-
పుణె పోర్షే కేసు : తాత అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర పుణె కారు ప్రమాదం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ను అత్యంత నాటకీయ పరిణామాల నడుమ పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కోసం సురేంద్రను విచారణకు పిలిచారు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాత్రి వరకు ప్రశ్నించారు. అయితే.. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. కాగా, ఈ కేసులో ఇది మూడో ఎఫ్ఐఆర్.ఓ టీనేజర్(17) ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మే 19వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్కు 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇద్దరు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది. ప్రొటోకాల్ ప్రకారం ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతే కేసును పుణె క్రైం బ్రాంచ్కు బదిలీ చేశారు. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. -
పూణే కారు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్
పూణే: పుణేలో విలాసవంతమైన పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని.. కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.కాగా, పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో ఫుల్ స్పీడ్లో పోర్షే కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాగా, పోర్శే కారును మైనర్(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువైనైల్ సెంటర్కు మైనర్ను తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. #Pune Porsche Car accident case: Accused Vishal patil, pub owner and driver shifted to jail after interrogation #porsche #porschecaraccidentinpune #pune #punecity #punenews #agrwal #kalyaninagar #accidentcase #accused #news #theupdatejuntionhttps://t.co/jGhBOiql24 pic.twitter.com/ep6fpeE5I2— The Update Junction (@TUJunction) May 23, 2024 ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మైనర్ బాలుడి స్నేహితులు ఇద్దరు కూడా కారును డ్రైవరే నడిపాడని తెలిపారు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్ను తప్పించేందుకే డ్రైవర్ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. నిందితుడు వేదాంత్ అగర్వాల్ కన్నీరు పెడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నిందితుడి తల్లి శివానీ అగర్వాల్ స్పందించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని రక్షించాలని కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఫేక్ వీడియో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. PUNE PORSCHE CAR ACCIDENT A FAKE RAP VIDEO has been circulating online, claiming to be accused minor Vedant AggarwalNow, his mother, Shivani Aggarwal, has put out a clarification video seeking protection for her son(Use headphones - very strong language) pic.twitter.com/8iLh2Cq0Ku— Arnaz Hathiram (@ArnazHathiram) May 24, 2024 ఇక, ఈ ఘటనపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. మైనర్కు మద్యం సరఫరా చేయడంతో పుణేలో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. డ్రగ్స్ స్వాధీనం, మైనర్లకు మద్యం సరఫరాలు, డ్రంకెన్ డ్రైవ్ జరుగుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నది ఎవరు?. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చడంలో నిమగ్నమైందని విమర్శించారు. పుణే ఘటనకు బాధ్యులు ఎవరని ఏక్నాథ్ షిండే సర్కార్ను ఆమె ప్రశ్నించారు. దీంతో, ఆ ఘటన రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. -
కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరిలోని బాయిలర్లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 దీంతో సమాచారం అదుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 -
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
పోర్షే కారు ప్రమాదం: ‘పబ్లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
ముంబై: పుణె రోడ్డు ప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలను అమితేష్ కుమార్ తెలిపారు.‘‘శనివారం 10.40కి మైనర్ నిందితుడు తన స్నేహితులతో కలిసి కోసీ రెస్టారెంట్(పబ్)కు వెళ్లారు. అక్కడ వారు భారీ బిల్లును చెల్లించారు. స్నేహితులతకు మైనర్ బాలుడు రూ. 48 వేలతో మద్యం తాగారు. కోసీ రెస్టారెంట్ మూసిన తర్వాత.. అక్కడి నుంచి వారు రెండో పబ్ బాలక్ మారియట్కు అర్థరాత్రి 12.10 గంటలకు వెళ్లారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆదివారం మెడికల్ టెస్ట్ పంపి.. అతని రక్త నమూనాలను ఫొరెన్సిక్ విభాగానికి పంపించాము. మద్యం తాగి మూలమలుపు రోడ్డుపై పోర్షే కారుకు నంబర్ ప్లేట్ లేకుండా నడిపాడు. రోడ్డు ప్రమాదానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది’అని అమితేష్ కుమార్ తెలిపారు.‘‘మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదానికి ముందు పబ్లో మద్యం సేవించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్థారణకు వచ్చాం. ఫొరెన్సిక్ విభాగానికి పంపిన రక్త నమూనాల రిపోర్టు కోసం వేచి చేస్తున్నాం’’ అని అసిస్టెంట్ పోలీసుల కమిషనర్ మనోజ్ పాలిట్ తెలిపారు.ఈ కేసులలో మైనర్ బాలుడి తండ్రిని పుణె పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మైనర్ బాలుడికి మద్యం సర్వ్ చేసిన రెండు హోటళ్లకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చాలా సీరియస్ అయ్యారు. దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ అమితేష్ కుమార్ తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి ఖరీదైన పోర్షే కారుతో ఓ బైక్ను దారుణంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు ఐటీ ఫ్రొపెషనల్స్ మరణించారు. ఈ ఘటన కల్యాణి నగన్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో నిందిత బాలుడుని జువైనల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టగా కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజురూకు విధించి షరతులు కూడా చర్చనీయాంశం అయ్యాయి. -
Pune Porsche Crash: మైనర్ తప్పిదం.. తండ్రి అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సదరు మైనర్ బాలుడు ఆదివారం మద్యం మైకంతో పోర్షే కారుతో ఓ బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మైనర్ బాలుడి తండ్రి పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు పలు బృందాలకు ఏర్పాడి మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.ప్రమాద సమయంలో 17 మైనర్ బాలుడు 200 కిలోమిట్లర్లు వేగంతో కారు నడిపి బైక్ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక.. పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు స్థానిక పబ్లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగే చట్టపరమైన అనుమతి ఉంది. చట్టవ్యతిరేకంగా మైనరకు మద్యం ఇచ్చిన బార్ ఓనర్లుపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన 15 గంటల లోపే మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇక.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు షరతులు విధించింది. వాటన్నింటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తీవ్రమైన నిర్లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్పై కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రముఖ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ పరారీలో వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు సెర్చ్ చేసిన మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
Pune: బెయిల్ ఇస్తున్నాం.. ఈ షరతులు పాటించాల్సిందే
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడు పోర్షే కారుతో బైక్ను ఢికొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎరవాడ పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్పై కేసు నమోదు చేసి జువెనైల్లో కోర్టులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల ఆ బాలుడి తరఫు న్యాయవాది బెయిల్ కోరగా.. పలు షురతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము విధించే షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు విధించిన షరతులు.. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. బైక్ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పుట్టుకలోనే ఆ విధి చిన్న చూపు చూసింది పుట్టాక తల్లిదండ్రులు మరింత అన్యాయం చేశారు. మా కొద్దీ పాప అంటూ చెత్త కుప్పలో పడేశారు. కానీ ఇక్కడే ఆమెకు మరో దారి దొరికింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుని తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. మహారాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్త కుప్పలో చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. శంకర్బాబా బాలిక సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకునే అవకాశం కలిగింది. తోటివారు గర్వపడేలా సత్తా చాటుకుంది.పద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టడం మరో విశేషం. అంతే మాలా పట్టుదలగా ఎదిగింది. తాజాగా (మే 16న ) విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. ‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు దేవదూతలను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యం’ అని మాలా చెప్తుతోంది. తన విజయానికి శంకర్ బాబా పాపల్కర్, యూనిక్ అకాడమీ అమరావతి ప్రొఫెసర్ అమోల్ పాటిల్, ప్రకాష్ టోప్లే కారణమంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ , ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్కు సంబంధించి దర్యాపూర్కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారని శంకర్బాబా వెల్లడించారు. -
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో ఇటీవల కుప్పకూలిన హోర్డింగ్ ప్రమాదం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఘాట్కోపర్ వద్ద కూలిన బిల్ బోర్డ్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా శిథిలాలను తొలగిస్తుండగా మరో రెండు మృతుదేహాలు లభ్యమయ్యాయి. రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య అనిత(59)గా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.కాగా ముంబైలోని ఘాట్కోపవర్ వద్ద ఈదురుగాలులతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 100 మంది హోర్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఈ వృద్ధ దంపతులు కూడా ఉన్నారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా.. రెండు నెలల క్రితమే మార్చిలో పదవీ విరమణ పొందారు. తర్వాత వారు ముంబైని వీడి, జబల్పుర్కు మారారు. వీసా పనుల నిమిత్తం వారు ముంబై వచ్చారు. పని పూర్తవడంతో జబల్పుర్కు తిరిగి ప్రయాణం చేస్తుండగా కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్ వద్ద ఆగారు. ఆ సమయంలో హోర్డింగ్ రూపంలో మృత్యువు వారిని కబళించింది.అమెరికాలో నివసిస్తున్న వారి కుమారుడు తల్లిదండ్రులకు కాల్ చేయగా.. సమాధానం రాకపోవడంతో సాయం కోసం బంధువులను సంప్రదించాడు. వారు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయగా చివరి లోకేషన్ ఘాట్కోపర్ పెట్రోల్ పంప్ వద్ద చూపించింది.బందువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగించగా.. దంపతుల మృతదేహాలు వెలుగుచూశాయి. శిథిలాల నుండి అన్ని మృతదేహాలను బయటకు తీయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ 40x40 అడుగుల కంటే పెద్ద హోర్డింగ్లను అనుమతించనప్పటికీ, ఈ హోర్డింగ్ మూడు రెట్లు పెద్దది. 120x120 అడుగుల విస్తీర్ణం, 250 టన్నుల బరువు కలిగి ఉంది. బిల్బోర్డ్ను ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై నేరపూరిత నరహత్య కేసు నమోదైంది. భిండేపై గతంలో అత్యాచారం సహా 20కి పైగా పోలీసు కేసులు ఉన్నట్లు తేలింది.కాగా పెట్రోల్ పంప్ మీద కూలిన హోర్డింగ్కు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈదురుగాలులతో పెట్రోల్ పంప్ ముందు నెమ్మదిగా వెళ్తున్న ఓ కారులోనుంచి ఈ వీడియో రికార్డ్ చేశారు. రోడ్డుపై భారీ వర్షం, గాలులు వీస్తుండగా కారులోని విండో నుంచి వీడియో తీశారు. ఇంధనం కోసం, వర్షం నుంచి తప్పించుకోవడానికి అనేక కార్లు, ట్రక్కులు, బైక్లు పెట్రోల్ పంపు వద్ద నిలిపి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బిల్బోర్డ్ అమాంతం పెట్రోల్ బంక్పై కుప్పకూలింది. -
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులా?
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు. -
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
66 ఏళ్ల వామన్ మహదేవ్ సంగలే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అంతగా తెలియని ధర్మరాజ్య పక్ష అనే పార్టీలో కార్యకర్తగా మారాడు. రోజువారీ ప్రయాణికుల కోసం ముంబై-నాసిక్, ముంబై-పూణే లోకల్ రైళ్లను ప్రారంభించాలనే ఏకైక కల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వాటి సాధన కోసమే నాసిక్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు.రైల్వేలో చీఫ్ లోకో ఇన్స్పెస్టర్గా పనిచేసిన సంగలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా రైలు ప్రయాణికులకు సేవలను మెరుగుపరచడం కోసం పరితపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు హేమంత్ గాడ్సే ద్వారా లోకల్ ట్రైన్ తెప్పించి ట్రయల్స్ నిర్వహించాలని రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కొంత సఫలమయ్యారు.అయితే సొరంగాల పరిమితులు, నిటారు ఎత్తుపల్లాల కారణంగా ట్రయల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కానీ పట్టువదలని సంగలే ఈసారి లోక్సభ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగారు. "అవును. ధర్మరాజ్య పక్ష తరఫున 'టేబుల్'ను నా గుర్తుగా చేసుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా వద్ద మేనిఫెస్టో కూడా ఉంది. ప్రజల కోసం నా ప్రాధాన్యతలను జాబితా చేశాను" అని వామన్ మహదేవ్ సంగలే చెబుతున్నారు.'కసారా నుంచి నాసిక్, కర్జాత్ నుంచి పుణె వరకు లోకల్ ట్రైన్ను ముంబైకి అనుసంధానం చేయడం నేను చేసిన సూచనల్లో ఒకటి. దీని కోసం నేను చాలా ఏళ్లుగా పోరాడుతున్నాను. రైల్వేలను మెరుగుపరచడానికి నేను సూచించిన 15 సూచనలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు ఎంఎంఆర్ పరిధిలోని నాసిక్, పుణె, ముంబై ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రైల్ శిబిరాన్ని నిర్వహించారని, అందులో తాను చేసిన 15 సూచనల్లో మూడింటిని ఎంపిక చేశారని సంగలే పేర్కొన్నారు.సంగలే మేనిఫెస్టో ఇదే..కల్యాణ్ను నాసిక్, పుణెలకు లోకల్ రైళ్ల ద్వారా అనుసంధానించడమే తన మొదటి ప్రాధాన్యత అని సంగలే పేర్కొన్నారు. భుసావల్ డివిజన్ లో మెయిన్ లైన్ ఈఎంయూ రైళ్లు నడపడం, నాసిక్కు పెద్ద ఈఎంయూ కార్ షెడ్ నిర్మాణం, నాసిక్ నుంచి గుజరాత్ రైల్వే లైన్ వంటివి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయని సంగలే వివరించారు.అలాగే నిఫాద్ నుంచి మన్మాడ్ వరకు తీవ్రమైన తాగునీటి కొరత సమస్యను పరిష్కరించడం, ప్రతిపాదిత నాసిక్ మెట్రో రైలు పురోగతి, కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, పంచవటిలోని రాంకుండ్, సీతాకుండ్ వంటి పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయడం, గోదావరి నదిని పరిశుభ్రం చేయడం వంటివి తన ప్రాధాన్యతలు అని వామన్ మహదేవ్ సంగలే నాసిక్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కాగా నాసిక్ లోక్సభ స్థానానికి ఐదవ దశలో మే 20న పోలింగ్ జరగనుంది. -
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్లు,బ్యానర్లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్కోపర్లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
ముంబై, సాక్షి: ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్కోపర్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈదుర గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్ కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వంద మంది దాకా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.Breaking : Death Toll in the Mumbai Hoarding collapse rises to 8. 30 still feared trapped. How is the crushing of 8 people , under a 100 ft hoarding , in India's financial capital NOT a news priority on Prime Time TV ? pic.twitter.com/G29jzn47IH— Shreya Dhoundial (@shreyadhoundial) May 13, 2024 #WATCH | Ghatkopar hoarding collapse incident | Latest visuals from the accident spot; rescue and search operation underway8 people have died and approximately 20-30 are trapped under the hoarding which collapsed in Maharashtra's Ghatkopar. pic.twitter.com/OFCajrg7iT— ANI (@ANI) May 13, 2024 సోమవారం సాయంత్రం 4గం.30 ప్రాంతంలో.. గాలుల ధాటికి ఘాట్కోపర్లోని సమతా నగర్లో భారీ హోర్డింగ్ కూలి రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు రంగంలోకి దిగారు. 14 మంది మృతదేహాల్ని వెలికి తీశాయి. కూలిన హోర్డింగ్ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g— ANI (@ANI) May 14, 2024 ఇక దాదర్, కుర్లా, మాహిమ్, ఘాట్కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది.#WATCH | Ghatkopar hoarding collapse incident | Maharashtra CM Eknath Shinde says, "...Rescuing the people is our priority. Government will take care of the treatment of those who are injured in the incident. Rs 5 lakh will be given to the family of those who have lost their… pic.twitter.com/uMPQjJLQ90— ANI (@ANI) May 13, 2024 వడాలాలోని బర్కత్ అలీ నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.ముంబయి విమానాశ్రయంలో దృగ్గోచరత పడిపోవడంతో గంటా ఆరు నిమిషాల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5.03 గంటలకు రన్వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
ఉరుములు, మెరుపులతో కురిసిన ముంబై నగరవాసులకు ఊరటనిచ్చింది. ఈ సీజన్లో ముంబైలో తొలి వర్షాలు వేసవి వేడి నుంచి కాస్త ఊరటనిచ్చాయి. సోమవారం మధ్యాహ్నం ముంబై, థానే , పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ దుమ్ము తుఫాను సంభవించింది. దీంతో పాలు ప్రాంతాల్లో చీకటి ఆవరించింది. వాతావరణ శాఖ ప్రకారం, ముంబైలో తేలికపాటి వర్షం , ఉరుములతో కూడిన జల్లులు కురువనున్నాయి.Mumbai currently looks like a Hollywood movie shot in Mexico pic.twitter.com/CeJRqEDEdL— Sagar (@sagarcasm) May 13, 2024ముంబైలోని ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు భారీ దుమ్ము తుఫాను కారణంగా 30 నిమిషాల పాటు నిలిపివేసినట్లు వర్గాలు తెలిపాయి.Mumbai is on Strom alert ⚠This is so beautiful 😍#mumbairainspic.twitter.com/ES7uiEqIbW— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) May 13, 2024 ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) థానే, పాల్ఘర్, రాయ్గడ్, షోలాపూర్, లాతూర్, బీడ్, నాగ్పూర్, రత్నగిరి , సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.పూణే, సతారా, సాంగ్లీ, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్నగర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భానీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. రాగల రెండు గంటల్లోల థానే ,పాల్ఘర్, కళ్యాణ్, బద్లాపూర్ , ఇంటీరియర్లలో రాబోయే 2 గంటలలో భారీ వర్షం కురుస్తుంది. నివాసితులు ఇళ్లలోనే ఉండటం మంచిది. గంటకు 40-50 కిమీ వేగంతోగాలులు వీచే అవకాశం ఉంది.📌Mod to intense thunderstorms over Red marked areas; District of Thane, Palghar, Raigad, Nagar & eastern suburbs of Mumbai during next 2 hrs. Mulund, Tiltwala, Kalyaan📌Mod to severe thunderstorms over yellow areas covering South ghat areas of Pune, Satara next 2,3 hrsWatch pl pic.twitter.com/WF7qd7LWsE— K S Hosalikar (@Hosalikar_KS) May 13, 2024 -
ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
పుణె: ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతయింది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్లోని పోలింగ్ బూత్ నంబరు26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని ఏసీఎం నాయక్ పీటీఐకి చెప్పారు.“మేము పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన ఓటరు స్లిప్పులు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు జాబితాలో లేదు”అని ఎయిర్స్ ఫోర్స్ మాజీ చీఫ్ వాపోయారు. పుణె సిట్టింగ్ ఎంపీ గిరీష్ బాపట్ మరణం తర్వాత బీజేపీ మాజీ మేయర్ మురళీధర్ మోహోల్ను పుణె లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. గత ఏడాది జరిగిన కస్బా అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించిన రవీంద్ర ధంగేకర్ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. -
Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ లోక్సభ స్థానం 2009 నుంచీ బీజేపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, రాధాకృష్ణ విఖే–పాటిల్ కుటుంబాల మధ్య ఇక్కడ చిరకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది. ఈసారి విఖే పాటిల్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ సుజయ్ మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే నీలేశ్ లంకేను ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పవార్ తొలిసారి లోక్సభ బరిలో నిలిపారు. కుమారున్ని ఎలాగైనా గెలిపించుకోవాలని రాధాకృష్ణ, అగాడీ మద్దతుతో లంకేను గట్టెక్కించి పైచేయి సాధించాలని పవార్ పట్టుదలతో ఉన్నారు. అహ్మద్నగర్లో నేడు పోలింగ్ జరుగుతోంది. సుజయ్కి ఈజీ కాదుసుజయ్ ముత్తాత విఠల్రావు విఖే పాటిల్ దేశంలో తొలి చక్కెర సహకార కర్మాగారం స్థాపించారు. తండ్రి రాధాకృష్ణ ప్రస్తుత ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రి. 2019లో రాధాకృష్ణ బీజేపీలో చేరారు. అంతకు ముందు రెండు దశాబ్దాలు కాంగ్రెస్తో, అంతకుముందు శివసేనలో ఉన్నారు. 1995 నుంచి అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాధాకృష్ణ తండ్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ 8 సార్లు ఎంపీగా చేశారు. వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సుజయ్ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత సంగ్రామ్ జగ్తాప్పై భారీ మెజారిటీతో నెగ్గారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గంతో కొనసాగుతున్న సంగ్రామ్ జగ్తాప్ ఈసారి సుజయ్ కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. అజిత్ నుంచి ప్రధాని మోదీ దాకా అగ్ర నేతలు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. అయినా ఈసారి సుజయ్ విజయం అంత తేలిక కాదంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నపవార్.. నీలేశ్ లంకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్నర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ టికెట్పై గెలిచారు. 2023లో పార్టీ చీలిక తర్వాత అజిత్ వర్గంలోకి వెళ్లి తర్వాత శరద్ వర్గంలోకొచ్చారు. జిల్లా రాజకీయాలపై పట్టున్న ఆయన సుజయ్కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను ధనబలం, ప్రజాబలం మధ్య పోరుగా అభివరి్ణస్తున్నారు. కరోనా వేళ ఉచిత చికిత్స ప్రజల మనసు గెలుచుకుంది. సహకార నాయకుడు, కాంగ్రెస్∙మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ తదితరుల మద్దతు నీలేశ్కు కలిసి రానుంది. శరద్ పవార్ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మక తీసుకుని సుడిగాలి ప్రచారం చేశారు. నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ వంటి స్థానిక సమస్యలపైనే నీలేశ్ తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.‘కేజ్రీవాల్, సోరెన్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు -
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
మహారాష్ట్రలో ‘మహా’ కూటముల కొట్లాట కాక రేపుతోంది. యూపీ తర్వాత అత్యధికంగా ఇక్కడ 48 లోక్సభ స్థానాలుండగా తొలి మూడు దశల్లో 24 సీట్లలో పారీ్టల భవితవ్యం ఈవీఎంలలోకి చేరిపోయింది. నాలుగో అంకంలో 13న రాష్ట్రంలో మరో 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ (మహాయుతి), ఇండియా (మహా వికాస్ అగాడీ) కూటములు హోరాహోరీగా తలపడుతున్న కీలక నియోజకవర్గాలపై ఫోకస్... ఔరంగాబాద్... మజ్లిస్ మేజిక్! కాంగ్రెస్, శివసేనలకు కంచుకోటగా నిలిచిన ఈ స్థానంలో గత లోక్సభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. శివసేన నుంచి వరుసగా నాలుగుసార్లు విక్టరీ కొట్టిన చంద్రకాంత్ ఖైరే మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ ఇంతియాజ్ జలీల్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. 97 ఏళ్ల మజ్లిస్ చరిత్రలో తెలంగాణ వెలుపల ఇదే తొలి ఎంపీ స్థానం! 1980 తర్వాత ఔరంగాబాద్లో మైనారిటీ గెలుపొందడం అదే ప్రథమం. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాధవ్కు ఏకంగా 2.8 లక్షల ఓట్లు పోలవడం ఖైరే ఓటమికి ప్రధాన కారణం. మజ్లిస్ మళ్లీ జలీల్నే బరిలోకి దించింది. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున శివసేన (ఉద్దవ్) అభ్యరి్థగా ఖైరే కూడా పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఇక అధికార మహాయుతి కూటమి తరఫున శివసేన (షిండే) అభ్యర్థి సందీపన్రావ్ భూమ్రే బరిలో ఉన్నారు. ఆయన బలమైన మరాఠ్వాడా నేత. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ చేశారు. మరాఠా రిజర్వేషన్ల పోరుతో మరాఠ్వాడా ప్రాంతంలో ఎంతో పేరు సంపాదించిన హర్షవర్ధన్ ఈసారి కూడా ఇండిపెండెంట్గా ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. ప్రకాశ్ అంబేద్కర్ వంచిత బహుజన్ అగాడీ నుంచి అఫ్సర్ ఖాన్ పోటీలో ఉన్నారు. 32 శాతం ముస్లిం జనాభా ఉన్న ఔరంగాబాద్లో ఈసారి చతుర్ముఖ పోరులో ఎలాంటి సంచలనం నమోదవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.జాల్నా... రావ్సాహెబ్ డబుల్ హ్యాట్రిక్ గురి ఇది బీజేపీకి మరో కంచుకోట. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు విజయ ఢంకా మోగించిన రావ్సాహెబ్ దన్వే పాటిల్ డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా మరోసారి బరిలో నిలిచారు. మోదీ రెండు విడతల్లోనూ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న దన్వే గత ఎన్నికల్లో 3.3 లక్షల పైగా మెజారిటీతో గెలిచారు. గత రెండు పర్యాయాలూ బీజేపీని ఢీకొన్న విలాస్ ఔతాడేను కాంగ్రెస్ ఈసారి పక్కనపెట్టింది. 2009లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి కేవలం 8,482 ఓట్ల తేడాతో ఓడిన కల్యాణ్ విజినాథ్ కాలేను రంగంలోకి దించింది.పుణె.. మాజీ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఇక్కడ గత రెండుసార్లూ బీజేపీదే విజయం. అయితే సిట్టింగ్ ఎంపీ గిరీశ్ బాపట్ గతేడాది మరణించడంతో పుణె మాజీ మేయర్ మురళీధర్ కిశాన్ మాహోల్కు ఈసారి బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ను బరిలో నిలిపింది. పుణె లోక్సభ స్థానం పరిధిలోని కస్బాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గతేడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థని ధంగేకర్ మట్టికరిపించడం విశేషం. 28 ఏళ్లుగా కాషాయ జెండా ఎగురుతున్న ఈ సీటు చేజారడం కమలనాథులకు భారీ షాకే. ఇదే జోరుతో పుణె లోక్సభ స్థానాన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది.షిర్డీ... శివసేన కుస్తీ 2009లో ఉనికిలోకి వచి్చనప్పటి నుంచీ ఇది శివసేన ఖాతాలోనే పడుతోంది. గత రెండు ఎన్నికల్లో నెగ్గిన సదాశివ లోఖండే ఇప్పుడు శివసేన (షిండే) వర్గం నుంచి మహాయుతి అభ్యరి్థగా హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. షిర్డీ తొలి ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత భావుసాహెబ్ రాజారామ్ వాక్చౌరే ఎంవీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. రెండు శివసేన వర్గాలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఈ స్థానం కోసం పట్టుబట్టినా సీఎం షిండే మోకాలడ్డారు. అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వీబీఏ అభ్యర్థి ఉత్కర్‡్ష రూపవతి ఎవరి ఓట్లకు గండి పెడతారన్నది ఆసక్తికరం! బీడ్.. పంకజకు రిజర్వేషన్ సెగ ఈ స్థానం బీజేపీ దుర్గం. దివంగత గోపీనాథ్ ముండే కుటుంబానికి గట్టి పట్టున్న స్థానం. ఈసారి అదే కుటుంబం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే బదులు అక్క, మాజీ మంత్రి పంకజా ముండేను బీజేపీ బరిలోకి దించింది. అయితే మారాఠా రిజర్వేషన్లపై అట్టుడుకుతున్న ఈ నియోజకవర్గంలో మహాయుతి కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో పంకజ ఎదురీదాల్సిన పరిస్థితి! అయితే 2019లో పర్లీ అసెంబ్లీ స్థానంలో పంకజను ఓడించిన సోదరుడు ఎన్సీపీ (అజిత్) నేత ధనంజయ్ ముండే దన్నుగా నిలవడం ఆమెకు కలిసొచ్చే అంశం. 2019లో 5 లక్షల పై చిలుకు ఓట్లతో ప్రీతం మెజారిటీకి భారీగా గండికొట్టిన భజరంగ్ మనోహర్ సోన్వానే ఎంవీఏ కూటమి నుంచి ఎన్సీపీ (శరద్) టికెట్పై బీజేపీకి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న దంగర్ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఎస్టీ రిజర్వేషన్లు డిమాండ్ చేస్తోంది. మరాఠా కోటా, ఈ ఎస్టీ హోదా డిమాండ్లు ఎవరిని ముంచుతాయన్నది ఆసక్తికరం. జల్గావ్... టఫ్ ఫైట్ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ పాతుకుపోయిన కమలనాథులకు ఈసారి మహా వికాస్ అగాడీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నేత ఉన్మేశ్ పాటిల్ 4 లక్షల పైగా బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అయినా ఈసారి ఆయన్ను కాదని స్మితా వాఘ్కు బీజేపీ టికెటిచ్చింది. ఎంవీఏ నుంచి శివసేన (ఉద్దవ్) నేత కరన్ బాలాసాహెబ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచి్చన ఎన్సీపీ (శరద్) దన్నుండటం కరన్కు కలిసొచ్చే అంశం. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లూ మహాయుతి కూటమి చేతిలోనే ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్లోని బుల్లెట్తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
బీటీ–3 పత్తి విత్తనాల పట్టివేత
నకిలీ విత్తనాలు అరికట్టాలి
వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలి
డబ్బు కోసం ఏదిపడితే అది చేశా.. తర్వాతేమో దేవుడిని ప్రార్థించేదాన్ని: నటి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
ప్రశాంతంగా పాలిసెట్
బీభత్సం..
31లోపు కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు అందించాలి
తప్పక చదవండి
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
- ఈవీఎంలకు ట్యాగ్లు?.. బీజేపీపై ట్యాంపరింగ్ ఆరోపణలు
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
Advertisement