-
తునిలో మరోసారి సైకిల్కు పంక్చర్..!
ఒకప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా పిలిచేవారు. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక అక్కడ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. దీంతో సైకిల్ అడ్రస్ గల్లంతైంది. రెండుసార్లు గెలిచిన ఫ్యాన్ మూడోసారి కూడా ఘన విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజల స్పందన ఆధారంగా ఫ్యాన్ హ్యాట్రిక్ ఖాయం అని ప్రజలే చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ లీడర్గా చెప్పుకునే యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోవడంతో తుని టీడీపీ కంచుకోట అని చెప్పేవారు.2009 ఎన్నికల నుంచి తునిలో యనమల ప్రాభవం తగ్గిపోయింది. అప్పటినుంచి వరుసగా సైకిల్కు పంక్చర్లు పడుతూనే ఉన్నాయి. 2009లో ఓడిన వెంటనే యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసినా టీడీపీకి విజయం దక్కలేదు.గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలిచి ..తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించారు. తాజా ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన తన తమ్ముడు కృష్ణుడికి ఇప్పటి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న యనమల. ఈసారి కృష్ణుడిని కాకుండా తన కుమార్తె దివ్యను దింపారు.దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు..అతని వర్గాన్ని దూరం పెట్టి అవమానించారు యనమల కుమార్తె దివ్య. దీంతో మనస్ధాపం చెందిన కృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు. దాదాపు 40 ఏళ్ల నుంచి తునిలో అన్నకు అండగా అన్ని తానై చూసిన కృష్ణుడు ఊహించని వెన్నుపోటును సహించలేకపోయారు. తునిలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం కృష్ణుడు కసిగా పని చేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్ సిపికి పడేలా రాజకీయం నడిపారు.గత ఎన్నికల్లో తునిలో 82.28% శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ ఎన్నికల్లో ఒక శాతం అదనంగా నమోదు అయ్యింది. ఇక గడిచిన ఐదేళ్ళ కాలంలో తునిలో దాదాపు రూ.1900 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి.. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, త్రాగు నీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది.యనమల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గెస్ట్ హౌజ్లో అనే విషయం తుని ప్రజలకు తెలుసు. అంతేకాదు...యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాదులో ఉండడం వల్ల ఆమెపై తుని నియోజకవర్గ ప్రజలకు అంతగా నమ్మకం లేదు.పైగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దివ్య కూడా ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా తరపున ఆయన సతీమణీ లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ కేడర్లో ఎక్కువ భాగం యనమల కృష్ణుడివైపు రావడం, కృష్ణుడు వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడి పనిచేయడం వంటి అనేక కారణాలతో మరోసారి తునిలో సైకిల్కి పంక్చర్ కావడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడకేనని..ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారని ప్రజాభిప్రాయం చెబుతోంది. -
గడ్కరీని ఓడించేందుకే వారు పనిచేశారు : రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్పై శివసేన(ఉద్ధవ్) కీలక నేత, ఎంపీ సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్పూర్లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్లు పనిచేశారని రౌత్ ఆరోపించారు.‘మోదీ, షా, ఫడ్నవిస్లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్ ఆలస్యంగా నాగ్పూర్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్ఎస్ఎస్ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్ కథనం రాశారు. మరోపక్క అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్ తన కథనంలో పేర్కొన్నారు. కాగా, రౌత్ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఫైర్ అయ్యారు. నిజానికి రౌత్ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్సీపీ(శరద్పవార్) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌత్కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్ విసిరారు. -
ఎన్నికల్లో పోటీ వారి మధ్యే: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్నా: ముస్లింల ఓటు బ్యాంకు ముందు ఇండియా కూటమి అవసరమైతే ముజ్రా డ్యాన్స్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రధాని బిహార్ను అవమానించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున బిహార్లోని ససరంలో ఆదివారం(మే26) ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఖర్గే మాట్లాడారు.ప్రధాని తనను తాను తీస్మార్ఖాన్ అనుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలే తీస్మార్ఖాన్లని గుర్తుంచుకోవాలన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు ఏమీ మాట్లాడటానికి కూడా ఉండదన్నారు. ఈ లోక్సభ ఎన్నికలు ప్రజలు వర్సెస్ మోదీయే తప్ప రాహుల్ వర్సెస్ మోదీ కానే కాదన్నారు. -
సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం.. మంత్రి ఉత్తమ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను వెయ్యి కోట్లు తీసుకున్నానని.. నీచపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘వినతి పత్రాలు తెచ్చి.. లోపలికి వెళ్లి భూములు సెటిల్మెంట్ మాట్లాడినట్టు కాదు. మేము అధికారంలోకి వచ్చే నాటికి సివిల్ సప్లైస్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, డీఫాల్డ్ చేసే మిలర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదు. డీఫాల్ట్ మిల్లర్లతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై మాట్లాడుతున్నారు’’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు.సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం అంటూ కేటీఆర్, మహేశ్వర్రెడ్డికి మంత్రి ఉత్తమ్ సవాల్ విసిరారు. సివిల్ సప్లైస్ రూ.11 వేల కోట్ల నష్టాల్లోఉంది. మిల్లర్లపై చర్యలు తీసుకుంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను. ధాన్యం కొనుగోళ్లను గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాం. మేం రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి’’అని ఉత్తమ్ మండిపడ్డారు.కేటీఆర్, మహేశ్వర రెడ్డి తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా కనీసం వాళ్లని కలవలేదు.. నాలాంటి నిజాయితీ పరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు.. సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు.. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుంది.. టెండర్లో ఉన్న కండిషన్స్కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుంది. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం మాదే.. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతోంది.. మిల్లర్ల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న వాళ్ళే మిలర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవి మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారు. బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం మాది కాదు. మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం. మహేశ్వర రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు’’ అంటూ ఉత్తమ్ దుయ్యబట్టారు.‘‘కిషన్రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారు. పార్టీలో ఓవర్ స్పీడ్గా పోవాలని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నాడు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో 1700 వచ్చింది. ఇప్పుడు 2400 వస్తోంది. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఉత్తమ్ చెప్పారు. -
ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
ఆ నలుగురు కూటమి తరపున పోటీ చేశారు. వారిలో ముగ్గురు పచ్చ పార్టీ నాయకులే. తమకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. లాస్ట్ ఛాన్స్ ఇవ్వాంటూ ప్రజల్ని బ్రతిమాలారు. కాని ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి? వారి ఆశలు నెరవేరతాయా? ప్రజలు వారికి చివరి అవకాశం ఇచ్చారా? మరి వారందరిని ఓటమి భయం ఎందుకు వెన్నాడుతోంది? ఇంతకీ ఆ నలుగురు ఎవరు?ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణలు ఇవే తమకు చివరి ఎన్నికలని ప్రచారం చేసుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత తాము రాజకీయాల్లో ఉండేది లేదని కూడా చెప్పుకుంటూ ఊళ్ళలో ప్రచారం చేసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ప్రకటించారు. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి, బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి, కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు.ఈ నాలుగు నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడతాయని ఆయా సెగ్మెంట్లలోని ప్రజలు లెక్కలేసి చెబుతున్నారు. నలుగురు నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి బలం గత ఎన్నికల కంటే మరింతగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ మీద ప్రజల్లో ఉన్న నమ్మకంతోనే నాలుగు నియోజకవర్గాల్లోనూ మళ్ళీ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో నలుగురు నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇవే తమకు చివరి ఎన్నికలని చెప్పుకుని ప్రజల్లో ప్రచారం చేసినా వారికి లభించిన మద్దతు నామ మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో సైతం ఇదే అంశం స్పష్టం అయ్యింది.అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల్లో సీఎం జగన్ సిద్ధం బహిరంగ సభను, బస్సు యాత్ర సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ రెండు సభలు ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమయ్యాయి.అందుకే గంటా, అయ్యన్న, బండారు, కొణతాల వంటి నేతలు తమకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకు తిరిగినా ప్రజలు పట్టించుకోలేదు. వారికి ఎదురైన నిరాదరణతోనే భయం మొదలైంది. చివరగా పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.. -
టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ హింసాత్మక చర్యలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. పోలింగ్ మరుసటి రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసం సృష్టించింది. కారంపూడిలో టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోయారు. ఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనని అంటోన్న వైఎస్సార్సీపీ.. సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టింది. కారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా టీడీపీ మూకలు రెచ్చిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు పల్నాడు పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించేదుకు రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు. ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి. -
టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
కాంగ్రెస్కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ఆదివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.నాలుగు సంస్థలకే టెండర్లు..బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్ సప్లై, ఎఫ్సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. బీజేపీపై అనుమానాలు..ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. -
మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా?
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25 (శనివారం) ముగిసింది. నిన్న జరిగిన పోలింగ్లో గాంధీ కుటుంబం, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలో బలమైన ప్రతిపక్ష గొంతును వినిపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ను ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం.. అన్యాయమైన కేసుల్లో ఇరికించి నేర దర్యాప్తు పేరుతో టార్గెట్ చేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై గతేడాది బీజేపీ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూరత్ కోర్టు దోషి తేల్చి.. రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్షపై అత్యున్నత న్యాయ స్థానం స్టే విధించింది.మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. తిరిగి జూన్లో తీహర్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఇన్కం టాక్స్ విభాగం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం వల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోని ప్రధాని మోదీ, బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు, నేతలను బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలోని ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్లో అధికార బీజేపీ ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటోందని ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా ఒక దశ అంటే ఏడవ దశ ఓటింగ్ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. -
మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సమయంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్ స్పందించారు.‘‘ హార్వార్డ్ యూనివర్సిటీలో ఓ సెమినార్ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను. ఆప్ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న భారత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో టచ్ ఉన్నాను. ...ఆప్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారత్లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్ వెళ్లి ఇటీవల భారత్ తిరిగి వచ్చారు. అనంతరం లోక్సభ ఎన్నికల ర్యాలీల్లో రాఘవ్ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. -
May 26th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 26th AP Elections 2024 News Political Updates..4:00 PM, May 26th, 2024అనంతపురం:అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిధర్మవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తితాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు సంబంధం లేదునన్ను పరామర్శించేందుకు మాత్రమే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు తాడిపత్రి వచ్చారుధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఆలోచన విరమించాలిధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఫ్యాక్షన్ ప్రేరెపించినట్లు అవుతుందివైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తాం 2:00 PM, May 26th, 2024తాడేపల్లి :టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్సీపీపోలింగ్ మరుసటిరోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసంకారంపూడిలో మారణాయుధాలతో దాడులకు తెగపడిన టీడీపీ కార్యకర్తలుటీడీపీ విధ్వంసానికి ముందే వెళ్లిపోయిన పోలీసులుఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనంటున్న వైఎస్సార్సీపీసాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన వైఎస్సార్సీపీకారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా రెచ్చిపోయిన టీడీపీ మూకలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందంటున్న వైఎస్సార్సీపీఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు ఉత్సాహం చూపుతున్న పల్నాడు పోలీసులు 1:45 PM, May 26th, 2024పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలుపోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ను చెల్లని ఓటుగా పరిగణించవద్దు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయి. ఫాం 13పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం, బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో చూసుకోవాలి. ఆర్వో సంతకం, సీరియల్ నెంబర్లేని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ. నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకుంటే తిరస్కరిస్తాం. 12:50 PM, May 26th, 2024టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నానిఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు.. ఏకపక్షంగా వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెట్టడం దుర్మార్గం. -మాజీ మంత్రి పేర్ని నాని#TDPLosing#TDPGoons pic.twitter.com/AUK8As1QIX— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 12:15 PM, May 26th, 2024ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది: మంత్రి కాకాణినెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్..ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..పోలీస్ అధికారులను ఉద్దేశ్యపూరీతంగా బదిలీ చేసింది..కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు.. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న చోట కేడర్ను భయబ్రాంతులకు గురి చేశారు..మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది..ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయం..నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదు..ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైంది..ఎన్నికల నిధులు దుర్వినియోగం, వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే.. దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు..మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదం..ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తాను..జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారు..జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు..కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని కోరుతున్నాం.. 11:40 AM, May 26th, 2024దెందులూరులో సంక్షేమానికే ప్రజల మద్దతు..దౌర్జాన్యాలతో, అరాచకాలతో చెలరేగిపోయిన చింతమనేని ప్రభాకర్2019 ఎన్నికల్లోనే చింతమనేనికి బుద్ధి చెప్పిన దెందులూరు నియోజకవర్గ ప్రజలు.దళితులను, అధికారులను తిట్టడం, కొట్టడంతో పేరుపొందిన చింతమనేని. ఈసారి కూడా చింతమనేనికి తమ పవరేంట్ చూపామంటున్న ప్రజలు. ప్రజలతో మమేకమై పనులు చేయించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి 11:00 AM, May 26th, 2024విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏయూలో ఏర్పాట్లుఓట్ల లెక్కింపునకు 14 గంటలు పట్టే అవకాశం.ఉదయం 8 గంటల నుంచి లెక్కింపుతొలి రౌండ్ ఫలితాలు 9 గంటల నుంచి వెల్లడించే అవకాశంవిశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం కలిపి 98 లోక్ సభ పరిధిలోని ఏది నియోజకవర్గాలు కలిపి 98 చొప్పున టేబుల్స్ ఏర్పాటుభీమిలి అసెంబ్లీకి 26 రౌండ్లతో రాత్రి 7:30 కు ఫలితం వచ్చే అవకాశంవిశాఖ తూర్పు 21 రౌండ్లలో సాయంత్రం ఐదు గంటలకువిశాఖ సౌత్ లో 17 రౌండ్లకు మధ్యాహ్నం మూడున్నరకువిశాఖ నార్త్ లో 22లకు సాయంత్రం ఐదు గంటలకువిశాఖ వెస్ట్ 16 రౌండ్లకు మధ్యాహ్నం 3:15 కుగాజువాకలో 22 రౌండ్లకు సాయంత్రం 5:45 గంటలకుపెందుర్తిలో 21 రౌండ్లకు సాయంత్రం 5:30 గంటలకుఎస్ కోట లో 19 రౌండ్లకు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫలితాలు వెల్లడివిశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు 2012373ఓట్లు వినియోగించుకున్న ఓటర్లు 1409316పోస్టల్ బ్యాలెట్ 23,981విశాఖ లోక్సభ పరిధిలో 1962 పోలింగ్ కేంద్రాలు 14 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ 10:30 AM, May 26th, 2024విజయం వైఎస్సార్సీపీదే..పోలింగ్ ఫలితాలపై లెక్కలువేసుకుంటున్న ప్రధాన పార్టీలుతమ స్థానాలు ‘పది’లమంటున్న వైఎస్సార్సీపీపరువు నిలుపుకుంటామంటున్న టీడీపీజనసేన, బీజేపీ స్థానాల్లో గెలుపు అసాధ్యమేఓటు బదిలీ కాలేదంటున్న రాజకీయ పరిశీలకులువైఎస్సార్సీపీ ఖాతాలోకే కడప,రాజంపేట పార్లమెంటు స్థానాలు 9:50 AM, May 26th, 2024బరితెగించిన టీడీపీ నాయకులు..పచ్చ బ్యాచ్ను వెంటాడుతున్న ఓటమి భయం..ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలుఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 8:40 AM, May 26th, 2024పచ్చముఠా పైశాచికత్వం..కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులుతిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరికప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమైందిరాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా టీడీపీ చంద్రబాబు కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైయస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమై.. రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా…— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:50 AM, May 26th, 2024దాడుల సంస్కృతి నాది కాదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్..దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదుపులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు… pic.twitter.com/YMmEAgkK8s— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:10 AM, May 26th, 2024ఓట్ల లెక్కింపు ఇలాజూన్ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభంతొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి 7:00 AM, May 26th, 2024కౌంటింగ్ ఏజెంట్లే కీలకంఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకంఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యంనిబంధనలు తెలియకుంటే అయోమయమే 6:50 AM, May 26th, 2024పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలుఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు దుకాణాలపై రాళ్లు, బైక్ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు.. పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం చిన్న చిన్న సాకులతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలుఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం 6:40 AM, May 26th, 2024క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావాజనసేన కార్పొరేటర్ పీతల మూర్తికి సీఎస్ జవహర్రెడ్డి హెచ్చరికవిశాఖలో అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదుచట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక 6:30 AM, May 26th, 202421 లోక్సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలేఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం మహిళల ఓట్లు వైఎస్సార్సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు -
మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 26.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వేయి చొప్పున కేవలం 10 వేల పోస్టులు భర్తీ చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 19 రెట్లు ఉద్యోగాలిచి్చనా ప్రజలకు చెప్పుకోలేకపోవడం తనతో సహా తమ పార్టీ నేతల వైఫల్యం అని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా తెలంగాణ యువత మెదడు నిండా అబద్ధాలను నింపి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 వేల ఉద్యోగాలు ఇచి్చనట్లు ఊదరగొడుతూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతోంది. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా? సీఎం స్థాయిలో రేవంత్ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు చూస్తే బాధ అనిపిస్తోంది’అని కేటీఆర్ అన్నారు. 95 శాతం రిజర్వేషన్ల ఘనత కేసీఆర్దే.. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, నాన్ లోకల్ కేటగిరీ పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో అటెండర్ నుంచి గ్రూప్–1 దాకా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్దే. పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చాం. అందులో 2.02 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1.60 లక్షల పోస్టులు భర్తీ చేశాం. మరో 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి.విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ఇది అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన 32,517 ఉద్యోగాలను రేవంత్ దుర్మార్గంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గ్రూప్–1, డీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టులు పెంచకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. సీఎం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అతీగతి లేదు. నిరుద్యోగ భృతి అంటూ ప్రియాంక గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ‘బ్రూ’ట్యాక్స్ మొదలైంది ‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. భట్టి, రేవంత్, ఉత్తమ్ ఎవరి దుకాణం వాళ్లదే అన్నట్లు మొత్తంగా ‘బ్రూ (బీఆర్యూ)’ట్యాక్స్ మొదలైంది. బిల్డర్ల పైనా కూడా ట్యాక్స్ వేస్తూ దోచుకుంటున్నారు. త్వరలో జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సామంత రాజులు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి మూర్ఖుడు, జోకర్లా తయారయ్యాడు. ప్రైవేటు సెక్టార్లో కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కూడా రేవంత్ పాతర వేస్తున్నారు.5 లక్షల ఉద్యోగాలు వచ్చే ఫార్మాసిటీని రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తారట. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 15 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకు వచి్చన కేన్స్ టెక్నాలజీ వెళ్లిపోయింది. రూ.వేయి కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపిన కేన్స్ గుజరాత్కు వెళ్లింది. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా అనే సంస్థ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది’అని కేటీఆర్ అన్నారు. వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడే పార్టీ బీఆర్ఎస్ సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ అని, మీరంతా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు శనివారం తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందని చెప్పారు.బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుంటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 5,522 మందికి రూ.118 కోట్లకుపైగా బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం వెచి్చంచామన్నారు. అధికారంలో లేనంత మాత్రన పార్టీ చేసే కార్యక్రమాలేవీ ఆగవని, భవిష్యత్లో కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని కేటీఆర్ సూచించారు. -
ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు
సాక్షి, అమరావతి/అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు పనిగట్టుకుని ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రికలు అబద్ధాలు వండివారుస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేదల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసిన టీడీపీకి ఈ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. టీడీపీ హయాంలో కేవలం తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలతోపాటు రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1.42కోట్లకు పైగా కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది.దీనిని తెలుగుదేశం నేతలు కాదనగలరా?.. టీడీపీ హయాంలో కేవలం 1,059 మాత్రమే ఉన్న ప్రొసీజర్లను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కి పెంచింది. ఉచిత వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పాలనలో కేవలం 919 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను మా ప్రభుత్వం 2,371 ఆస్పత్రులకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రులను 72 నుంచి 204కి పెంచింది. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ చంద్రబాబు దురి్వనియోగం చేయగా, నేడు గ్రీన్ చానల్ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91లక్షల మందికి రూ.13,471కోట్ల విలువైన వైద్యసేవలు అందించాం2023–24 ఆరి్థక సంవత్సరానికి సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,566కోట్లు చెల్లించింది. 2024–25 ఆరి్థక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రూ.366కోట్లు చెల్లించగా, తాజాగా మరో రూ.200కోట్ల బకాయిలు విడుదల చేసింది. అదేవిధంగా ప్రజలకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలుచేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.16,852కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసింది.గత ఐదేళ్లలో వైద్యశాఖలో సుమారు 54వేల పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రజలకు డిజిటల్ వైద్యసేవలు, పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలోనూ ఏపీ తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహరి్నశలు పనిచేస్తోంది.’ అని విష్ణు పేర్కొన్నారు. -
కలిసికట్టుగా ముందుకు..
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఐక్యతారాగం ఆలపించాయి. నాలుగు పార్టీల కేడర్కు సమష్టి సందేశం ఇస్తూ ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్రెడ్డి నివాసంలో శనివారం ఆయా పార్టీల నేతలంతా భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా నిర్వహించిన ప్రచారం, పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎం. కోదండరాం, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వరరావు (టీజేఎస్), కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్రెడ్డి, బాగం హేమంతరావు (సీపీఐ), ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్య (సీపీఎం), మహేశ్కుమార్గౌడ్, మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, బొంతు రామ్మోహన్ (కాంగ్రెస్) పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు అవసరమని, ఆయన గెలుపునకు సహకరించేలా మిత్రపక్ష పార్టీలు కేడర్ను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఈ భేటీలో సూచించారు. కలసికట్టుగా పనిచేసి తీన్మార్ మల్లన్నను గెలిపిద్దామని కోరారు. అనంతరం పలు అంశాలపై దాదాపు గంటపాటు నేతలంతా చర్చించారు. భారీ మెజారిటీతో మల్లన్న గెలుస్తారు: మహేశ్కుమార్గౌడ్ ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్ సమీక్షించారని చెప్పారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పూర్తిగా మద్దతిస్తున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే మల్లన్న గెలవాలి: కూనంనేని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం కోసం సీపీఐ శ్రేణులన్నీ కృషి చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే మల్లన్న గెలుపు అనివార్యమన్నారు. రాజకీయ పొత్తులో భాగంగా తాము మల్లన్నకు, కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. మార్పు కోసం గెలిపించండి: ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలోనూ టీజేఎస్ మద్దతు కాంగ్రెస్కేనని చెప్పారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు, మార్పు కోసం కాంగ్రెస్ అభ్యరి్థని గెలిపించాలని టీజేఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మల్లన్నకు ఓటేయండి: సీపీఎం నేత వీరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విద్యాధికులు ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని ఓటేయాలని సీపీఎం నేత ఎస్. వీరయ్య కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలపై చర్చ.... విడివిడిగా భేటీ సమావేశంలో భాగంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా నాలుగు పార్టీల నేతలు చర్చించినట్లు తెలిసింది. దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని రావాలని కోరుతున్నామని, తెలంగాణ ఉద్యమకారులతోపాటు అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున సన్మానించాలని భావిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా సీపీఐ, టీజేఎస్ నేతలు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై రేవంత్కు పలు సూచనలు చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు రాగా మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఏం చేయాలనే విషయమై అధ్యయనం చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పార్టీలతో కలిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినట్లు తెలియవచ్చింది. సంయుక్త సమావేశం అనంతరం సీఎం రేవంత్తో టీజేఎస్, సీపీఐ, సీపీఎం నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, గుడిసెలు వేసుకున్న పేదలకు ఆయా స్థలాల్లో పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేతలు వినతిపత్రం ఇచ్చారు. -
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు. -
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం సీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని మూర్తి యాదవ్ను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని సీఎస్ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరోపణలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రిల్లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహానికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆదివారం కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లానని సీఎస్ తెలిపారు. ఆ మరుసటి రోజు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు అసైన్డ్ భూములు కొట్టేసినట్లు యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీలో 2023 అక్టోబర్లో సభ ఆమోదం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసైన్డ్ భూములపై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్ పేర్కొన్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపాదించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడి ద్వారా విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్ చేసినట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకున్నాననడంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.మరో 400 ఎకరాలను రిజిస్రే్టషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవాస్తవమని సీఎస్ తెలిపారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు. -
విజయం మనదే!
సాక్షి ప్రతినిధి, కడప: ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో ఓటర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితం కోసం జూన్ 4వరకు వేచి ఉండక తప్పదు. అయినప్పటికీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మేమే గెలుస్తామంటూ ఎవరికి వారు ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. బూత్ల వారీగా ఓట్లు గణన చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పది సీట్లు పదిలమని వైఎస్సార్సీపీ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు దక్కుతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఓటు బదిలీపై ఆశలు పెట్టుకున్న జనసేన, బీజేపీలకు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా నిరాశే మిగలనుంది. కాగా, కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో మరోమారు జమ కానున్నాయి.ఎన్నికల పొత్తులో భాగంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఏకమై తలపడ్డాయి. ఆ కారణంగానే ముందంజలోకి వచ్చామని టీడీపీ భావిస్తుండగా అదే పొత్తు ప్రతిబంధకంగా మారిందని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది. పైగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒంటరిని చేసి ముప్పేట దాడి చేయడం కూడా జిల్లా వాసులకు మింగుడు పడలేదని తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న సంప్రదాయ ఓటర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అండగా నిలిచారని వైఎస్సార్సీపీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ఈ క్రమంలో అన్ని స్థానాలు పదిలపర్చుకుంటామని మరోమారు 2019 ఫలితాలు పునరావృతం కాగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలతో పాటు 10 శాసనసభ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే జమ కానున్నట్లు పలువురు వివరిస్తున్నారు.ఖాతా తెరుస్తాం.. పరువునిలుపుకుంటామంటున్న టీడీపీగత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం, పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధిస్తామని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వరుసగా ఓడిపోయిన నేపథ్యంలో ఈమారు అనుకూలత ఉందని టీడీపీ భావిస్తోంది. పుట్టా సుధాకర్యాదవ్ ఎన్నికల సమయంలో మినహా స్థానికంగా లేకపోవడంతో పాటు రెడ్డి, ముస్లిం, క్రిష్టియన్ మైనార్టీ, ఎస్సీ ఓటర్లు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని గెలుపు అసాధ్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కమలాపురంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి వరుసగా పరాజయం పాలయ్యారు. ఈమారు సానుభూతితో గట్టెక్కగలమని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అభ్యర్థిత్వం పుత్తా నరసింహారెడ్డికి కాకుండా ఆయన తనయుడు కృష్ణచైతన్యరెడ్డికి కేటాయించారు. పైగా టీడీపీ విజయం కోసం పనిచేస్తారని భావించిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కాశీభట్ల సాయినాథశర్మ ఇరువురు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఈక్రమంలో మెజార్టీ తథ్యమని భావించిన కమలాపురం మండలంలో టీడీపీకి భారీగా గండిపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సన్నగిల్లిన వరద ఆశలు...మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ప్రొద్దుటూరుపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఈమారు విజయకేతనం ఎగురవేస్తామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపించే కొద్ది వారి ఆశలకు తూట్లు పడ్డాయి. పోలింగ్లో మహిళలు గణనీయంగా పాల్గొనడంతో మరింతగా చచ్చుబడిపోయారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 2.6 శాతం ఓటింగ్ పెరిగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొత్త ఓటర్ల కారణంగా ఓటింగ్ పెరిగిందని దీంతో మరోమారు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాదరెడ్డి విజయం సాధిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో ఇలాంటి ఆశలే పెట్టుకున్న టీడీపీకి ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ప్రతిబంధకంగా నిలిచినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గట్టిపోటీకి మాత్రమే పరిమితం అయ్యారని, ఓటు బదిలీ ఆశించిన స్థాయిలో కాలేదని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మూలె సుధీర్రెడ్డి విజయానికి ఢోకా లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.కడపలో టీడీపీకి నిరాశే..కడప అసెంబ్లీపై తెలుగుదేశం పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో అనేక వివాదాస్పద వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. మత విద్వేషాలను పురిగొల్పారు. సామాజిక సమీకరణల్లో భాగంగా అనేక ఎత్తుగడలను అవలంబించారు. ముస్లిం మైనార్టీల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనార్టీ నాయకున్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు ఏమేమి చేయాలో అన్ని రకాలుగా చేశారు. అయినప్పటికీ 65.27 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లలో సుమారు 33శాతం పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనార్టీ, క్రిష్టియన్ మైనార్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెడ్డి సామాజికవర్గంలో, వలస వచ్చిన వారిలో, కాపు సామాజికవర్గంలో టీడీపీకి కాస్త సానుకూలత లభించినట్లు పలువురు వివరిస్తున్నారు. ఎటుచూసినా టీడీపీకి గెలుపు అంత సులువు కాదనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.పార్లమెంటు అభ్యర్థుల విజయం ఏకపక్షమే.. కడప, రాజంపేట వైఎస్సార్సీపీ పార్లమెంటు ఫలితాలు ఏకపక్షంగా ఉండనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కడప ఎంపీ పరిధిలో 1989 నుంచి వైఎస్ కుటుంబం ఆధిపత్యమే కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ఎంపీ అయ్యింది మొదలు ఇప్పటి వరకూ ఆ కుటుంబ సభ్యులే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014లో తొలిసారి పోటీ చేసిన వైఎస్ అవినాష్రెడ్డికి 55.95 శాతం ఓట్లు లభించాయి. అప్పట్లో 1,90,323 ఓట్లు మెజార్టీ లభించగా, రెండవసారి 2019లో 63.79 శాతం ఓట్ల శాతంతో 3,80,726 ఓట్ల మెజార్టీ దక్కింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన ఆయన హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోనున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిపాజిట్టు కోల్పోనున్నట్లు పరిశీలకుల అభిప్రాయం. రాజంపేట నుంచి ఇప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సైతం ఈమారు హ్యాటిక్ర్ విజయం దక్కించుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మిథున్రెడ్డికి భారీ మెజార్టీ దక్కనున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు మాత్రం గెలుపు విషయంలో ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తుండటం విశేషం. -
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్రమేశ్
న్యూఢిల్లీ: ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి టార్గెట్ 350 సీట్లలో ఇప్పటికే 272 సీట్ల మార్క్ దాటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ అన్నారు. ఈ మేరకు శనివారం(మే25) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిస్థితి సౌత్ మే సాఫ్, నార్త్ మే హాఫ్ అన్నట్లుగా తయారైందన్నారు. దక్షిణాదిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే సగానికి తగ్గనున్నాయన్నారు. హర్యానా, పంజాబ్లలో అయితే బీజేపీ లీడర్లను ప్రచారానికి రాకుండా ప్రజలు తరిమి కొడుతున్నారని చెప్పారు. బీజేపీ ప్రచారం గడువు కంటే ముందే ముగిసినందున ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకునేందుకు కావల్సిన సమయం దొరుకుతుందని సెటైర్ వేశారు. -
ముగిసిన ఆరవ విడత పోలింగ్... ప్రధాని మోదీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ: ఆరో విడత పోలింగ్లో ఓటు వేసిన వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం(మే25) సాయంత్రం ఎక్స్(ట్విటర్)లో మోదీ ఒక పోస్టు చేశారు. ఆరో విడత పోలింగ్ తర్వాత ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు.ఇండియా కూటమి ఎలాగూ అధికారంలోకి రాదని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే వారికి ఓటు వేయడం వృథా అని భావిస్తున్నారు. ఇదిలాఉంటే తమకు ఈ ఎన్నికల్లో రానున్న 352 సీట్లలో ఇప్పటికే 272 సీట్లు తమ ఖాతాలో వేసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, శనివారం ముగిసిన ఆరో విడత పోలింగ్తో దేశంలో ఇప్పటివరకు 486 ఎంపీ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడవ, తుది విడత పోలింగ్ జూన్1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. -
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్లోని ఝర్గ్రామ్లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్కు వెళ్లారు.వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. -
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్చైర్లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement