ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. విశేష పూజలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్నకొట్టాయి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి,అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయంలో ఊరేగించారు. భక్తులు పాల్గొని మొక్కులుతీర్చుకున్నారు. ఈవో ఎస్వీ నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎంబీయూలో అంతర్జాతీయ సమావేశం
చంద్రగిరి: మండల పరిధిలోని మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)లో శనివారం అలైడ్ హెల్త్ కేర్ సాంకేతిక పురోగతిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ఎంబీయూ వీసీ ప్రొఫెసర్ నాగరాజ్ రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హెల్త్కేర్ సైన్స్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ మాధవి, సీఎంసీ వేలూరు ప్రముఖ రేడియోలజిస్టు డాక్టర్ సంతోష్ బాబు, చైన్నె కావేరి ఆస్పత్రి చీఫ్ బయోకెమిస్ట్రీ డాక్టర్ సెల్వకుమార్లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాముఖ్యతను వివరించారు. మెడికల్ టెక్నాలజీలో ఏఐ ద్వారా వ్యాధులను నిరూపించడంపై చర్చించారు. అనంతరం రాష్ట్ర హెల్త్కేర్ సైన్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మాధవిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. -
గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్న కారు
– అక్కడికక్కడే యువకుడి మృతి చంద్రగిరి: ఆగి ఉన్న గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, ఐతేపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... రేణిగుంట మండలం, ఆర్.మల్లవరానికి చెందిన సందీప్(31) వ్యక్తిగత పనులపై శుక్రవారం రాత్రి చిత్తూరుకు కారులో పయనమయ్యాడు. అనంతరం పనులు ముగించుకుని శనివారం తెల్లవారుజామున చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో ఐతేపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఆగి ఉండడంతో దాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తిం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు ఢీకొని బేల్దారి మృతి పెళ్లకూరు: గుర్తుతెలియని కారు ఢీకొని బేల్దారి మృతిచెందిన ఘటన శనివారం రాత్రి నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి, చెంబడిపాళెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ వివరాలు.. నెల్లూరులోని భగత్సింగ్ కాలనీకి చెందిన అలీషైర్(37) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చెంబడిపాళెం పరిసర ప్రాంతాల్లో ఓ మేసీ్త్ర వద్ద పనిచేసి, పనులు పూర్తయ్యాక గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు అతి వేగంగా ఢీకొట్టడంతో అలీషైర్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడు పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
No Headline
గూడూరు నియోజకవర్గం ● అసెంబ్లీ: విశ్వేశ్వరయ్య బ్లాక్– మూడో ఫ్లోర్, రూమ్ నం.407 ● పార్లమెంట్కు: విశ్వేశ్వరయ్య బ్లాక్– మూడో ఫ్లోర్, రూమ్ నం.407 సూళ్లూరుపేట నియోజకవర్గం ● విశ్వేశ్వరయ్య బ్లాక్ : మూడో ఫ్లోర్– రూమ్ నం.306 ● పార్లమెంట్కు : విశ్వేశ్వరయ్య బ్లాక్ – మూడో 3 ఫ్లోర్, రూమ్ నం.307 వెంకటగిరి నియోజకవర్గం ● అసెంబ్లీకి: సీవీ రమణ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం. 101 ● పార్లమెంట్కు: విశ్వేశ్వరయ్య బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం.105 చంద్రగిరి నియోజకవర్గం ● అసెంబ్లీకి: లైబ్రరీ హాల్, కేఎల్రావ్ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్ ● పార్లమెంట్కు: మల్టీపర్పస్ హాల్, కేఎల్రావ్ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ తిరుపతి నియోజకవర్గం ● అసెంబ్లీకి: సీవీ రమణ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం.312 ● పార్లమెంట్కు: సీవీ రమణ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం.301 శ్రీకాళహస్తి నియోజకవర్గం ● అసెంబ్లీకి : విశ్వేశ్వరయ్య బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 206 ● పార్లమెంట్కు: విశ్వేశ్వరయ్య బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 207 సత్యవేడు నియోజకవర్గం ● అసెంబ్లీకి: సీవీ రమణ బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం. 403 ● పార్లమెంట్కు : సీవీ రమణ బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం. 410 జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తిరుపతిలో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నారు. -
కౌంటింగ్పై ప్రత్యేక దృష్టి
తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. విధివిధానాలు ● కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ ఏజెంట్లతో పిచ్చాపాటిగా మాట్లాడకూడదు. ● స్ట్రాంగ్ రూమ్ నుంచి తెచ్చిన ఈవీఎం పెట్టెలకు సీల్ పరిశీలించిన తరువాతే వాటిని టేబుళ్ల వారీగా అందించాలి. ● 17సీ ఫారం–1, కంట్రోల్ యూనిట్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్లు సరిపోల్చుకోవాలి. ● కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ● సిస్టమ్ డిస్ప్లే అయ్యేంత వరకు వేచి చూడాలి. ఆ తరువాత టోటల్ బటన్ను ప్రెస్ చేసి 17సీ ఫారం–1తో సరిపోల్చుకోవాలి. ● కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్ తొలగించాలి. పై కవర్ తీసి, వేసిన సీళ్లను తొలగించిన తరువాత ‘రిజల్ట్ బటన్’ ప్రెస్ చేయాలి. ● అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను 17సీ ఫారం–2లో నమోదు చేయాలి. ఫారాన్ని కార్బన్ పేపర్ ద్వారా రెండు కాపీలు ఉండేలా చూడాలి. ఓట్ల నమోదు అనంతరం అందులో ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. ఒక ప్రతిని తమ వద్ద ఉంచుకుని, అసలు ప్రతిని 17సీ ఫారం–1కు పిన్ చేసి రో–ఇన్చార్జకు అందజేయాలి. వీవీప్యాట్ల లెక్కింపు ఇలా.. ● నియోజకవర్గంలో ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు చెందిన వీవీ ప్యాట్లను ఒకదాని తర్వాత ఒకటి లెక్కించాలి. ● వీవీ ప్యాట్ స్లిప్పును సంబంధిత ట్రేలో ఉంచాలి. పూర్తయిన తరువాత 25 చొప్పున కట్టగా కట్టాలి. స్లిప్పులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ● వీవీ ప్యాట్ కౌంటింగ్ అనంతరం ఆర్ఓ పరిశీలిస్తారు. కౌంటింగ్ ప్రక్రియపై ఆర్వో సంతృప్తి చెందిన తరువాత స్లిప్పును సంబంధిత బాక్స్లో ఉంచి, విధుల్లో ఉన్న ఏర్వోకు అప్పగించాలి. అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రాంతాలు గూడూరు– విశ్వేశ్వరయ్య బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం.407 సూళ్లూరుపేట–విశ్వేరయ్య బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం. 306 వెంకటగిరి– సీవీ రమణ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం. 101 చంద్రగిరి–లైబ్రరీ హాల్, కేఎల్ రావ్ బ్లాక్, ఫస్ట్ఫ్లోర్ తిరుపతి–సీవీ రమణ బ్లాక్, సెకండ్ ఫ్లోర్, రూమ్ నం.312ఏ శ్రీకాళహస్తి–విశ్వేశ్వరయ్య బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 206 సత్యవేడు– సీవీ రమణ బ్లాక్, మూడో ఫ్లోర్, రూమ్ నం.403 -
ఐదంచెల భద్రత
తిరుపతి సిటీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నట్టు తెలిపారు. 200 మీటర్లలో రాష్ట్ర పోలీస్ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు మోహరించాయన్నారు. పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం జరిగిన ఘటనల నేపథ్యంలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ రోడ్ పాయింట్ వద్ద నుంచి సరైన ధ్రువపత్రాలు ఉంటేనే లోనికి పంపుతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఆరు గార్డ్ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచినట్టు వెల్లడించారు. మొత్తం 160 మంది పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత కోసం సుమారు 96 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 96 సీసీ కెమెరాలతో నిఘా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్మీనా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అధనపు సూచనలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏదైనా సంఘటనపై స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా, సంయమనం పాటించాలని సూచించారు. సందేహాలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలను సంప్రదించి వివరణ తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్వో పెంచలకిషోర్, రిటర్నింగ్ అధికారి నిషాంత్రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. -
పరస్పర ఒప్పందాలతో ఆరోగ్యకర జీవనం
తిరుపతి తుడా: ఎస్వీ వైద్యకళాశాల, ఎస్వీ విశ్వవిద్యాలయ పరస్పర ఒప్పందం కారణంగా ఇటు విద్యార్థులకు, అటు అధ్యాపకులకు పరిశోధనలో మెలకువలు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పఎస్వీ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. శనివారం వైద్య పరిశోధనపై పరస్పర ఒప్పందాలపై మొదటి సమావేశం నిర్వహించారు. ఎస్వీ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్లినికల్.. నాన్ క్లినికల్ వైద్యులు, ఎస్వీ వైద్యకళాశాల, రుయా ఆస్పత్రి నుంచి పంపితే విశ్వవిద్యాలయ క్యాంపస్లో చదువుకుంటున్న విద్యార్థులకు, సిబ్బందికి మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎస్వీ విశ్వ విద్యాలయంతో మొట్టమొదటిసారిగా పరస్పర ఒప్పందం కోసం సమావేశం నిర్వహించామన్నారు. వైద్య కళాశాల అదనపు వైద్య విద్యాసంచాలకులు, ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, ఎస్వీ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ నారాయణబాబు, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు, డాక్టర్ వెంకటేశ్వర్లు (పరిపాలన), డాక్టర్ సునీత (అకడమిక్ ), డాక్టర్ సత్యనారాయణమూర్తి (పరిశోధనలు ), డాక్టర్ శశికళ,(సామాజిక వైద్య విభాగం), ఎస్వీ విశ్వవిద్యాలయ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుధాకర్రెడ్డి, సీనియర్ టెక్నీషియన్ ముత్తువేలు, ఎస్వీ వైద్యకళాశాల పీఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు. -
బంగారు తిరుచ్చిపై కల్యాణ వెంకన్న అభయం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వారపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేక సేవను నిర్వహించి వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తదుపరి స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను కల్యాణ మండపానికి వేంచేపు చేసి వైఖానస ఆగమోక్తంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవను చేపట్టారు. సర్వాలంకర శోభితుడైన శ్రీనివాసుడు, అమ్మవార్లతో కలసి బంగారు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి డక్కిలి: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని వెంబలూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నిపింది. మృతురాలి తండ్రి బ్రహ్మయ్య కథనం.. మోపూరు రోడ్డు గ్రామానికి చెందిన బ్రహ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె లక్ష్మీ కావేరిని(22) రెండేళ్ల క్రితం వెంబులూరు గ్రామానికి చెందిన పాయసం తిరుపాల్, రత్నమ్మ కుమారుడు శివరాజ్కు ఇచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. తరువాత శివరాజ్తో పాటు తల్లిదండ్రలు అధనపు కట్నం కోసం లక్ష్మీకావేరిని వేధించడం ప్రారంభించారు. మధ్యలో ఓ సారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లక్ష్మీకావేరి పుట్టింటికి చేరింది. తర్వాత కొన్నాళ్లకు మెట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో శివరాజ్కు రెండో వివాహం చేయాలని శివరాజా తల్లిదండ్రలు నిశ్చయించారు. తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీకావేరి శనివారం ఉదయం ఉరి వేసుకొని తనువు చాలించింది. విషయం తెలుసుకుని వెంబులూరుకి వెళ్లగా తమ కుమార్తె కావేరి మృతదేహాన్ని ఇంటి బయట వరండాలో ఉంచి శివరాజా తల్లిదండ్రలు పరారయ్యరని మృతురాలి తండ్రి ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు. తల్లి ప్రేమకు దూరం కాగా కావేరి, శివరాజ్కు 8నెలలు క్రితం కుమార్తె జన్మించింది. తల్లి మృతి చెందడంతో చిన్నారి తల్లి ప్రేమకు దూరం కావడంతో స్థానికులను కంటతడి పెట్టించింది. -
ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రవెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
● తాతయ్యగుంట గంగమ్మకు తోటివేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. జాతరలో భాగంగా మూడోరోజు శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి పోటెత్తారు. తోటి వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయ ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుని తన్మయత్వం చెందారు. ఈ క్రమంలో నాలుగోరోజు శనివారం కై కాల, రజక కులస్తులు అనువంశిక వేషాలతో పురవీధుల్లో సంచరిస్తూ పూజలందుకోనున్నారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – తిరుపతి కల్చరల్ -
ఐకేఎస్తో వేదిక్ వర్సిటీ ఒప్పందం
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన భారతీయ జ్ఞానపరంపర విభాగం (ఐకేఎస్)తో తిరుపతి ఎస్వీ వేదిక్ వర్సిటీ ‘వైదిక వాజ్ఞ్మయ వ్యాసాల ప్రచురణ, తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్’పై శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ వైదిక వాజ్ఞ్మయ వ్యాసాలను అధిక సంఖ్యలో ప్రచురించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేసి ప్రచురించేందుకు మరో ఒప్పందం కుదిరిందని వివరించారు. అనంతరం జ్ఞానపరంపర విభాగ జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ జి.సూర్యనారాయణమూర్తితో ఎంఓయూ మార్చుకున్నారు. రిజిస్ట్రార్ రాధాగోవింద త్రిపాఠి, ఆచార్య గోలి సుబ్రమణ్యశర్మ, ప్రొఫెసర్లు రాధేశ్యామ్, పవన్కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ అంజిరెడ్డి పాల్గొన్నారు. -
నమ్మొద్దు.. మోసపోవద్దు!
● ముందస్తు అడ్మిషన్లతో జాగ్రత్త ● ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోకండి ● పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి ● రిజిస్ట్రేషన్, రికగ్నైజేషన్పై ఆరా తీయండి ● క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారా... పరిశీలించండి ● ఆ తర్వాతే పిల్లలను చేర్పించండి క్వాలిఫైడ్ టీచర్లేనా? జిల్లాలో పలు ప్రైవేటు విద్యాసంస్థలలో క్వాలిఫైడ్ అధ్యాపకులు లేకుండా నడుస్తున్నాయి. 10వ తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం డిగ్రీ, ఇంటర్ చదివిన వారే అధ్యాపకులుగా బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్గా సబ్జెక్ట్ మీద పట్టు దొరకడం లేదు. కేవలం బట్టి ప్రక్రియతో విద్యార్థులను రాత్రి, పగలు హింసించి పరీక్షలు రాయిస్తున్నారు. దీంతో పరీక్షలలో మంచి మార్కులు సాధించిన పోటీపరీక్షలలో చతికలపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలకు బీఈడీ, జూనియర్ కళాశాలకు పీజీ, స్లెట్, నెట్ స్థాయి అధ్యాపకులు ఉండాలి. కొన్ని విద్యాసంస్థలు నిబంధనలు పూర్తిగా పాటించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు అడ్మిషన్లు తీసుకునే సమయంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే అడ్మిషన్లు పొందాలి. లేకుంటే విద్యార్థుల జీవితం అయోమయంలో పడ్డట్టే. తిరుపతి సిటీ: జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్ల హడావుడి మొదలైంది. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే గత రెండు నెలల నుంచి జిల్లాలోని సీబీఎస్ఈ, సాధారణ పాఠశాలల్లో అడ్మిషన్ల కోలాహలం నడుస్తోంది. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్క్లాస్ ప్రవేశాలకు ప్రైవేటు యాజమాన్యాలు గాలం వేసేందుకు ఆకట్టుకునే ప్రచారాలను ముమ్మరం చేశాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలలో టాలెంట్, కాన్సెఫ్ట్, ఇంటర్నేషనల్, టెక్నో, ఒలంపియాడ్, ఐఐటీ, నీట్ వంటి ట్యాగ్లైన్లతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. వీటిలో కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉండగా, మరికొన్నిటికి పూర్తిగా అనుమతులే లేవు. ఇంకొన్ని పాఠశాలలు, కళాశాలలు బ్రాంచీల పేరుతో నడుపుతున్నారు. ఆ ప్రచారాలను నమ్మొద్దు విద్యాసంస్థల నిర్వాహకులు ఆడ్మిషన్లు పెంచుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా సరికొత్త ప్రచారాలతో గాల వేయడానికి ప్రయత్నిస్తుంటారు. తమ విద్యాసంస్థలో ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో టాప్ ర్యాంకులు వచ్చాయని ఊదరగొడుతుంటారు. అడ్మిషన్ల సమయంలో టెస్ట్లు పెడుతూ వచ్చిన మార్కుల ఆధారంగా డొనేషన్లలో డిస్కౌంట్ అంటూ వ్యాపార ప్రకటనలు చేస్తుంటారు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అధునాత భవనాలు, టాయ్లెట్లు, ప్లేగ్రౌండ్, డిజిటల్ క్లాస్రూమ్స్, ప్రాథమిక స్థాయ నుంచే టోఫెల్, ఐఐటీ, నీట్, టెక్నో, ఐఏఎస్ శిక్షణ ఇస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాలలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా విద్యాసంస్థను పరిశీలించాలి. క్రీడామైదానాలు లేని, అపార్ట్మెంట్ భవనాలలో, ఇరుకు సందులలో ఉండే విద్యాసంస్థలలో పిల్లలను చేర్చకుండా ఉంటే మంచిది. విద్యార్థులు శారీరకంగా, మానసింగా ఉల్లాసంగా ఉండాలంటే క్రీడలు ఎంతగానో తొడ్పడతాయి. ఇరుకు గదులు, సందులలో ఉండే పాఠశాలల్లో ప్రమాదాలు జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ అనుమతి కూడా ప్రతి విద్యాసంస్థ కలిగి ఉండాలి.ప్రతి విద్యాసంస్థ ప్రభుత్వ నుంచి కచ్చితంగా రికగ్నైజేషన్ పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్డ్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం తప్పనిసరి. రికగ్నైజేషన్ పొందిన విద్యాసంస్థలలోనే తల్లిదండ్రులు పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచ్ ద్వారా పరీక్షలు రాయిస్తుంటాయి. ఇలాంటి విషయాయలలో తల్లిదండ్రులు కచ్చితంగా విద్యాసంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్తో పాటు రికగ్నైజేషన్ పొందిన పత్రాలను అన్ని విద్యాసంస్థలు నోటీసు బోర్డులో ఉంచాలనే నిబంధన ఉంది.వీటిపై ఆరా తీయ్యండి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు జిల్లాలో ప్రతి ప్రైవేటు విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అదేవిధంగా విద్యాసంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్తో పాటు ప్రభుత్వ రికగ్నైజేషన్ తప్పక పొంది ఉండాలి. రిజిస్ట్రషన్ మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థల ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. –డాక్టర్ వీ.శేఖర్, జిల్లా విద్యాశాఖాధికారి, తిరుపతి జిల్లా -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
చంద్రగిరి : మండలంలోని కోనంగివారిపల్లె సమీపంలో ఓ పాడుబడిన ఫ్యాక్టరీ వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు శుక్రవారం స్థానికులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. గుర్తుతెలియన వ్యక్తికి సుమారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటాయని, మృతి చెంది మూడు రోజులై ఉంటుందని వెల్లడించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు వివరించారు. -
బోయకొండ గంగమ్మా..పాహిమాం
చౌడేపల్లె: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గంగమ్మ తల్లీ శరణు అంటూ పూజల్లో పాల్గొన్నారు. వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సమయంలో అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు ఉపవాస దీక్షలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నప్రసాదాల పంపిణీ ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్, ఈఓ పర్యవేక్షణలో సుమారు 2 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం బోయకొండ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న చోట జరుగుతున్న మరమ్మతు పనులను ఈఓ, చైర్మన్ పరిశీలించి తగు సూచనలు చేశారు. -
ఫలితాలను శాసించే పోలింగ్!
90శాతానికి పైగా ఓట్లు పోలైన కేంద్రాలు (అసెంబ్లీ) తిరుపతి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన పూర్తి అయినప్పటికి విజయావకాశాలపై జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చర్చ సాగుతోంది. జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు 78.63 శాతం, తిరుపతి పార్లమెంట్కు 79.10 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. ఈ క్రమంలో అంతా ఏ ఊరుల్లో....ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి. ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనే అంశాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 90శాతానికి పైగా 319 బూత్లలో పోలింగ్ నమోదైంది. వెయ్యికి పైగా ఓట్లు 94 బూత్లలో పడ్డాయి. అత్యధికంగా తొట్టంబేడు మండలం పెన్నలపాడులో 96.73శాతం, ఏర్పేడు మండలం వికృతమాలలో 96.12శాతం, శ్రీనివాసపురంలో 95.04శాతం, రేణిగుంట మండలం అల్లికేశంలో 95.65శాతం, శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 94.98శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రాలే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. అలాగే మెజారిటీల్లోనూ కీలకంగా మారనున్నట్లు వివరిస్తున్నారు. ఈ క్రమమంలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి సంబంధించి 322 పోలింగ్ బూత్లలో అధికశాతం ఓటింగ్ నమోదుకావడం గమనార్హం. ● సత్యవేడు నియోజకవర్గం కంచనపుత్తూరులో 1,011 ఓట్లు, చిల్లమత్తూరు– 1,053, వెరికింబట్టు ఎస్సీకాలనీ– 1022, నాగలాపురం–1,010, కన్నవరం–1,041, కళత్తూరు ఎస్సీకాలనీ–1,060 ఓట్లు నమోదయ్యాయి. ● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీవీపురం బూత్లో 1,047ఓట్లు, అన్నాసంపల్లె–1,214, కరకంబాడి–1,076, తారకరామానగర్–1,106, ఆర్.మల్లవరం–1లో1,072, ఆర్,మల్లవరం–2లో 1,010, తూకివాకం–1,110, ఎర్రమరెడ్డిపాళెం–1,086, శ్రీకాళహస్తి పట్టణంలోని 20 బూత్ల్లో అధికశాతం ఓటింగ్ నమోదైంది. ● వెంకటగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లెలో 1,011, పెరమకొండ–1,012 ఓట్లు, జిలకపాడు–1,066 , మార్లపూడి–1,042, అనంతమడుగు– 1,055 తదితర 12 బూత్ల్లో అధికశాతం ఓట్లు పోలయ్యాయి. ● సూళ్లూరుపేట నియోజకవర్గంలోఃని పుణ్యేపల్లెలో 1,000 ఓట్లు, బిరదవాడ– 1,000, పుద్దేరు–1,068, కల్లూరు–1,025 మరో 10 బూత్ల్లో వెయ్యి ఓట్లు దాటాయి. ● గూడూరు నియోజకవర్గంలోని రామలింగాపురంలో 1,024 ఓట్లు, పోట్టుపాళెం–1,035, మేకనూరు–1,068, తిక్కవరం–1,061, తదితర 14 బూత్ల్లో వెయ్యికి పైగా ఓట్లు నమోదయ్యాయి. ● చంద్రగిరి నియోజకవర్గంలోని భాకరాపేట బూత్లో 1,032 ఓట్లు, గుండ్లగుట్టపల్లె–1,195 ఓట్లు, వల్లివేడు–1,038, కుక్కలపాళెం ఎస్సీకాలనీ– 1,141 , ఓట్లవారిపాళెం ఎస్సీకాలనీ–1,030 ఓట్లు, ఇరంగారిపల్లె–1,223, గానుగపెంట–1,128 తదితర 19 పోలింగ్ బూత్లలో వెయ్యికిపైగా ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో 319 బూత్లలో అధికశాతం ఓటింగ్ అభ్యర్థుల భవితవ్యం తేల్చడంలో ఇవే కీలకం గెలుపోటములను నిర్దేశించేవి ఈ కేంద్రాలే..సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలింది.. ఈ సమయంలో అభ్యర్థుల జయాపజయాలపై ముమ్మరంగా చర్చ సాగుతోంది.. ఓటింగ్ శాతం అధికంగా నమోదైన బూత్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.. ఫలితాలను శాసించనున్న ఆయా కేంద్రాలు ఎవరికి అనుకూలంగా ఓట్లు పడ్డాయో అనే విషయం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలో 90శాతానికి పైగా పోలింగ్ జరిగిన 319 సెంటర్లే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశముంది. నియోజకవర్గం పోలింగ్ బూత్లు శ్రీకాళహస్తి 81 సత్యవేడు 67 వెంకటగిరి 28 చంద్రగిరి 46 గూడూరు 39 సూళ్లూరుపేట 58 తిరుపతి లేవు మొత్తం 319 జిల్లాలో వెయ్యి ఓట్లకు పైగా పోలైన కేంద్రాలు నియోజకవర్గం పోలింగ్ బూత్లు శ్రీకాళహస్తి 20 సత్యవేడు 06 వెంకటగిరి 12 చంద్రగిరి 19 గూడూరు 14 సూళ్లూరుపేట 10 తిరుపతి లేవు మొత్తం 81 -
విమానంలో విహారయాత్రకు విద్యాకుసుమాలు
సత్యవేడు: మాధనసాళెం జెడ్పీఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తే విమానంలో విహాయ యాత్రకు పంపుతానని సురుటుపల్లె ఆలయ కమిటీ సభ్యుడు ఉమాపతి ప్రకటించిన విషయం విధితమే. అందులో భాగంగా విద్యార్థులు పురుషోత్తం(552), వి. విష్ణు( 515),మహా(509), తనూజ(505)తోపాటు ప్రధానోపాధ్యాయుడు మునిమోహన్ను శుక్రవారం చైన్నె నుంచి హైదరాబాద్కు విమానంలో పంపించారు. టికెట్లతోపాటు విద్యార్థుల రెండు రోజుల విహార యాత్రకు అయ్యే మొత్తం ఖర్చును ఉమాపతే భరిస్తున్నారు. ఈ మేరకు ఉమాపతిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. ఆముదాలకోనలో ఒంటరి ఏనుగు! ● అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక చంద్రగిరి : మండలంలోని ఆముదాల కోన వద్ద అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు పనపాకం రేంజ్ డీఆర్ఓ చిన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం అటవీప్రాంతంలో ఆయన పర్యటించి ఏనుగు కాలి గుర్తులను పసిగట్టారు. గతంలో తవణంపల్లె, పాకాల వద్ద ఇద్దరిని హతమార్చింది ఈ ఏనుగే అని గుర్తించామని డీఆర్ఓ వెల్లడించారు. ఈ మేరకు ఆముదాల కోన ఎస్టీ కాలనీ, కల్రోడ్డుపల్లె, మిట్టూరు, కాశిపెంట్ల, కొత్త ఇండ్లు ప్రజలకు తీసుకోవాల్సిన అవగాహన కల్పించారు. -
వరసిద్ధుని సేవలో కలెక్టర్
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారిని కలెక్టర్ ప్రవీణ్కుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం సేవించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆలయ మర్యాద చేశారు. స్వామి చిత్రపటం, ప్రసాదం అందించి కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు కోదండపాణి, బాబు పాల్గొన్నారు. పెంచలకోనకు ప్రత్యేక బస్సులు రాపూరు: మండలంలోనిపెంచలకోన బ్రహ్మోత్సవాలకు 120 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు, గూడూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి, వాకాడు, కావలి, వెంకటగిరి, గూడూరు, వైఎస్సార్ జిల్లా కడప, మైదుకూరు, రాజంపేట, బద్వేల్ నుంచి ప్రత్యేక బస్సులను శనివారం నుంచి నడపనున్నట్లు వివరించారు. 22న నృసింహ జయంతి, 23న శ్రీవారి కల్యాణం నేపథ్యంలో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందని, ఆ మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అన్ని బస్సుల్లో మామూలు చార్జీలనే వసూలు చేయనున్నట్లు తెలిపారు. 27 నుంచి కల్యాణ వేంకటేశ్వరుని వసంతోత్సవాలు తిరుపతి(అలిపిరి): శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారీ సమేతంగా వసంతోత్సవంలో పాల్గొననున్న ట్లు వెల్లడించారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, సీతాలక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించనున్నట్లు వివరించారు. సేవలో పాల్గొనేందుకు దంపతులు రూ.516 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈక్రమంలోనే ఆర్జితసేవలను రద్దుచేసినట్లు వెల్లడించారు. -
మొదటి ఘాట్లో ప్రమాదాలు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం పలు ప్రమాదాలు జరిగాయి. వివరాలు.. తమిళనాడుకు చెందిన భక్తులు మినీవ్యాన్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కిందకు దిగుతుండగా మాల్వాడిగుండం సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లోని కొందరు భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యాన్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ప్రమాద సమయంలో అటుగా వస్తున్న టీటీడీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. అలాగే ఘాట్ 19వ మలుపు వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే టీటీడీ వాటర్ ట్యాంకు కూడా డివైడర్ను ఢీకొంది. -
స్ట్రాంగ్ భద్రత
● పకడ్బందీగా బందోబస్తు ● నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ● కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగింపుతిరుపతి సిటీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్కు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఆయన మాట్డాఉతూ భద్రతలో భాగంగా మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అమర్చిన సీసీ కెమెరాల పర్యవేక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఆదితీ సింగ్, నిషాంత్రెడ్డి, నరసింహులు, అదనపు ఎస్పీ కులశేఖర్, డీఆర్ఓ పెంచలయ్య పాల్గొన్నారు. కౌంటిగ్ కేంద్రానికి కట్టుదిట్టంగా.. తిరుపతి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు కట్టదిట్టమైన భద్రత కల్పించాలని, హింసాత్మక చర్యలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనా ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి రాష్ట్ర సీఎస్ జవహార్రెడ్డితో కలసి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత, ప్రధాన ద్వారం వద్ద చెకింగ్ అమలు చేయాలని చెప్పారు. దీనిపై కలెక్టర్ ప్రవీణ్కుమార్ స్పందిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత కల్పించినట్లు చెప్పారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ వద్ద అదనపు పోలీస్ బలగాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో ఏఎస్పీ శ్రీనివాస రావు, డీఆర్ఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు. -
సప్తగిరి.. భక్తఝురి
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తుల క్యూ శిలాతోరణం వరకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 76,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భా రీగా వర్షం కురవడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మాడవీధులు జలమయమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు గాయాలు చౌడేపల్లె: దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె సమీపంలో శుక్రవారం నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు చెంగారెడ్డి పెంపుడుకుక్కను పెంచు కుంటున్నాడు. శుక్రవారం ఇంటికి సమీపంలో ఉన్న ఒక రైతు మామిడితోటలోకి కుక్క వెళ్లింది. కొద్దిసేపటికి పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. చెంగారెడ్డి అక్కడికి వెళ్లి చూడగా నాటు బాంబు పేలి కుక్క తీవ్రంగా గాయపడి ఉంది. దవడ భాగం చీలిపోయి ఉంది. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు పాతిపెట్టిన నాటుబాంబును కొరకడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
‘అధికారులు తీరు మార్చుకోవాలి’
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement