-
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో కమిషనర్గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
ఆనందమే జీవిత మకరందం!
ఉద్యోగరీత్యా హైదరాబాద్ సిటీ వదిలి నాలుగేళ్లు పనిచేసాకనే నాకు మళ్ళీ రాజధాని నగరంలో ఒక పోస్ట్ లభించింది. భాగ్యనగర నివాస భాగ్యం, సొంత ఇంట్లో ఉండే అవకాశం రెండూ ఒకేసారి కలిసి వచ్చిన ఆ రోజు మేం పొందింది మహదానందం. నేను అప్పుచేసి మరీ కొన్న మొట్టమొదటి టీవీ ( EC ) మా ఇంటికి చేరిన రోజు ( 1984 మార్చ్ 17 ) వాళ్లకు కలిగింది బ్రహ్మానందం. ఎందుకంటే ఆ రోజుల్లో దూరదర్శన్లో వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ షో ‘ఆనందో బ్రహ్మ’ మా పిల్లలను ఆనందపరవశులను చేసేది. ఆనందం ( Happiness ) ఒక భావోద్వేగం. నచ్చిన ఆహార విహారాలు, ఆటా పాటలు, ప్రేమ స్నేహాలు, సిరి సంపదలు, మంచి వాతావరణం, ప్రకృతి సౌందర్యం వంటివి మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగించడం సహజం.అయితే ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, అక్కడి మనుషుల జీవన ప్రమాణాలు, వారికున్న స్వేచ్చా స్వాతంత్య్రాలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, లంచగొండితనం ఆధారంగా 2012 నుంచి ప్రతి ఏటా ‘అంతర్జాతీయ హ్యాపీనెస్ డే ( మార్చి 20 ) ’ సందర్బంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రచురిస్తున్న ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి. వీరి 2024 సంవత్సరం రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 143 దేశాల్లో ముందున్న అత్యంత సంతోషకరమైన 10 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్ , ఐస్లాండ్ , స్వీడెన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్, నార్వే , లక్సంబెర్గ్ , స్విడ్జెర్లాండ్ , ఆస్ట్రేలియాలు కాగా చివర్లో బిక్కుబిక్కు మంటున్నవి లెబనాన్, అఫ్గనిస్థాన్ లు.ఇందులో విశేషం ఏమిటంటే సంతోషకరమైన దేశాల్లో భారత్ ర్యాంక్ 126 . ఆధ్యాత్మిక చింతనతో మనం ఎంతో ఆత్మానందాన్ని పొందుతున్నా మనుకుంటూ ఇలా కిందికి జారిపోవడమే మింగుడుపడని విషయం. మనకన్నా ఆనందడోలికల్లో తెలుతున్నవి లిబ్యా , ఇరాక్ , పాలస్తినా, నైగర్ వంటి దేశాలు ,అంతేకాదు పాకిస్థాన్ కూడా . నిరంతర యుద్ధ జ్వాలలతో రగిలిపోతున్న రష్యా , ఉక్రైన్ లు కూడా మనపైనే ఉన్నాయి. ఆసియా వరకే చూస్తే సింగపూర్, తైవాన్, జపాన్ , సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ ప్రజలు ఆనందంలో ముందున్నారట. మనదేశంలో మిజోరాం రాష్ట్రవాసులు ఎక్కువ ఆనందంగా ఉన్నారట. ఈ విషయంలో కేరళను క్యూట్ స్టేట్ అన్నారు. సిటీల్లో కాన్పూర్, జైపూర్, చెన్నై, మంగళూర్, మైసూర్ల తర్వాతనే మన హైదరాబాద్ స్థానం. భారత్లో యువతరం హ్యాపీగానే ఉన్నారట, బోలెడంత నిరుద్యోగం ఉన్నా కూడా ( బహుశా అంతర్జాలంలో తేలిపోతూ కావచ్చు ). వృద్ధతరం కూడా పర్వాలేదు అంటున్నారు, వీరిలో జీవనసాఫల్య సాధనలో మాత్రం మహిళామణులే ఓ అడుగు ముందున్నారట, సంతోషం. మధ్య వయస్కులు మాత్రం ( సంసార సాగరాన్ని ఈదలేకనేమో ) కాస్త విచారంలో ఉంటున్నారట. మరో విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాలో హ్యాపీనెస్ అంతంతే అంటున్నారు. ఆనందకరమైన మొదటి 20 దేశాల్లో వీరు లేకుండా 23 వ స్థానానికి పడిపోవడం. అందుకు ముఖ్యమైన కారణాల్లో ఆ దేశ యువతలోని అసంతృప్తి, అక్కడున్న ఒంటరితనం అంటున్నారు. ఫలితంగా వారు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారట. అందుకే యుక్తవయసు రాగానే పెళ్లిళ్లు చేసేసుకుంటే గొడవే లేదు, ఇంటిపోరుతో బోలెడంత టైమ్ పాస్ కదా అంటున్నారు పెద్దలు !వేముల ప్రభాకర్(చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా హెచ్చరిక
వెనిజులా దేశ సందర్శనకు ఎవరూ వెళ్లొద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనించడం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతన్న నేపథ్యంలో వెనిజులా సందర్శన విషయంలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను మరోసారి జారీ చేసింది.వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాము ఏమీ చేయలేమని అమెరికా పౌరులను ఆ దేశ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాన్నారు. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ తెలిపింది.విస్తారమైన కరేబియన్ సముద్రతీరానికి, సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏటా లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తరువాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది. -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక.. బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు
పార్లమెంటరీ ప్రాజాస్వామ్యానికి మాతృకగా పరిగణించే ఇంగ్లండ్లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన (జూన్ 4) నెల రోజులకు అంటే వచ్చే జులై 4న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లోని మొత్తం 650 సీట్లకు పోలింగ్ నిర్వహించడానికి ఇంగ్లండ్ రాజు నుంచి చార్లెస్ 3 నుంచి అనుమతి తీసుకున్నారు.భారత సంతతికి చెందిన యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి సునాక్.. దాదాపు రెండు పార్టీల వ్యవస్థ స్థిరపడిన ఇంగ్లండ్లో 2010 నుంచీ కన్సర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఇంగ్లండ్లో సుదీర్ఘ చరిత్ర (190 ఏళ్లు) ఉన్న పార్టీ కన్సర్వేటివ్ పార్టీ. ఈ పార్టీకి తన పూర్వ రూపమైన టోరీ పార్టీ అని కూడా పేరుంది.ప్రస్తుత బ్రిటిష్ పార్లమెంటు పదవీకాలం 2025 జనవరి వరకూ ఉన్నా దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడడానికి ప్రజల మద్దతు కోసం ముందస్తు ఎన్నికలు జరిపించడానికి ప్రధాని సునాక్ నిర్ణయించడం విశేషం. బుధవారం యూకే రాజు మూడో చార్లెస్ తో మాట్లాడి పార్లమెంటును రద్దుచేయించి, ఎన్నికలు జరిపించడానికి ప్రధాని అనుమతి తీసుకున్నారు.124 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రస్తుత ప్రతిపక్షం లేబర్ పార్టీ చివరి ప్రధాని గోర్డన్ బ్రౌన్ నుంచి కన్సర్వేటివ్ పార్టీ ఇంగ్లండ్లో అధికారం హస్తగతం చేసుకున్నపటి నుంచి ఇప్పటి వరకూ ఈ 14 సంవత్సరాల్లో సునాక్ సహా ఐదుగురు ప్రధానులు మారారు. 2010 మేలో డేవిడ్ కేమరూన్ తో మొదలైన కన్సర్వేటివ్ పార్టీ హయాంలో ఆయన తర్వాత వరుసగా థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టారు. ఈ ఐదుగురులో డేవిడ్ కేమరూన్ ఎక్కువ కాలం (2010–2016 మధ్య 6 ఏళ్ల 64 రోజులు) అధికారంలో ఉన్నారు. ఆయన తర్వాత కన్సర్వేటివ్ పార్టీకే చెందిన థెరిసా మే, బోరిస్ జాన్సన్ చెరో మూడు సంవత్సరాలు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. హౌస్ ఆఫ్ కామన్స్ పదవీకాలం గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ ఉంటుంది.వివాదాస్పద ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో టోరీ పార్టీకి భారీ మెజారిటీ!ఒక తాత వైపు నుంచి టర్కీ కుటుంబ నేపథ్యం ఉన్న బోరిస్ జాన్సన్ హయాంలో కిందటిసారి 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ (365 సీట్లు) లభించింది. అయితే, కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి విందులో పాల్గొన్నారనే కారణంగా 2022 సెప్టెంబర్ మొదటి వారం జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ప్రధాని అయిన మూడో మహిళా నేత లిజ్ ట్రస్ ఒక ప్రభుత్వ సంక్షోభం వల్ల 50 రోజులకే రాజీనామా చేశారు. ఇలా ఆమె బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు.అనుకోని పరిస్థితుల్లో 2022 అక్టోబర్ 25న ఇంగ్లండ్ ప్రధాని పదవి చేపట్టిన తొలి హిందువుగా చరిత్ర సృష్టించిన 'రిషి సునాక్'ది పంజాబీ కుటుంబ నేపథ్యం. ఆయన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి, సుధా మూర్తిల అల్లుడనే విషయం తెలిసిందే. తన సంపదకు తోడు భార్య అక్షత ఆస్తి తోడవడంతో యూకేలో రాజు మూడో చార్లెస్ కన్నా ఎక్కువ సంపద ఉన్న వ్యక్తిగా ఇటీవల సునాక్ వార్తల్లో నిలిచారు.గతంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థికవ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ గతేడాది ఆ హోదాను కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సునాక్ ప్రధాని పదవి చేపట్టిన 2022 అక్టోబర్ నెలలో దేశంలో 11 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని కన్సర్వేటివ్ సర్కారు సగానికి తగ్గించగలిగింది. అయితే, 2023 చివర్లో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ఇంగ్లండ్ ప్రవేశించడంతో కన్సర్వేటివ్ పార్టీ విధానాలపై ఇంగ్లిష్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి ఇప్పుడు మెజారిటీ ప్రజల సానుకూలత ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత కియర్ స్టార్మర్ (61) 2020 నుంచీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కుటుంబ సంబంధ ఆర్థికపరమైన వివాదాలతోపాటు, దేశంలో ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడిన 44 ఏళ్ల రిషి సునాక్ జులై 4 ఎన్నికల్లో తన పార్టీని మెజారిటీ దిశగా (650 సీట్లలో కనీసం 326) నడిపించి రెండోసారి ప్రధాని అవుతారా? అనేది మిలియన్ పౌండ్ల ప్రశ్నగా మారింది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
అమెరికాలో మరో విషాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బెలెం అచ్యుత్ (సన్నీ) బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.న్యూయార్క్లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్’లో చదువుతున్న అచ్చుత్ బైక్పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Saddened to learn about the untimely demise of Shri Belem Atchyuth, a student at SUNY who met with a bike accident and passed away yesterday evening; our deepest condolences to the family; @IndiainNewYork is in touch with the bereaved family & local agencies to extend all…— India in New York (@IndiainNewYork) May 23, 2024 అచ్యుత్ మృతి పట్ల అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. అతని మృతదేహాన్నిభారతదేశానికి తిరిగి పంపడం లాంటి ఇతర సహాయాన్ని అందించడానికి వారి కుటుంబ సభ్యులు, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. కాగా అమెరికాలో 2024లోనే పదకొండు మందికి పైగా విద్యార్థులు మరణించారు . అనేక మంది తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. ఇటీవల జార్జియాలోని అల్ఫారెట్టా నగరంలో జరిగిన ఘోరురోడ్డు కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్నగర్కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్నగర్లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
కిర్గిస్తాన్కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కిర్గిస్తాన్లో జరిగింది చిన్న గొడవేకిర్గిస్తాన్లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టల్కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. కిర్గిస్తాన్కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?కిర్గిస్తాన్.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి కిర్గిస్తాన్కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్లో యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.కిర్గిస్తాన్ కరెన్సీ విలువఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిస్తాన్ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఖర్చుల పరంగా చూస్తే మనదేశం కంటే అక్కడ కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికి.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.కిర్గిస్తాన్కు ఆదాయం ఎలా?కిర్గిస్తాన్లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్కు అత్యంత కీలకంగా మారాయి. ఇండియన్ మెడిసిన్ కేరాఫ్ కిర్గిస్తాన్కిర్గిస్తాన్లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్ డాక్టర్ల టీచింగ్ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్కు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం కిర్గిస్తాన్లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో మంచి ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్లోనే కోచింగ్ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. -
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.బ్రాడ్కామ్ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్ అరోరా వేతనం 151.43 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.అడోబ్కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ 24.40 మిలియన్ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నికేశ్ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్బ్యాంక్కు నాయకత్వం వహించారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్వర్క్స్కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది. -
అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు హఠాత్తుగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం షాక్కు గురి చేస్తోంది. ఎన్నో కలలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న యువత అకాల మరణాలు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయ అమెరికన్ విద్యార్థులు కన్నుమూశారు. వీరిని శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ అనే మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వీరు అల్ఫారెట్టాలోని నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్ విద్యార్థులనీ, యాక్సిడెంట్ సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిందని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా, అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.అన్వీశర్మ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కళాకార్ గ్రూప్ పేర్కొంది. అలాగే శ్రియ అద్భుతమైన డాన్సర్ అని షికారీ గ్రూప్ సంతాపం తెలిపింది. శ్రియ అవసరాల యూజీఏ షికారి డ్యాన్స్ టీమ్లో సభ్యురాలు, అలాగే అన్వీశర్మ యూజీఏ కళాకార్ ,కాపెల్లా బృందంలో సింగర్గా ఉన్నారు. ఇక ఆర్యన్ జోషి క్రికెటర్గా రాణిస్తున్నాడు. కీలక పోటీల్లో జట్టు విజయానికి కారణమైన అతని మరణం తీరని లోటని ఆల్ఫారెట్టా హై క్రికెట్ జట్టు ఇన్స్టా పోస్ట్లో విచారం వ్యక్తం చేసింది. తెలిపింది.కాగా గత నెల, అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. -
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటారీ్నగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ -
విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్ ఎయిర్లైన్స్
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఓ ప్రయాణికుడు (73) అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఘటనపై ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్కు పంపుతున్నట్లు తెలిపింది.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బోయింగ్ 777 రకం ఎస్క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయి ర్హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్కు ఢీకొన్నారు. Aftermath of Singapore Airlines flight 321 from London to Singapore which had to divert to Bangkok due to severe turbulence. One death passenger and several injured. Blood everywhere, destroyed cabin. #singaporeairlines #sq321 pic.twitter.com/C2FgrVt9yv— Josh Cahill (@gotravelyourway) May 21, 2024 Severe turbulence on #SingaporeAirlines flight from London to Singapore results in 1 death and several injured passengers. This is a reminder - always have your seat belts fastened when inflight. #SQ321 pic.twitter.com/NV9yoe32ZC— Bandit (@BanditOnYour6) May 21, 2024 మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు.ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్కు పంపేశారు. -
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
మా మనమడు మొదటిసారి కాలేజీలో చేరుతున్న సందర్భంగా కుటుంబంతో కలిసి నేనూ జనవరి మొదటి వారంలో లబ్బాక్ ( Lubbock )లోని టెక్సస్ టెక్ ( Texas Tech ) యూనివర్సిటీకి కారులో షికారులాగా బయలుదేరాం. లబ్బాక్ ఏమిటీ అందం చందం లేని పేరు అన్నాను మా మనవరాలితో. ఆమె వెంటనే పొంగిపోతూ చెప్పిన సమాధానం ‘ తాతా ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ అఫ్ ఫేమస్ రాక్ ఎన్ రోల్ లెజెండ్ బడ్డీ హోలీ ( Buddy Holly )’ అని. ఏమిటో ఏది అడిగినా మ్యూజిక్ భాషలోనే జవాబు చెబుతుంది అనుకున్నాను మనసులోనే. ఎటు చూసినా అంతా హిస్పానిక్భూమి కొరత లేని దేశం యూఎస్. టెక్సస్ టెక్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణమే దాదాపు రెండువేల ఎకరాల్లో ఉంది. అయినా ఓపిక చేసుకొని కొన్ని ముఖ్యమైన భవనాలు తిరిగి చూసాము. ఎటు చూసినా అంతా హిస్పానిక్ వాతావరణం, ఇందులో చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది హిస్పానిక్స్నేట. అందుకే దీన్ని హిస్పానిక్ సర్వీసింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. మా వాడు చేరింది ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేసేది మాత్రం చెస్. క్రియేటివ్ సిటీగా..మరునాడు మా కారు న్యూ మెక్సికో రాజధాని ‘సాంత ఫె ( Santa fe )’ వెళ్ళింది. అక్కడి మారియేట్ హోటల్లో మా బస. సాంత ఫె ఒకప్పటి ( 1610 ) స్పానిష్ వాళ్ళ కాలనీ , సాంగ్రెడ్ క్రిస్టో పర్వతాల దగ్గరున్న 400 సంవత్సరాల నాటి పట్టణం. అన్నీ పూబ్లో స్టైల్ నిర్మాణాలు. అవి కళాసంస్కృతులకు ప్రసిద్ధి గాంచినవి. అందుకేనేమో యునెస్కో దీన్ని ఒక ‘ ప్రపంచ స్థాయి క్రియేటివ్ సిటీ ’ గా గుర్తించింది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా మార్చ్ నెలలో వస్తారట.మేము కొంచెం ముందే వెళ్ళాం. ఎంతైనా మంచు ప్రాంతం కదా చలి ఎక్కువగానే ఉంది. నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అయినా ఆ చలిని లెక్కచేయకుండా 5 వ తేదీ నాడు అందరితోకలిసి సాంత ఫె సమీపంలో నేనూ స్కీయింగ్ చేశాను. మావాళ్లు హెచ్చరిస్తున్నా పర్వాలేదు అని ప్రత్యేక పొడుగు చెక్క పాదుకలు ( Long flat runners అవే skis ) షూతో కలిపి వేసుకొని రెండుసార్లు జారిపడ్డా ఏమీ కానట్టు నవ్వుతూ, పడిలేచిన కెరటంలా లేచి, ఆ ఐస్ మీద చిన్నప్పుడు బడిలో జారుడు బండ ఆడినట్టు సరదాగా జారుతూ పిల్లలతో ఔరా! అనిపించుకున్నా. చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్మా విహారయాత్ర చివరి రోజు మేము సాంత ఫెలో చూసింది ఓ చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్ ‘మియో వోల్ఫ్ ’ ( Meo wolf ). ఇక్కడ అడుగు పెట్టగానే మాకు స్వాగతం చెప్పింది ఓ రాక్షసాకార రోబోట్. ఈ మ్యూజియంలోకి ప్రవేశించిన వారు ఈ భూలోకాన్ని మరిచి ‘మరో ప్రపంచం’లోకి ( శ్రీ శ్రీ చెప్పింది కాదు సుమా ! ) వెళ్ళిపోతారన్నారు. దాదాపు వంద మంది కళాకారులు సృష్టించిన విద్యుత్ వెలుగుల వింత ప్రపంచం ఇది. ఆర్ట్ & టెక్నాలజీ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనశాలను చూస్తే అర్థమౌతుంది. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇలాంటిది పెడితే సంవత్సరం పొడుగునా జనం వచ్చి చూసి ఆనందిస్తారు కదా! అనిపించింది. House of Eternal Returnగా వర్ణించిన ఈ రంగుల ప్రపంచంలో ఒక పూట గడిపి ఎట్లాగయితేనేం బయటపడ్డాం. నాలుగు రోజులకే లాడ్జింగ్, హోటల్ లతో విసుగెత్తి , ఇంటిమీద బెంగ పెట్టుకొని డాలస్ బాట పట్టాం ! వేముల ప్రభాకర్(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భరతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.🚨 Indian students in Prince Edward Island, a province in Canada, are protesting as they face being deported to India after a sudden change in the provincial immigration rules. 🇮🇳🇨🇦 pic.twitter.com/sSfd2OOH5h— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితుల ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు. దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు’’ అని రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ నిరసన రెండో వారంలో అడుగుపెట్టిందని నిరసన తెలుతున్న భారతీయ విద్యార్థులు తెలిపారు. ‘‘మేము చేపట్టిన నిరసన రెండో వారంలోకి చేరింది. అంతే ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు పారదర్శకత కావాలి. నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఓ భారతీయ విద్యార్థి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధలను మార్పు చేసింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావటంతో హెల్త్కేర్, నివాస సదుపాయాలపై ప్రతికుల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో వర్క్ పర్మిట్లు రద్దై, తాము బహిష్కరణ ఎదుర్కొవల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్పై వెబినార్ నిర్వహించింది. జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలి..? మనం ఆలోచించే తీరు ఎలా ఉండాలి..? మానసిక ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి..? అనే అంశాలపై ఈ వెబినార్లో చర్చించారు. ప్రముఖ వైద్యురాలు మీనా చింతపల్లి ఈ వెబినార్లో మైండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అనేక కీలక అంశాలు వివరించారు. ముఖ్యంగా ఆటిజం బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి..? వారికి ఎలాంటి మానసిక మద్దతు అందించాలి..? చిన్నప్పటి నుంచి పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎలా వ్యవహారించాలి అనే విషయాలపై విలువైన సూచనలు చేశారు. ఈ వెబినార్కి అనుసంధానకర్తగా వెంకట్ మంత్రి వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్ పర్సన్ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. జీవితంలో ఒత్తిడులను అధిగమించడం.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం విలువైన సూచనలు చేసిన మీనా చింతపల్లికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన విషయమని దీనిపై అవగాహన కల్పించిన మీనా చింతపల్లికి నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!) -
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
మే 20: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నాట్స్ సహకారంతో అవని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని బాపు నూతి ప్రారంభించారు. విద్యార్ధులు మల్టీ స్కిల్స్ నేర్చుకుంటే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ నైపుణ్యం ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బేసిక్స్, లాంగ్వేజస్ పై పట్టు సాధించి సరికొత్త టెక్నాలజీ కోర్సులు చేస్తే యువత ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదని బాపు నూతి భరోసా ఇచ్చారు. గతంలో నాట్స్ సహకారంతో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో బాపు నూతికి అలిశెట్టి ప్రభాకర్ కవిత పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి , స్పర్శ ఫౌండేషన్ సిఇవో పంచముఖి, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, ఏఐటీయూసీ నాయకులు బాలకాశి తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపయోగపడే ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ నాయకులను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
సింగపూర్లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తన గురువు సిరివెన్నెల జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు. -
హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..
హాంగ్కాంగ్లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, శ్రీ కే. వెంకట రమణ గారుకాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా,హాంగ్ కాంగ్ మరియు మకావ్; మాస్.ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; శ్రీ. లాల్ హర్దసాని ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక మరియు శ్రీ. కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిధులుగా విచ్చేసారు. శ్రీ వెంకట రమణ గారు దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిధులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ వెంకట రమణ గారు,హాంగ్ కాంగ్ లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి గారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ‘ గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో మరియు హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. గౌరవనీయ అతిధులు కాన్సల్ శ్రీ వెంకట రమణ గారు మరియు మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్చంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో మరియు ఆక్స్ఫామ్ ట్రయిల్ వాకర్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభ గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి ఇక్కడ పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యంయ్యిందని వివరించారు .జూన్ లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా మరియు ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష – రవికాంత్ గునిశెట్టి, కల్పన – జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక – బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్టౌన్కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది. -
మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?
"శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి. కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుందరాధి పోజ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" ! ( హంపీక్షేత్రం కొడాలి & కామరాజుగడ్డ ) నేను శిక్షణలో భాగంగా బెంగుళూరు వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి పనిగట్టుకొని హంపీ, బేలూరు, హలబెలిలకు వెళ్లి అలనాటి విజయనగర సామ్రాజ్య గతవైభవ శిథిలాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన పద్యం ఇది. అమెరికా లాస్ ఏంజెల్స్ వెళ్ళినప్పుడు, హాలీవుడ్ బొలివెర్డ్ లోనున్న ‘ మేడం టుస్సాడ్ వాక్స్ మ్యూజియం ’ చూశాం. అప్పుడు పదేపదే నాకు జ్ఞాపకం వచ్చింది ఈ పద్యమే. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం 2009 లో ప్రారంభమైందట. దీని ముందున్న కింగ్ కాంగ్ పెద్ద ఆకృతి ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రదర్శించబడిన మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో , చార్లీ చాప్లిన్, బ్రూస్ లీ, బారక్ ఒబామా వంటి ఎంతోమంది ప్రముఖుల రూపాలను చూసినప్పుడు వాటిని సజీవమూర్తులా అన్నట్లుగా తయారుచేసి పెట్టిన కళాకారుల ప్రతిభాసామర్థ్యాలు మమ్మల్ని ముగ్దులను చేశాయి. అయితే అప్పట్లో అందులో నాకు ఇండియా వాళ్ళది ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. ఈ వాక్స్ కళను మ్యూజియం స్థాయికి అభివృద్ధి చేసిన మేడం, ఫ్రాన్స్కు చెందిన మేరీ టుస్సాడ్ ( 1761 - 1850 ) మూర్తికి చేతులెత్తి మొక్కాము. ఇప్పుడు మేడం టుస్సాడ్ & సన్స్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీరు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి మ్యూజియంలను స్థాపించి ,అందులో సినిమా నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల మూర్తులను పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూపోతున్నారు. నిజమే కానీ ఇవన్నీ ఉత్త మైనపు బొమ్మలు మాత్రమేనన్న విషయం మనం మరిచిపోవద్దు. వీటితో పోల్చినప్పుడు కఠిన శిలలను శిల్పాలుగా, దేవతా మూర్తులుగా, మలిచిన మన శిల్పుల గొప్పదనం అర్థమౌతుంది. ఎన్నో కాలపరీక్షలను తట్టుకొని వేలవేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిలిచివున్న మన అపురూప కళాఖండాల విలువ తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మట్టితో భిన్న భిన్న ఆకృతుల వినాయక విగ్రహాలు చేసి అమ్ముకుంటున్న మన కళాకారుల వ్యాపారమంతా ఇప్పటికీ సరియైన ఆదరణ లేక రోడ్ల మీదనే కదా జరుగుతుంది. బ్రిటిషర్స్ పరాయి పాలకులైనా, భిన్న మతస్తులైన భారతదేశ చరిత్ర, సంస్కృతికి సాక్ష్యాలైన మన శిల్ప, శాసన సంపత్తిని చాలావరకు కాపాడగలిగారు. అపాటి కృషి స్వతంత్ర భారతంలో కూడా జరుగలేదన్నది చేదునిజం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎంతో అమూల్యమైన మన ప్రాచీన శిల్పసంపద సరియైన ఆదరణకు నోచుకోకుండా శిథిలమై కాలగర్భంలో కలిసిపోతుండడం విచారకరం. వీటిని కాపాడి ఎన్ని మ్యూజియంలైనా పెట్టవచ్చు. ప్రకృతివిపత్తులు, బయటివారి దండయాత్రలు, దేశ అంతర్గత మతబేధాల వల్ల మనం ఎంతో శిల్ప సంపదను కోల్పోయింది వాస్తవం . ఇప్పుడు ఉన్నదాన్నైనా కాపాడుకోలేక పొతే, మ్యూజియంల వంటి వాటిలో పరిరక్షించుకోలేకపోలే భావితరాలు మనల్ని క్షమించవన్న భావన నాకు మేడం టుస్సాడ్ మ్యూజియం సందర్శన ప్రేరణగా కలిగింది ! వేముల ప్రభాకర్(చదవండి: US : చర్మం రంగు.. కోటి తిప్పలు!) -
కిర్గిజ్స్థాన్లో తెలుగువారు సురక్షితం
సాక్షి, అమరావతి: కిర్గిజ్స్థాన్ (బిష్కెక్)లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్ఆర్టీఎస్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కిర్గిజ్స్థాన్లో భారతీయ విద్యార్థులపై దాడుల జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కిర్గిజ్స్థాన్లోని తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి తెలిపారు. ఏపీకి చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (డబ్ల్యూ)తో పాటు కిర్గిజ్స్థాన్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్ 0555710041ను సంప్రదించాలని సూచించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఈ–మెయిల్స్: info@apnrts.com; helpline@apnrts. com ద్వారా కూడా సంప్రదించొచ్చని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మెడిసిన్ చదివేందుకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలిసిందని, వీరంతా క్షేమంగా సురక్షిత ప్రదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. -
అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు
వాషింగ్టన్: తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడో హ్యూమన్ ఫ్లైట్ ‘ఎన్–25’ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పైలట్గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు. 60 ఏళ్ల తర్వాత.. నెరవేరిన కల అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్ఫోర్స్ మాజీ కెపె్టన్ ఎడ్డ్వైట్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్ ‘ఎన్–25’మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్డ్వైట్ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు. -
అమెరికా : చర్మం రంగు.. కోటి తిప్పలు!
శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన ఈ మధ్య ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మనది చాలా వైవిద్యమున్న దేశం, ఇక్కడ దక్షిణాదివాళ్ళు ఆఫ్రికన్లలా, ఉత్తరాదివాళ్లు శ్వేతజాతీయుల్లా, తూర్పువాళ్ళు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా కనబడుతారు, అయినా మనమంతా ఒక్కటే! అన్నాడు. ఆయన మాటల్లో తప్పుందా? లేదా అన్నది పక్కనబెడితే ఆర్య, ద్రావిడ అంతరాల చర్చ మనకు కొత్తేమి కాదు. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీల మధ్య అదో వివాదాస్పద విషయం అయింది. అమెరికాలో భారత సంతతి వారిని మామూలుగానైతే బ్రౌన్స్( Wheatish ) అంటే గోధుమవర్ణం కలవారని అంటుంటారు. అంతమాత్రాన ఒక ఉప ఖండమంత ఈ దేశంలో ఉన్నవారందరూ అదే రంగు కలవారు కాదు కదా! ఈ గోధుమ వర్ణం చాలావరకు ఉత్తరాది వాళ్లకు వర్తిస్తుంది, దక్షిణాదిలో నలుపు వర్ణస్తులే ఎక్కువ. తెలుపు పాశ్చాత్యుల రంగు. అమెరికాలోని 70 శాతానికి పైగా ప్రజలు కాకేసియన్ (యూరోపియన్) జాతివారు, మిగతా 30 శాతంలో లాటినో, ఆఫ్రికా అమెరికన్స్, ఆసియన్స్ వారి రంగు, రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. అయితే చాలామంది ముఖ్యంగా స్త్రీలు ఏ దేశస్తులైనా వారికి జన్మతో సహజంగా వచ్చిన శరీర వర్ణంపై, అందంపై అంతగా తృప్తి ఉన్నట్లు కనబడదు. భారత్లో పసుపు, కుంకుమ, కాటుకలే గొప్ప సౌందర్య సాధనాలు, మధ్యకాలంలో వచ్చినవి స్నోలు, పౌడర్లు, ఇప్పుడైతే లెక్కకు మిక్కిలి. రంగు పెంచుకునే పాట్లు..అమెరికాలో నల్లవారైతే కాస్త తెల్లగా కనబడాలని, బ్రౌన్ కలర్ వున్నవారు కొంత తెల్లబడాలని, పూర్తి తెల్లవారు ఆ కలర్ కాస్త తగ్గితే బాగుండునని, ఉన్న శరీర వర్ణ సౌష్టవాన్ని మరింత పెంచుకోవాలని అందుకు శతప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల సౌందర్య తృష్ణ ఫలితంగా అక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతున్న బ్యూటీ సెలూన్లు, పార్లర్లు, క్లినిక్లు, జిమ్లు, స్పాలు, మసాజ్, ట్యానింగ్ ( చర్మశుద్ధి ), బ్లీచింగ్ ( చర్మాన్ని తెల్లబరచడం ) బాడీ టోనింగ్ ( కండరాల వృద్ధి), హెయిర్ టోనర్ వగైరా సెంటర్లు నడుస్తున్నాయి. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సముద్రతీర సందర్శన ఉండనే ఉంటుంది. అలా ఏ రాష్ట్రంలోని ఏ బీచ్ కు వెళ్లినా ‘ సన్ బాత్ ’ చేసే స్త్రీ పురుషులతో అవి కిటకిట లాడడం గమనించాను. సూర్య స్నానాలువీటివల్ల సూర్యకాంతి సోకి చర్మశుద్ధి అవుతుంది, చర్మంలో మార్పు వస్తుంది, శరీరానికి విటమిన్ డి లభిస్తుంది, ఎముకలు ధృడమౌతాయి, మనిషిలోని ఒత్తిడి తగ్గుతుంది, మంచినిద్ర కూడా వస్తుందంటారు. కానీ ఇలాంటి ‘సూర్య స్నానాలు’ సూర్యోదయం నుండి ఉదయం 10 గంటల వరకు పర్వాలేదు, ఆ తర్వాత సాయంత్రం ముందు వరకు సూర్యుని నుండి సోకే యూఏబి కిరణాలవల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం ఉందన్నది డాక్టర్ల హెచ్చరిక. ఎందుకొచ్చిన ‘అవుట్ డోర్ ట్యానింగ్’ అనుకునే వారికోసం ప్రత్యామ్నాయంగా వచ్చినవి, అమెరికన్ మహిళల ఫ్యాషన్ అయినవి ‘ఇండోర్ ఆర్టిఫిషల్ అల్ట్రా వయలెట్ సెంటర్లు . ఇందులో అతి నీలలోహిత వికిరణాలను విడుదలచేసే పరికరాలు, ట్యానింగ్ లేదా సన్ బెడ్స్ ఉంటాయి. ఇక్కడ చర్మానికి హాని చేయని విధంగా కృత్రిమ కాంతిని నియంత్రిత పద్దతిలో వాడి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ చికిత్స 16-25 సంవత్సరాల వయసులో ఉన్నవారికేనట. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వున్నవారికి కూడా ఈ చర్మశుద్ధి చికిత్సలు ఉపయోగపడుతున్నాయంటున్నారు. ఇలా ట్యానింగ్ వల్ల వచ్చిన కలర్ శాశ్వతం మాత్రం కాదు సుమా! ప్రపంచం లోనే స్వీడెన్ దేశ స్త్రీలు అందమైన వారు అంటారు, భారత్ లో హిమాచల్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్ మహిళల గురించి చెబుతారు. ఎవరి వర్ణం గొప్ప , అతిలోక సుందరులు ఎవరు? అంటే అది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యవంతులు, ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా ఉండేవారే అందమైనవారు అనడం సమంజసంగా ఉంటుంది !వేముల ప్రభాకర్(చదవండి: US : రిటైర్మెంట్ హోమ్స్.. మంచికా.? చెడుకా?) -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement