-
సరిహద్దులో చైనాతో కొత్త బెడద
‘షావోకాంగ్’ పథకం ద్వారా వందల ఆధునిక గ్రామాలను సరిహద్దుల్లో చైనా నిర్మించింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట సాగుతున్న ఇది పూర్తిగా నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘భౌగోళిక పటాల దాడి’ని కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. టిబెట్, షిన్జాంగ్ లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. ‘ఎత్తుకు పై ఎత్తు’ వేయడం కాకుండా, చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. సరిహద్దులలో చైనా ఆధునిక గ్రామాలను నిర్మించడం, వాటిని నివాస ప్రాంతాలుగా చేసుకోవడం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మార్చ్ 28న, టిబెట్ను చైనా స్వాధీనం చేసుకున్న ఘటన 65వ వార్షికోత్సవం సందర్భంగా, భారత్, భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న కొత్త గ్రామాలలో చైనా ప్రభుత్వం అనేక వేడుకలను నిర్వహించింది. తాజా వార్తల ప్రకారం, ఇప్పటికే ఉన్న 628 ‘సవొకాంగ్’ (సంపన్న గ్రామా లు)తో పాటు, మరో 175 సరిహద్దు గ్రామాలను చైనా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట, షావోకాంగ్ చొరవ అనేది నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ద్వారా చైనా సమాజపు సమాన అభివృద్ధిని నిర్ధారించ డానికి 1979లో డెంగ్ జియావోపింగ్ ఈ నమూనాను ప్రతిపాదించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీనిని, ప్రధాన భూభాగంతో సరిహద్దు ప్రాంతాల ఏకీకరణ వ్యూహంగా మార్చారు. తద్వారా అరుణాచల్ప్రదేశ్కు ఎదురుగా ఉన్న టిబెట్లో దాని భూసరిహద్దుల భద్రతను మెరుగుపరిచారు. షావోకాంగ్ పథకంలో భాగంగా, 427 మోడల్ గ్రామాలను ఫ్రంట్ లైన్లో నిర్మించగా, 201 గ్రామాలు రెండవ శ్రేణిలో ఉన్నాయి. ఈ సంపన్న గ్రామాలు షిగత్సే, లోహ్కా, న్యింగ్చి, ఎన్గారి వంటి ముఖ్య మైన పట్టణాలతో సహా 21 సరిహద్దు కౌంటీలలో విస్తరించి ఉన్నాయి. భూటాన్, అరుణాచల్ప్రదేశ్లతో సరిహద్దును పంచుకునే లోహ్కా ప్రాంతంలోనే, చైనా 354 ‘సంపన్న’ సరిహద్దు స్థావరాలను అభివృద్ధి చేసింది. ఈ గ్రామాలలో దాదాపు మూడింట ఒక వంతు వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) సమీపంలో నిర్మించారు. మౌలిక సదు పాయాలు సహా, ఈ ఆవాసాల నిర్మాణం కోసం సుమారుగా 4.6 బిలి యన్ డాలర్లు కేటాయించారు. 2017 అక్టోబర్లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్లో, ప్రతిభావంతులైన చైనీస్ పౌరులు మారుమూల జాతిపరమైన మైనారిటీ ప్రాంతాలలో పని చేయాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నది, ప్రధానంగా అక్కడి జనావాసాల స్థితిగతులను మార్చడమే. గత దశాబ్దంలోనే, టిబెట్లో హాన్ జనాభా సుమారు 12 శాతం పెరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతిమ లక్ష్యం, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో పూర్తిగా చైనీకరణను సాధించడం. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలలో అన్ని సరిహద్దు గ్రామాలకు రోడ్లు, విద్యుదీకరణ, ఆఖరికి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి నాణ్యమైన సౌకర్యాలు అందించారు. అదనంగా, దాదాపు 206 పారిశ్రామిక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడానికి చైనా ఇటీవలి సంవత్సరాలలో రెండు జాతీయ చట్టాలను ప్రవేశపెట్టింది. 2021లో ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ లా, జాతీయ ప్రయోజనాల కోసం పౌర సంస్థలతో కలిసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పనిచేయడానికి అధిక పాత్రను అందిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత, ఆక్రమిత ప్రాంతా లపై చైనా పట్టును ఏకీకృతం చేసేందుకు భూ సరిహద్దు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టంలోని ఆర్టికల్స్ 10, 43... సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి యథాతథ స్థితిని సవాలు చేస్తున్నాయి. ఇది భారతదేశ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘మ్యాప్ల దాడి’ని ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. ఇది ప్రచారపరమైన, మానసికపరమైన, చట్టపరమైన కోణాలను కలిగి ఉంటుంది. జూలై 2021లో, జిన్పింగ్ లాసాను సందర్శించారు. గత మూడు దశాబ్దాలలో చైనా దేశాధినేత చేసిన మొదటి సందర్శన. ఆయన టిబెట్ను ‘ఇనుప కవచం’గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని ప్రకారం, డోక్లామ్, లాంగ్ జు వంటి వివాదాస్పద ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలు ఫార్వర్డ్ పోస్ట్లుగా వ్యవహరించడానికి చైనా సైన్యపు రక్షణ ప్రణాళికలలో విలీనం చేయబడ్డాయి. హాన్ జాతికి చెందిన మాజీ సైనిక సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చైనా చర్యలు దాని ‘గ్రే జోన్ వార్ఫేర్’కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో పౌరులు, పౌరసైనికులు ‘నాన్–కాంటాక్ట్’ యుద్ధంలో భాగమ వుతారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కార్యాచరణ దీనికి ఒక ఉదాహరణ. ఒక స్పష్టమైన విధానం లేనందున, ముఖ్యంగా చైనాకు ఎదు రుగా ఉన్న భారత సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. టిబెట్, షిన్జాంగ్లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని గతేడాది ప్రారంభించారు. దీని ప్రకారం, చైనా సరిహద్దులో కనెక్టివిటీ లోపించిన 168 గ్రామాలను ఈ ఏడాది చివరి నాటికి అనుసంధానం చేయనున్నారు. 19 జిల్లాల్లోని 663 సరి హద్దు గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,800 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.చైనా నియంత్రణలో పూర్తిగా ఉండే సవొకాంగ్ పథకానికి విరు ద్ధంగా, భారత్ కార్యక్రమం ‘హబ్ అండ్ స్పోక్’(ఒక దగ్గరి నుంచి అందరికి) నమూనాను అనుసరిస్తోంది. ఇది జిల్లా పరిపాలన, గ్రామ పంచాయతీల ద్వారా అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర నిధులు ఇవ్వడానికే పరిమితమైంది. వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ప్రధాన దృష్టి సామాజిక–ఆర్థిక కార్యక్రమాల ప్రచారంపై ఉంది. అయితే, భద్రతా అంశాలను కూడా చేర్చడం ద్వారా ద్వంద్వ–వినియోగ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు, జలమార్గాలతో సహా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సరిహద్దుల్లో భారత్ చేపడుతోంది. ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి రూ. 12,882.2 కోట్ల నిధులను ‘స్థూల బడ్జెట్ సహాయం’ కింద సమకూర్చారు. వివాదాస్పద సరిహద్దు, లద్ధాఖ్లలో కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా, చైనా ప్రణాళిక తీవ్రమైన వ్యూహాత్మక పరిణామాలను కలిగి ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే బీజింగ్ ఉద్దేశం, సవొకాంగ్ పథకంతో మరింత తోడ్పాటును పొందు తుంది. 2005 (ఆర్టికల్ 7)లో పొందుపర్చిన ‘సరిహద్దు సమస్య పరి ష్కారానికి రాజకీయ పరామితులు, మార్గదర్శక సూత్రాలు’ ఒప్పందాన్ని కూడా చైనా విస్మరించింది. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దుల వెంబడి జనాభా ప్రస్తుత అమరికకు ఎవరూ భంగం కలిగించకూడదు. చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. ‘ఎత్తుకు పై ఎత్తు’పై ఆధారపడిన మన ప్రస్తుత ప్రతిస్పందనా విధానానికి కాలం చెల్లిపోయింది. సరిహద్దు నిర్వహణ మొత్తంగా సమగ్ర సమీక్షకు గురికావాలి. ఇది జాతీయ భద్రతా వ్యూహంలో కీలకమైన అంశంగా ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పటికీ రూపు దాల్చుతూనే ఉంది! మేజర్ జనరల్ జిజి ద్వివేది (రిటైర్డ్) వ్యాసకర్త చైనాకు భారత మాజీ డిఫెన్స్ అటాచె (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
సైన్యంలోని అవినీతిపై చైనా పోరాటం
2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ)లోని అవినీతిని తొలగించలేకపోయారు. దానికోసం ఆయన అమలు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్పింగ్కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న కనీసం 70 మంది పీఎల్ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ పేర్కొంది. ఇక, తైవాన్ పై దాడికి పీఎల్ఏ సిద్ధంగా లేదని మరో నివేదిక పేర్కొంది. పీఎల్ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి చైనా అధ్యక్షుడు ఒక కఠినమైన ప్రచారం నిర్వహించనున్నారనేది స్పష్టం. గత సంవత్సరం మధ్య నుండి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ–ప్రజా విముక్తి సైన్యం) ఉన్నత స్థాయులలో స్పష్టంగా గందరగోళం కనిపిస్తోంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) నిర్వహించిన నూతన సంవ త్సర ప్రదర్శనలో జనవరి 29న కనిపించిన సీఎంసీ సీనియర్ వైస్ ఛైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియాను, రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫును ఆకస్మికంగా తొలగించడం గురించి సుదీర్ఘకాలంపాటు చైనా ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. వీరిద్దరికీ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్తో సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉండటం అనిశ్చితిని మరింతగా పెంచింది. అవినీతి లేదా రాజకీయ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలపై చాలా మంది సీనియర్ అధికారులను ఇటీవలి నెలల్లో పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై విచారణలో ఉంచిన కనీసం 70 మంది పీఎల్ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ (మేధా సంస్థ) పేర్కొంది. అదనంగా, తైవాన్ పై దాడికి పీఎల్ఏ సిద్ధంగా లేదని పీఎల్ఏ అధికారులు జిన్ పింగ్కు తెలియజేసినట్లు మరో నివేదిక పేర్కొంది. అవినీతిని నిర్మూలించడం, రాజకీయ క్రమశిక్షణ, విశ్వసనీయతను నిర్ధారించడంపై చైనా అధ్యక్షుడు దృష్టి సారించడంతో, పీఎల్ఏ పూర్తిగా ‘ప్రక్షాళన’ లేదా దిద్దుబాటుకు లోనవుతుందనే విషయం దాదాపు నిశ్చయమైంది. కదులుతున్న సోపానక్రమం గత ఏడాది సెప్టెంబర్లో జనరల్ లీ షాంగ్ఫు ఆకస్మికంగా ప్రజల దృష్టి నుండి అదృశ్యమైనప్పటి నుండి, ఇది ఎందుకు జరిగింది, అతని స్థానంలో ఎవరు ఉంటారు? అనే దానిపై నిరంతర ఊహాగానాలు కొనసాగుతున్నాయి. జిన్ పింగ్ మరొక ఆశ్రితుడైన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ జూలైలో ఆకస్మికంగా, ఇప్పటికీ వివరించలేని విధంగా అదృశ్యమవడం కారణంగా మరింతగా ఊహాగానాలు పెరిగాయి. బహుశా వారు అవినీతికి పాల్పడ్డారనీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనీ ఆ తర్వాత సంకేతాలు వచ్చాయి. ఆసక్తికరంగా, వీరిద్దరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా తమ స్థానాన్ని మాత్రం నిలుపుకొన్నారు. 2023 సంవత్సరం అక్టోబరులో జనరల్ లి షాంగ్ఫు అధికారికంగా రక్షణ మంత్రి పదవి నుండి వైదొలిగారు. అయితే పీఎల్ఏ మాజీ నేవీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ ను ఆయన వారసుడిగా నియమించటానికి మరో మూడు నెలలు పట్టింది. మొదటిసారిగా, మాజీ పీఎల్ఏ నేవీ కమాండర్ను రక్షణ మంత్రిగా నియమించడం వలన పీఎల్ఏ పదాతి బలగం, పీఎల్ఏ రాకెట్ బలగం గురించి సందేహాలు తలెత్తాయి. అదే సమయంలో, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జనరల్ జాంగ్ చాలా కాలం గైర్హాజరు కావడం, మళ్లీ అడపాదడపా సుదీర్ఘకాలం కనిపించకపోవడం వల్ల, జిన్పింగ్తో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని ఊహాగానాలు వచ్చాయి. జనవరి 16న బీజింగ్లోని సెంట్రల్ పార్టీ స్కూల్లో ‘అధిక నాణ్యత, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం’పై జరిగిన అధ్యయన సెషన్లో జనరల్ జాంగ్, జనరల్ హీ వీడాంగ్ వెనుక మూడవదైన చివరి వరుసలో కూర్చున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని సీసీటీవీ కవరేజి చూపించింది. ఇది పీఎల్ఏ సోపానక్రమం విషయంలో చాలా అసాధారణమైనది తనిఖీ పరిధిలోకి వచ్చినప్పటికీ... పీఎల్ఏలో దశాబ్దాలుగా అవినీతి రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. 2012 నవంబర్లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా జిన్పింగ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పీఎల్ఏను చైనా కమ్యూ నిస్టు పార్టీకి చెందిన అవినీతి నిరోధక సంస్థ అయిన కేంద్ర క్రమశిక్షణా తనిఖీ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. దానిని ఏడాది పొడవునా సైద్ధాంతిక, అవినీతి వ్యతిరేక ప్రచారాలకు గురిచేశారు. పీఎల్ఏ ఆధు నీకరణ, ఆల్–రౌండ్ టెక్నాలజీ అప్గ్రేడ్పై కొత్త, ప్రధాన ప్రాధాన్యత కారణంగా భారీ మొత్తంలో డబ్బు అందుబాటులోకి వచ్చేది. పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ ముఖ్యంగా క్షిపణుల జాబితాను పెంచడానికి, కొత్త రకాల క్షిపణులను ప్రవేశపెట్టడానికి, అనేక భూగర్భ గోతులను నిర్మించడానికి చేసిన కృషి కారణంగా పెద్ద మొత్తాలను అందుకుంది. పీఎల్ఏ సామగ్రి అభివృద్ధి విభాగానికి సంబంధించిన రక్షణ శాస్త్రీయ సంస్థల్లోని అధికారుల తొలగింపు, వారు కూడా అవినీతికి పాల్ప డ్డారని నిర్ధారిస్తుంది. తాను కనీవినీ ఎరుగని స్థాయిలో అవినీతి వ్యతిరేక ప్రచారం సాగించినప్పటికీ, పీఎల్ఏలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి కొనసాగడంపై జిన్ పింగ్ ఆగ్రహం చెందారు. దీని ఫలితంగా 2017 నాటికి అవినీతి ఆరోపణలపై 40 శాతం మంది అధికారులను తొలగించారు. రిపోర్టింగ్, పర్యవేక్షణ యంత్రాంగం పని చేయలేదనీ, దానిని పర్య వేక్షించడానికి పార్టీ చేసిన ప్రయత్నాలను పీఎల్ఏ ప్రతిఘటించిందనీ ఇది సూచిస్తుంది. దీనికి అనుగుణంగా, 2024 జనవరి 1న నాటి పీఎల్ఏ దినపత్రిక సంపాదకీయం, అవినీతిపై పోరాటానికి ప్రాధాన్య తనిస్తూ మూడుసార్లు ‘అవినీతి’ని ప్రస్తావించింది! అప్పటి నుండి, పీఎల్ఏ అవినీతిని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే దాదాపు అరడజను కథనాలు వచ్చాయి. కఠిన ప్రచారం ఇంతలో, రహస్య పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ కమాండర్, పొలిటికల్ కమిస్సార్, జనరల్ లీ యుచావో, జనరల్ గ్జూ జోంగ్బోలను, వరు సగా వారి పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై వీరిపై విచారణ సాగించారు. విశ్వసనీయ నివేదికల ప్రకారం, ఈ అవినీతి సొమ్ము విలువ మొత్తం 2 బిలియన్ డాలర్లు అని అంచనా. డిసెంబర్ 29న, చైనా పార్లమెంటుగా పేర్కొనే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొమ్మిది మంది సీనియర్ పీఎల్ఏ అధికారులను వారి పదవుల నుండి తొలగించింది. 2023 జూన్ లో, అణువ్యతిరేక దాడిని ప్రారంభించడం కోసం చర్యలను పర్యవేక్షించిన జనరల్ లి యుచావో, జనరల్ జు, ఆయన సహాయకులు లియు గ్వాంగ్బిన్, జాంగ్ జెన్ జాంగ్లను కూడా వారి పదవుల నుండి తొలగించారు. పీఎల్ఏ సామగ్రి అభివృద్ధి విభాగం అధికారులైన జాంగ్ యులిన్, రావో వెన్ మిన్ లను తొలగించడం మరింత ఆసక్తికరంగా ఉంది. గత నెల ప్రారంభంలో, దాదాపు 15 మంది సీనియర్ పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ అధికారులను కూడా తొలగించి విచారణలో ఉంచారు. వారిలో ఐదుగురు ఆ సంస్థకు చెందిన గత లేదా ప్రస్తుత కమాండర్లు. 2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, జిన్పింగ్, పీఎల్ఏ నుండి అవినీతిని తొలగించలేకపోయారు. పైగా ఆయన అమలులో ఉంచిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్పింగ్కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. జనరల్ లి షాంగ్ఫు వంటి ఆయన సన్నిహిత వ్యక్తులు కూడా వారి స్థానాల నుండి తొలగించబడిన అధికారులలో ఉన్నారు. పీఎల్ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి ఒక కఠినమైన కేంపెయిన్ నిర్వహించనున్నారని స్పష్టం అవుతోంది. జయదేవ రానాడే వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ చైనా ఎనాలిసిస్ అండ్ స్ట్రాటెజీ’ అధ్యక్షుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి!
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి! -
బైడెన్తో జిన్పింగ్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చైనా అధినేత షీ జిన్పింగ్ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. -
చైనా బిగ్ ప్లాన్.. పుతిన్ మద్దతు
తాయ్ పీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో ఇరు దేశాల బంధం ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఈ పర్యటన తాజా నిదర్శనమని అంటున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా అవి ఇప్పటికే పరోక్షంగా జట్టు కట్టడం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలుకుతోంది. విదేశాల్లో ఆర్థిక, భౌగోళిక, దౌత్యపరమైన ఆధిపత్యం సాధించేందుకు చైనా ప్రదర్శిస్తున్న దూకుడుకు రష్యా దన్నుగా నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు (బీఆర్ఐ)కు కూడా రష్యా మద్దతు పలుకుతోంది. ఆ ప్రాజెక్టులో తనకేమీ తప్పుడు ఉద్దేశాలు కనిపించడం లేదని చైనా అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పారు కూడా. బీఆర్ఐ పదో వార్షికోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. దీని ద్వారా మధ్య ఆసియాలోని మాజీ సోవియట్ యూనియన్ దేశాల మధ్య ఆర్థిక బంధం ఏర్పాటు చేయాలని ఆశాభావం వెలిబుచ్చారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగేందుకు కొద్ది వారాల ముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు. ఇక జిన్ పింగ్ కూడా మార్చిలో రష్యాలో పర్యటించారు. ఆ దేశంపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను దుయ్యబట్టారు. ఇది కూడా చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి -
చైనాపై నిరసనల హోరు.. జిన్పింగ్ దిష్టిబొమ్మ దహనం
ఇటానగర్: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఆటగాళ్ల కోచ్కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు -
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్!
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్! -
జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్పింగ్ సహా..
ఢిల్లీ: రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనుంది. కాగా, కోవిడ్ కారణంగా మరో నేత జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్కు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో జీ-20 సదస్సుకు ఆయన హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో, మరో కీలక నేత సమావేశాలకు దూరమయ్యారు. వివరాల ప్రకారం.. జీ-20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో సమావేశాలకు రావడంలేదని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా శాంచెజ్..‘గురువారం నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. దీంతో, ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. జీ-20 సమావేశాల్లో స్పెయిన్ తరఫున వైఎస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని’ చెప్పారు. అలాగే, యూరోపియన్ యూనియన్(ఈయూ) సహకారం ఉంటుందన్నారు. Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20. Me encuentro bien. España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación. — Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023 ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు.. ఇదిలా ఉండగా.. ఢిల్లీ కేంద్రంగా జరుగనున్న జీ-20 సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇక, ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా హాజరు కావడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ జీ-20 సమావేశాల్లో పాల్గొనడం లేదు. దీంతో, ముఖ్యమైన మూడు దేశాల నుంచి అధ్యక్షులు సమావేశాలకు హాజరు కావడం లేదు. ► మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. ► జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. ఇది కూడా చదవండి: ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? -
గైర్హాజరీ సందేశం!
అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది. వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి. బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్ పెంచు కోవడంతో డ్రాగన్కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు ఈ మధ్య బీజింగ్కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి. గత నవంబర్లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్గానైనా హాజరయ్యారు. గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి. మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు. నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. డ్రాగన్ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్’లో భారత్ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు. జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే! -
జీ20 సదస్సుకు జిన్పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
జీ 20 సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు.. స్పందించిన బైడెన్
భారత్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలు జరిగే దేశ రాజధానిలో భారత్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జీ 20 సభ్య దేశాల అధినేతలతోపాటు ఇతర దేశాల అగ్రనేతలు సైతం హాజరుకానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలను పకడ్బందీగా చేపట్టింది. ఈ సదస్సుకు తాను రాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పేర్కొన్నారు. ఆయన తరపున రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరుకానున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సైతం గర్హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ మధ్య చైనాతో సరిహద్దు వివాదం తెరపైకి రావడంతో జిన్పింగ్ జిన్పింగ్ రాకపై సందిగ్ధం నెలకొంది. అంతేగాక ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. డెలావేర్లోని రెహోబోత్ బీచ్లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత్లో జరిగే జీ20 నేతల శిఖరాగ్ర సమావేశానికి జిన్పింగ్ రావడం లేదనే వార్తలు విని కలత చెందినట్లు తెలిపారు. ‘ చైనా అధ్యక్షుడు సదస్సుకు రాకపోవడం నిరాశకు గురి చేసింది. అయినా ఆయన్ను నేను త్వరలోనే చూడబోతున్నాను’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనాకు మించిన విపత్తు: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? అయితే బైడెన్ చైనా అధ్యక్షుడిని ఎక్కడ కలవబోతున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ జిన్పింగ్ ఢిల్లీ రాకపోతే.. నవంబర్లో అమెరికా అతిథ్యం ఇస్తున్న శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే APEC సమావేశంలో వీరిరువురూ కలుసుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సదస్సుకు రెండు రోజుల ముందే అంటే సెప్టెంబర్ 7నే భారత్కు రానున్నారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జీ20 సదస్సులో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ వంటి అంశాలతోపాటు ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలపై ఈ సందర్భంగా సభ్య దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు. అనంతరం బైడెన్.. వియత్నాం పర్యటకు వెళ్తారు ఇక భారత్లో పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు బైడెన్ తెలిపారు. తనకు మరికొంత సమన్వయం కావాలి. భారత్, వియత్నాం రెండూ యూఎస్తో చాలా సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని, అది చాలా తమకు కూడా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్లో చేర్చడం ఎందుకూ..
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్లో చేర్చడం ఎందుకూ.. భయపడి వెళ్లకుండా ఉండటమెందుకు.. సార్! -
జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు!
న్యూఢిల్లీ: జీ20 దేశాల అధినేతల ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల 9, 10న ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాదినేతలు హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిన్పింగ్ హాజరయ్యే అవకాశం లేదని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. బదులుగా ప్రధానమంత్రి లీ కియాంగ్ రావొచ్చని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ çకూడా సదస్సుకు రావడం లేదు. -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్బర్గ్లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
బ్రిక్స్ మీటింగ్లో జిన్పింగ్కు అనుకోని ఘటన..
జోహెన్నస్బర్గ్: జోహెన్నస్బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అయోమయ ఘటన ఎదురైంది. సమావేశానికి హాజరయ్యే క్రమంలో జిన్పింగ్ సెక్యూరిటీని అడ్డుకున్నారు అక్కడి భద్రతా సిబ్బంది. తన వెనక ఏం జరిగిందో తెలియని జిన్పింగ్ సందేహాంగా వెనక్కి ముందుకు చూస్తూ వెళ్లారు. బ్రిక్స్ మీటింగ్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన భేటీ జరిగే సెంట్రల్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన వెనకే కొద్ది దూరంలో వస్తున్న వ్యక్తిగత సిబ్బంది వస్తున్నారు. జిన్పింగ్ హాల్లోకి అడుగుపెట్టగానే ఆయన్ని వెనకే వెళ్లాలనుకున్న పర్సనల్ సెక్యూరిటీ వేగంగా వచ్చారు. జిన్పింగ్ వ్యక్తిగత సిబ్బంది నడక కాస్త అనుమానంగా ఉండే సరికి.. అక్కడి సెక్యూరిటీ వారిని అడ్డగించారు. వెంటన్ డోర్లు మూసుకుపోయాయి. వెనక ఏం జరిగిందో తెలియని జిన్పింగ్.. వెనకకు ముందుకు చూస్తూ వెళ్లారు. South African Security Officers physically stop Chinese Officials from entering BRICS main venue behind Xi Jinping. Forcibly shut the door.🤣🤣🤣#Prigojine #Prigozhin #republicanDebate #Wagner #BRICSSummit2023 #XiJinping #BRICS #BRICSSummit2023 #BRICSSummit #ChinaNews #China pic.twitter.com/dY4CgLZadq — Mr. R V (@Havoc3010) August 24, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జిన్పింగ్కు అయోమయ పరిస్థితి ఎదురైందని నెటిజన్లు కామెంట్ పెట్టారు. అయితే.. దక్షిణాఫ్రికా జోహెన్నస్బర్గ్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదీ చదవండి: వీడియో: బ్రిక్స్లో జిన్పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం -
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్గాంగ్ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్కాంగ్కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్తో వివాహేతర సంబంధమే చిన్గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్గాంగ్కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్బాల్ క్లబ్కి యజమాని కూడా అయిన గ్వాంగ్చాంగ్ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు!
చైనా కుబేరుడు జాక్ మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిన్పింగ్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్కడి సర్కారుకు టార్గెట్గా మారిపోయారు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలతో జాక్ మా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. తాజాగా, జాక్మా అధినేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాంట్ గ్రూప్కు డ్రాగన్ కంట్రీ 1 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని తప్పని సరిగా చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. ఇంతకీ జిన్పింగ్ జాక్మాపై కక్ష పెంచుకోవడానికి అసలు కారణాలేంటీ? అలిబాబా సహ వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ అధినేత జాక్మాపై జిన్పింగ్ ఆంక్షలు విధించడంతో ఆయన జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోనూ ఉండాల్సి వచ్చింది. అయితే, అంత అకస్మాత్తుగా ఆయన్ని ప్రభుత్వం టార్గెట్ చేయడానికి ఓ బలమైన కారణం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే ఆయన పాలిట శాపమా ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ఏదైనా ఒక్క పొరపాటు లేదా తప్పుడు నిర్ణయం కూడా మనిషిని ఉన్నత శిఖరాల నుంచి అగాధంలోకి నెట్టేస్తుంది. అపర కుబేరుడు జాక్ మా విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్తో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ కోటాను కోట్లు వెనకేసుకున్న దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవాలనే బుద్ధి పుట్టింది. అదే ఆయన పాలిట శాపమైంది. జిన్పింగ్కు మింగుడు పడలేదు 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవడమే జాక్ మా కొంపముంచింది. చైనా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ట్రంప్తో భేటీ అయ్యారు. అంతేకాదు, అమెరికాలో 10లక్షల ఉద్యోగాలు సృష్టస్తామని హామీలిచ్చారు. అది సరిపోదున్నట్లు చైనాలో జరిగే ఓ బిజినెస్ సమ్మిట్లో దేశ ఆర్ధిక వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఇదిగో ఈ తరహా ధోరణే చైనా పాలకులకు ఏమాత్రం మింగుడుపడలేదు. పైగా చైనాను కట్టడి చేసేలా అనేక చర్యలు తీసుకుంటున్న ట్రంప్ను కలవడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదిగో అప్పటి నుంచి జాక్మాను చైనా ప్రభుత్వం వేధిస్తూ వస్తుంది. రోజుకు 7వేల కోట్ల నష్టం యాంట్ ఐపీవోను అడ్డుకుంది.టెక్నాలజీ, స్థిరాస్థి, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీ ఇలా అన్నీ వ్యాపారాలను ఆంక్షలతో కుదేలయ్యేలా చేసింది. ఏడాది తిరిగే లోపు దాదాపు రూ.25లక్షల కోట్లు నష్టపోయారు. అంటే రోజుకు రూ.7వేల కోట్లన్న మాట. అందుకే చైనాలో ప్రభుత్వాన్ని ఎదిరించి మనుగడ సాధించడం కష్టం. ఈ విషయం తెలుసుకున్న జాక్మా జిన్ పిన్ ప్రభుత్వంతో రాజీ పడ్డారు. దేశాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే కానీ చైనా ప్రభుత్వం జాక్ను కనికరించలేదు. సరికాదా కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో జాక్మాకు చైనా ప్రభుత్వం ఫైన్ విధించింది. జరిమానా విధించినా..భవిష్యత్లో జాక్ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే వాదన వినిపిస్తుంది. చైనా టాప్ సెక్యూరిటీ రెగ్యులేటర్ పరిశ్రమలపై ఆంక్షల విధించే సమయం ముగియనుంది. కాబట్టే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘలన పేరుతో జాక్ మాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. మా’ 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని షరతు పెట్టింది. ఊరట కలిగేనా 2020లో యాంట్పై అణిచివేత తర్వాత, దాని మాతృ సంస్థ అలీబాబా రికార్డు స్థాయిలో 2.8 బిలియన్ల యాంటీట్రస్ట్ పెనాల్టీని విధించిన డ్రాగన్ కంట్రీ అధికారులు. దీంతో పాటు రైడ్-హెయిలింగ్ కంపెనీ దీదీకి సైతం 1.2 బిలియన్ల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం జాక్మాకు ఊరట కల్పిస్తుందా? లేదంటే మరింత ఇబ్బందులు పెడుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. చదవండి : పాకిస్తాన్లో జాక్మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
జిన్పింగ్ ఓ నియంత: బైడెన్
జిన్పింగ్ ఓ నియంత: బైడెన్ -
ఎట్టకేలకు ఒక ముందడుగు!
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు... ఒకదానిపై మరొకదానికి ఒంటి నిండా అనేక అనుమానాలు, అపనమ్మకాలు. అలాంటి దేశాలు కూర్చొని చర్చించుకుంటే అది పెద్ద విశేషమే. అమెరికా, చైనాల మధ్య ఈ వారం అదే జరిగింది. అస్తుబిస్తుగా ఉన్న తమ సంబంధాలను చక్కదిద్దు కొనేందుకు అవసరమైన ఒక అడుగు ముందుకు వేశాయవి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజా చైనా పర్యటన అనేక విధాల గుర్తుండిపోయేది అందుకే. 2018 తర్వాత గడచిన అయిదేళ్ళలో అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా చివరిరోజైన సోమవారం సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సైతం బ్లింకెన్ సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నించడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. అరుదైన ఈ పర్యటనలో కళ్ళు చెదిరే కీలక ప్రకటనలేవీ లేకపోవచ్చు. కానీ, అసలంటూ ఘర్షణ వాతావరణాన్ని ఉపశమింపజేసి, తమ మధ్య సంబంధాలను సమస్థితికి తీసుకురావాలని రెండు దేశాలూ అంగీకరించడమే అతి పెద్ద వార్త అయింది. పరస్పరం నిష్కర్షగా అభిప్రాయాలు పంచు కొన్న ఈ చర్చలు భవిష్యత్తు పట్ల ఆశలు రేపాయి. నిజానికి, మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి కొన్నేళ్ళుగా అమెరికా తన దూకుడు చర్యలతో డ్రాగన్కు కోపం తెప్పించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ గాడిన పెట్టాలనుకున్నా, ఫిబ్రవరిలో గగనతలంలో పయనిస్తూ భారీ బెలూన్ అమెరికాలో కనిపించేసరికి వ్యవహారం ముదిరింది. చైనా బెలూన్ గూఢచర్యానికి పాల్పడుతోందంటూ ఆరోపణలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాహాటంగానే చైనాను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బ్లింకెన్ తాజా చైనా పర్యటన, సత్సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక విధంగా– బీజింగ్తో సంభాషణ వాషింగ్టన్ ఏరికోరి ఎంచుకున్నది కాదు. తప్పనిసరి అనివార్యత. తాజా సంభాషణల్లో సైతం బీజింగ్ తన మూతి బిగింపు పూర్తిగా వీడినట్టు లేదు. ఆ దేశం కాస్తంత నిష్ఠురంగానే ఉన్నా వైట్హౌస్ వర్గం తమ పని తాము కొనసాగించక తప్పదు. స్వీయ ప్రయోజనాల రీత్యా డ్రాగన్తో మాటామంతీ కొనసాగింపే అమెరికాకు ఉన్న మార్గం. కొద్ది వారాలుగా ఈ ప్రయత్నాలు కాస్త ముమ్మరించాయి. చైనాకు చెందిన అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ గత నెల వియన్నాలో రెండు రోజులు ‘‘నిర్మాణాత్మక’’ సమావేశాలు జరపడాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఫలితంగా అమెరికా వాణిజ్య కార్యదర్శి, చైనా వాణిజ్య శాఖ మంత్రితో అమెరికాలో మాట కలిపేందుకు తలుపులు తెరుచుకు న్నాయి. ఇక, మధ్యశ్రేణి అమెరికన్ అధికారులు బీజింగ్లో పర్యటించారు. అమెరికా గూఢచారి విభాగం సీఐఏ డైరెక్టర్ సైతం సద్దు లేకుండా చైనా సందర్శించిన సంగతి మర్చిపోలేం. దీన్నిబట్టి భౌగోళిక రాజకీయాలకు అతీతంగా డ్రాగన్తో దోస్తీకి అగ్రరాజ్యం చేయిచాస్తోందని అర్థమవుతోంది. బంధాలు మెరుగుపడడం దేవుడెరుగు, కనీసం మరింత క్షీణించకుండా ఆపడానికి బ్లింకెన్ పర్య టన ఉపకరిస్తుంది. తక్షణ ప్రయోజనాలు ఆశించలేం కానీ, చైనా విదేశాంగ మంత్రితో, అగ్ర దౌత్య వేత్తతో ‘నిక్కచ్చిగా’ సంభాషణలు సాగడంతో, ఆఖరి రోజున డ్రాగన్ దేశాధినేతతో బ్లింకెన్ భేటీకి మార్గం సుగమం అయింది. రానున్న రోజుల్లో ఇది రెండు అగ్రరాజ్యాల అధినేతల మధ్య భేటీకి దారి తీయగలదని ఆశించడానికి వీలు కలిగింది. సైనిక ఘర్షణ ముప్పును తగ్గించుకోవాలని రెండు దేశాలూ ఒకే ఆలోచనకైతే వచ్చాయి. ఈ దిగ్గజ దేశాల మధ్య బంధం సుస్థిరంగా ఉండడం ప్రపంచ శాంతికి సైతం అవసరం. నిజానికి, చైనా ఆశలు, ఆకాంక్షలు అపరిమితమే అయినా, షీ మాత్రం విశ్వనేతగా అమెరికా స్థానంలోకి రావాలనే ఆలోచన, వ్యూహం తమకు లేదని చెబుతున్నారు. చైనా తనదిగా ప్రకటించుకొనే స్వయంపాలిత ద్వీపం తైవాన్కు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తైవాన్పై డ్రాగన్ వేసే అడుగులను గ్రహించడంలో అంచనాలు తప్పితే ప్రమాదం తప్పదన్న తెలివిడి అమెరికాకు ఉంది. అందుకే, సంబంధాల మెరుగుదలకు, మరీ ముఖ్యంగా సైనిక చర్చల పునరుద్ధరణకు వాషింగ్టన్ తహతహలాడింది. కానీ, తమ రక్షణ మంత్రిపైన అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న వేళ బీజింగ్ అందుకు ఇష్టపడలేదు. అమెరికా మరింత స్పష్టమైన చర్యలతో, సంకల్పంలో నిజాయతీ ఉందని నిరూపించుకొనేలా ముందుకు రావాలని చూస్తోంది. ఆ మాటకొస్తే, గతంలో తనకూ, బైడెన్కూ మధ్య కుదిరిన ఒప్పందాల పైనే ఇరుపక్షాలూ ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని బ్లింకెన్కు షీ గుర్తు చేశారు. రానున్న నెలల్లో పరిణామాల్ని బట్టి, షీ– బైడెన్ల శిఖరాగ్ర సమావేశానికి అవకాశాలుంటాయి. సొంతగడ్డపై రాజకీయ ఒత్తిళ్ళ రీత్యా చైనాపై కఠిన వైఖరిని బైడెన్ సర్కార్ ఏ మేరకు మార్చుకో గలుగుతుందన్నది సందేహమే. అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారం దగ్గరవుతున్న వేళ బైడెన్కు అది మరీ కష్టం. అయితే, భౌగోళిక రాజకీయాల్లో పొరపొచ్చాలెన్ని ఉన్నా, ప్రపంచ కుగ్రామంలో ఆర్థిక అనివార్యతలే కీలకమనే స్పృహ ఈ అగ్రశక్తులు రెంటికీ పుష్కలం. అదే ఇప్పుడు ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని వదిలించుకొనే మాటలకు దృశ్యాదృశ్య హేతువు. పరిమిత సహకారం, ఉద్రిక్తతల్లో కొంత ఉపశమనం సరిపోతాయా? చెప్పలేం. కానీ, నిరంతర సంభాషణలకు సిద్ధంగా ఉన్నామన్న ఈ సంకేతమే గనక ఇవ్వకుంటే, విశ్వశాంతికి కీలకమైన బంధాన్ని చేతులారా చెడగొడుతున్న బాధ్యతారహిత పెద్దన్నలనే ముద్ర మిగిలిపోతుంది. ఆ ఎరుక అమెరికా, చైనాలకు దండిగా ఉంది. -
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
చైనా చాట్జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా?
బీజింగ్: చైనాలో చాట్ జీపీటీని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా ఎర్నీ బోట్ అనే అనే ఏఐ చాట్బోట్ను బీజింగ్కు చెందిన బైడు అనే టెక్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చాట్బోట్పై కూడా చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ గురించి గానీ, కరోనాకు సంబంధించి విషయాలు గానీ యూజర్లు అడిగితే.. ఎర్నీ బోట్ తప్పుడు సమాధానాలు ఇస్తోంది. అంతేకాదు జిన్పింగ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అభ్యంతకర ప్రశ్నలు అడిగినా.. ఆ యూజర్లు మరోసారి ప్రశ్నలు అడగకుండా శాశ్వతంగా బ్యాన్ చేస్తోంది. ఎర్నీ బోట్ పనితీరును పరీక్షించేందుకు సీఎన్బీసీ రిపోర్టర్ ఒకరు పలు ప్రశ్నలు సంధించారు. కోవిడ్-19 మూలాలు ఎక్కడున్నాయ్..? అతని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానంగా.. 'కరోనా మూలాలపై ఇంకా శాస్త్రీయ పరిశోధన జరుగుతోంది' అని బదులిచ్చింది. కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మొదటి కేసు వెలుగు చూసింది అక్కడే. వుహాన్ల్యాబ్లోనే కరోనాను సృష్టించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఎర్నీ బోట్ మాత్రం ఇందుకు సంబంధించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. తప్పుడు సమాధానం ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు, విన్నీ పూహ్కు మధ్య సంబంధం ఏంటి? అని రిపోర్టర్ మరో ప్రశ్న అడగ్గా.. ఎర్నీబోట్ ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. అనంతరం రిపోర్టర్ మరో ప్రశ్న అడగకుండా అతడ్ని డిసేబుల్ చేసింది. విన్నీ ది ఫూహ్ అనేది ఓ కార్టూన్. ఇది జిన్ పింగ్ను పోలి ఉంటుంది. అందుకే అదంటే జిన్పింగ్కు అస్సలు నచ్చదు. 2013 నుంచి జిన్పింగ్, విన్నీ పూహ్లను పోల్చడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను జిన్పింగ్ కలిసిప్పటి నుంచి ఇది మొదలైంది. వీరిద్దరు కలిసి నడుస్తున్న ఫొటోను ఓ అమెరికా కళాకారుడు కార్టూన్ రూపంలో తీర్చిదిద్దగా.. అందులోని విన్నీ పూహ్ బాగా పాపులర్ అయింది. 2017 నుంచి ఈ కార్టూన్తో ప్రచురితమయ్యే ఫొటోలను, కంటెంట్ను చైనా సెన్సార్ కూడా చేస్తోంది. చదవండి: భారత్కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..? -
చైనా వింత చేష్టలు!
దౌత్యం ఒక ప్రత్యేక కళ. అవతలి పక్షం నుంచి రాబట్టుకోవాలన్నా, మనం ఇచ్చేది ఘనంగా కనబడేట్టు చేయాలన్నా నేర్పుతో, ఓర్పుతో, చాకచక్యంతో మాట్లాడాల్సివుంటుంది. చైనాది మొరటు పద్ధతి. అక్కడి పాలకులకు ఆంతరంగికంగా ఇబ్బందులెదురైనా, సరిహద్దు అవతల తనకు నచ్చని పరిణామం చోటుచేసుకున్నా వెంటనే తన సైనికులను హద్దు దాటించి అలజడి రేకెత్తించటం అలవాటు. అలాంటిది కుదరనప్పుడు నామకరణ మహోత్సవానికి దిగటం రివాజు. తాజాగా చైనా చేసిందదే. ఒక ప్రాంతానికి దక్షిణ టిబెట్ ప్రాంతమని పేరెట్టి, మాండరిన్ భాషాపదమైన జంగ్ నన్గా దాన్ని వ్యవహరిస్తూ మన అరుణాచల్ ప్రదేశ్ అందులో భాగమని ఎప్పటినుంచో వాదిస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్కు సమీపంలోని పట్టణంతో సహా 11 ప్రాంతాలకు తన సొంత పేర్లతో తాజా జాబితా విడుదల చేసింది. ఇందులో అయిదు పర్వత శిఖరాలు, రెండు జనావాస ప్రాంతాలు, రెండు నదులు, మరో రెండు ఇతర స్థలాలు ఉన్నాయి. లోగడ 2017లో ఒకసారి, 2021లో మరోసారి చైనా ఈ నామకరణ మహోత్సవాలు చేసింది. చైనా దబాయింపులపై ఎప్పటి కప్పుడు మన దేశం అభ్యంతరం చెబుతూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా పేర్ల జాబితా విడుదల చేస్తూ ‘చారిత్రక, పాలనాపర అంశాల ప్రాతిపదికగా’ కొత్త పేర్లు పెట్టామని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పుకుంటోంది. చరిత్ర తిరగేస్తే జనం ఒకచోటు నుంచి మరో చోటుకు స్వేచ్ఛగా సంచరిస్తూ వెళ్లటం, ఎక్కడ జీవనం సవ్యంగా గడుస్తుందనిపిస్తే అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవటం కనబడుతుంది. ఈ ఆవాసాలకూ, దారిలో తారసపడే ప్రదేశాలకూ, నదులకూ, పర్వతాలకూ పేర్లు పెట్టడం కూడా మామూలే. దేశాలు తమ తమ సరిహద్దుల్ని ఖరారు చేసుకోవటం ఇంచుమించు 17వ శతాబ్దంలో మొదలైంది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దుల విషయంలో సమస్య ఏర్పడినప్పుడల్లా చరిత్రలో ఆ ప్రాంతాలకు మాండరిన్ భాషలో ఫలానా పేరుందని, కనుక అది తమదేనని మర్కట తర్కానికి దిగటం చైనాకు తెలిసిన విద్య. మన దేశంతో మాత్రమే కాదు... దక్షిణాసియాలో ఇంచుమించు చాలా దేశాలతో దానికి ఇదే తగువు. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని రెండు ప్రధాన ద్వీప సమూహాల్లోని స్ప్రాట్లీ, పరాశల్ దీవుల విషయంలో బ్రూనై, ఇండొనేసియా, మలే సియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాంలతో చైనాకు లడాయి నడుస్తోంది. శతాబ్దాల క్రితం చైనీ యులు చేపల వేటకు ఉపయోగించిన మార్గాన్ని ‘ఖరారు’ చేసి ఆ ప్రాంతమంతా తనదేనని వాదించటం చైనాకే చెల్లింది. ఆ లెక్కన హాంకాంగ్ మొదలు బోర్నియో వరకూ గల దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని 35 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 90 శాతం చైనాదే అవుతుంది! తూర్పు చైనా సముద్ర ప్రాంతంలోని సెంకాకు దీవులు జపాన్ అధీనంలో ఉండగా హఠాత్తుగా ఆ ప్రాంతాన్ని దియోయూ అంటారనీ, అది తనదేననీ 1950లో పేచీకి దిగింది. చైనా ఇలా పేర్లు మార్చినప్పుడల్లా అది జారీచేసే పాస్పోర్టుల్లోనూ, అంతర్జాతీయ మీడియాకు విడుదల చేసే ప్రకటనల్లోనూ ఆ కొత్త పేర్లు వచ్చి కూచుంటాయి. దేశదేశాల్లో ఉండే చైనా పౌరులు వాటిని పదే పదే వల్లిస్తారు. ఈ తంతు అంతా పూర్తి చేశాక తన భూభాగాన్ని అవతలి పక్షం ‘చట్టవిరుద్ధంగా’ ఆక్రమించుకున్నదని అదును చూసుకుని గొడవ మొదలెడుతుంది. వివాదాలు ముదిరి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు కెళ్లినప్పుడు ఆ ప్రాంతం తన పాలనా నిర్వహణలోనే ఉన్నదని చెప్పుకోవటం, దానికున్న పేరు తాను పెట్టిందేనని నిరూపించుకోవటం, సంబంధిత మ్యాప్లు చూపటం అవసరమవుతుంది. ఇలా చడీచప్పుడూ లేకుండా చిన్నగా వివాదం ప్రారంభించటం, ఆనక దాన్ని పెద్ద సమస్యగా మార్చటం చైనాకు అలవాటు. వియత్నాంతో ఉన్న వివాదం విషయంలో అది మరింత వింతగా ప్రవర్తించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా వాదనకు అనుగుణమైన మ్యాప్ ముద్రించి ఉన్న టీ షర్టులతో 2018లో 14 మంది చైనా పర్యాటకులు వచ్చినప్పుడు వియత్నాం ప్రజలు ఆగ్రహంతో రగిలి పోయారు. ఆ టీ షర్టులు తీసేవరకూ బయటకు అడుగుపెట్టనీయబోమని విమానాశ్రయ అధికారులు చెప్పటంతో గత్యంతరంలేక వారు మార్చుకోవాల్సి వచ్చింది. చూడటానికి ఇది తుంటరి చేష్టగా కనబడుతుంది. పెద్ద పట్టించుకోవటం ఎందుకనిపిస్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న చర్యలే మున్ముందు అక్కర కొస్తాయన్నది దాని ఆలోచన. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది. దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మన దేశం మొదటినుంచీ అన్నివిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా దలైలామాను మన అధికార పక్ష నేతలు కలిసినప్పుడో, అరుణాచల్ ప్రదేశ్లో కేంద్రమంత్రులు పర్యటించినప్పుడో నిరసన స్వరం వినిపించటం చైనాకు అలవాటు. మరికొన్ని వారాల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) మంత్రుల స్థాయి సదస్సుకు చైనా రక్షణ మంత్రి మన దేశం రావాల్సివుంది. జూలైలో ఆ సంస్థ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వస్తారు. ఎస్సీఓకు ప్రస్తుతం మన దేశం సారథ్యం వహి స్తోంది. ఇలాంటి సమయంలో కొత్త తగువు రేకెత్తించాలన్నది చైనా ఎత్తుగడ కావొచ్చు. మన దేశం చెప్పినట్టు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన భౌగోళిక వాస్తవాలు మారిపోవు. వివాదాలు పరిష్కారమై పోవు. వివేకం తెచ్చుకుని హుందాగా వ్యవహరించటం నేర్చుకుంటే గౌరవం నిలబడుతుంది. చిల్లర తగాదాలతో కాలక్షేపం చేద్దామనుకుంటే అది చైనాకే చేటు తెస్తుంది. -
పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు.. రష్యాలో జిన్పింగ్
మాస్కో: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు రష్యాలో ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన సోమవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చల కోసం పుతిన్పై ఒత్తిడి! ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు జిన్పింగ్, పుతిన్ సోమవారం చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జిన్పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరుదేశాల నడుమ ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. ఇద్దరు నాయకుల చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయని రష్యా మీడియా వెల్లడించింది. జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా, సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి నెలకొనాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు జిన్పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడమే లక్ష్యంగా శాంతి చర్చల కోసం పుతిన్పై ఆయన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బద్ధశత్రువులైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవలే చేతులు కలిపాయి. దీని వెనుక చైనా దౌత్యం ఉంది. గత పదేళ్లుగా చైనా అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతూ ఇటీవలే మూడోసారి ఎన్నికైన జిన్పింగ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని ప్రపంచంలో చాలా దేశాలు తప్పుపట్టినప్పటికీ జిన్పింగ్ మాత్రం పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అమెరికా వ్యతిరేకతే చైనా, రష్యా దేశాలను ఒక్కటి చేస్తోంది. శాంతి ప్రణాళికతో వచ్చా: జిన్పింగ్ చైనా, రష్యా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని జిన్పింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. థర్డ్ పార్టీని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. రెండు పెద్ద దేశాల సంబంధాల విషయంలో ఒక కొత్త మోడల్ను అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ లా పరిరక్షణ కోసం రష్యాతో కలిసి పని చేస్తూనే ఉంటామని జిన్పింగ్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానన్నారు. ఉక్రెయిన్లో సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో చైనా చేసిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పుతిన్ తెలిపారు. దీనిపై జిన్పింగ్తో చర్చిస్తానని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ వ్యవహారాలు, సంక్షోభాల విషయంలో చైనా నిష్పాక్షిక, సమతూక వైఖరి అవలంబిస్తోందని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జిన్పింగ్ మాట్లాడే అవకాశమున్నట్లు సమాచారం. తన శాంతి ప్రణాళికను జెలెన్స్కీతో ఆయన పంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
రష్యాను సందర్శించనున్న జిన్పింగ్..నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా..
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చే వారం రష్యాను సందర్శిస్తారని బీజింగ్ మంత్రిత్వశాఖ తెలిపింది. దాదాపు నాలుగేళ్ల అనంతరం జిన్పింగ్ తొలిసారిగా రష్యాలో పర్యటించనున్నారు. ఆయన చివరిసారిగా 2019లో రష్యాను సందర్శించారు. ఐతే జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆహ్వానం మేరకు మార్చి20 నుంచి మార్చి 22 వరకు రష్యాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో వ్యూహాత్మక సహకారంపై ఇరు దేశాల అధ్యక్షులు చర్చించనున్నారు. అలాగే అంతర్జాతీయ వేదికపై రష్యా, చైనాల మధ్య సమగ్ర భాగస్వామ్యం వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చిస్తారని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన ఏడాది తర్వాత జరుగుతున్న చైనా అధ్యక్షుడు తొలి పర్యటన. ఒక వైపు యూఎస్ దాని మిత్ర దేశాలు రష్యాకు రహస్యంగా ఆయుధాలు మద్దతు అందిస్తోందంటూ చైనాపై ఆరోపణలు గుప్పించాయి. అదీగాక చైనా, రష్యా వ్యూహాత్మక మిత్రదేశాలు తమ మధ్య అంతరాలు లేని భాగస్వామ్యం ఉందని పదే పదే చెబుతుండటమే ఈ ఆరోపణలకు ఆజ్యం పోశాయి. కానీ చైనా మాత్రం వాటన్నింటిని ఖండిస్తూ తాము తటస్థవైఖరిని అవలంభిస్తున్నాం అని నొక్కి చెబుతోంది. అంతేగాదు గత నెలలో చైనా యుద్ధంపై 12 పాయింట్ల పొజిషన్ పేపర్లో అన్ని దేశాల సార్వభౌమాధికారంలో కోసం చర్చలతో సమస్యను పరిష్కారించుకోవాలంటూ రష్యా ఉక్రెయిన్ దేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, చైనా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్, రష్యాలను వీలైనంత త్వరగా శాంతి చర్చలు పునః ప్రారంభించాలని కోరారు. అలాగే అన్ని దేశాలు సంయమనం పాటిస్తాయని, వీలైనంత త్వరితగతిన శాంతి చర్చలు ప్రారంభించి రాజకీయ పరిష్కార మార్గంలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాం అని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ఫోన్ కాల్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో అన్నారు. (చదవండి: అమెరికా ఎయిర్ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా చౌధరి)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
- కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
- Lok Sabha Election 2024: లద్దాఖ్లో త్రిముఖ పోటీ
Advertisement