-
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
లోక్సభ ఎన్నికల బరిలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా బీజేపీలో చేరకముందే ఆమె టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్యసింగ్ బరిలో నిలిచారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత ఎంత కష్టమో తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారం కోసం తను పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా పేర్కొంది.ఎన్నికల యుద్ధం ప్రారంభం నుంచి వరుసగా ప్రజా సభలతో పాటు పార్టీ కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో చాలా కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసినట్లు కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం వల్ల సరిగ్గా నిద్రకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పారు. కనీసం సమయానికి భోజనం కూడా తీసుకోవడంలేదని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోరాటం ముందు సినిమా నిర్మించడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివేనని కంగన చెప్పడం విశేషం. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. జూన్ 14న విడుదల కావాల్సిన ఈ సినిమా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
'నరేంద్ర మోదీ' బయోపిక్లో స్టార్ యాక్టర్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్లో సత్యరాజ్కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది. నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ హీరామండి: ద డైమండ్ బజార్. రెండు వారాల క్రితం నెట్ఫ్లిక్స్లో రిలీజైన ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో మనీషా కొయిరాలా.. మల్లికాజాన్ అనే పాత్రను పోషించింది. టీనేజ్ మల్లికగా నటి అభా రంత కనిపించింది.క్యాస్టింగ్ కౌచ్?తాజాగా ఈమెకు ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నావా? అని అడగ్గా డైరెక్ట్గా కాకపోయినా పరోక్షంగా అలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసినట్లు బదులిచ్చింది. అభా మాట్లాడుతూ.. 'కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని చెప్పేవారు. కానీ ఇది ఆడిషన్ కాదని నొక్కి మరీ చెప్పేవారు. నాకసలు అర్థమయ్యేది కాదు.. అదేంటి? ఫోన్ చేసి రమ్మంటున్నారు.. కానీ ఆడిషన్ కాదంటున్నారేంటని తికమక పడేదాన్ని. ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని అసలు మీటింగ్కు వెళ్లేదాన్నే కాదు. అసలు సంగతేంటో వెళ్లి చూద్దామని ధైర్యం చేసేదాన్నే కాదు.ఎవరూ నాతో..నేరుగా మాత్రం ఎవరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నీకు పని కావాలంటే ఇది చేయాలి.. ఫలానా దానికి ఒప్పుకోవాలి అని ఎవరూ నాతో చెడుగా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు షార్ట్కట్స్ నచ్చవు. ఆడిషన్స్కు వెళ్లేదాన్ని.. ఫోన్ కాల్ కోసం ఎదురుచూసేదాన్ని. నాకది మాత్రమే తెలుసు' అని అభ చెప్పుకొచ్చింది. అభ సోదరి ప్రతిభ రంత కూడా హీరామండిలో నటించింది. చదవండి: పవిత్రతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు: చందు భార్య శిల్ప -
24 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ప్రముఖు నటుడు
అదృశ్చమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు గురుచరణ్ సింగ్ తిరిగొచ్చాడు. దాదాపు 24 రోజులు తర్వాత ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 24న ముంబయి వెళ్తానని చెప్పి దిల్లీ ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్లిన ఇతడు.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా పనిచేయలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఇప్పుడు గురుచరణ్ ఆచూకీ కనుగొన్నారు. తిరిగొచ్చిన పోలీసులతో గురుచరణ్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా గురుచరణ్ పలు ప్రదేశాలకు వెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ధ్యానం కోసం హిమాలయాలకు కూడా వెళ్లాలనుకున్నాడని పేర్కొన్నారు.హిందీలో పాపులర్ టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో గురుచరణ్.. రోషన్ సింగ్ సోధీ పాత్ర చేశారు. దీనితోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా 2020లో షో నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఏదైతేనేం గురుచరణ్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ 'షరతులు వర్తిస్తాయి'.. స్ట్రీమింగ్ అందులోనే?) -
మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!
ఓటీటీలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. లాహోర్లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు భన్సాలీ. (చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ వెబ్సిరీస్కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్కే హైలెట్. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది. ‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు. ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ షూటింగ్కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్ సిరీస్లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు. -
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ భామ జాన్వీకపూర్ దేవరలో జూనియర్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవలే తన కాబోయే వరుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి మొదటిసారి నోరు విప్పింది దేవర భామ.జాన్వీ మాట్లాడుతూ..'నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా లైఫ్లోకి వచ్చాడు. మేమిద్దరం కలసి పెరిగాం. అతను నా కలలను తనవిగా ఫీలవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేము మద్దతుగా ఉంటాం' అని తెలిపింది. కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఇలాంటి లక్షణాలు ఉండాలంటూ చెప్పుకొచ్చింది. గతంలోనూ బోనీ కపూర్ సైతం శిఖర్పై ప్రశంసలు కురిపించారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని తెలిపారు. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్ తనకు తెలుసని బోనీ అన్నారు. కాగా.. జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఈనెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. -
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సింగర్ సుచిత్ర కోలీవుడ్ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్ టాపిక్గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్హాసన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్ ట్రిప్లో కార్తీక్ కుమార్, షారుక్, కరణ్ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారాయి.*Big Allegations on Shahrukh Khan and Karan Johar*According to Tamil Singer Suchitra, her Ex husband Karthik Kumar, SRK and Karan Johar had a gay encounter in LondonThey Usually go the countries on holidays where GAY S*X is legal and they enjoy it 😵 pic.twitter.com/VYrYk8pUnz— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 16, 2024 -
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఎవరైనా దేని గురించైనా ఆరా తీస్తే చాలు.. కొందరు ఏదీ దాచుకోకుండా ఉన్నదంతా కక్కేస్తారు. దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా అంతే! మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా బదులిస్తుంటాడు. ఇంటి విషయాలను కూడా పూసగుచ్చినట్లు చెప్తుంటాడు. ఈ వైఖరి వల్ల పిల్లలు ఇబ్బందిపడుతున్నారట! ఈ విషయాన్ని బోనీ కపూరే వెల్లడించాడు.నా కుటుంబం గురించి అడగొద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్కు.. పబ్లిక్గా కుటుంబం గురించి పొరపాటున ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? దీనివల్ల ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చాయా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు 'ఇది చాలాసార్లు జరిగింది. అందుకే ఇంటర్వ్యూకి కూర్చునే ముందు అక్కడున్నవారికి కేవలం నా గురించి మాత్రమే అడగండి, నా కుటుంబం గురించి అడగొద్దు అని మరీ మరీ చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాను. వాళ్లకు నచ్చదుఅది నా పిల్లలకు అస్సలు నచ్చదు. ఎందుకలా ప్రతీది చెప్తావని కోప్పడతారు. ముఖ్యంగా యాక్టింగ్కు సంబంధించిన విషయాలను జనాలే తెలుసుకోవాలి తప్ప తమంతట తాముగా చెప్పకూడదంటారు. నేనేమో అవన్నీ ముందే లీక్ చేస్తుంటాను. వారు హర్ట్ అయ్యారని అర్థమవగానే తప్పయిపోయిందంటూ సారీ చెప్పేస్తాను' అని బదులిచ్చాడు.అందరం ఏడ్చేశాంఈ మధ్య అలాంటిదేమైనా జరిగిందా? అన్న ప్రశ్నకు.. 'ఇప్పట్లో ఏమీ జరగలేదు కానీ గతంలో నేను మీడియా ముందు ఉన్నదంతా మాట్లాడటం వల్ల వాళ్లు చాలా అప్సెట్ అయ్యారు. నన్ను తిట్టారు. నేను బాధపడేసరికి ఏడ్చేశారు. నేనూ ఏడ్చేశాను. సారీ చెప్తుంటే అలా మాట్లాడొద్దని వాళ్లే బుజ్జగించారు' అని బోనీకపూర్ చెప్పుకొచ్చాడు.చదవండి: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది! -
నాన్న రెండో పెళ్లి.. మా అమ్మ వెళ్లి ఆశీర్వదించింది!: నటి
కట్టుకున్న భర్త పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే మహిళలు భరించలేరు. కానీ ఇక్కడ చెప్పుకునే మహిళ మాత్రం భర్త రెండో పెళ్లి చేసుకుంటే వారి పెళ్లికి వెళ్లి మరీ ఆశీర్వదించింది. ఇంతకీ ఆ మహిళ మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ. భర్త రెండో పెళ్లి చేసుకుంటే ఆమెతో స్నేహం కూడా చేసిందట. ఈ విషయాలన్నింటినీ పూజా బేడీ కూతురు, నటి ఆలయ ఎఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.నాన్న రెండో పెళ్లికి..'నా తల్లిదండ్రులు విడిపోయారు. కానీ ఎప్పుడూ కలిసే కనిపించేవారు. మంచి ఫ్రెండ్స్లా కలిసిమెలిసుంటారు. ఇప్పటికీ గొప్ప మిత్రులుగానే కొనసాగుతున్నారు. ఎంతలా అంటే.. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఆ వేడుకకు అమ్మ కూడా హాజరైంది. నాక్కూడా ఆ పిన్ని అంటే చాలా ఇష్టం. ఆ పిన్నికి పుట్టిన కుమారుడిని నా సొంత సోదరుడిలానే భావిస్తాను. వాళ్లిద్దరూ నాకెంతో ఇష్టం.విడాకులు మంచి నిర్ణయంనా జీవితంలో వాళ్లు లేకపోయుంటే అన్న ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. నా వరకైతే అమ్మానాన్న విడాకులు తీసుకుని మంచి పనే చేశారు. విడాకులను అంత పెద్ద సమస్యగా చూడకుండా చక్కగా హ్యాండిల్ చేశారు. వీళ్లు విడిపోయాక నాకు మంచి మనసున్న పిన్ని, తమ్ముడు దొరికారు.అమ్మ, పిన్ని ఎలా ఉంటారంటే?విడిపోయారన్న మాటే కానీ అమ్మానాన్నలు ఎప్పుడూ ఒకరిగురించి మరొకరు చెడుగా మాట్లాడుకోవటం నేను వినలేదు. పైగా అమ్మ, పిన్ని కూడా ఫ్రెండ్స్లా కలిసిపోవడం విశేషం' అని ఆలయ చెప్పుకొచ్చింది. పూజా బేడీ, బిజినెస్మెన్ ఫర్హాన్ 1994లో పెళ్లి చేసుకున్నారు. 2003లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. కాగా ఆలయ ఎఫ్.. ఈ ఏడాది రిలీజైన బడే మియా చోటే మియా, శ్రీకాంత్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.చదవండి: Laya: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది! -
భర్త కోసం హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ప్రెగ్నెంట్ అని హింట్ ఇస్తోందా?
బర్త్డే అంటేనే సెలబ్రేషన్స్.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్ డేలో వర్క్ పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్మెంట్కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 36వ బర్త్డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్.. విక్కీ బర్త్డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్ సింబల్స్, మూడు కేక్ ఎమోజీలను క్యాప్షన్లో జత చేసింది. ఆ క్యాప్షన్కు అర్థమదేనా!ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్, కేక్స్.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా.. అని ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం కూడా..కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!ఇద్దరూ సినిమాలతో బిజీవిక్కీ కౌశల్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ! -
ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు
బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. రీసెంట్గా ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో హీరో బంధువులు కూడా ఉన్నారు. తాజాగా వాళ్ల అంత్యక్రియలకు సదరు హీరో హాజరు కావడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)సోమవారం సాయంత్రం మంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఘాట్కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దాంతో దాని కింద 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. వీళ్లలో హీరో కార్తిక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ చన్సోరియా(60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు.తాజాగా వీళ్లిద్దరికీ అంత్యక్రియలు జరగ్గా.. కార్తిక్ ఆర్యన్ హాజరయ్యాడు. తన బంధువులకు తుది నివాళులు అర్పించాడు. ఇకపోతే హోర్డింగ్ కుప్పకూలిన కేసులో నిందితుడు భవేశ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు. భవేశ్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..: నటి లయ)14 killed, 74 injured in this giant hoarding collapse in Mumbai’s dust storm yesterday. The 17,000 sqft hoarding was listed in the Limca Book of Records last year. The BMC says it was illegal, unauthorised.FOURTEEN lives gone & counting.Banana republic. pic.twitter.com/uHqx0tW1in— Shiv Aroor (@ShivAroor) May 14, 2024 -
చేతికట్టు తొలగించి కేన్స్లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్పై మెరిశారు. కేన్స్లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఐశ్వర్య తన గ్లామర్ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024 -
రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది
ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు.కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్లో దాగివున్న నిజాలను ఈ సిరీస్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. -
ఎమర్జెన్సీ వాయిదా
భారతదేశంలో అమలు చేయబడిన ఎమర్జెన్సీ కాలం (1975 జూన్ 25–1977 మార్చి 21) నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం దేశంలో జరగుతున్న ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారామె. దాంతో కంగనా రనౌత్ రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
ప్రపంచ ఫిల్మ్ మేకర్స్ను ఏకం చేసే వేదిక ఇది
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ వేడుకలను తొలిసారిగా నిర్వర్తిస్తోంది భారత ప్రభుత్వం. ఈ వేడుకల్లో భాగంగానే ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పెవిలియన్’ను ‘ఫ్రాన్స్లోని భారత రాయబారి’ జావేద్ అష్రఫ్, ఎమ్ఐబీ (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ) సెక్రటరీ సంజయ్ జాజు ్రపారంభించారు. తొలుత ఈ పెవిలియన్కు ‘ఇండియన్ పెవిలియన్’ పేరు అనుకున్నారట. ఆ తర్వాత ఈ పేరును ‘భారత్ పెవిలియన్’గా మార్చారు.భారత్ పెవిలియన్ ్రపారంభం సందర్భంగా... ‘‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమాతో మళ్లీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్పోటీలో నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సంజయ్. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే కేవలం ఫ్యాషన్, రెడ్ కార్పెట్ మాత్రమే కాదు.. వరల్డ్ సినిమా ఫిల్మ్ మేకర్స్ను ఏకం చేస్తుంది. భవిష్యత్ ఫిల్మ్ మేకింగ్కు ఓ వేదిక అవుతుంది’’ అని పేర్కొన్నారు జావేద్ అష్రఫ్. ఈ కార్యక్రమంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డిప్యూటీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ క్రిస్టియన్ జ్యూన్, ఇండియన్–కెనడియన్ ఫిల్మ్మేకర్ రిచీ మెహతా పాల్గొన్నారు. చేతికి ఏమైంది?... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు రెండు దశాబ్దాలుగా తప్పకుండా హాజరవుతున్నారు ఐశ్వర్యా రాయ్. ఈ ఏడాది చిత్రోత్సవాల్లోనూ ఆమె మెరవనున్నారు. ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య ఫ్రాన్స్ చేరుకున్నారు. తొలిసారిగా ఐశ్వర్యా రాయ్ 2002 కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై నడిచిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తల్లి ఐశ్వర్యతో కలిసి 2012లో ఆరాధ్య తొలిసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా తన కుమార్తెతో కలిసి ఐశ్వర్య కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను గమనిస్తే.. ఆమె చేతికి కట్టు కట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ఆమెకు ఏమైంది? గాయంతో ఐశ్వర్యా రాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఎలాంటి కాస్ట్యూమ్లో కనిపించనున్నారు? అనే ఆసక్తి నెలకొంది. -
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్ఫ్లిక్స్లో రిలీజైన ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్లోని లాహోర్లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.అయితే ఈ సిరీస్లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్ షా. ఈ వెబ్ సిరీస్లో కార్ట్రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్తో బ్రేకప్ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్ షా పంచుకున్నారు. అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్తో విడిపోయారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
విక్రాంత్ మాస్సే.. బాలీవుడ్లో ఎంతోకాలంగా హీరోగా రాణిస్తున్నాడు. అయితే 12th ఫెయిల్ మూవీతో మాత్రం ఒక్కసారిగా ట్రెండయ్యాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జనాల్ని పట్టి కుదిపేసింది. ఈ ఒక్క చిత్రంతో సౌత్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో బోలెడన్ని చిత్రాలున్నాయి. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్లాక్ అవుట్. మౌనీ రాయ్ హీరోయిన్గా నటించింది. సునీల్ గ్రోవర్, కరణ్ సోనావానే కీలక పాత్రల్లో అలరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవంగ్ భవసార్ దర్శకత్వం వహించాడు. 2021లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించగా ఇన్నాళ్లకు రిలీజ్కు నోచుకోవడం గమనార్హం. ఈ చిత్రం జియో సినిమాలో జూన్ 7 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జియో సినిమా అధికారికంగా వెల్లడించింది. Iss kahani ke sabhi patra ki life ke 🤫 lag chuke hai…!#StayTuned for more details about their life 🧐Subscribe to JioCinema Premium at Rs.29 per month.Exclusive content. Ad-free. Any device. Up to 4K.@VikrantMassey @Roymouni @WhoSunilGrover @focusedindian #JyotiDeshpande… pic.twitter.com/zCy7Uuqz1c— JioCinema (@JioCinema) May 16, 2024చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
రోజుకు మూడుసార్లు వంటగదిలో పని చేయాలన్నాడు: సీనియర్ నటి
ప్రేమపెళ్లిళ్లు అనేవి బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్నవే! మనసులు కలిశాక మనుషులు ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్ సీనియర్ జంట షర్మిల ఠాగోర్- మన్సూర్ అలీ ఖాన్ పటౌడీలు కూడా ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ ప్రేమ బంధాన్ని 1968లో పెళ్లితో పదిలపర్చుకున్నారు.కిచెన్లోకి నోపెళ్లైన కొత్తలో జరిగిన విషయాలను తాజాగా ఓ షోలో గుర్తు చేసుకుంది షర్మిల. 'నా భర్త నన్ను రోజుకు మూడుసార్లు వంటగదికి వెళ్లాలని చెప్పాడు. ఇది చాలా చెడ్డ ఆలోచన.. నేను అన్నిసార్లు కిచెన్కు వెళ్లానంటే నీకే కష్టమవుతుందని భర్తకు వార్నింగ్ ఇచ్చాను. ఇదెక్కడుంది? ఆ వస్తువు ఎక్కడుంది? నాకు ఏదీ దొరకడం లేదంటూ నీ వెంటే పడతానని హెచ్చరించాను.అతడే స్వయంగా..దానికంటే నేను వంటగదికి వెళ్లకపోవడమే మేలని చెప్పాను. దీంతో అతడు తన వంట తానే చేసుకోవాల్సి వచ్చింది. నేను తెలివిగా అతడు వంటగదిలోకి వచ్చేలా చేశాను. ఏమాటకామాట కిచెన్లో అద్భుతాలు చేసేవాడు. యూట్యూబ్లో చూసి కొత్తరకం వంటలు చేసేవాడు. దానివల్ల తను మరింత కాన్ఫిడెంట్గా తయారయ్యాడు. అద్భుతంగా వండుతాడుఓసారి నేను లండన్లో ఉన్నప్పుడు ఒకరు నాకు కాల్ చేసి నీ భర్త వంట ఎంత సూపర్గా చేశాడో.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను కిచెన్లోకి వెళ్లకపోవడం వల్లే అతడు అమోఘంగా వంటలు చేయగలిగాడు' అని షర్మిల చెప్పుకొచ్చింది. మన్సూర్ అలీ ఖాన్- షర్మిల ఠాగోర్లకు సైఫ్, సబా, సోహా అలీ ఖాన్ అని ముగ్గురు సంతానం. కాగా క్రికెటర్ మన్సూర్ 2011లోనే కన్నుమూశాడు.చదవండి: భర్తతో విడాకులు ప్రకటించిన తెలుగు నటి.. అర్థం చేసుకోండంటూ.. -
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి కేన్స్కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్లో పింక్ లుక్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Manikarnika Films Production (@manikarnikafilms) -
సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
సన్నీలియోన్ బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఆమె అభిమానులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. అలా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన యువకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి అక్కడ వారందరూ కేక్ కట్ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ పుట్టినరోజును ఎందుకు జరుపుకున్నారో కూడా వారు చెప్పుకొచ్చారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె నటించిన గత సినిమాలు ఎలా ఉన్నా సరే సన్నీలో సేవా గుణం ఉంది. భారత్పై గౌరవంతో ఇక్కడే ఉంటుంది. అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుంది. ఇక్కడి ప్రజల్లో మమేకమైంది. ఇక్కడి ప్రజలకు ఆమె ఎంతో సాయం చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి..? అంటూ వారు సన్నీ లియోన్ గురించి చెబుతున్నారు. -
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ భామ జాన్వీకపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా బుధవారం ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారికి ఎలా ఉండాలో చెప్పగలరా? అని అడిగారు. అయితే దీనికి జాన్వీ కపూర్ ఆసక్తికర సమాధానమిచ్చింది. అదేంటో మీరు చూసేయండి.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..' నా కలలను తనవిగా భావించేవాడు. నాకు అండగా నిలిచేవాడు. ఎల్లప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు. నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కావాలి' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. బాలీవుడ్ భామ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా చాలాసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా తన పెళ్లి కూడా తిరుమలలోనే జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. చాలా సింపుల్గా శ్రీవారి ఆలయంలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మరోవైపు జాన్వీకపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చే మూవీలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. -
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ముంబయిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె బ్రదర్ రాకేశ్ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్ వెల్లడించారు.మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిల్పై ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Bollywood Khabar (@bollywoodkhabarofficial) -
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement