-
తాడిపత్రి ఘటనలో 91 మందికి రిమాండ్
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు. -
సీఎం జగన్పై దాడి: సతీష్కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.ఈ నేపథ్యంలో సతీష్ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్సింగ్నగర్లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.రిమాండ్ రిపోర్టు ఇలా.. సీఎం జగన్పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్డేటా, సిసిటివి ఫుటేజ్లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కుట్ర ఎలా జరిగిందంటే?ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్ను ప్రేరేపించాడు.ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడుసింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడుసీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడుదాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడుప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడునిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయిసీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయిప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్గా ఉందిఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాంసాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. -
సీఎం వైఎస్ జగన్పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్కుమార్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్కు చెందిన కేదర్యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు షాక్ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా.. ఈడీ మార్చి 28 వరకు తమ క్లైంట్కు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. మార్చి 24 ఆదివారంలోపు తను దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటం గమనార్హం. ఇక.. గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ పదిరోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. చదవండి: కేజ్రీవాలే అసలు కుట్రదారు -
కవితకు రిమాండ్, 7 రోజుల కస్టడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. ఫామ్ హౌజ్కు కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఆపై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన పరిణామాల అనంతరం ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్కు వెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టుపై ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదు. కవిత భర్తకు కూడా నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అనూహ్యంగా మరో అడుగు ముందుకేసింది. కవిత భర్త అనిల్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అనిల్ ఫోన్లను సీజ్ చేసింది ఈడీ. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు. -
AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శరత్ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. శరత్ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ -
శివబాలకృష్ణ అక్రమ సంపాదన విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
-
‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు దొరికిన పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం ఉన్నతాధికారి శివబాలకృష్ణ ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువను మదింపు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం ఆయనను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వచ్చే నెల 8వరకు రిమాండ్ విధించడంతో.. చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన మూర్తి, సత్యంల కోసం గాలిస్తున్నారు. శివబాలకృష్ణ అవినీతి, అక్రమాల సంపాదనతో నాలుగైదు ప్రాంతాల్లో వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేశారని పురపాలక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు రెండు కిలోల బంగారం.. కోటి నగదు.. శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థిరాస్తి పత్రాలను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లో విల్లాలు, ఫ్లాట్లు, నగర శివారు ప్రాంతాల్లో భారీగా భూముల పత్రాలు వీటిలో ఉండటం గమనార్హం. మొత్తంగా వంద ఎకరాల వరకు ఈ భూములు ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు కోటి వరకు నగదు, దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోలకుపైగా వెండి వస్తువులు, 80కిపైగా అత్యంత ఖరీదైన వాచీలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్టాప్లను కూడా అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లను తెరిస్తే ఇంకా ఎంత స్థాయిలో ఆస్తులు బయటపడతాయోనని అధికారులు పేర్కొంటున్నారు. బినామీల పేరిట భూములు సోదాల్లో కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల స్థిరాస్తి భూముల పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో చాలా వరకు బినామీల పేరిట ఉన్నట్టు చెప్తున్నారు. బినామీలుగా వ్యవహరించిన సత్యం, మూర్తి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో, మరో 16 చోట్ల జరిపిన దాడుల్లో ఇప్పటివరకు స్థిరాస్తులు, చరాస్తుల డాక్యుమెంట్లలోని ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8.26 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నోరెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆస్తుల మదింపు జరుగుతోందని తెలిపారు. సోదాల్లో రూ.99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి ఆభరణాలు/వస్తువులు, డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం రూ.5,96,27,495 విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు తెలిపారు. బాలకృష్ణను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు అదనపు స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చినట్టు వివరించారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సమాచారం ఇవ్వాలని కోరారు. పుర ‘ప్లానింగ్’ అంతా ఆయనదే! ♦ విధానాల రూపకల్పనలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ ♦ ఆయన కోసం పురపాలక శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పోస్టు సృష్టి ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ విధాన నిర్ణయాల్లో ప్రభావం ♦ రెరా నిబంధనలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, టీఎస్–బీపాస్ల రూపకల్పనలోనూ కీలక పాత్ర ♦ అనుమతులు, మినహాయింపులు, అలైన్మెంట్ మార్పుల పేరిట అవినీతి ♦ శివబాలకృష్ణ ఏసీబీకి చిక్కడంపై రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర చర్చ సాక్షి, హైదరాబాద్: ఏసీబీకి చిక్కి అరెస్టయిన హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ.. రాష్ట్ర అర్బన్ ప్లానింగ్ పాలసీల రూపకల్పనలో చక్రం తిప్పారని పురపాలకశాఖ వర్గాలు చెప్తున్నాయి. పట్టణ ప్రణాళి కకు సంబంధించిన విధానాల రూపకల్పన, రచన (డ్రాఫ్టింగ్)లో దిట్టకావడంతో ఆయన హవా కొన సాగిందని అంటున్నాయి. 2014లో రాష్ట్ర సచివాల యంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో డైరెక్టర్ (ప్లానింగ్) పేరుతో కొత్త పోస్టును సృష్టించి మరీ ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించ డం గమనార్హం. దీనితో ఆయన హెచ్ఎండీఏ, జీహె చ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోరైల్, భూవిని యోగ మార్పిడి, ఎలివేటెడ్ కారిడార్లు, ఆకాశ హర్మ్యాలు, మాస్టర్ ప్లాన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో విధానపర నిర్ణయాలు తీసుకోవ డంలో కీలకంగా వ్యవహరించారు. పురపాలక శాఖ లో ఈ వ్యవ హారాలను పర్యవేక్షించే కీలకమైన ప్లానింగ్–1, ప్లానింగ్–2, ప్లానింగ్–3 అనే మూడు సెక్షన్లకూ శివ బాలకృష్ణ మకుటం లేని మహా రాజుగా వ్యవహరించారని.. హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్)గా ఆ సంస్థ అంతర్గత వ్యవహారాల్లోనూ ప్రభావం చూపి నట్టు చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయ న పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి ఆస్తులు పోగే సుకున్నట్టు ఆరోపణలు విని పిస్తున్నాయి. శివబాల కృష్ణ ఇంట్లో సోదాల్లో లభించిన విలువైన వాచీలు, సెల్ఫోన్లు, ఆభరణాలు వంటివన్నీ బహుమతు లుగా అందుకున్నవేనని పురపాలక శాఖలో చర్చ జరుగుతోంది. కీలక విధాన నిర్ణయాలన్నీ.. గత పదేళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ తీసుకొచ్చిన పాలసీల రూపకల్పనలో శివబాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ముఖ్యమైన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యు లేషన్ అథారిటీ (టీఎస్ రెరా) నిబంధనలను సైతం శివబాలకృష్ణ రూపొందించారు. ఈ క్రమంలో రెరా అమల్లోకి వచ్చిన తేదీ నాటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చి, బిల్డర్లకు ప్రయోజనం కల్పించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక అనుమతి లేని కట్టడాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కారు తెచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల జీవోలు శివబాలకృష్ణ ఆధ్వర్యంలోనే సిద్ధం చేశారు. టౌన్షిప్ పాలసీ, పొడియం పార్కింగ్ పాలసీ, పార్కింగ్ ఫీజు విధానం, సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో భవన అనుమతుల జారీ కోసం తెచ్చిన టీఎస్–బీపాస్ పాలసీ, కూల్రూఫ్ పాలసీ, రాష్ట్ర బిల్డింగ్ రూల్స్ (జీవో 168)కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన జీవోలు, లేఅవుట్ రూల్స్కు సవరణలతో వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన జీవోలను సైతం ఆయన నేతృత్వంలోనే రూపొందించినట్టు పురపాలక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దరఖాస్తులను పెండింగ్లో పెట్టి.. హెచ్ఎండీఏ, ఇతర పట్టణాల మాస్టర్ ప్లాన్లకు సవ రణలు/మినహాయింపులు, మాస్టర్ ప్లాన్ల నుంచి రోడ్లను తొలగించడం/పార్కులను మార్చడం, హెచ్ఎండీఏ పరిధిలో భూవినియోగ మార్పిడి దర ఖాస్తుల పరిష్కరణ, హెచ్ఎండీఏ పరిధి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్, ఓఆర్ఆర్ వ్యవహారాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిబంధ నల మినహాయింపులు, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజె క్టులు/గేటెడ్ సొసైటీలు/టౌన్షిప్ల నిర్మాణానికి అనుమతులు, మెట్రో అలైన్మెంట్ మార్పులు వంటి అంశాల్లోనూ శివబాలకృష్ణ కీల కంగా వ్యవహ రించారని సమాచారం. ఈ క్రమంలో ఆయా అంశాల్లో అనుమతులు, మినహాయింపులు కోరుతూ వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచేవా రని.. కొన్నింటికి మాత్రమే వేగంగా పురపాలకశాఖ నుంచి అనుమతులు లభించేవని విమర్శలు ఉన్నా యి. ఈ క్రమంలోనే భారీగా సొమ్ము, బహుమ తులు అందుకునేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జూలైలోనే పక్కాగా రెక్కీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్చేశారు. లోక్సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్ సింగ్ వీరాభిమాని. లలిత్, సాగర్, మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలిశారు. అప్పుడే పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్ దేవి, అమోల్ షిండే తోడయ్యారు. ఫేస్బుక్లో భగత్సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్ రెక్కీ నిర్వహించాడు. జూలైలో సందర్శకుల పాస్తో పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్లోని విశాల్ శర్మ అలియాస్ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు. అమోల్, నీలమ్లు పార్లమెంట్ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్కతాకు చెందిన ఒక ఎన్జీవో నిర్వాహకుడు నీలా„Š అయి‹Ùతో స్పెషల్ సెల్ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్జీవోతోనే లలిత్ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వారం రోజుల రిమాండ్ పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒకే రకమైన సమాధానాలు సాగర్ శర్మ(26), మనోరంజన్(34), అమోల్ షిండే(25), నీలమ్ దేవి(37)లకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్(డీఎస్ఎఫ్) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్కు, తర్వాత డీఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్ పాలనలో విప్లవయోధుడు భగత్ సింగ్ చేసినట్లుగా పార్లమెంట్లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రిమాండ్ ఖైదీగా 50 రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు
-
చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’ సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు. చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. -
వ్యూహాత్మకంగానే.. తప్పు మీద తప్పులు!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయినప్పటి నుంచి ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోంది. ఒక తప్పును కవర్ చేయడానికి మరిన్ని తప్పులు చేస్తారన్నట్లుగా టీడీపీ నేతలు పూర్తి అయోమయావస్థలో పలు బ్లండర్స్కు పాల్పడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు గత నెల తొమ్మిదో తేదీన అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ చేసిన తప్పులేమిటో చూద్దాం. చంద్రబాబును ఉదయం ఆరున్నర గంటల సమయంలో అరెస్టు చేస్తే.. కోర్టులో మాత్రం ఆయన తరపు లాయర్లు అర్దరాత్రి అరెస్టు చేసినట్లు చెప్పడానికి యత్నించారు. తమ కక్షీదారుకు మద్దతుగా లాయర్లు వాదిస్తారు. కానీ, అందరికి తెలిసిన సత్యాన్ని కూడా అందుకు భిన్నంగా చెబితే ప్రజలలో పలచన అవుతామన్న సంగతి అర్థం చేసుకోవాలి. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనను హెలికాఫ్టర్లో తరలించాలని సీఐడీ భావించింది. కానీ, అందుకు చంద్రబాబు నిరాకరించారు. దాంతో ఆయన కోరుకున్న విధంగానే రోడ్డు మార్గంలో.. అదీ ఆయన వాహనంలోనే తరలించారు. అయినా టీడీపీ నేతలు, ఆయనకు మద్దతు ఇచ్చే ఇతర పార్టీల నేతలు చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని విమర్శలు చేశారు. ✍️తప్పు చేసింది చంద్రబాబు అయితే ప్రభుత్వం పై నింద మోపడం ఏమిటి? ప్రజలకు ఈ విషయం కూడా తేటతెల్లమైంది. ఆయన విజయవాడ వస్తుంటే ప్రజలంతా తండోపతండాలుగా తరలివచ్చి సానుభూతి చెబుతారని ఆశించారు. కానీ ఒకటి,రెండు చోట్ల మినహాయించి అలా జరగలేదు. దాంతో ఆయన ప్లాన్ బెడిసినట్లయింది. కాకపోతే ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకోవడానికి కొంత సమయం కలిసి వచ్చింది. అలాగే విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై తరలించినప్పుడు కూడా స్పందన కనిపించలేదు. ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు మాత్రం శరభ..శరభ అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. ఇలాంటి మీడియాను నమ్ముకునే చంద్రబాబు నష్టపోయారు. ఎందుకంటే వారు రాసింది ప్రతిదీ నిజమని ఆయన భ్రమపడ్డారు. అందుకే మాట్లాడితే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి నువ్వేం పీకావ్.. అంటూ సవాల్ చేసేవారు. తీరా అవినీతి కేసుల్లో అరెస్టు చేసిన తర్వాత కక్ష అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ✍️చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నించకుండా క్వాష్ పిటిషన్లు వేసి ఆయన తరపు లాయర్లు కాలం గడిపినట్లు అనిపిస్తుంది. దాంతో ఆయన ఐదువారాలు దాటినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి అరెస్టు తర్వాత హడావుడిగా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లడం పలు సందేహాలకు తావిచ్చింది. పైకి డాంబికంగా మాట్లాడుతున్నా తాను కూడా అరెస్టు అవుతానేమో అనే భయంతోనే ఢిల్లీలోనే బస చేశారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది కూడా టీడీపీకి నెగిటివ్ అయింది. చంద్రబాబు జైలులో ఉంటే సానుభూతి వస్తుందనుకుంటే అది కూడా పెద్దగా కనిపించకపోవడం తో రకరకాల నిరసనలు అంటూ కథ నడిపారు. ✍️డప్పులు కొట్టడం, విజిల్స్ ఊదడం, కంచాలు కొట్డడం వంటివి చూసేవారికే ఎబ్బెట్టుగా మారాయి. ఏదో సంబరాలు చేసుకున్నట్లు ఉంది.. తప్ప బాధపడుతున్నట్లు లేదన్న వ్యాఖ్యలు వచ్చాయి. తదుపరి లైట్లు తీసేయాలని ఒకరోజు, చేతులకు సంకేళ్లు వేసుకున్నట్లు ఇంకో రోజు కార్యక్రమాలు చేశారు. కాని అవన్నీ ప్రజలలోకి వెళ్లలేకపోయాయి. టీడీపీ కార్యకర్తలు అరవై, డెబ్బై లక్షల మంది ఉంటారని చంద్రబాబు చెబుతుంటారు. అందులో పది శాతం మంది ఆ నిరసనలలో పాల్గొన్నా చాలా ప్రభావం పడేదని అంటారు. నిజానికి ఈ నిరసనలు ఎవరిమీద చూపుతున్నారు?. చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేసింది సీఐడీ అనేది నిజమే. కాని వారు పెట్టిన ప్రాధమిక ఆధారాలను చూశాకే కోర్టు ఆయనను రిమాండ్కు పంపిందన్న సంగతిని మర్చిపోయి ఈ నిరసనలు చేయడం కూడా విమర్శలకు గురి అయింది. ఇక రిమాండ్కు పంపిన గౌరవ జడ్జి మీద ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెట్టడం నీచం అనే భావన ఏర్పడింది. ✍️చంద్రబాబు చాలా ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. సడన్గా ఆయనకు ఏదో జరిగిపోతోందని లోకేష్ తదితరులు అనడం కూడా ఎవరికి అర్ధం కాలేదు. మరోవైపు తమ హెరిటేజ్ కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్మితే రూ. 400 కోట్లు వస్తాయని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పడం కొత్త వివాదం అయింది. లోకేష్ చాలా రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు ఎవరూ కలవడానికి ఆసక్తి చూపలేదు. ఎలాగోలా హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయనే తనను పిలిపించుకున్నారని లోకేష్ చెప్పడం అంత తెలివైన చర్యగా ఎవరూ చూడడం లేదు. తద్వారా అమిత్ షానే అవమానించారని కొందరు వ్యాఖ్యానించారు. భేటీ అయిన తర్వాత ఒక సందర్భంలో టీడీపీ అటు ఎన్డీయేకి, ఇటు ఇండియా కూటమికి సమదూరంలో ఉంటుందని అనడం కూడా బీజేపీ నేతలకు నచ్చలేదట. దాంతో టీడీపీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదని బీజేపీ పెద్దలు భావించారట. చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు టీడీపీవారే లేవదీయడం, ప్రజలలో అనుమానాలు కలిగేలా కుటుంబ సభ్యులే మాట్లాడడం కూడా ఆశ్చర్యం కలిగించింది. నిజంగానే చంద్రబాబు ఆరోగ్యం బాగోపోతే ఎందుకు ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కోర్టులో పిటిషన్ వేయలేదో అర్ధం కాదు. కేవలం ఏసీ పెట్టాలని మాత్రమే పిటిషన్ వేయడం కోర్టువారు అంగీకరించడం జరిగిపోయాయి. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఆరోగ్యం నిజంగా దెబ్బతిన్నదా?లేదా? అనే చర్చకు ఆస్కారం ఇచ్చారు. చంద్రబాబు ఎండల్లో, దుమ్ము, ధూళి మధ్య చెమట్లు కక్కుతూ జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. కానీ జైలులో నీడపట్టున ఉన్నప్పుడు అంత సీరియస్గా ఆరోగ్యం దెబ్బతింటుందా? అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీడీపీ వాళ్లు కోర్టులో ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కోరకపోవడంతో జనంలో సందేహాలు వచ్చాయి. ✍️ఏపీలో పెద్దగా నిరసనలు లేకపోయినా, హైదరాబాద్లో ఒక సామాజికవర్గం వారే నిరసనలకు దిగడం ద్వారా చంద్రబాబును చివరికి ఒక కుల నాయకుడుగా మార్చివేశారనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు ముడిపెట్టిన తీరు కూడా అంత తెలివిగా కనిపించదు. ఇలా పలు రకాలుగా టీడీపీ నేతలు అనండి.. చంద్రబాబు కుటుంబ సభ్యులనండి.. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అన్నింటికీ మించి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోవడం, సుప్రీంకోర్టు వరకు కేవలం 17ఏ ద్వారా గవర్నర్ అనుమతి లేనందునే కేసు కొట్టేయాలని లాయర్లు కోరడం వంటివాటి ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, టీడీపీ ఖాతాలోకి రూ. 27కోట్లు వచ్చే ఉంటాయని ప్రజలు అభిప్రాయపడే పరిస్థితిని ఆ పార్టీ నేతలే తెచ్చుకున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి లాయర్ గా పేరొందిన హరీష్ సాల్వే చివరికి తన వాదనలో చంద్రబాబు వయసు ప్రస్తావించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనడం, అవసరమైతే మళ్లీ జైలులో పెట్టవచ్చని చెప్పడంతో టీడీపీ ఎంత బలహీనంగా ఉందన్న విషయం అర్దం అయిపోయింది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు రిమాండ్ పొడగింపు..!?
-
రాజమండ్రీ జైల్లో 24వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
-
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మళ్లీ ఆవు కథే!
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా నకిలీ ఒప్పందంతో నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టిన కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. పక్కా పన్నాగంతో ‘స్కిల్’ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సీఐడీ విచారణను కూడా పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలోనూ ఆయన ఏమాత్రం సహకరించనందున చంద్రబాబు కస్టడీని పొడిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్లు సీఎంనంటూ సీఐడీ విచారణలో చంద్రబాబు సంబంధం లేని సంగతులు చెబుతూ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఏ ప్రశ్నలు వేసినా చంద్రబాబు ఒకటే చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని... 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ కాలయాపన చేసేందుకే ప్రయత్నించారు. దీంతో ఆయన రాజకీయ అనుభవం గురించి తమకు కూడా తెలుసని, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ జీవో, ఒప్పందాలను ఏ ప్రాతిపదికన చేశారు? బిల్లులు చెల్లింపుల్లో హేతుబద్ధత ఏమిటీ? నిధుల మళ్లింపులో పాత్రధారులతో సంబంధాలు ఏమిటీ? అనే అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సిట్ అధికారులు పదేపదే పట్టుబట్టాల్సి వచ్చింది. వ్యూహాత్మక ప్రశ్నావళి.. కొంతవరకు సఫలీకృతం మొదటి రోజు చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో రెండో రోజు సిట్ అధికారులు ప్రశ్నావళిలో కొన్ని మార్పులు చేశారు. వరుస క్రమంలో కాకుండా ఓ అంశం నుంచి మరో అంశానికి జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ అరెస్ట్ చేసిన సుమన్బోస్, వికాస్ వినాయక్ కన్విల్కర్లతోపాటు నిధుల అక్రమ తరలింపులో షెల్ కంపెనీలతో చంద్రబాబు సంబందాలు, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. నిధుల అక్రమ మళ్లింపులో కీలక పాత్రధారులైన చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలతో చంద్రబాబు, లోకేశ్ లావాదేవీలపై కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయగానే పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారు కావడంపై సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. వెరసి రెండు రోజుల విచారణలో వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించడం ద్వారా సీఐడీ అధికారులు కొంతవరకు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. విచారణ సాగిన తీరు, వీడియో రికార్డింగ్ తదితర ఫైళ్లను న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించనున్నారు. మరింత విచారించాల్సిన అవసరం విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించి కాలహరణం చేసినందున చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారు కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నివేదించనుంది. ఈ కేసులో గతంలో విచారించిన సాక్షులను ప్రభావితం చేసిన ఉదంతాలను కూడా న్యాయస్థానం దృష్టికి మరింత వివరంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో కుట్రకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి సిట్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు. -
చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ బ్లాక్ ఫ్రైడే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి.. కోర్టుల్లో ఇవాళ బ్యాక్ టూ బ్యాక్ ఝలక్కు తగిలాయి. ఒకవైపు ఆయన రిమాండ్ను రెండు రోజులు పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఇంకోవైపు.. ఆయన్ని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. వీటితో పాటు ఆయన బెయిల్ పిటిషన్పై వాదనలను కూడా అనిశా(ACB) కోర్టు వాయిదా వేయడం గమనార్హం. స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడిని ఐదురోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరగ్గా.. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. తీర్పు సమయంలో చంద్రబాబును ఎక్కడ విచారిస్తారనే దానిపై సీఐడీ సమాధానం ఆధారంగా తీర్పు ఉంటుందని తొలుత ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. అయితే.. ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దు ఆయన్ని జైల్లోనే విచారిస్తామని సీఐడీ సమాధానం ఇవ్వడంతో.. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే రెండ్రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ‘‘విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వండి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గం. లోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతిస్తాం. ఇబ్బందులేమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. చంద్రబాబు విచారణ జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని జడ్జి ఈ సందర్భంగా సీఐడీ అధికారులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు కస్టడీ తీర్పుతో.. రేపు(శనివారం), ఆదివారం జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అలా ఎలా వింటాం? మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కస్టడీ విచారణ జరిగే సమయంలో వాదనలు ఎలా వింటామని?.. అలా వినడం సరికాదని పేర్కొంది ఏసీబీ కోర్టు. ఆపై.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు సోమవారం వింటామని తెలిపింది. అంతకు ముందు రెండు అంతకు ముందు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ముగిసి పోవడంతో.. ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టులోనూ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ‘‘ఇంత దర్యాప్తు జరిగిన తర్వాత.. ఈ దశలో తాము జోక్యం చేసుకోమని.. దర్యాప్తును ఆపే ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. -
చంద్రబాబు లాయర్ల కొత్త స్కెచ్..
-
ఇల్లు కాదు జైలే..
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. హౌస్ రిమాండ్కు సంబంధించి ఏ చట్టంలో కూడా ఎలాంటి నిర్దిష్ట ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. అందువల్ల హౌస్ రిమాండ్ విషయంపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు (ఏసీబీ కోర్టు) లేదని పేర్కొంది. అంతేకాక హౌస్ రిమాండ్లో ఎందుకు ఉంచాలనేందుకు చంద్రబాబు సరైన కారణాలను తమ ముందుంచలేదని తెలిపింది. హౌస్ రిమాండ్ విషయంలో న్యాయస్థానాన్ని పిటిషనర్ ఒప్పించలేకపోయారని, భద్రత విషయంలో ఇంటి వద్ద కంటే జైలు వద్దే ఎక్కువ భద్రత ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు వ్యక్తం చేసింది. ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) భద్రత ఉన్న వ్యక్తికి అదే స్థాయిలో ఇంటి వద్ద భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చునంది. చంద్రబాబు భద్రత కోసం జైలులో పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. మాకేవీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం రోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. హౌస్ రిమాండ్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కొట్టివేయటానికి కారణాలు ఏమిటో కూడా కోర్టు వివరించింది. ఈ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకేమీ కారణాలు వివరించాల్సిన అవసరం లేదని పేర్కొనగా, కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు కారణాలను వివరించింది. జ్యుడీషియల్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయి.. మాజీ సీఎం చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అసాధారణ అభ్యర్థన అని సోమవారం వాదనల సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదని, అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు. జైలులో చంద్రబాబు భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. చట్టంలో కేవలం జ్యుడీషియల్ రిమాండ్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టు తీర్పు సందర్భంగా ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది. బెయిల్ పిటిషన్ అంటూ హల్చల్... మాజీ సీఎం చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నానంటూ ఏసీబీ కోర్టులో మంగళవారం ఓ న్యాయవాది హడావుడి సృష్టించారు. చంద్రబాబు తరఫున ఓ టీడీపీ కార్యకర్త పేరుతో తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై విచారణ జరపాలని కోరారు. అయితే చంద్రబాబు వకాలత్ ఇవ్వకుండా ఆయన తరఫున ఎలా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని కోర్టులో ఉన్న న్యాయవాదులు చర్చించుకున్నారు. ఆ న్యాయవాది తీరును గమనించిన న్యాయస్థానం ఈ విషయాన్ని చంద్రబాబు తరఫున గత మూడు రోజులుగా వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల దృష్టికి తెచ్చింది. చంద్రబాబు ఎలాంటి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని వారు కోర్టుకు తెలియచేయడంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. సుదీర్ఘ వాదనలు.. సందేహాల నివృత్తి తరువాతే తీర్పు మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్పై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఏసీబీ కోర్టు ఎంతో ఓపికగా విన్నది. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు పిటిషన్పైనే విచారణ జరిపింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు ఎంత సమయం తీసుకున్నా వారిని ఏ దశలోనూ కోర్టు నిలువరించలేదు. అటు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వినిపించిన ప్రతీ వాదననూ సావధానంగా ఆలకించింది. ఆయన కోర్టు దృష్టికి తెచ్చిన ప్రతీ తీర్పునూ నిశితంగా పరిశీలించింది. వాటి విషయంలో తనకున్న సందేహాలను సైతం ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. అలాగే సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలను సైతం అదే రీతిలో ఆలకించింది. సీఐడీ న్యాయవాదిని కూడా ప్రశ్నించి తన సందేహాలను ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. చివరకు సీఐడీ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఎందుకు ఇవ్వడం లేదో కోర్టు హాలులోనే చాలా స్పష్టంగా వివరించింది. తమకేమీ కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది గట్టిగా వ్యాఖ్యానించినా కూడా, తన బాధ్యత మేరకు కారణాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా, తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ అన్ని పిటిషన్లను ఏసీబీ కోర్టు చాలా ఓపికగా విచారించింది. ఎక్కడా కూడా ఎలాంటి తొందరపాటుకు ఆస్కారం లేకుండా విచారణ జరుపుతూ వస్తోంది. న్యాయవాదులతో, ఇతరులతో (చంద్రబాబుకు చెందిన వ్యక్తులు) కోర్టు హాలు కిక్కిరిపోయినప్పటికీ ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా ఏసీబీ కోర్టు తన బాధ్యతలను నిర్వర్తించింది. -
ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచింది
సాక్షి, అమరావతి :ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి, జైలుకు పంపడంతో ఇన్నాళ్లకు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నట్లు మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు సిగ్గుపడకుండా.. వేళ్లూపుకుంటూ జైలుకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ.. స్టేల మీద నెట్టుకొస్తూ.. ప్రతి వ్యవస్థలోనూ, తాను ఏర్పాటుచేసుకున్న స్లీపర్ సెల్స్ ద్వారా బయటపడుతూ, సమాజానికి మాత్రం చంద్రస్వామిజీ నీతులు చెబుతూ వచ్చారంటూ విమర్శించారు. 2014–19 మధ్యలో జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరుపుతామని స్పష్టంచేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. అరెస్టు నుంచి జైలుకు పంపే వరకు ఆయన్ను ప్రభుత్వం కక్ష సాధింపుగా కాకుండా మర్యాదగా చూసుకుంది. ఇన్ని వందల, వేల కోట్లు కొట్టేసిన వారిని ఎవరైనా ఇంత మర్యాదగా చూస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గర నుంచి, దత్తపుత్రుడు పవన్కళ్యాణ్, సీపీఐ నాయకులు, ఎల్లో మీడియా బాబును వేధిస్తున్నారని అనడం హేయం. చంద్రబాబు సీఐడీ విచారణకు అసలు సహకరించలేదు. ఏమో, తెలియదు, గుర్తులేదు.. ఈ మూడే కదా బాబు చెప్పింది. కోర్టులోకి చంద్రబాబు కుటుంబ సభ్యులంతా వస్తుంటే పోలీసులు అనుమతించారా? లేదా? జైల్లో ఆయనకు సకల సౌకర్యాలు ఇవ్వమని ప్రభుత్వం తరఫున, సీఐడీ తరఫున న్యాయవాదులు అభ్యంతరంలేదని చెప్పారా? లేదా? చంద్రబాబును ఇంత మర్యాదగా చూస్తే.. వేధించారని మాట్లాడతారా? కోర్టు రిమాండ్ విధిస్తే.. సిగ్గులేకుండా రెండువేళ్లూ ఊపుతూ జైలుకెళ్లాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ కోసం రూ.5 వేల కోట్లు ఇస్తుందని తెలిసి, చంద్రబాబు, ఆయన కొడుకు ఫైబర్నెట్ స్కాం చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ కాంట్రాక్టుల పేరుతో రూ.119 కోట్లు లూటీ చేసినా ఏమీ పట్టించుకోకూడదా? అవినీతిపై రాజీలేని పోరాటమంటే.. రోడ్ల మీద పడి పొర్లాడటమా పవన్? వారాహి యాత్రలో గోదావరి జిల్లాల్లో కనీసం 50 మందిని చంపేయడానికి రెండువేలమంది కిరాయి రౌడీలను వైఎస్సార్సీపీ నేతలు పంపారని పవన్ చెప్పడం హేయం. సైకలాజికల్ డిజార్డర్తో ఉన్న పవన్ను సైక్రియాటిస్టు ఇండ్ల రామసుబ్బారెడ్డికి చూపించాలి. పవన్ చెప్పే నిఘా వర్గాలు కేంద్రానివి కాదు.. చంద్రబాబువి. -
పీటీ వారంట్!
అటాచ్ చేయనున్న ఆస్తుల వివరాలు.. ఏ–1 చంద్రబాబు కరకట్ట నివాసం (లింగమనేని రమేశ్ కుటుంబం పేరిట ఉన్న ఈ నివాసాన్ని చంద్రబాబు క్విడ్ ప్రో కో కింద పొందారు) ఏ–2 పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు. ఏ–2 నారాయణ భార్య పొత్తూరి ప్రమీల, కుటుంబ సభ్యులు, బంధువులు రాపూరి సాంబశివరావు, ఆవుల మునిశంకర్, వరుణ్ కుమార్ ఇప్పటివరకు పొందిన కౌలు మొత్తం రూ.1,92,11,482. సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన కుంభకోణాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజినీ కుమార్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఆ కేసులో కూడా ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి కోరనుంది. దీంతో కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించవచ్చని సీఐడీ భావిస్తోంది. చంద్రబాబు, చినబాబు భూ దోపిడీ టీడీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. వారి బినామీ లింగమనేని రమేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారు.అప్పటివరకు రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారు. అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరిగేలా పథకం వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములు వీటికి అదనం. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా చంద్రబాబు వాటా కల్పించారు. ఆ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉండటం గమనార్హం. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించారు. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్ను ఏ–5గా పేర్కొంది. చంద్రబాబు, నారాయణ ఆస్తుల అటాచ్ ఈ కేసులో చంద్రబాబు, నారాయణ బినామీల ద్వారా పొందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ప్రతిపాదనను ఆమోదిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు పొందిన కరకట్ట నివాసంతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను అటాచ్ చేయనుంది. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
జైల్లో ఉండను మా ఇంట్లో ఉంటా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అయితే ఉదయమే తీర్పు వెలువరించాలన్న చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ సమయంలో తమకు విచారించాల్సిన కేసులు చాలానే ఉన్నాయని కోర్టు పేర్కొంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది. కౌంటర్లు దాఖలైన తరువాత కస్టడీ పిటిషన్పై విచారణ జరుపుతామని తెలిపింది. బీపీ, షుగర్ ఉంది.. : అంతకు ముందు హౌస్ రిమాండ్ పిటిషన్పై సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకున్న ప్రాణహాని రీత్యా ఆయనకు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించిందన్నారు. ఆయన ప్రాణాలకు పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయన్నారు. జైలులో చంద్రబాబు భద్రతపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అంతేకాక చంద్రబాబు వయస్సు 73 ఏళ్లని, షుగర్, బీపీలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే ఆయనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్లో ఉంచాలని అభ్యర్థించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి దర్యాప్తు అధికారులు ఎన్నడూ చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహించలేదని, ఎలాంటి డాక్యుమెంట్లను జప్తు చేయలేదని తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ స్కామ్లో ఎలాంటి ఆధారాలు ఉండే అవకాశం లేదన్నారు. హౌస్ రిమాండ్లో ఉంచితే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం జరగదన్నారు. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించారు. జైలులోనే భద్రత ఎక్కువ... అనంతరం సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ హౌస్ రిమాండ్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలోలో ఉన్న నేపథ్యంలో హౌస్ రిమాండ్ పిటిషన్ నిరర్థకమైందన్నారు. చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అభ్యర్థన అసాధారణమన్నారు. వాస్తవానికి హౌస్ రిమాండ్ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదన్నారు. అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు. జైలులో ఆయన భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేందుకు ఎలాంటి వైద్య రికార్డులను కోర్టు ముందు ఉంచలేదన్నారు. అరెస్ట్, రిమాండ్ సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్లు తేల్చారన్నారు. జీవన శైలి సంబంధ వ్యాధులకు సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు అరోగ్యంగా ఉన్నారు కాబట్టే అరెస్ట్కు ముందు ఆయన చాలా క్రియాశీలకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. హౌస్ రిమాండ్కు పంపితే సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం ఉందని చంద్రబాబు చెబుతున్నారని, అయితే వాస్తవానికి ఆయన ప్రోద్భలంతోనే ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారయ్యారని తెలిపారు. వారు దర్యాప్తునకు దొరకుండా ఉండేందుకే అలా చేశారన్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండేందుకే జ్యుడీషియల్ కస్టడీ విధిస్తారని, ఇప్పుడు చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఇస్తే ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ కోర్టు చంద్రబాబుకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, తగిన భద్రత కూడా కల్పించాలని జైలు అధికారులను ఆదేశించిందని తెలిపారు. చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని సుధాకర్రెడ్డి చెప్పారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయకుండా హౌస్ రిమాండ్ కోసం పట్టుబడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ఉదహరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఈ సమయంలో చంద్రబాబు న్యాయవాది లూథ్రా జోక్యం చేసుకుని ఉదయమే తీర్పు వెలువరించాలని పట్టుబడ్డారు. అయితే ఉదయం అనేక కేసులో పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా విచారించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు గుర్తు చేసింది. -
చంద్రబాబు అరెస్టుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు
-
చంద్రబాబు అవినీతి చిట్టా చాలా పెద్దది
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement