-
‘ఆదివాసీ ప్రజల మధ్య సమైక్యతా భావం’
జయపురం: వివిధ ఆదివాసీ సాంప్రదాయ ప్రజల మధ్య సమైక్యతా భావం నిలిచి ఉందని ప్రొఫెసర్ సత్యనారాయణ రథ్ అన్నారు. కొరాపుట్ కోట్స్ సభాగృహంలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్ అజిత్ కుమార్ మిశ్ర మెమోరియల్ వక్తృత్వ మాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొరాపుట్ కోట్స్, ప్రొఫెసర్ అజిత్ మిశ్ర మెమోరియల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోట్స్ డైరెక్టర్ ప్రపుల్ల చంద్ర మహాపాత్రో అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రథ్ మాట్లాడుతూ దివంగత అజిత్ మిశ్ర తన కార్యక్రమాల్లో జాతి ధర్మ భేదాలు లేకుండా అందరి ఐక్యతకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లా చాలకంబ గ్రామంలో నివాసముంటున్న సవర సాంప్రదాయ ప్రజలతో పాటు వివిధ ఆదివాసీ సాంప్రదాయ ప్రజలను ఒకే తాటిపై నిలిపి, వారి మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడంతో ఆయన కృషి చిరస్మరణీయమని ప్రశంసించారు. మిశ్ర పేరున ప్రతి ఏడాది చర్చావేదిక నిర్వహించి ఆయన సేవలు స్మరించుకునేందుకు ఆయన భార్య డాక్టర్ బిమళ మిశ్ర 2010లో మొదటి వక్తృతామాల కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఆ చర్చా కార్యక్రమాలు 2018 వరకు జరిగాయని వెల్లడించారు. అనంతరం కోవిడ్ తదితర కారణాల వలన గత 5 ఏళ్లు జరగలేదని పేర్కొన్నారు. మరలా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కోట్స్ సంస్థ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జగబందు సామల్, ఆదివాసీ జీవన పరిశోధకుడు డాక్టర్ పరేష్ రథ్, సుధాకర పట్నాయిక్, నారాయణ పండ, రాజేంద్ర పండ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్
ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024భువనేశ్వర్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం అత్యంత ముఖ్యమని, ప్రధానంగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం మూడో దశ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఏరోడ్రోమ్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు నవీన్ నివాసం నుంచి పోలింగ్ కేంద్రానికి నడిచి వెళ్లారు.అనంతరం నవీన్ సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. 2009, 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగు అంతంతమాత్రంగా జరిగిందని, ఈ పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ప్రతి ఓటరు ఓటు హక్కుని సద్వినియోగపరచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. శాసన సభ, లోక్ సభ ఎన్నికలలో బిజూ జనతా దళ్ (బీజేడీ) గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, జగన్నాథుని ఆశీస్సుల వల్ల రాష్ట్రంలో మళ్లీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యూస్రీల్ -
No Headline
రాయగడ: గుణుపూర్ ప్రజల గ్రామదేవత పాలపోలమ్మ ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఇష్టమైన వివిధ వేషాధారణలతో, ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో అమ్మవారి మందిరం సందడిగా కనిపించింది. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ కూడలిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మండపంలో అమ్మవారి ప్రతి రూపాలైన ఘటాలను నిలిపారు. ముందుగా పేరంటాలుగా పిలిచే బాలికలతో కలశాలతో వంశధార నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో నిలిపి మండపాన్ని శుద్ధిచేశారు. ఐదు రోజులు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు ఉత్సవ కమిటీ సభ్యులు కె.శ్రీరాంమూర్తి, ఎస్.బాబూరావు, హరినాథ్, డి.కామేష్ తెలిపారు. -
No Headline
పర్లాకిమిడి: పర్లాకిమిడి మహారాజా, ఒడిశా భాషాభిమాని శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ వర్ధంతిని స్థానిక రాజావారి ప్యాలస్లో ఉన్న యూటెక్ కంప్యూటర్స్ సంస్థ, ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కుమ్మరి వీధిలోని మహారాజా శ్మశాన వాటిక వద్ద లోకనాథ మిశ్రా, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి, బిచిత్రానంద బెబర్తా, హారిమోహాన్ పట్నాయిక్, శరత్ ప్రధాన్ తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూటెక్ కంప్యూటర్స్ కార్యాలయంలో ప్రాథమిక విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విశ్రాంత బ్యాంకు మేనేజర్ హారిమోహాన్ పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత మట్టిని వదులుకోలేక పర్లాకిమిడిలో స్థిరపడ్డారని, ఒడిషాను ప్రత్యేక భాషా రాష్ట్రంగా ఏర్పాటుకు కృష్ణచంద్రగజపతి బ్రిటీష్ వారితో పోరాడి సాధించగలిగారని గుర్తు చేశారు. ఒడిషా సాహిత్య అకాడమి సభ్యులు బిచిత్రా నంద బెబర్తా క్విజ్ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగవత్ పాఢి, త్రిపతి పండా, మురళీధర్ పోరిచ్చా, ప్రణబ్ పండా పాల్గొన్నారు. -
పాముకాటుతో యువతి మృతి
మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి పనాస్పూట్ పంచాయతీ డబలగూడ గ్రామంలో ఒక యువతి పాముకాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి గ్రామంలో రాందాస్ హంతాల్ కుమార్తె షకీల(20) ఇంటి బయట నిద్రపోయింది. అయితే అర్థరాత్రి 2 గంటల సమయంలో తనను ఏదో జంతువు కాటువేసినట్లు తెలియడంతో పెద్దగా కేకలు వేస్తూ లేచింది. వెంటనే చుట్టుపక్కల చూడగా ఒకపాము పక్కనే ఉన్నటువంటి గోతిలోకి వెళ్లడం గమనించారు. దీంతో హుటాహుటిన జోడాంబ్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జోడాంబ్ పోలీసులు కేసు నమోద్ చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి శనివారం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
పెద్దలు పోలింగ్కు.. పిల్లలు సంరక్షణ కేంద్రాలకు..
భువనేశ్వర్: రాష్ట్రంలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పురస్కరించుకుని అత్యధిక ఓటింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. అత్యాధునిక సౌకర్యాలు కల్పించి అన్నివర్గాలను ఆకట్టుకోగలిగింది. ప్రధానంగా పసి పిల్లలు ఉన్న ఓటర్లు పిల్లాపాపలతో సహా విచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల ప్రాంగణాల్లో పిల్లల సంరక్షణ శిబిరం (క్రెచ్) ఏర్పాటు చేశారు. ఓటు వేసి తల్లిదండ్రులు వచ్చేంత వరకు పిల్లలు మారాం చేయకుండా బుజ్జగించి ఆటపాటలతో సంరక్షించి కార్యకర్తలు ప్రత్యేక సేవలు అందించారు. -
ఈవీఎం ధ్వంసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి
భువనేశ్వర్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ని ధ్వంసం చేసి ప్రిసైడింగ్ అధికారిని కొట్టిన ఆరోపణ కింద భాతీయ జనతా పార్టీ ఖుర్దా నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత కుమార్ జగదేవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖుర్దా జిల్లా బొలొగొడొ – బెగుణియా శాసనసభ నియోజకవర్గం రాజొసున్నొఖొలా సమీపం కంవురియాపట్న 114వ నంబరు పోలింగ్ బూత్లో ఓటింగ్ జరుగుతుండగా జగదేవ్ బూత్లోనికి ప్రవేశించి ప్రిసైడింగు అధికారిని కొట్టి ఈవీఎంతో సహా ఆస్తులను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ భువనేశ్వర్ ఎంపీ అభ్యర్థి అపరాజిత షడంగి ఉన్న వాహనంలో ఆయన అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం పోలీసులు వెంబడించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్సీసీ కెడెట్స్కు శిక్షణ
జయపురం: బరంపురం ఎన్సీసీ గ్రూపు హెడ్క్వార్టర్ పరిధిలోని జయపురం విక్రదేవ్ విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఎన్సీసీ కెడెట్స్కు వేసవి వికాశ రెండో విడత శిక్షణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఓఎస్డీ డాక్టర్ ప్రొఫసర్ దేవీప్రసాద్ మిశ్ర జ్యోతిని వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. క్యాంపు కమాండెంట్ లెఫ్ట్నెంట్ కర్ణల్ ప్రీతి రంజన్ దాస్ ముఖ్యవక్తగా హాజరై శిబిరంలక్ష్యం, ప్రాధాన్యతను వివరించారు. ఎన్సీసీ కెడెట్లు సమాజానికి, దేశానికి సేవ చేసేందుకు ముందుండాలని ఉద్బోంధించారు. ఎన్సీసీతో క్రమశిక్షణ అలవడుతోందన్నారు. విక్రమదేవ్ విశ్వ విద్యాలయ అసోసియేట్ ఎన్సీసీ అధికారి కెప్టెన్ లక్ష్మణ పాత్రో పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శిబిరంలో మొదటి విడత శిక్షణలో కొరాపుట్ జిల్లా నుంచి 317 మంది, రెండో విడతలో 400 మంది కెడెట్లు పాల్గొన్నట్టు నిర్వాహక అధికారులు వెల్లడించారు. శిక్షణలో భాగంగా మ్యాప్ రీడింగ్, తుపాకులు పేల్చటం, డ్రిల్, పేరెడ్, అగ్నిప్రమాద నివారణ, డిజిటల్ బ్యాంకింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించార. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి న్యూఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవాలలో జరిగే పేరేడ్కు పంపిస్తామన్నారు. -
దుర్గా జాతర ఆరంభం
రాయగడ: స్థానిక పయికొవీధిలో కొలువైన మా సమలాయి దుర్గా జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఐదురోజులు జరిగే జాతరలో భాగంగా అమ్మవారి పాదాలను తీసుకువచ్చి మందిరంలో నిలపడంతో జాతరకు శ్రీకారం చుట్టారు. నిత్యపూజలతోపాటు రోజూ సాయంత్రం అమ్మవారి ఘటాలను పురవీధుల్లొ ఊరేగిస్తారు. కొలువైన ఘటాలలో పుర ప్రజలు అమ్మవారికి ముందుగా మొక్కుకున్న విధంగా ఈ ఏడాది పండే మామిడి పండ్లను వేసి చీర, రవికలను సమర్పిస్తారు. జాతర చివరిరోజున మల్లెలు (అగ్గిపై పూజారి నడక) వంటి కార్యక్రమాలు జరుగతాయి. ఈ ఘట్టాలను వీక్షించేందుకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. -
మూడో విడత ఎన్నికల్లో విషాదం
● వడదెబ్బతో ఇద్దరు మృతి భువనేశ్వర్: రాష్ట్రంలో శనివారం జరిగిన మూడో విడత ఎన్నికల పోలింగ్ విషాదం మిగిల్చాయి. వడదెబ్బకు గురై పోలింగ్ ప్రతినిధితో పాటు మరొకరు మరణించారు. నయాగఢ్ జిల్లా భాపూర్ మండలం పొథొరొపుంజి గ్రామానికి చెందిన కుముదిని దొలేయ్ (60) ఓటు వేయడానికి వెళ్లి కొంత సేపు క్యూలో నిల్చుంది. ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో ఖండపడా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వేరొక సంఘటనలో పోలింగ్ ఏజెంట్ సుకదేవ్ పట్నాయక్ బహలుండా గ్రామం 136వ నంబర్ బూత్ వద్ద విధుల్లో ఉండగా అసౌకర్యంగా భావించి అకస్మాతుగా ఒరిగిపోయాడు. వెంటనే హిందోల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భగ్గుమన్న భానుడుపర్లాకిమిడి: గజపతి జిల్లా జిల్లా కేంద్రం పర్లాకిమిడిలో గత నాలుగు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉండడంతో జనం ఎండ వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటలకే జనసంచారం లేక ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని గుసాని సమితి గారబంద, రాయగడ బ్లాక్లో మహేంద్రగడ, రామగిరి, ఆర్.ఉదయగిరి బ్లాక్లో పలు గ్రామాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ పర్లాకిమిడిలో చినుకు కూడా లేదు. ఎండ తీవ్రతతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. -
ఓలా పేరుతో బురిడీ..!
రాయగడ: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు కనిపించడం లేదు. ప్రతిరోజూ కొత్త తరహాలో నేరగాళ్లు జనాలను మోసగించి ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా పట్టణంలోని సాయిప్రియ నగర్లో నివాసముంటున్న ఒక పాత్రికేయుడి కుమారుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.49,599 లు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై సదరు పోలీసుస్టేషన్లో బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ● ఫోన్ పే ద్వారా... సాయిప్రియ నగర్లో నివాసముంటున్న గురుప్రసాద్ సాహు అనే వ్యక్తి కుమారుడు ఈనెల 16వ తేదీన ఓలా కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే యాప్ ద్వారా సన్నాహాలు చేశాడు. ఈక్రమంలో యాప్లో వాహనానికి సంబంధించి చాటింగ్ చేయగా, కంపెనీ నుంచి వాహనం ఎంత ఖరీదు పడుతుంది అనే వివరాలతో ఒక బిల్ను బాధితుడి వాట్సాప్కు పంపించారు. అనంతరం 81005 69937 అనే మొబైల్ నంబర్తో బాధితుడికి ఒక కాల్ వచ్చింది. మీరు ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు అంగీకరించిన బాధితుడు వారు పంపించిన యూపీఐ నంబర్కు ఫోన్ పే ద్వారా ఆ మొత్తాన్ని పంపించారు. అనంతరం మరో పది నిమిషాల తర్వాత అదే నంబర్ నుంచి మరోసారి కాల్ వచ్చి, మీ పేరుతో బండి బుకింగ్ అయ్యింది. మీరు మా సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు అని చెప్పారు. ఇక వాహనానికి సంబంధించి డౌన్ పేమెంట్గా మరో రూ.28,600 చెల్లించాలన్నారు. దీంతో వారి సూచనల మేరకు ఆ సొమ్మును కూడా జమ చేశారు. మరికొంత సమయం తర్వాత మీరు ఇప్పుడు మరో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే మరో గంట తర్వాత ఆ డబ్బులు తిరిగి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. మిగతా అమౌంట్ వాహనం డెలివరీ సమయంలో చెల్లించాలని వెల్లడించారు. అదే క్రమంలో మిగతా రూ.20 వేలు సైతం అతడు జమ చేశాడు. కానీ మరలా ఆ డబ్బులు తిరిగి అకౌంట్లో జమ కాకపోవడంతో తనకు కాల్ చేసిన నంబర్కు కాల్ చేశాడు. అందుకు బదులుగా సైబర్ నేరగాళ్లు మీ వాహనం బుకింగ్ రద్దయ్యింది. మీరు పంపించిన మొత్తం తిరిగి పంపిస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో తాము సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించి, వెంటనే 1930 నంబర్కు ఫోన్చేసి తమకు జరిగిన మోసం గురించి సైబర్ పోలీసులకు వివరించారు. అనంతరం సదరు పోలీస్స్టేషన్లో సైతం శుక్రవారం ఫిర్యాదు చేశారు. రూ.49,599 లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు -
కడుపు కోతలపై కొరడా
విజయనగరం ఫోర్ట్: కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో 80 శాతంకు పైగా సిజేరియన్లు జరగ్గా, మరి కొన్ని ఆస్పత్రుల్లో శతశాతం సిజేరియన్లు జరగడం గమనార్హం. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. అత్యధికంగా సిజేరియన్లు చేసిన ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. కారణాలు తెలియజేయాలని కోరింది. ● 9 ఆస్పత్రులకు నోటీసులు జిల్లాలో సిజేరియన్లు అధికంగా నిర్వహిస్తున్న 9 ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పటిల్, అమృత హాస్పటిల్, శ్రీ సాయి పీవీఆర్ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, పీజీ స్టార్ ఆస్పత్రి, మువ్వగోపాల ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి, అభినవ నర్సింగ్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. ● సిజేరియన్తో ఆరోగ్య సమస్యలు ఒకసారి సిజేరియన్ చేస్తే రెండో కాన్పులో కూడా సిజేరియన్ తప్పనిసరి. దీనివల్ల మహిళలకు నడుంనొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు చుట్టుముడతాయి. సాధారణ ప్రసవం అయితే రక్తస్రావం తక్కువగా జరుగుతుంది. అదే సిజేరియన్ అయితే రక్తస్రావం అధికంగా జరుతుంది. దీనివల్ల మహిళలు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంది. సాధారణ ప్రసవం అయితే కేవలం రూ.10 వేలు నుంచి రూ.15 వేలు ఖర్చు అవుతుంది. సిజేరియన్ అయితే రూ.25 వేల నుంచి రూ.40వేల వరకు కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. సిజేరియన్లు అధికంగా చేసే ఆస్పత్రులపై చర్యలు జిల్లాలో 9 ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ ప్రసవాల్లో 80 శాతం ఆపరేషన్లకే మొగ్గు ఓ ఆస్పత్రిలో శతశాతం సిజేరియన్లే సిజేరియన్కే ప్రాధాన్యం ప్రైవేటు ఆస్పత్రికి గర్భిణి రాగానే ఏదో ఒక కారణం చెప్పి సిజేరియన్ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. కడుపులో బిడ్డ ఉమ్మినీరు తాగింది, బీపీఎక్కువుగా ఉంది ఇలా ఎదో ఒక కారణం చెప్పి సిజేరియన్ చేసేస్తున్నారు. వైద్యుడు చెప్పినట్టు చేయకపోతే తల్లీబిడ్డకు ఏమవుతుందోనని భయపడి వైద్యుల చెప్పినట్టు తలాడిస్తున్నారు. జిల్లాలో ప్రసవాలు జరిగే ప్రభుత్వాస్పత్రులు 57 ఉన్నాయి. వీటిలో పీహెచ్సీలు 44, సీహెచ్సీలు 11, ఘోషాస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. ప్రసవాలు జరిగే ప్రైవేటు ఆస్పత్రులు 64 వరకు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో అధిక శాతం సాధారణ ప్రసవాలు జరిపేందుకే వైద్యులు ప్రయత్నిస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం సిజేరియన్లకే మొగ్గుచూపుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది -
No Headline
విజయనగరం అర్బన్: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2021 – 24 బ్యాచ్ డిగ్రీ తుది పరీక్షల (ఆరో సెమిస్టర్) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పలు సబ్జెక్ట్లలో మొదటి మూడు స్థానాలు సాధించారు. బీసీఏ గ్రూప్లో దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన కన్నా జోస్యుల అపూర్వ 9.25 సీజీపీఎస్ పాయింట్లు, పట్టణంలోని కామాక్షినగర్కు చెందిన కట్లమూడి భవ్యతేజ 9.24 తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బీఎస్సీ (సీబీసీఎస్)లో మెరకముడిదాం మండలం బిల్లలవలసకు చెందిన ఆరవెల్లి ఆశ్రితరాం 9.60, డెంకాడ మండలం చింతలవలస చెందిన శంకుసాయి ప్రవళ్లిక 9.56 సీజీపీఎస్ పాయింట్స్లో జిల్లా స్థాయిలో రెండు, మూడు స్థానాలు సాధించారు. బీకాం (జనరల్) విభాగంలో పట్టాణానికి చెందిన మంచుకొండ అలివేలు మంగతాయారు 9.31 సీజీపీఏ పాయింట్స్, విసినిగిరి గీతాంజలి 9.19, మోతమర్రి అనూష 8.85 పాయింట్లతో వరుసగా మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించారు. బీబీఏలో పట్టణానికి చెందిన బగ్గాం లిఖిత 8.68, కెళ్ల తరుణిసాయిశ్రీ 8.64 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్లో పట్టణానికి చెందిన నేపాడ హిమాని 8.65, సారిక నయోమి 8.62, రాజాం మండలానికి చెందిన కోడూరు వెన్నెల 8.50 పాయింట్లతో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. జిల్లా టాపర్ హారిక.. బొబ్బిలి: బీఎస్సీ మ్యాథ్స్, స్టాటస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో పొట్నూరు హారిక 9.7 పాయింట్లతో జిల్లా టాపర్గా నిలిచింది. దీంతో హారికను రాజా కాలేజ్ ప్రిన్సిపాల్ చల్లా వీరంద్రకుమార్, అభినందించారు. -
స్ట్రాంగ్ రూమ్ను సందర్శించిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ ఎం.దీపిక శనివారం సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన మూడంచెల భద్రత, గార్డ్స్ పనితీరును తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రామతీర్థానికి పోటెత్తిన భక్తులు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసం, శనివారం కలిసి రావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలు భక్తులు విచ్చేసి శ్రీరామచంద్రస్వామిని, ఆలయ క్షేత్ర పాలకుడైన ఉమా సదాశివుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్మపథం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు కళాకా రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తి భజనలు ఆకట్టుకున్నాయి. ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్టు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది (99.57 శాతం)ఉత్తీర్ణత సాధించారు. బీఏ(సీబీసీఎస్)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్)లో 98.66, బీకాం (కంప్యూటర్స్)లో 99.71, బీకాం(జనరల్)లో 99.92, బీహెచ్ఎంసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్ సైన్స్లో 100, బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీలో 100, బ్యాచలర్ ఆఫ్ ఓకేషన్లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాపలా
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లో ఉంచిన విషయం తెలిసిందే. దీంతో కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో రాత్రివేళలో కాపలా ఉంటున్నారు. మోహనా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, బీజేపీ అభ్యర్థి (మోహనా) ప్రశాంత్ మల్లిక్తో పాటు పర్లాఖెముండి నియోజికవర్గ కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్ట్రాంగ్ రూమ్ బయట కాపలా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు వచ్చే 4న జరగనున్న దృష్ట్యా అధికార పార్టీపై అనుమానంతో కాపలాగా ఉంటున్నామని అభ్యర్థులు అంటున్నారు. -
ఘనంగా ధ్యాన మందిర వార్షికోత్సవం
రాయగడ: జిల్లాలోని సదరు సమితి కొత్తపేట పంచాయతీ సింఘనాపూర్లొ గత ఏడాది నిర్మించిన సీతారామ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీచైతన్యరాంజీ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవాల్లొ కొత్తపేట, జేకేపూర్, ఇరుకుబడి, పితామహాల్ పంచాయతీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేష నామార్చన, కుంకుమ, అభిషేక తదితర పూజా కార్యక్రమాలలు జరిగాయి. సంకీర్తనలు, భజన కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. -
శరవేగంగా రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు
పర్లాకిమిడి: స్థానిక రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టేషన్ ప్లాట్ఫారం ఎత్తు, టికెట్ కౌంటర్, రెస్ట్ షెడ్, వాష్ రూమ్, ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వంటి పనుల వల్ల పర్లాకిమిడి మీదుగా పూరీ, భువనేశ్వర్, విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. దీంతో ఈనెల 28 వరకు పలు రైళ్లు పలాస నుంచి తిరిగి వెళ్లనున్నాయి. పర్లాకిమిడిలో ట్రైన్లు ఆగుతుంటే ప్రయాణికులు బయటకు వెళ్లడానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రీ షెడ్యూల్ చేశారు. -
పకోడి కోసం మారాం
● కోపంతో కుమార్తెను కొట్టి చంపిన తల్లి ● హోల్ది గ్రామంలో విషాదంకొరాపుట్: పకోడి కోసం మారాం చేసిన కుమార్తెను తల్లి బలంగా కొట్టడంతో ఆ చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి హోల్ది గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లఖిరాం మజ్జి, త్రివేణి మజ్జిల కుమార్తె లఖిధర్ మజ్జి (9) చందాహండి సమితి ధర్మల్ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చింది. తల్లి త్రివేణి తన ముగ్గురు పిల్లలకు పకోడి తెచ్చి ఇచ్చింది. అయితే లఖిధర్ తనకు ఎక్కువ పకోడి కావాలని మారాం చేసింది. దాంతో ఆగ్రహించిన తల్లి అక్కడే ఉన్న వెదురు కర్రతో లఖిధర్ తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు లఖిధర్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇంటి వెనుక నాళాలో లఖిధర్ మృతదేహం పడేసి డీజిల్ వేసి దగ్ధం చేసింది. అనంతరం తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులను నమ్మించింది. విషయం తెలుసుకున్న రాయిఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. చిన్నారి ఆత్మహత్యపై అనుమానంతో దర్యాప్తు చేయగా జరిగిన విషయం త్రివేణి అంగీకరించింది. అనంతరం పోలీసులుత్రివేణిని అరెస్ట్ చేశారు. -
విద్యుదాఘాతంతో యువతి మృతి
రాయగడ: విద్యుదాఘాతంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని జిల్లాలోని కొలనార సమితి సూరి పంచాయతీ పరిధి మునిసింగి గ్రామానికి చెందిన భాస్కర గౌడొ కూతురు లక్ష్మీగౌడొ (27)గా గుర్తించారు. శుక్రవారం ఉయదం చొటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంఽధించి చందిలి పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీగౌడొ తన ఇంట్లో బట్టలను ఇసీ్త్ర చేస్తుండగా ఇసీ్త్ర పెట్టెకు గల విద్యుత్ తీగ తగిలి షాక్కు గురైంది. దీంతో కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ పనులపై అసంతృప్తి జయపురం: సబ్ డివిజన్లోని కొట్పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్.ఎ.సి) పరిధిలో దమయంతి సాగర్, దేవానిముండ చెరువుల పునరుద్ధరణ పనులపై కొట్పాడ్ ఎన్.ఎ.సి.చైర్మన్ ఎం.శంకరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.20 కోట్లతో పనులు ప్రారంభమైనా సక్రమంగా జరగడం లేదని చెప్పారు. ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని, ఈ విషయమై ఇటీవల కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి రాయగడ: రక్తదానం చేసేందుకు ప్రతీఒక్కరూ ముందుకు రావాలని స్థానిక బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్ అన్నారు. రాయగడ రక్తదాతల సంఘం ఐదో వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తనిధి కేంద్రంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినవారిమి అవుతామన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను విడనాడాలన్నారు. సంఘం అధ్యక్షులు విజయ్ చొలెట్, కార్యదర్శి అజయ్ అశ్రాని, డాక్టర్ అబ్దుల్ కలామ్ బ్లడ్ డొనేషన్ వ్యవస్థాపక సంఘం రాయగడ శాఖ అధ్యక్షుడు బి.రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చైల్డ్లైన్కు చిన్నారుల అప్పగింత మల్కన్గిరి: జిల్లాలోని పోడియ సమితి నీలిగూడ పంచాయతికి చెందిన 3 ఏళ్ల సుభద్రను జిల్లా న్యాయ సలహా కార్యాలయం వారు బాలిక రక్షణార్థం జిల్లా చైల్డ్లైన్ కార్యాలయానికి శుక్రవారం అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. సుభద్ర తన తమ్ముడు బాబులితో కలిసి నీలిగూడ గ్రామంలో నివసిస్తుంది. వీరి తల్లిదండ్రులు చనిపోవడంతో సుభద్ర చదువు మానేసి తమ్ముడి కోసం ఇప్పపువ్వ ఏరడం, బీడీ ఆకులు అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో తమ పొట్ట నింపుకుంటున్నారు. ఈ విషయం జిల్లా న్యాయ సలహా కార్యాలయం నాయ్యవాది అశోక్ కుమార్ పట్నాయక్కు ఈ విషయం తెలియడంతో ఇద్దరినీ వారి కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఈ చిన్నారులను జిల్లా శిశు సంరక్షణ కార్యాలయానికి అప్పగించారు. -
అన్వేష హాస్టల్లో అక్రమాలు
● నలుగురు అసిస్టెంట్ సూపరింటెండెంట్ల సస్పెన్షన్ ● ద్వితీచంద్ర సాహుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగింత ● కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఆదేశాలురాయగడ: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని పెట్టాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారుల విచారణలో నిజమని తేలడంతో నలుగురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొట్లాగుడ వద్ద అన్వేష హాస్టల్ను నిర్వహిస్తున్నారు. ఆదివాసీ హరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నడుపుతున్న ఈ వసతి గృహంలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు ఉంటున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకుంటూనే ఇక్కడ ఉండేవారు. మొత్తం నాలుగు వార్డుల్లో నివాసం ఉండే వీరందరికీ ప్రభుత్వం అందించే ఆహారం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భరత్ భూషణ బిశ్వాల్ ఐదు నెలల క్రితం అన్వేష హాస్టల్ను సందర్శించి దర్యాప్తు చేశారు. ప్రతీ బుధవారం విద్యార్థులకు చికెన్ కూరతో కూడిన ఆహారాన్ని అందించాల్సి ఉన్నప్పటికీ దానికి బదులుగా పన్నీరు కూరతో భోజనం పెట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. అలాగే నాణ్యమైన ఆహారాన్ని అందివ్వడం లేదని సంక్షేమ శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ చర్యలకు ఉపక్రమించారు. నలుగురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇన్చార్జి బాధ్యతలను ఉపాధ్యాయుడు ద్వితీ చంద్ర సాహుకు అప్పగిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్కు గురైన వారిలో హాస్టల్ ఒకటి, రెండు, మూడు, నాలుగు వార్డులకు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రమాకాంత పట్నాయక్, గౌరీశంకర్ పిడిక, అరుంధతి పండ, ఎం.శివప్రసాదరావు ఉన్నారు. -
ఎకై ్సజ్ అధికారుల ముమ్మర దాడులు
జయపురం: నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీశాఖాధికారులు శుక్రవారం ముమ్మరంగా దాడులు చేశారు. నవరంగపూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కమళ లోచన మిశ్ర, జిల్లా అబ్కారీశాఖాధికారి అభిరాం బెహరల ఆదేశాల మేరకు.. నవరంగపూర్ అబ్కారీశాఖ విభాగ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ రథ్ పర్యవేక్షణలో నవరంగపూర్ అబ్కారీ స్టేషన్ అధికారి సుజిత్ నాగ్ తన సిబ్బందితో సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. అబ్కారీ విభాగ బృందం సభ్యులు ఖతిగుడ పోలీసు స్టేషన్ పరిధి సవురాగుడ గ్రామం సమీప కొండ వాగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నాటు సారా వంటకానికి సిద్ధం చేసిన 2,400 లీటర్ల ఇప్ప ఊట, 750 లీటర్ల నాటు సారా పట్టుకొని వాటిని ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే తెంతులికుంటి పోలీసుస్టేషన్ పరిధిలో కొహియిగుడ గ్రామానికి చెందిన మధు బిశాయి అనే వ్యక్తి వద్ద 21 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ త్రినాథ్ సౌర, మహిళ కానిస్టేబుల్ రంజీ జానీ, కానిస్టేబుల్ సుధాంశు శేఖర బాగ్, రంజిత్ సింహ, ఛతర గోండ్, అంశుమాన్ పొరిడ ఉన్నారు. 2,400 లీటర్ల ఇప్ప ఊట ధ్వంసం 750 లీటర్ల నాటుసారా ధ్వంసం -
మూడో విడత పోలింగ్ నేడే
భువనేశ్వర్: భువనేశ్వర్ అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ (యూపీడీ)లో 3వ దశ ఎన్నికల పోలింగు శనివారం జరగనుంది. యూపీడీ పరిధిలో పోలింగు కోసం 1,132 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంగణాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా యూపీడీ సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థని ప్రవేశ పెడుతున్నట్లు డీసీపీ తెలిపారు. 51 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలతో 3,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వివరించారు. భువనేశ్వర్ కమిషనరేట్ పోలీస్, ఒడిశా స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఒస్కాక్) పోలీస్ పెట్రోలింగ్, బూత్ మానిటరింగ్ సిస్టమ్ (పీపీబీఎంఎస్), వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) రెండు మొబైల్ అప్లికేషన్లను అభివృద్ధి చేశాయి. ఈ అప్లికేషన్ ద్వారా పోలింగ్ సమయంలో పెట్రోలింగ్ యూనిట్ల స్థానాన్ని పర్యవేక్షించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అవసరమైన ప్రదేశానికి పంపవచ్చు. అంతేకాకుండా, ఈ అప్లికేషన్ ద్వారా, బూత్లో మోహరించిన సిబ్బంది నేరుగా బూత్ ప్రస్తుత స్థితి, పోలింగ్ స్థితి, క్యూలో వేచి ఉన్న ఓటర్ల సంఖ్య, అంతరాయం కలిగితే, వారు వెంటనే పూర్తి సమాచారాన్ని ఫోటోలు, వీడియోలతో తక్షణమే సమాచారం అందించగలిగే సదుపాయం కలిపించారు. మొబైల్ పార్టీలు పెట్రోలింగ్ చేయడానికి రూట్లు ముందే నిర్దేశించారు. ఆ మార్గంలో ఏదైనా మార్పు ఉంటే కంట్రోల్ రూమ్లోని డ్యాష్ బోర్డ్లో ఆఫ్–రూట్ హెచ్చరికను సూచిస్తుంది. 94,48,553 మంది ఓటర్లు.. ● ఈ విడత పోలింగులో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. 42 అసెంబ్లీ స్థానాలకు 383 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో 339 మంది పురుషులు, 44 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 64 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 55 మంది పురుష అభ్యర్థులు, 9 మంది మహిళా అభ్యర్థులు ఆరు లోక్సభ నియోజకవర్గాలకు పోటీలో ఉన్నారని సీఈవో వివరించారు. ● రాష్ట్రంలో 94,48,553 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 48.30 లక్షల మంది పురుషులు, 46.18 లక్షలు మహిళలు ఉన్నారు. ● 10,551 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటిలో దాదాపు 200 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 2,000 పోలింగ్ స్టేషన్లు కీలకమైనవిగా గుర్తించారు. ● మహిళా పోలింగ్ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో 1,500 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగుల పర్యవేక్షణలో 30 పోలింగ్ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 70 వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు సీఈఓ తెలిపారు. దేవ్గడ్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగు జరుగుతుందని, మిగిలిన అన్ని స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హోమ్ ఓటింగ్.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం బాలాసోర్ పార్లమెంటరీ నియోజక వర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో 85 ఏళ్లు పైబడిప వయో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లు పోలింగు అత్యధిక సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సహించే దిశలో ఈసీఐ ఈ కార్యక్రమం చేపట్టింది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్న 94,48,553 మంది ఓటర్లు భువనేశ్వర్ యూపీడీలో ఓటింగ్కు సమర్థవంతమైన వ్యవస్థ -
సంక్షేమ పథకాలపై మహిళలకు శిక్షణ
జయపురం: జయపురం చైల్డ్ ఫండ్ విభాగం ద్వారా లీడ్ మదర్ మహిళలకు స్థానిక పంచాయతీ సమితి కార్యాలయ సభాగృహంలో శిక్షణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. తల్లీబిడ్డల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేయటంపై అవగాహన కల్పించారు. పంచాయతీల పరిధిలో పని చేస్తున్న సిబ్బంది మహిళలకు మంచిజరిగేలా పని చేయాలని అధికారులు వివరించారు. గొడొపొదర్, టంకువ, రొండాపల్లి, బరిణిపుట్ గ్రామ పంచాయతీల నుంచి 20 మంది లీడ్ మా మహిళలు శిక్షణలో పాల్గొన్నారు. శిశువులు, కిశోరీల ఆరోగ్యం, ప్రభుత్వ చేపట్టిన పథకాలపై శిక్షణ ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు. రామణగుడ కమ్యూనిటీ వైద్య కేంద్రాధికారి డాక్టర్ సుధాకర బిశాయి లీడ్ మదర్ మహిళలకు శిక్షణ ఇచ్చారు. చెల్డ్ ఫండ్ విభాగ కోఆర్డినేటర్ పూర్ణిమా దాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినాశ్ సిన్హ, ప్రమీళ నాయక్, సీతామణి హంతాల్, మధుశ్మిత నాయక్, గౌరీ చరణ్ హంతాల్ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా లీడ్ మా మహిళలకు తమ విధులపై మరింత అవగాహన ఏర్పడుతుందని కోఆర్డినేటర్ పూర్ణిమ దాస్ అన్నారు. -
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
భువనేశ్వర్: మహా వైశాఖి పురస్కరించుకుని గురువారం ఖుర్దారోడ్ ట్రాఫిక్ కాలనీ రామ మందిరంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వైశాఖ మాసం సంపూర్ణ శక్తి ఈ పూర్ణిమ తిథిలో దాగి ఉన్నందున ఈ రోజున చేసిన సత్యనారాయణ వ్రతం పూర్ణ ఫలితాలు ప్రసాదిస్తుందని ప్రధాన అర్చకుడు పంతుల రఘునాథ శాస్త్రి తెలిపారు. సామూహికంగా నిర్వహించిన ఈ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ ఏడాది తరచూ ఇటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామ మందిరం భక్త సమాజం వర్గం తెలిపింది. -
బావిలో పడిన వృద్ధుడు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలోని బహిరంగ బావిలో మంగళవారం రాత్రి పడిపోయిన వృద్ధ భక్తుడు అదృష్టవశాత్తు రక్షించబడ్డాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన 65 ఏళ్ల ధ్రువ చక్రవర్తిగా గుర్తించబడిన వృద్ధ భక్తుడు అతని భార్యతో కలిసి స్వామివారి దర్శనం కోసం విచ్చేశాడు. గురువారం ఆలయానికి వెళ్లి సాయంత్రం రత్న వేదికపై కొలువుదీరిన మూల విరాటుల్ని దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో తిరుగాడుతూ ఆనంద బజార్కు వెళ్లి మహా ప్రసాదం స్వీకరించారు. వారు నీరు కోసం ఆలయ ఉత్తర ద్వారం సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు ధృవ చక్రవర్తి జారి బావిలో పడిపోయాడు. దీంతో అతని భార్య సాయం కోసం కేకలు వేయడంతో సేవకులు సంఘటనా స్థలానికి చేరుకుని సింహద్వారం ఠాణా పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు బృందం బావి వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గంటపాటు సహాయక చర్యలు చేపట్టి 70 అడుగుల లోతున్న బావిలో నుంచి ధ్రువను ప్రాణాలతో అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. అతనికి ఎలాంటి గాయాలు కానప్పటికీ వైద్యుల సంప్రదింపుల కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆలయ నిర్వాహకులు విచారణ జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement