-
ఓటు కోసం హస్తినకేగి..
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, నవలా రచయిత, ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించిన విశ్రాంత ఉద్యోగి డాక్టర్ టి.సంపత్కుమార్ ఓటు హక్కు వినియోగం కోసం ఢిల్లీ వెళ్లారు. 6వ దశ ఎన్నికల్లో భాగంగా శనివారం ఢిల్లీలో పోలింగ్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి డాక్టర్ టి.సంపత్ కుమార్–మాధవీలత దంపతులు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని ద్వారక ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తె లిపారు. సుదీర్ఘకాలంపాటు కెనడీయన్ కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారిగా విధులు నిర్వహించినందున తనకు ఓటు అక్కడే ఉందని తెలిపా రు. ఓటును కచ్చితంగా వినియోగించుకోవాలని దంపతులు ఢిల్లీకి వెళ్లడం స్ఫూర్తినిచ్చే అంశం. -
చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇంద్రవెల్లి: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని యావత్మాల్కు చెందిన కుడ్మిత నితిన్ (40) బంధువులతో కలిసి గురువారం ఇంద్రవెల్లి మండలం గిన్నేర పంచాయతీ పరిధి తోయగూడలో కనక వంశీయులు నిర్వహించిన కులదేవత పూజలకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం బంధువులతో కలిసి స్నానం కోసం చెరువు వద్దకు వెళ్లారు. నితిన్ బహిర్భూమికని చెప్పి కొంత దూరం వెళ్లాడు. బంధువులు స్నానాలు పూర్తయినా ఎంతసేపటికి రాలేదు. అనుమానం వచ్చి గాలించగా ఒడ్డు పక్కనే నితిన్ బట్టలు ఉండడం, అనుమానంతో గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లను చెరువులో గాలించి నితిన్ మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. -
లోకారి(బి)ని సందర్శించిన అధికారులు
నార్నూర్: గాదిగూడ మండలం లోకారి(బి) గ్రా మంలో శుక్రవారం కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఐటీడీఏ ఏవో రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, డీఎల్పీవో ప్రభాకర్, ఎంపీడీవో రమేశ్లు శనివా రం లోకారి(బి) గ్రామాన్ని సందర్శించారు. డిప్యూ టీ డీఎంహెచ్వో విజయ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. వాంతులు, విరోచనాలకు కారణమైన తాగునీటి బావిని పరిశీలించారు. కలుషిత నీరేనా? ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరిపారు. గత 30 ఏళ్లుగా ఆ బావినీటిని గ్రామస్తులు తాగుతున్నారని గ్రామపెద్దలు మేస్రం శేఖర్ వివరించారు. ఎండలోనే పలువురు ఉపాధి, వ్యవసాయ పనులకు వెళ్లారని, ఈ క్రమంలో కొందరికి వాంతులు విరోచనాలైనట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ వాంతులు విరోచనాలకు ఎండ తీవ్రతతో పాటు నీరు కారణమన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. గ్రామాల్లో భగీరథ నీళ్లు తాగకుండా బావినీటినే తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ తెలిపారు. పీహెచ్సీ వైద్యాధికారి సంజీవ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాహుల్, హెల్త్ సూపర్వైజర్ ఆడే సంజీవ్ ఉన్నారు. -
అధికారులతో ట్రిపుల్ఐటీ వీసీ సమీక్ష
భైంసా: బాసర ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జూన్ 5 నుంచి యూనివర్సిటీ ప్రారంభం కానున్ననేపథ్యంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు క్యాంపస్కు వచ్చే స మయంనాటికి సమస్యలు లేకుండా చూ డాలని సూచించారు. ట్రిపుల్ఐటీ క్యాంపస్లో పర్యటించా రు. తరగతి, హాస్టల్ గదుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే పరి ష్కరించాలని సూచించారు. ట్రిపుల్ఐటీలో అన్ని శా ఖ ల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చేయాలని తెలిపారు. నీటి సమస్యలేకుండా చేయాలన్నారు. హాస్టల్ గదుల్లో ఏవైన మరమ్మతులు ఉంటే పూర్తిచేయాలన్నారు.ట్రిపుల్ఐటీలో శా ఖల అధికారులతో నివేదికలు తెప్పించుకున్నారు. -
గరళమా!
మధురఫలమా..● నోరూరించే మామిడిపండ్లు విషతుల్యం ● తి(కొ)నే ముందు అప్రమత్తత అవసరం ● కాల్షియం కార్బైడ్తో మగ్గుతున్న పండ్లు ● ఆరోగ్యానికి హానికరమంటున్న వైద్య నిపుణులునిర్మల్ఖిల్లా: పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి విషతుల్యంగా మారుతోంది. మార్కెట్లోకి వచ్చే కాయలను రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్ ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు విరివిగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మంచిర్యాల చుట్టుపక్కల మామిడితోటల నుంచి కాయలు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. నిషేధిత కార్బైడ్ రసాయనాలు వినియోగించి ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ పండ్లను తినడంతో అనేక అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాగబెట్టిన పండ్లను గుర్తించండిలా..మామిడి కాయలను కార్బైడ్ ద్వారా మాగబెట్టినవి గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ పండ్లపై ఆకుపచ్చని మచ్చలు, పసుపు వర్ణం ఎక్కువగా ఉంటుంది. సహజసిద్ధంగా మాగితే ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు కలిసినట్టుగా ఉంటాయి. పండును కోసినపుడు గుజ్జు ఎరుపు, పసుపు కలిసినట్టుగా ఉంటుంది. పండ్లలో రసం ఎక్కువ, తొడిమ లోపటికి కుంగినట్లుగా ఉంటుంది. ప్రజలు పండ్లను కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో తగ్గిన దిగుబడి..జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి పండిస్తున్న రైతులు నష్టానికి గురయ్యారు. ఉద్యానవన శాఖ అంచనా ప్రకారం.. జిల్లాలో 2,744 ఎకరాల్లో మామిడి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో అకాల వర్షాలకు 671 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో 486 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏటా రావల్సిన దిగుబడి ఈసారి తగ్గింది. వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి మామిడి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యానికి హానికరం రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లు తింటే అనేక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదముంది. జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు చేతులు, తిమ్మిర్లు, నరాల బలహీన తలకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధకత తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. గర్భిణుల్లో హార్మోన్లు దారితప్పుతాయి. సహజపద్ధతిలో పండిన పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. – డాక్టర్ ఎన్.శశికాంత్, ల్యాప్రోస్కొపిక్ సర్జన్, నిర్మల్ఇథిలీన్పై అవగాహన ఏది?రసాయనాలతో పండించిన మామిడి అనారో గ్యానికి కారణమవుతుందని అప్పటి ఏపీ హైకోర్టు నిషేధించింది. ఇథలీన్ వాయువు ద్వా రా పండ్లు మాగబెడితే ఆరోగ్యకరమని కేంద్రం గతంలో ప్రకటించింది. మాగబెట్టే గదులను ఉపయోగించాలని తెలిపింది. ఇందుకోసం రైఫనింగ్ చాంబర్ల ఏర్పాటు కోసం రాయితీ కల్పి స్తోంది. ఇథలీన్ వాడకం, రైఫనింగ్ చాంబర్ల ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఇథలీన్ గ్యాస్ను వదిలి పండ్లను మూడు రోజులపాటు మాగబెడితే సహజసిద్ధంగా ఉంటాయి. మంచి రంగుతోపాటు రుచి ఉంటుంది. ఇథలీన్ గ్యాస్తో ఖర్చు పెరుగుతుందని ఉపయోగించడం లేదని తెలుస్తోంది. -
క్లుప్తంగా
చిన్నారికి రక్తమార్పిడి మంచిర్యాలటౌన్: జన్నారంలో చెత్తకుండీలో పడేసిన శిశువును బాలల సంరక్షణ అధికారులకు అప్పగించగా మంచిర్యాలలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్నారి శరీరంలో రక్తం తక్కువగా ఉండడంతో ఉమెన్ అండ్ చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ ప్రేమ ద్వారా రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు ఇన్చార్జి మధుసూదన్రెడ్డి శిశువుకు అవసరమైన గ్రూప్ రక్తాన్ని ఉచితంగా అందజేశారు. రక్తమార్పిడి తర్వాత మాతాశిశు కేంద్రానికి వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇరువర్గాలపై కేసు కాగజ్నగర్రూరల్: పట్టణంలోని శ్రీషైన్ ఆ స్పత్రి వద్ద శుక్రవారం రాత్రి ఫర్నీచర్ విషయంలో డాక్టర్ నవ్య, స్థానిక నివాసి శ్రీనివా స్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరి స్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సైలు సోని యా, అంజన్న సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. డాక్టర్ నవ్యకు తలకు గాయం కావడంతో స్థా నిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇరువురి ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని రూరల్ సీఐ అల్లం రాంబాబు తెలిపారు. మోసం చేసిన భార్యభర్తలపై కేసు ఖానాపూర్: అమెరికాలో ఉంటున్న వ్యక్తి ఏటీఏం కార్డుతో డబ్బులు డ్రా చేసి సొంతానికి వాడుకుని మోసగించిన భార్యభర్తలపై శని వారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబా ద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పట్ట ణంలోని భర్కత్పుర కాలనీకి చెందిన అసద్అలీ అమెరికాలో ఉంటున్నాడు. ఖానాపూర్లో ఆయన తల్లిదండ్రుల బాగోగులు, హాస్పిటల్, ఇతర ఖర్చుల కోసం అదేకాలనీకి చెందిన షర్జిల్ అహ్మద్కు రెండేళ్ల క్రితం అసద్అలీ తన ఏటీఎం కార్డు ఇచ్చాడు. షర్జిల్ అహ్మద్తోపాటు అతని భార్య హుమేరా యాస్మిన్ ఆ డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో బ్యాంక్ మేసెజ్ అలర్ట్ నంబర్ను మార్పించారు. రూ.60 లక్షలు విత్డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. ఈ విషయం తెలిసి నిలదీస్తే రూ.12 లక్షల విలువైన ప్లాట్ ఇచ్చారని, రూ.48 లక్షలు చెల్లిస్తామని ప్రామిసరీనోటు రాశారు. ఎంతకీ చెల్లించకపోవడంతో అసద్అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైస్మిల్లు తనిఖీ నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్మిల్లులో ధాన్యం దిగుమతి ప్రక్రియను శనివారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ తనిఖీ చేశారు. రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని, ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లుల వద్ద ఎలాంటి కోత విధించకూడదని యాజమాన్యానికి సూచించారు. మిల్లులకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సబ్బ రమేశ్, తదితరులు ఉన్నారు. -
హార్వెస్టర్ పడి ఒకరు మృతి
నర్సాపూర్(జి): హార్వెస్టర్ పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు..మండల కేంద్రానికి చెందిన దర్శనం కనకయ్య (42) శనివారం హార్వెస్టర్ నుంచి ట్రాక్టర్ను విడదీసే క్రమంలో రెండు జాకీలు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు జారి అతని మెడపై పడింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు జేసీబీ సహాయంతో యువకుడిని బయటకు తీసి అంబులెన్స్లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ఽధ్రువీకరించారు. మృతుడికి భార్య సాయవ్వ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోర్సినిలో ఒకరు దారుణహత్య చింతలమానెపల్లి: చింతలమానెపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కోర్సినిలో శుక్రవారం రాత్రి ఒకరు దారుణహత్యకు గురైనట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. గ్రామంలో కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న బొట్టుపల్లి సదయ్య (34) శుక్రవారం రాత్రి ముల్కల రాజ్కుమార్ ఇంటికి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో రాజ్కుమార్ ఇనుప పైపుతో తలపై కొట్టగా సదయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి బొట్టుపల్లి మల్లక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘కడెం’ మరమ్మతుల్లో వేగం పెంచాలి
● ఈఎన్సీ నాగేందర్రావుకడెం: కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని అపరేషన్ అండ్ మెంటెనెన్స్ ఇంజనీరింగ్ చీఫ్(ఈఎన్సీ) నాగేందర్రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు మరమ్మతు ప నులను శనివారం పరిశీలించారు. పనులను జూన్ 10లోగా పూర్తి చేయాలన్నారు. రెండేళ్లుగా భారీ వరదలతో ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయించి, వానాకాలం సీజన్కు ప్రాజెక్టును సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈఎన్సీ వెంట ఎస్ఈలు సంజీవ్, రవీందర్రావు, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ఏఈఈలు రవినాయక్, సర్వర్, ప్రాజెక్టు సిబ్బంది ఉన్నారు. -
నకిలీ విత్తనాల కేసులో ఇద్దరి రిమాండ్
● మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపుఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధిలో ని దస్నాపూర్ ప్రాంతంలో ఓ గోదాంలో ఓ ముఠాను అక్రమంగా నకిలీ విత్తన ప్యాకెట్లు తయారు చేస్తూ పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆదిలాబాద్లోని హనుమాన్నగర్లో నివాసం ఉంటున్న జైనథ్ మండలం పెండల్వాడకు చెందిన అశోక్రెడ్డి, హైదరాబాద్లో ఉన్న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన అప్పాల రాజేందర్ను అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు సిద్దిపేటకు చెందిన మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. వీరు గతంలో వివిధ విత్తనాల కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. ఆ అనుభవంతోనే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లూజ్ విత్తనాలు తీసుకువచ్చి వివిధ కంపెనీల బ్రాండ్ల పేరుతో ప్యాకెట్లు తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎక్కడైన విత్తనాలు విక్రయించారా, స్టాక్ ఎక్కడైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
వృద్ధుడు ఆత్మహత్య
కౌటాల: ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్యకు పా ల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ముత్తంపేటకు చెందిన కారెం పెంటు (64) శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఎన్.మధుకర్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి)సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్ల్లు ఉన్నారు. పురుగుల మందుతాగి.. కోటపల్లి: పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పార్పల్లికి చెందిన నామని సురేశ్ (42) కొంతకాలంగా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతుండేవాడు. శనివారం ఇంట్లో పురుగుల మందు తాగడంతో అతని భార్య రజిత గమనించి 108కు సమాచారం అందించింది. ముందుగా చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఏఎస్సై కాంతారావు తెలిపారు. -
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: వినియోగదారుల సమస్యల పరిష్కానికి కృషి చేయనున్నట్లు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రాష్ట్ర ఇన్చార్జి అధ్యక్షురాలు మీనా రామనాథన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కమిషన్ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలపై ఆరా తీశారు. సిబ్బందికి పలు అంశాలపై సూచనలు చేశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే కార్యాలయాన్ని పరిశీలించినట్లుగా తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్తో పాటు పలువురు న్యాయవాదులు ఆమెను సన్మానించారు. ఇందులో వినియోగదారుల కమిషన్ జిల్లా చైర్మన్ జాబెజ్ శ్యామూల్, తదితరులు పాల్గొన్నారు. -
‘పీడీ కేసులు నమోదు చేయాలి’
ఇచ్చోడ: నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్న వ్యాపారులపై పీడీ యా క్టు కింద కేసులు నమోదు చేయాలని రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో శనివారం ఆయన మాట్లాడారు. ఏటా నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన అమాయక గిరిజన, ఆదివాసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట రైతులు విష్ణు, ప్రకాశ్, రాము, ఆనందర్రావు ఉన్నారు. -
1200 మందికి ‘గొర్రెల’ డీడీలు వాపస్
కై లాస్నగర్: సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం గొల్ల, కుర్మలు చెల్లించిన డీడీలను ప శుసంవర్ధకశాఖ తిరిగి వారికి అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల యూనిట్లను అ ందించేందుకు సుముఖంగా లేకపోవడం, తమ డీడీలు తమకు తిరిగి ఇచ్చేయాలంటూ గొల్ల, కుర్మలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా పశుసంవర్దకశాఖ అధికా రులు వాటిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. డీడీలను వెనక్కి ఇచ్చే ప్రక్రియ ఇటీవల ప్రారంభించగా అది కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1200 మందికి డీడీలను తిరిగి అందజేసినట్లుగా జిల్లా ఇన్చార్జి పశుసంవర్ధకశాక అధికారి కిషన్ తెలిపారు. మరో 512 మంది మిగిలి ఉన్నారని త్వరలోనే వారికి కూడా ఇచ్చేస్తామని పేర్కొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
బేల: ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని జైనథ్ సీఐ సాయినాథ్ అన్నారు. మండల కేంద్రంలోని విత్తన విక్రయ కేంద్రాల్లో టాస్క్ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు చేపట్టారు. విత్తన ప్యాకెట్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల గుర్తించిన నకిలీ విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల ప్యాకెట్లు అమ్మవద్దన్నారు. పలు కంపెనీల శాంపిల్స్ సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర రైతులకు ఇక్కడి విత్తనాలు విక్రయించవద్దని డీలర్లను ఆదేశించారు. అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర రైతులకు పత్తి విత్తనాలు విక్రయించిన 24మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఇన్చార్జి ఏవో విశ్వామిత్ర తెలిపారు. ఇందులో ఎస్సై రాధిక, ఏఎస్సై జీవన్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. -
● గతేడాదితో పోల్చితే 1,342 తక్కువగా నమోదు ● సర్కారు ఖజానాకు రూ.7.3 కోట్ల ఆదాయం లెస్ ● ఎన్నికల ప్రభావంతో తగ్గిన క్రయ, విక్రయాలు
జనం లేక బోసిపోయి దర్శనమిస్తున్న ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కైలాస్నగర్: జిల్లాలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతగా లేకపోవడంతో భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ, విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. జిల్లాలో ఉన్న రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు సందడిగా కనిపించే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రస్తుతం మధ్యాహ్నానికే బోసిపోతున్నాయి. ఉద్యోగులు ఖాళీగా కూర్చోవాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ ప్రభావం సర్కారు ఖజానాపై తీవ్రంగా పడుతోంది. తగ్గిన 1,342 రిజిస్ట్రేషన్లు జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,342 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఆ శాఖకు సుమారు రూ.7.3కోట్ల ఆదాయం తగ్గినట్లైంది. కార్యాలయాల వారీగా పరిశీలిస్తే.. బోథ్ కార్యాల య పరిధిలో 2023 జనవరి 1నుంచి మే 31వరకు 501 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రూ.96.60 లక్షల ఆ దాయం సమకూరింది. అదే ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 24 వరకు 372 రిజిస్ట్రేషన్లు మా త్రమే జరిగాయి. వీటి ద్వారా రూ.54 లక్షల ఆ దాయం మాత్రమే వచ్చింది. గతేడాదితో పోల్చితే 129 రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదు కావడంతో రూ.42.60లక్షల ఆదాయం తగ్గింది. నిత్యం రద్దీగా ఉండే ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరి ధిలోనూ ఇదే పరిస్థితి. గతేడాది ఐదు నెలల వ్యవధిలో 5,165 రిజిస్ట్రేషన్లు నమోదవగా రూ.17. 76కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది 3,952 రిజిస్టేషన్లు కాగా రూ.11.14కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,213 రిజిస్ట్రేషన్లు తక్కువగా కావడంతో ప్రభుత్వానికి రూ.6.61కోట్ల ఆదాయం తగ్గిపోయింది. ఎన్నికల ప్రభావమే కారణం జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గిపోవడానికి గతేడాది జరిగిన అసెంబ్లీ, ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ప్రభావమే కారణమని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ, విక్రయాలు జరిపే వారిలో ఎక్కువగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. వీరంతా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండటంతో భూముల క్రయ, విక్రయాలు ఆశించిన స్థాయిలో జరుగలేదని తెలుస్తోంది. కోడ్ అమలు కారణంగా నగదు తరలింపు అరికట్టేందుకు యంత్రాంగం ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో వాటిని కొనుగోలు చేయాలని భావించినప్పటికీ అందుకు సంబంధించిన నగదు తీసుకెళ్లే అవకాశం లేకపోవడం, ఒకవేళ పట్టుబడితే అప్పటికప్పుడు ఆధారాలు చూపించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది క్రయ, విక్రయాలపై ఆసక్తి చూపలేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి పుంజుకునే అవకాశముంటుందని భావిస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లుగా జనవరి నుంచి మే వరకు నమోదైన రిజిస్ట్రేషన్లు, సమకూరిన ఆదాయం వివరాలు ఇలా.. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో.. 2023లో 2024లో నెల రిజిస్ట్రేషన్లు ఆదాయం(రూ.లక్షల్లో) రిజిస్ట్రేషన్లు ఆదాయం(రూ.లక్షల్లో) జనవరి 975 339.3 669 221.45 ఫిబ్రవరి 990 382.8 762 251.82 మార్చి 1261 404.52 847 226.86ఏప్రిల్ 907 295.2 905 211.58మే 1,032 354.9 769 202.72బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో.. జనవరి 63 9.0 74 14.0 ఫిబ్రవరి 90 17.6 93 14.0 మార్చి 110 24.0 86 13.0 ఏప్రిల్ 137 31.0 57 6.0 మే 101 15.0 62 7.0ఎన్నికల ప్రభావంతోనే.. జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు కొంత మేర తగ్గాయి. ఇందుకు ఎన్నికల ప్రభావమే కారణం. కోడ్ కారణంగా భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ, విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి పుంజుకునే అవకాశముంటుంది. – అశోక్, సబ్రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్రూరల్: 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో కార్పొరేట్ కళా శాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారి సునితకుమారి ప్రకటనలో తెలి పారు. సర్కారు పాఠశాలలు, వసతి గృహా ల్లో ఉండి 10వ తరగతి చదివి 7.0 ఆపై జీపీలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ మెమో, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఐదు పాస్ ఫోర్టు ఫొటోలు, ఆధార్ కార్డు, బోనఫైడ్ వంటి ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు సమయంలో అందజేయాలని పేర్కొన్నారు. -
ఫిర్యాదు.. రూటు మారింది!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక అక్రమ రవా ణాపై ఫిర్యాదుల రూటు మారింది. కంప్లయింట్లు నేరుగా హైదరాబాద్ స్థాయికి చేరుతున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో ఇసుకాసురులతో ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు అనుమానా ల కు తావిస్తోంది. ఈ నెల 22న ఓ మైనింగ్ అధి కారి అసిస్టెంట్తో కలిసి బేల మండలంలోని కాంగార్పూర్ అక్రమ ఇసుక క్వారీ తనిఖీ కోసం వెళ్లారు. వారు వెళ్లిన సమయంలో ఆ సైట్లో ఇసుక తోడే మరబోటు లేదు.. పైపుల సెట్టింగ్, తవ్వే కూలీలూ కనిపించలేదు.. ట్రాక్టర్లు, టిప్ప ర్లు, జేసీబీల జాడ సైతం లేకుండా పోయింది.. పెన్గంగ నిశ్శబ్ద వాతావరణంలో ఉంది. ఆదిలా బాద్ నుంచి వచ్చే దారిలో తమ వాహనాన్ని ముందే పసిగట్టి ఎవరో లీక్ చేయడంతో ఇలా జరిగిందని వారు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అధికా రులు ఎందుకు డీలా పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆకస్మిక తనిఖీకి వచ్చేవారు తమ రెగ్యులర్ వాహనం కాకుండా మరో వాహనంలో వచ్చేదని, చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ జరిగే సమయంలో నేరుగా దాడులు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఆ శాఖ అధికారులే ముందుగా లీక్ ఇచ్చి క్వారీ నిర్వాహకులను అలర్ట్ చేశారనే విమర్శ కూడా లేకపోలేదు. పైకే ఫిర్యాదులు.. కాంగార్పూర్లో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని కొంత మంది ఇటీవల హైదరాబాద్ స్థాయిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 22న మైనింగ్ అధికారులు తనిఖీ కోసం వచ్చారని తెలిసింది. ఇక్కడి ఆఫీసర్లు మాత్రం పైకి కంప్లయింట్ చేసిన విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేని పరిస్థితి. అయితే ఆ రోజు మైనింగ్ అధికారులు సైట్కు వచ్చి వెళ్లిన తర్వాత అక్కడి జనంలో ఈ రకమైన చర్చ సాగుతోంది. దీని బట్టే ఫిర్యాదు జిల్లా స్థాయిలో చేసిన పక్షంలో స్పందన రావడం లేదనే నమ్మకం స్థానికుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదు రూట్ మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్యాకేజీలు, నెలవారీ మామూళ్లు.. కంప్లయింట్ నేరుగా హైదరాబాద్ స్థాయిలోనే.. అక్రమ ఇసుకదందాపై జనం వ్యవహరిస్తున్న తీరు అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు జిల్లాలో పెన్గంగ పరీవాహక ప్రాంతం 70 కిలోమీటర్ల పైబడి మహారాష్ట్రకు సరి హద్దుగా ఉంది. ఈ పరీవాహక ప్రాంతం భీంపూర్, జైనథ్, బేల మండలాల పరిధిలోకి వస్తుంది. సుమారు 12 నుంచి 15 క్వారీల నిర్వహణ పలుసైట్లలో జరుగుతుంది. ప్రధానంగా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. అయితే వారు ప్యాకేజీలు, నెలవారీ ఫిక్స్డ్ మామూళ్లతో నిండా ముగినిపోయారనే అపవాదు లేకపోలేదు. ఇది వరకు ఓ మైనింగ్ ఆఫీసర్కు క్వారీ నిర్వాహకులు ఏకంగా ఖరీదైన కారును గిఫ్ట్గా ఇచ్చారనే ప్రచారం ఉంది. ఈ ఆమ్యామ్యాలు మితిమీరడంతో గతంలో భీంపూర్ మండలం వడూర్లో ఓ క్వారీ నిర్వాహకుడు ఏకంగా సైట్నే క్లోజ్ చేసుకున్నాడనే ప్రచారం ఉంది. ప్రధానంగా వీటి విషయంలో ఆఫీసర్లు ప్రతీ నెల నిక్కచ్చిగా ఉండడం, దీన్ని అవకాశంగా తీసుకుని క్వారీలో ఇసుక దోపిడీ తీవ్రం చేయడం నిర్వాహకులకు అందేవేసిన చేయిగా మారిందని పలువురు చెప్పుకుంటారు. అయితే అడపాదడపా తనిఖీలు చేస్తూ ఇసుక రవాణా వాహనాలను సీజ్ చేస్తూ జరి మానా విధించడం ద్వారా సర్కారుకు ఆదాయం తీసుకవస్తున్నామనే బిల్డప్ చేయడంలో వీరిని మించిన వారుండరని జనం నవ్వుకునే పరిస్థితి ఉంది. మైనింగ్ అధికారుల తనిఖీల విషయంలో ఆ శాఖ ఇన్చార్జి ఏడీ రవీందర్ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ఫోన్లో యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
అందుబాటులో 6,32,446 విత్తన ప్యాకెట్లు
ఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా 280 మంది విత్తన డీలర్ల వద్ద 6,32,446 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా సమీపంలోని దుకాణాలను సంప్రదించి విత్తనాలు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. డీలర్లు ఎవరైనా ఎంఆర్పీకి మించి విక్రయించినా, విత్తనాలు అందుబాటులో ఉండి కూడా లేవని చెప్పినా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ‘ఆర్డర్ కాపీలు సరే.. పోస్టింగ్లు ఎప్పుడు?’ నేరడిగొండ: గురుకుల పాఠశాలలు, కళా శాలల్లో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధించి ఆర్డర్ కాపీలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదని గిరిజన లంబాడాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురుకులాల్లో ఎంపికైన అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఆర్డర్ కాపీలు ఇచ్చినా ఇంకా పోస్టింగ్ కల్పించ డం లేదని పేర్కొన్నారు. అలాగే స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ వారికి సైతం నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంద్రం అమతరావ్ (56) మృతి చెందాడు. మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస కాలనీకి చెందిన పెంద్రం అమతరావ్, ఆడ నాగోరావ్ ఇద్దరు కలిసి బైక్పై ఈ నెల 23న ఆదిలాబాద్ జిల్లాలోని జంగుబాయి దేవాలయానికి వెళ్లి సాయంత్రం తిరుగుపయనమయ్యారు. బీర్సాయిపేట్–ఉండుంపూర్ మధ్యలో ఈదురుగాలులకు రహదారికి అడ్డంగా విరిగిపడ్డ చెట్టును వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనకాల కూర్చున్న అమతరావ్ కింద పడడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యయి. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అమత్రావు భార్య రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కష్ణసాగర్రెడ్డి తెలిపారు. -
ఉరేసుకుని ఆత్మహత్య
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని కై లాస్నగర్కు చెందిన పోతన్న (56) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతన్న కొన్నేళ్లుగా అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదే క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం ఆదిలాబాద్రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని యాపల్గూడ శివారు ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. పులిమడుగులో మహిళ.. ఉట్నూర్రూరల్: మండలంలోని పులిమడుగులో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రాథోడ్మాయ (30) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఉట్నూర్ ఎస్సై మనోహర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం మాయ భర్త రాథోడ్నరేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మాయ ముగ్గురు పిల్లలను పోషిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో మాయ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దకుమారుడు రాంకుమార్ గమనించి చుట్టుపక్కల వారికి తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి జాదవ్ అనుషాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
తానూరు: మండలంలోని కోలూరు గ్రామానికి చెందిన దేవ్రే మారుతి (45) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మారుతి గతేడాది కూతురి పెళ్లికి రూ.10లక్షల వరకు అప్పుచేశాడు. అప్పులు ఎలా తీర్చాలని తరచూ ఆవేదనకు లోనయ్యేవాడు. ఈక్రమంలో అప్పులు తీర్చే మార్గం కనిపించక మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 22న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి కోలూరుతండా నుంచి మసల్గ వెళ్లే రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది రైతులు మృతదేహాన్ని గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సందీప్ -
కలుషితనీరు తాగి 20మందికి అస్వస్థత
నార్నూర్: గాదిగూడ మండలంలోని లోకారి–బీ గ్రామంలో కలుషిత నీరు తాగి 20మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. అస్వస్థతకు గురైన 20 మందిని అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించినట్లు 108 పైలట్లు వసీం, ముజాఫర్, ఈఎంటీలు దీపక్, కృష్ణ, రవి తెలిపారు. కాగా, గ్రామంలో కలుషితనీరు తాగడంతో చాలామంది వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రెండురోజుల క్రితం కురిసిన వర్షంతో పాటు గ్రామ సమీపంలోని బావి నీరు తాగడంతోనే విరేచనాలు అవుతున్నట్లు గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఝరి పీహెచ్సీ వైద్యాధికారి సంజీవ్ గ్రామంలో వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి సమస్య లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆయనతో పాటు గ్రామ పెద్ద మెస్రం శేఖర్బాబు తెలిపారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులు ఆదిలాబాద్టౌన్: గాదిగూడ మండలంలోని లోకా రి(బీ) గ్రామంలో 20 మందికి శుక్రవారం వాంతులు, విరేచనాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పరిస్థితి విషమించగా వారి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వీరిలో తొమ్మిదిమంది మహిళలు, ఆరుగురు పురుషులున్నారు. ఐదుగురు చిన్నపిల్లలూ ఉన్నారు. కాగా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వారికి ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీటితోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. -
జొన్న లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా
భైంసారూరల్: మండలంలోని మిర్జాపూర్ గ్రా మ సమీపంలో జొన్న లోడ్తో వెళ్తున్న లారీ శు క్రవారం బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. కుంటాల పీఏసీఎస్ కొనుగో లు కేంద్రం నుంచి జొన్నల లోడ్తో కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి వెళ్తున్న లారీ భైంసా మండలంలోని మిర్జాపూర్ గ్రామ సమీపంలో గేదెలను తప్పించే క్రమంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రఫీక్మహ్మద్ ప్రమా దం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. గిన్నెర చెరువులో మహారాష్ట్రవాసి గల్లంతు ఇంద్రవెల్లి: మండలంలోని గిన్నెర పంచాయతి పరిధిలోని చెరువులో మహారాష్ట్ర వాసి గల్లంతయ్యాడు. అతడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఎవత్మాడ్ పట్టణానికి చెందిన కుడ్మెత నితిన్ (40) బంధువులతో కలిసి మండలంలోని గిన్నెర పంచాయతీ పరిధి తోయగూడ గ్రామంలో గురువారం నిర్వహించిన కనక వంశీయుల కుల దేవత పూజలకు హాజరయ్యాడు. శుక్రవారం ఉదయం బంధువులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లాడు. ఈక్రమంలో బహిర్భూమికి వెళ్లిన నితిన్ ఎంతకూ తిరిగి రాలేదు. బంధువులంతా గాలించగా చెరువు కట్ట పరిసర ప్రాంతంలో అతడి దుస్తులు కనిపించాయి. నితిన్ స్నానానికి వెళ్లి గల్లంతై ఉంటాడని అనుమానంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించినా ఆచూకీ దొరకలేదు. శనివారం గజ ఈతగాళ్లను రంగంలో దింపి మృతదేహాన్ని బయటకు తీస్తామని ఎస్సై సునీల్ తెలిపారు. -
విద్యుత్ స్తంభం విరిగిపడి మూడేళ్ల చిన్నారికి గాయాలు
సారంగపూర్: మండలంలోని కౌట్ల(బీ) గ్రా మంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మెండ్ల శ్రీను–లక్ష్మి దంపతుల మూడేళ్ల కుమార్తె చైత్రపై శుక్రవారం విద్యుత్ స్తంభం విరి గిపడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్కాలనీకి చెందిన రాథోడ్ గంగాధర్ విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోకుండా తీగలు తగులుతున్నాయనే కారణంతో చెట్టుకొమ్మలు నరికివేశాడు. ఈక్రమంలో చెట్టుకొ మ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. వాటి బరు వుకు స్తంభం విరిగి ఇంటిముందు ఆడుకుంటున్న చైత్ర కాలుపై పడింది. దీంతో చిన్నారికి కాలు, తలకు బలమైన గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ అనుమతి లేకుండా చెట్టు నరికి ప్రమాదానికి కారకుడైన గంగాధర్పై ట్రాన్స్కో ఏఈ సాయికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై చంద్రమోహన్ గంగాధర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెయిల్పై విడుదల
కడెం: మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామ ంలోని అటవీ నర్సరీలో మొక్కలు ధ్వంసం చేసిన 16మందిని శుక్రవారం బెయిల్పై విడుదల చేసినట్లు కడెం ఎఫ్ఆర్వో అనిత తెలిపారు. ఇటీవల వడ్ల కల్లం కోసం స్థలం కావాలని అటవీ నర్సరీలోకి చొరబడి మొక్కలు ధ్వంసం చేసినందుకు సుప్రీంకోర్టు సూచన మేరకు 16మందికి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. అటవీ చట్టాలపై అవగాహన లేనందున అలా ప్రవర్తించామని, ఒకరిద్దరు జామీను ఇవ్వడంతో కండిషనల్ బెయిల్ మీద వారిని విడుదల చేశామని తెలిపారు. అటవీ వన్యప్రాణి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- కలిసికట్టుగా ముందుకు..
Advertisement