-
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్కు షాకిస్తూ మెరుగైన రన్రేట్తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా అభిమానులు ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్ట్నర్ బౌలింగ్లో సిక్స్లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) పటిదార్తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
నిఖత్ జరీన్కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్కు చెందిన జజీరా ఉరక్బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. -
అంచనాలను అందుకోలేకపోయాను: రోహిత్ శర్మ
ఐపీఎల్ తాజా సీజన్లో తాను అనుకున్న విధంగా రాణించలేకపోయానని, అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యానని ముంబై ఇండియన్స్ బ్యాటర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే దాని గురించి ఇప్పుడు అతిగా ఆలోచించడం అనవసరమని అతను అభిప్రాయపడ్డాడు.‘ఒక బ్యాటర్గా నేను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనేది వాస్తవం. ఇప్పుడు దానిని విశ్లేíÙంచి లాభం లేదని ఇన్నేళ్ల అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉండటం అవసరం. ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఆటను మెరుగుపర్చుకోవడమే నేను చేయగలిగింది’ అని రోహిత్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ తమ జట్టు ప్రణాళికల ప్రకారం సాగలేదని, ఎన్నో తప్పులు చేశామన్న రోహిత్ శర్మ...తాము గెలవాల్సిన మ్యాచ్లను స్వల్ప తేడాతో చేజార్చుకున్నామని అన్నాడు. మరో వైపు భారత జట్టు విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని కెప్టెన్ అన్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టులోని ప్రతీ ఒక్కరికీ తమ బాధ్యతలేమిటో స్పష్టంగా తెలుసని అతను పేర్కొన్నాడు. -
IPL 2024: సీఎస్కేపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీ
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సత్తాచాటింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్ను బెంగళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(61) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖరిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ రెండు వికెట్లు, మాక్స్వెల్, సిరాజ్, గ్రీన్, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోయినప్పటికి.. ఛేజింగ్లో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి ఉండేది. సీఎస్కే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి.ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చితన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. -
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి సత్తాచాటాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47 పరుగులు చేశాడు. సీఎస్కే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ అద్బుతమైన క్యాచ్తో కోహ్లిని పెవిలియన్కు పంపాడు. 10 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్లో నాలుగో బంతిని కోహ్లి లాంగాన్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ టైమింగ్లో జంప్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మిచెల్ బౌండరీ రోప్కు తాకడాని అంతా భావించారు. కానీ రీప్లేలో అతడు క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న కోహ్లి సతీమణి అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Anushka Sharma also thinks Virat Kohli was not out 😭😭😭@JayShah, please bring King Kohli back. He should be batting out there 🇮🇳💔💔💔#IPL2024 #RCBvsCSK #tapmad #HojaoADFree pic.twitter.com/5fnBv6hAJO— Farid Khan (@_FaridKhan) May 18, 2024 -
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.ఏమి జరిగిందంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సీఎస్కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్స్ట్రైక్ ఎండ్లో స్టంప్స్ను తాకింది. వెంటనే సీఎస్కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్చేశాడు.అయితే అల్ట్రా ఎడ్జ్లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.ఓ యాంగిల్లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు.దీంతో ఫాప్ డుప్లెసిస్తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/4hijPiCz9A— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024 -
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు.సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించాలి.చదవండి: టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..! -
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
టీ20 వరల్డ్కప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం విధితమే. భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 లోపు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత హెడ్కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్గా ఉండాలని గంభీర్ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్తో బీసీసీఐ పూర్తి స్ధాయి చర్చలు జరపనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గంభీర్ గతంలో ఎప్పుడూ కోచ్గా పనిచేయనప్పటికి మెంటార్గా మాత్రం అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కేకేఆర్తో పాటు గతంలో రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా కూడా గంభీర్ పనిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్గా ఉన్న కోల్కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. కెప్టెన్గా కూడా కేకేఆర్కు రెండు సార్లు టైటిల్ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆటగాడిగా గంభీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గౌతీకి భారత హెడ్కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. -
‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్కప్ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు.‘సాక్షి’కి రానున్న వరల్డ్కప్ ట్రోఫీఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్కప్ ట్రోఫీ నేడు ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్కు రానుంది. ప్రొటెక్టెడ్ కంటైనర్లో సాక్షి ఆఫీస్కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా కూడా సాక్షి ఆఫీస్కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్కు విచ్చేయనుంది.కాగా జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా ఈ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. తొలిసారి ఉగాండ..టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్కప్కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్కప్లో పాల్గొంటుంది. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్లు జరుగనున్నాయి.ఈ ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వీటిల్లో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యాయి. -
భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి!
విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా..? చేసుకోవాల్సిందే అంటున్నాడు పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్. 'మైండ్ నా కర్నా విత్ అహ్మద్ అలీ బట్' అనే టాక్ షోకు హాజరైన అతడు విడాకుల తర్వాత జీవితం చీకటిమయం కాకూడదంటున్నాడు. జాఫర్ మాట్లాడుతూ.. ఏ మహిళ అయినా విడాకులు తీసుకోవడమనేది దురదృష్టకరం. కానీ భర్తతో విడిపోగానే ప్రపంచమే అంతమైపోయినట్లు చింతించకూడదు. జీవిత భాగస్వామిని వెతుక్కోవాలి.. మరో పెళ్లి చేసుకోవాలి. సానియా మీర్జాకు కూడా మంచి పార్ట్నర్ దొరికితే రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమించి పెళ్లి చేసుకుంటే..కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించుకున్నారు. ప్రేమకు సరిహద్దులు అడ్డు కాదంటూ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరి బంధానికి విడాకుల కార్డు పడింది. షోయబ్.. పాక్ నటి సనా జావెద్ను పెళ్లి చేసుకోవడంతో సానియాతో విడాకుల విషయం ఆలస్యంగా, అధికారికంగా తెలిసొచ్చింది. అతడికి మూడోది.. ఆమెకు రెండోదిషోయబ్కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి ఆయేషా సిద్ధిఖికి తలాక్ ఇచ్చాకే సానియాను పెళ్లి చేసుకున్నాడు. పద్నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుని పాక్ నటి సనా జావెద్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు గతంలో పాక్ గాయకుడు ఉమైర్ జైస్వాల్తో పెళ్లి జరగ్గా వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో షోయబ్ను రెండోసారి మనువాడింది.చదవండి: ఫోన్లు చేసి రావాలనేవారు.. భయంతో నేనసలు వెళ్లేదాన్నే కాదు!: హీరామండి నటి -
సీఎస్కేతో ఆర్సీబీ కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలక మ్యాచ్లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగాయి. ఆర్సీబీ జట్టులోకి విల్ జాక్స్ స్ధానంలో మ్యాక్స్వెల్ రాగా.. సీఎస్కే జట్టులోకి మిచెల్ శాంట్నర్ వచ్చాడు. కాగా ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణ -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ..
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై 21-11 21-12 తేడాతో సాత్విక్-చిరాగ్ ద్వయం విజయం సాధించింది.కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్ను ఈ జంట ఫినిష్ చేసింది. వరుస రెండు గేమ్లలోనూ వీరిద్దరూ ప్రత్యర్ధి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.ఇక ఆదివారం జరగనున్న తుది పోరులో చైనా జోడీ చెన్బో యాంగ్-లియు యితో భారత టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్ ద్వయం తలపడనుంది. -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్లోనైనా గెలిచి సీజన్ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో తన ఆఖరి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ. ఈ సీజన్లో నిలకడలేని ఫామ్తో విమర్శల పాలైన హిట్మ్యాన్ సొంతగడ్డపై శుక్రవారం ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.లక్నో సూపర్ జెయింట్స్తో వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 38 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఏకంగా 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.అయితే, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ముంబై జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్లో లక్నో 18 పరుగుల తేడాతో గెలుపొందడంతో లీగ్ దశను ఓటమితోనే ముగించింది ముంబై ఇండియన్స్.ఏకంగా పదో పరాజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. ఆఖరి మ్యాచ్లో అదరగొట్టిన రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కోచ్ సిబ్బంది ప్రత్యేక మెడల్తో సత్కరించింది.హిట్మ్యాన్ను సత్కరించిన నీతా అంబానీప్రధాన కోచ్ మార్క్ బౌచర్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడంటూ ప్రశంసించాడు. మెడల్ తీసుకోవడానికి రావాల్సిందిగా రోహిత్ శర్మను కోరాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ హిట్మ్యాన్ జెర్సీకి బ్యాడ్జిని అటాచ్ చేసి సత్కరించారు.అయితే, ఆ సమయంలో రోహిత్ శర్మ ముఖంలోగానీ.. నీతా ఫేస్లో గానీ ఏమాత్రం సంతోషం కనబడలేదు. నీతా ఏదో మొక్కుబడిగా బ్యాడ్జి పెట్టిన అనంతరం.. రోహిత్ ముభావంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు.तोडफोड from the get-go, a 𝐭𝐲𝐩𝐢𝐜𝐚𝐥 𝐑𝐨 𝐩𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 was on display in #MIvLSG 💪💙#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/sddic4we6i— Mumbai Indians (@mipaltan) May 18, 2024 తారస్థాయికి విభేదాలు!ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరు చూస్తుంటే.. ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోందని.. వచ్చే సీజన్లో రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. లక్నో చేతిలో ఓటమి తర్వాత రోహిత్- నీతా సీరియస్గా మాట్లాడుకున్న దృశ్యాలను ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు.Is Nita Ambani requesting Rohit Sharma to stay back in Mumbai Indians?#RohitSharma | #MumbaiIndians pic.twitter.com/DP59HFueWd— Indian Cricket Team (Parody) (@ictparody) May 17, 2024 కాగా ముంబై ఇండియన్స్ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. అయితే, ఐపీఎల్-2024కు ముందే అతడిపై వేటు వేసిన ముంబై మేనేజ్మెంట్.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది.అయితే, హార్దిక్ సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2024లో ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక తాజా ఎడిషన్లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ.చదవండి: T20 WC 2024: టీమిండియా ఆటగాళ్ల న్యూయార్క్ ప్రయాణం ఆరోజే! -
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. పదిహేను రోజుల్లోపే అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఈవెంట్కు తెరలేవనుంది.క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2024కు మే 26న శుభం కార్డు పడనుండగా.. జూన్ 1 నుంచి ఈ టోర్నమెంట్ రూపంలో మరోసారి పొట్టి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా దొరకనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా టీమిండియా తమ లీగ్ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది.ఇక మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్తో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనున్న రోహిత్ సేన.. జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లలో మెజారిటీ మంది మే 25న అమెరికాకు ప్రయాణం కానున్నట్లు సమాచారం.తొలి దఫా బ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తదితరులతో పాటు సహాయక సిబ్బంది కూడా న్యూయార్క్కు బయల్దేరతారని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.నిజానికి మే 21నే వీరంతా అమెరికాకు పయనం కావాల్సి ఉందని అయితే, ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఉంది కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బోర్డు అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన వాళ్లలో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి తదితరులు ఐపీఎల్-2024 ఫైనల్ పూర్తైన మరుసటి రోజు అంటే మే 27న భారత్ను వీడనున్నారు.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. -
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్తో ఎన్నో మ్యాచ్లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్ గైక్వాడ్కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన తలా.. వికెట్కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పలు మ్యాచ్లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్లో ఆటకు గుడ్బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా! -
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్పై విమర్శల వర్షం కురుస్తోంది. అతి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని.. అయినా పరిస్థితులు ఎదుర్కోకుండా పారిపోవడం ఏమిటంటూ నెటిజన్లు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండుల్కర్ 2024 సీజన్లో ఎట్టకేలకు శుక్రవారం తన తొలి మ్యాచ్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో కేవలం 2.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేస్ ఆల్రౌండర్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా.. లక్నో ఇన్నింగ్స్లో రెండో ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. 3 పరుగులు మాత్రమే ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు.అయితే, ఐదో ఓవర్లో కాస్త అతి చేశాడు. మార్కస్ స్టొయినిస్ను ట్రాప్ చేసేందుకు అర్జున్ ఇన్స్వింగర్ సంధించగా.. బ్యాటర్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అర్జున్ వికెట్లకు స్టొయినిస్ మీదకు విసిరేస్తానన్నట్లుగా దూకుడు ప్రదర్శించాడు. ఇందుకు స్టొయినిస్ చిరాగ్గా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.ఇక ఆ తర్వాత 15వ ఓవర్లో మళ్లీ బాలింగ్కు దిగిన అర్జున్ టెండుల్కర్ బౌలింగ్లో నికోలసన్ పూరన్ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత అర్జున్ తనకు ఇబ్బంది ఉందంటూ ఫిజియోను పిలిపించుకున్నాడు.ఆ తర్వాత అతడితో కలిసి మైదానం వీడగా.. నమన్ ధిర్ మిగిలిన కోటా పూర్తి చేశాడు. అయితే, ఆ ఓవర్లో టెండుల్కర్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. తర్వాత నమన్ ధిర్ బౌలింగ్లోనూ వరుసగా సిక్స్, ఫోర్, 1, సిక్స్ బాది 29 పరుగులు పిండుకున్నాడు.ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ కావాలనే గాయం పేరిట తప్పించుకున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. పూరన్ ఫామ్ చూసి భయపడిపోయిన అర్జున్ను కాపాడేందుకు మేనేజ్మెంట్ నమన్ ధిర్ను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టొయినిస్ విషయంలో అర్జున్ ప్రవర్తించిన తీరు కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.కాగా సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్లో అర్జున్ మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు.Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.🥵💥#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024Arjun Tendulkar Going Back To Dressing Room After Pooran Hit Him Two Back To Back Sixes 🤡🤡🔥🔥😂😂He didn't Even Complete His Over 🤡🤡🤡#MIvsLSG #RCBvCSK #CSKvRCB pic.twitter.com/OlyNj9k1QW— Khabri_Prasang (@Prasang_) May 17, 2024 -
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024 లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది.అయితే, చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ ఫలితంపైనే లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే, ఈ మ్యాచ్లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికైతే లక్నో దాదాపుగా నిష్క్రమించినట్లే!ఇదిలా ఉంటే.. లీగ్ దశను విజయంతో ముగించడం పట్ల లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. సీజన్ ఆసాంతం ఇలాగే ఆడి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ ఎడిషన్లో ఓవరాల్గా తమ ప్రదర్శన మాత్రం నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు.ఫ్రాంఛైజీ మయాంక్ యాదవ్, యుధ్వీర్ వంటి భారత యువ ఆటగాళ్ల మీద భారీ మొత్తం పెట్టుబడి పెట్టిందని.. అయితే, గాయాల కారణంగా వారు తమ పని పూర్తి చేయలేకపోయారని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. నేను మా మామగారి జట్టులో ఉన్నాఅదే విధంగా.. తన బ్యాటింగ్ పొజిషన్పై దృష్టి సారించానని.. మిడిలార్డర్లో ఆడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు తెలిపాడు. కాగా ఈ ఎడిషన్లో లక్నో 14 మ్యాచ్లలో ఏడు గెలిచింది. ఇక ఐపీఎల్-2024 తర్వాత తదుపరి ప్రణాళికలు ఏమిటన్న ప్రశ్నకు కేఎల్ రాహుల్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను మా మామగారి జట్టులో ఉన్నాను. ఇద్దరం కలిసి ప్రపంచకప్ టోర్నీలో ఆడే శర్మా జీ వాళ్ల అబ్బాయిని చీర్ చేస్తాం’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్-2024లో ఆడనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.తన మామగారు, బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టితో కలిసి మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. కాగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ నేపథ్యంలో కేఎల్ రాహుల్కు భారత జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో రాహుల్ను కాదని రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు చోటిచ్చింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ!చదవండి: BCCI: హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్.. ఐపీఎల్ 2025లో ఇక.. #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్గానూ హిట్మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. -
BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్రౌండర్గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్ దశలో ఆఖరిదై మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది.ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్-2024లో ఆడిన 14 మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
Paris Olympics: పర్వీన్ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం
Parveen Hooda suspended- భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కోల్పోయింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ వల్లే ఆమె పారిస్ విశ్వక్రీడలకు దూరం కానుంది.‘వాడా’ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పరీ్వన్ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వివరణ ఇచ్చింది.దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. శుక్రవారంతో మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇక పర్వీన్పై నిషేధం నేపథ్యంలో ఇప్పుడు 57 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. ఈ క్రమంలో.. పర్వీన్ స్థానంలో జాస్మిన్ లాంబోరియాను బీఎఫ్ఐ.. వరల్డ్ క్వాలిఫయర్-2 బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్లో మహిళల, పురుషుల విభాగాలలో ఏడు చొప్పున ఒలింపిక్ వెయిట్ కేటగిరీలు ఉండగా... భారత్ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్ జరీన్–50 కేజీలు; ప్రీతి–54 కేజీలు; లవ్లీనా బొర్గొహైన్–75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. పర్వీన్పై నిషేధం కారణంగా... ఈనెల 23 నుంచి జూన్ 3 వరకు బ్యాంకాక్లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ మహిళల విభాగంలో మూడు వెయిట్ కేటగిరీల్లో (57, 60, 66 కేజీలు), పురుషుల విభాగంలో ఏడు వెయిట్ కేటగిరీల్లో పోటీపడుతుంది. -
MI Vs LSG: లక్నో విజయంతో ముగింపు
ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ దశకు దూరమైంది. ఇప్పుడు ఆఖరి స్థానంతో లీగ్ దశను పేలవంగా ముగించింది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. ముందుగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (29 బంతుల్లో 75; 5 ఫోర్లు, 8 సిక్స్లు) సునామీలా చెలరేగిపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. పియూశ్ చావ్లా, తుషారా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసి ఓడింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 68; 10 ఫోర్లు, 3 సిక్స్లు), నమన్ ధీర్ (28 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించారు. పూరన్ ధనాధన్ పది ఓవర్లలో లక్నో స్కోరు 69/3. పడిక్కల్ (0), స్టొయినిస్ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు), దీపక్ హుడా (11) అవుటయ్యారు. ఇంకో 10 ఓవర్లలో వంద కొట్టినా... 170 దాటదు! కానీ పూరన్ తన 29 బంతుల్లో అంతా మార్చేశాడు. రాహుల్తో కలిసి విధ్వంసరచన చేశాడు. అన్షుల్ 13వ ఓవర్లో పూరన్ 4, 0, వైడ్, 4, 6, 6, 1లతో 22 పరుగులు రాబట్టాడు. 15వ ఓవర్ను అర్జున్ టెండూల్కర్ ప్రారంభించి 2 బంతులేస్తే పూరన్ సిక్సర్లుగా మలిచాడు. కండరాలు పట్టేయడంతో అర్జున్ వెనుదిరిగాడు. మిగతా ఓవర్ను నమన్ ధీర్ వేయగా పూరన్ 6, 4, 1 కొట్టాడు. ఆఖరి బంతిని రాహుల్ సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. పూరన్ 19 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకోగా... రాహుల్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆఖర్లో బదోని (10 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో లక్నో 200 పైచిలుకు స్కోరు చేసింది. రోహిత్, ధీర్ ఫిఫ్టీ–ఫిఫ్టీ భారీ లక్ష్యఛేదనకు అవసరమైన హిట్టింగ్తో రోహిత్ ముంబై స్కోరును పరుగుపెట్టించాడు. మరో ఓపెనర్ బ్రెవిస్ (20 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) వేగంలో వెనుకబడినా రోహిత్ బౌండరీలతో జోరు కనబరిచాడు. 28 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 88 పరుగుల వద్ద బ్రెవిస్ అవుటయ్యాక ముంబై తడబడింది. సూర్యకుమార్ (0), రోహిత్, హార్దిక్ (16), నేహల్ (1) వికెట్లను కోల్పోవడంతో ముంబై లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో నమన్ ధీర్ మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. నమన్ 25 బంతుల్లో అర్ధసెంచరీ సాధించినా ముంబైని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) తుషారా (బి) చావ్లా 55; పడిక్కల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషారా 0; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 28; హుడా (సి) నేహల్ (బి) చావ్లా 11; పూరన్ (సి) సూర్య (బి) తుషారా 75; అర్షద్ (సి) నేహల్ (బి) తుషారా 0; బదోని (నాటౌట్) 22; కృనాల్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–1, 2–49, 3–69, 4–178, 5–178, 6–178. బౌలింగ్: తుషారా 4–0–28–3, అర్జున్ 2.2–0–22–0, అన్షుల్ 3–0–48–0, పియూశ్ చావ్లా 4–0–29–3, నేహల్ 2–0– 13–0, హార్దిక్ 2–0–27–0, నమన్ 0.4–0–17–0, షెఫర్డ్ 2–0–30–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోసిన్ (బి) బిష్ణోయ్ 68; బ్రెవిస్ (సి) కృనాల్ (బి) నవీనుల్ 23; సూర్య (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 0; ఇషాన్ (బి) నవీనుల్ 14; హార్దిక్ (సి) నవీనుల్ (బి) మోసిన్ 16; నేహల్ (సి) కృనాల్ (బి) బిష్ణోయ్ 1; నమన్ (నాటౌట్) 62; షెఫర్డ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–88, 2–89, 3–97, 4–116, 5–120, 6–188. బౌలింగ్: అర్షద్ 2–0–11–0, హెన్రీ 2–0–24–0, కృనాల్ 4–0–29–1, మోసిన్ 4–0– 45–1, నవీనుల్ 4–0–50–2, రవి బిష్ణోయ్ 4–0–37–2. -
జూన్ 1న బంగ్లాదేశ్తో భారత్ వార్మప్ మ్యాచ్
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్లలో జరిగే ప్రపంచకప్లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్లు ఆడనుంది. -
RCB Vs CSK: చివరి బెర్త్ ఎవరిదో?
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... మూడుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్రేట్ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్రేట్ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ బెర్త్ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement