-
లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
కొత్తగూడెంటౌన్ : జిల్లా కోర్టులో జూన్ 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీమా కంపెనీ ప్రతినిఽ దులు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలిపారు. మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసుల్లో కక్షిదారులకు న్యాయం జరగాలన్నారు. లోక్ అదాలత్లో రాజీపడడంతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, మనోవర్తి, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంకు కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రామారావు, మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.శివనాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, పీపీలు పోసాని రాధాకృష్ణమూర్తి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి భద్రాచలంఅర్బన్ : ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. శనివారం ఆయన భద్రాచలం సబ్ జైలులో ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడారు. జైలు జీవితంలో లభించే విరామ సమయంలో గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ నేర ప్రవృత్తికి దూరం కావాలని, కుటుంబం కోసం జీవించేలా పరివర్తన చెందాలని సూచించారు. జైలులో ఖైదీలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో భద్రాచలం కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె. సూరిరెడ్డి, సబ్ జైల్ అధికారి ఉపేందర్, టౌన్ సీఐ సంజీవరావు పాల్గొన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ -
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
సూపర్బజార్(కొత్తగూడెం): వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 27న పోలింగ్, జూన్ 5న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 76 మంది పీఓలు, 76 మంది ఏపీఓలు, 160 మంది ఓపీఓలు అవసరమని తెలిపారు. జిల్లాలో 40,106 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, వారిలో 22,590 మంది పురుషులు, 17,516 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5 ఎంసీసీ బృందాలతో పటిష్ట నిఘా చేపట్టాలని సూచించారు. సెక్టార్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వసతుల కల్పనను తనిఖీ చేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. 100 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేశారని, రిసెప్షన్ కేంద్రం నల్గొండలో ఉంటుందని చెప్పారు. అనంతరం ధరణి, మీ సేవ, ప్రజావాణి, అమ్మ ఆదర్శ కమిటీ పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీఓలు మధు, దామోదర్రావు, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, డీటీ రంగాప్రసాద్ పాల్గొన్నారు. గ్రూప్–1 పరీక్షకు 21 కేంద్రాలు..జూన్ 9న జరుగనున్న గ్రూప్ –1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 8,875 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. పరీక్ష రోజు ఉదయమే తగిన భద్రత మధ్య ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాలు కేంద్రాలకు తరలించాలని అన్నారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఒక ప్రధాన గేట్ ద్వారానే కేంద్రంలోకి పంపించాలని సూచించారు. తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలన్నారు. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందని, 9 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించాలని, 10 గంటలకు ప్రధాన గేట్లు మూసివేయాలని సూచించారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. టీజీపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష జరిగేలా చూడాలన్నారు. దివ్యాంగులు, అంధ అభ్యర్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, టీజీపీఎస్సీ రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ జగన్మోహన్రాజుతో కలిసి కలెక్టరేట్లో ఉన్న స్ట్రాంగ్రూంను పరిశీలించారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం టీఎస్ స్థానంలో టీజీప్రభుత్వ రంగ సంస్థలు, ఏజన్సీలు టీఎస్కు బదులు ఇకపై టీజీగా మార్చాలని కలెక్టర్ ప్రియాంక అల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ జారీ చేసిందని పేర్కొన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్లకు గత మార్చిలోనే అనుమతి రాగా, అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీజీగా మార్చుతూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. టీజీగా మార్చుతూ తీసుకునే చర్యలపై అన్ని శాఖల అధికారులు ఈనెల 25 లోగా నివేదికలు అందజేయాలని సూచించారు. -
No Headline
తగ్గిన రైళ్లు.. ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న భద్రాద్రి జిల్లాకు ఇప్పటికీ రైలు సౌకర్యం అరకొరగానే ఉంది. అది కూడా కొత్తగూడెం కేంద్రంగానే ఎక్కువ రైళ్లు నడుస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందు కొత్తగూడెం (భద్రాచలం రోడ్) స్టేషన్ నుంచి విజయవాడ, డోర్నకల్, బల్లార్షా, కాజీపేటలకు ఒక రైలు, హైదరాబాద్కు మణుగూరు సూపర్ఫాస్ట్, కొల్హాపూర్, కాకతీయ రైళ్లు నడిచేవి. కరోనా తర్వాత డోర్నకల్, కాజీ పేట రైళ్లను ఇప్పటికీ పునరుద్ధరించ లేదు. కొల్హాపూర్ రైలు స్థానంలో బెళగావి ఎక్స్ప్రెన్ను ప్రవేశపెట్టారు. అయితే పునరుద్ధరించిన రైళ్లు సైతం ఎప్పుడు నడుస్తాయో, ఎప్పుడు నడవవో తెలియని పరిస్థితి నెలకొంది. వేసవి సెలవులతో రద్దీ.. గత నెల రోజులుగా విద్యాలయాలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణాలు జరుగుతున్నాయి. అయితే కొత్తగూడెం మీదుగా వెళ్తున్న రైళ్లు రద్దు కావడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. మరో రెండు వారాల్లో విద్యాలయాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రద్దయిన రైళ్లను నడిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఎప్పుడు సమయపాలన పాటిస్తాయో, ఎప్పుడు పాటించవో తెలియని గందరగోళం నెలకొంది. గత మూడు దశాబ్దాలుగా చూస్తే సింగరేణి రైలు సమయపాలన పాటించడమే లేదు. నూటికి 90 రోజులు ఆలస్యంగానే నడుస్తోంది. ఇప్పుడు దీనికి కాకతీయ ఎక్స్ప్రెస్ కూడా తోడయింది. మరోవైపు రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరాల్సిన మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వారంలో సగం రోజులు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరుతోంది. దీంతో అర్ధరాత్రి వేళ రాష్ట్ర రాజధానిలోని ప్రధాన స్టేషన్లో జిల్లాకు చెందిన ప్రయాణికులు పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్నాళ్లిలా.. నాలుగేళ్ల క్రితం కరోనా, ఇప్పుడు మూడో లైన్ నిర్మాణం పేరుతో ఇష్టారీతిగా రైళ్లను రద్దు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ – నెక్కొండ మధ్యనే మూడో లైన్ నిర్మాణం పూర్తయింది. నెక్కొండ – మహబూబా బాద్ – డోర్నకల్ మధ్య ట్రాక్ నిర్మాణ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. మరోవైపు భద్రాచలం రోడ్ – డోర్నకల్ సెక్షన్లో రెండో లైన్, డోర్నకల్ – ఖమ్మం సెక్షన్లో మూడో లైన్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఈ నిర్మాణ పనుల వంకతో ఎన్ని నెలల పాటు రైళ్లు రద్దు చేస్తారో తెలియడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తెచ్చి రైళ్ల రద్దును అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. రద్దు తప్పనిసరైన పక్షంలో కనీసం హేతుబద్ధత పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాకు అరకొరగా ఉన్న కొద్దిపాటి రైలు ప్రయాణ సౌకర్యాన్ని దూరం చేయొద్దని కోరుతున్నారు. మూడో లైన్ పేరుతో.. రాష్ట్రంలో కీలకమైన బల్లార్షా – కాజీపేట – డోర్నకల్ – విజయవాడ మార్గంలో గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ మూడో లైన్ నిర్మాణ పనులు చేపడుతోంది. ఇందులో నెక్కొండ – వరంగల్, ఖమ్మం – విజయవాడ సెక్షన్ల మధ్య మూడో లైన్ ట్రాక్ నిర్మాణం పూర్తయింది. అయితే సిగ్నలింగ్ పనులు చేపట్టాలంటూ గతేడాది కాలంగా పగటి వేళ నడుస్తున్న విజయవాడ, సింగరేణి, కాకతీయ, బెళగావి ఎక్స్ప్రెస్ రైళ్లను తరచుగా రద్దు చేస్తున్నారు. ఇందులో విజయవాడ, సింగరేణి, బెళగావి రైళ్లు సాఫ్ట్ టార్గెట్గా మారాయి. దీంతో ఇప్పటికే విజయవాడ రైలును జిల్లా వాసులు మరిచిపోయే పరిస్థితి రాగా బెళగావి ఎక్స్ప్రెస్ రెగ్యులర్గా నడుస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. -
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
● భక్తులతో భద్రగిరి కిటకిటభద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం వైభవంగా సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం కల్యాణ మూర్తులను మేళతాళాల నడుమ చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యకల్యాణ వేడుకలో 80కి పైగా భక్త దంపతులు పాల్గొన్నారు. పోటెత్తిన భక్తులు భద్రాద్రి రామాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులతో పాటు వారాంతపు సెలవు రోజులు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి బారులుదీరారు. ఆర్జిత సేవల్లోనూ పెద్ద ఎత్తన పాల్గొన్నారు. అటవీ అభ్యంతరాలతో నిలిచిన రోడ్లు● నిర్మాణానికి అనుమతి ఇవ్వండి ● అటవీ శాఖ మంత్రిని కోరిన తుమ్మల ఇల్లెందు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ, ఏజెన్సీ గ్రామాలకు కనీస రహదారులు లేక ప్రజలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అటవీ శాఖ అభ్యంతరాలతో పలు కీలక రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోడ్లకు అనుమతులు సాధించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు రోడ్లకు అనుమతులు సాధించారు. తాజాగా మరికొన్ని రోడ్లకు అనుమతులు ఇవ్వాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పీసీసీఎఫ్ను కోరారు. 2018 – 19 సంవత్సరంలో ఎల్డబ్ల్యూఈ ఫేస్ –1, 3 కింద పలు రహదారులు మంజూరైనా అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిపోయాయని తుమ్మల వారి దృష్టికి తీసుకెళ్లారు. నిలిచిపోయిన వాటిలో గుండాల – పస్రా, వీరాపురం – గుండాల, పెద్ద మిడిసిలేరు – బత్తినపల్లి రాచన్నగూడెం వయా పూసుకుంట, ఆళ్లపల్లి – పెద్ద వెంకటాపురం, లక్ష్మీనగర్ – లక్ష్మీపురం, అడివిరామవరం – దొంగతోగు, సాయనపల్లి – అడివిరామవరం, ఎర్రంపాడు – ఆర్సీ పురం, దేవరపల్లి – కొరకటపాడు, కొరకటపాడు – బక్క చింతలపాడు, కొత్తపల్లి – గద్దెమడుగు, కిష్టాపురం – పిట్టతోగు, కుర్నపల్లి – నిమ్నలగూడ, బత్తినిపల్లి – కురుమపల్లి తదితర రహదారులు ఉన్నాయని వివరించారు. -
పూరిల్లు దగ్ధం
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి పంచాయతీ శివారు మహ్మద్నగర్లో శనివారం ఓ పూరిల్లు దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్కే బడేమియా ఇంట్లో సర్వీస్ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామస్తులు చూస్తుండగానే ఇల్లంతా కాలిబూడిదైంది. ఇంట్లోని టీవీ, మంచాలు, దుస్తులు, సామగ్రి, రూ. 20 వేల నగదు కాలిపోయిందని, రూ. 80 వేల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పశువులు పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం సరిహద్దున ఉన్న తోటపల్లి నుంచి శనివారం బూర్గంపాడు మండలం సారపాకకు ఓ ట్రాలీలో ఐదు పశువులను తరలిస్తుండగా పట్టణంలోని ఫారెస్టు చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించి, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సారా స్థావరాలపై దాడికరకగూడెం: మండలంలోని కలవలనాగారం గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో ఉన్న సారా స్థావరాలపై శనివారం పోలీసులు దాడి చేశారు. 10 లీటర్ల నాటు సారా, బెల్లం, పానకం స్వాధీనపర్చుకొని ధ్వంసం చేశారు. సారా తయారీదారులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. -
శిక్షణలో నేర్పించే అంశాలు
● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● మేకప్స్ (బ్రైడల్, పార్టీ మరియు లైట్ మేకప్స్) ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● శారీ డ్రాపింగ్● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ కేర్ ● ఫేషియల్స్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ సై ్టల్స్ -
గాడిన పడేదెప్పుడో ?
అడ్రస్ లేకుండాపోయిన కాజీపేట ప్యాసింజర్ ● తరచూ రద్దవుతున్న బెళగావి, విజయవాడ రైళ్లు ● మూడో లైన్ నిర్మాణం, ట్రాక్ రిపేర్లతో చిక్కులు ● గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న మిగితా ట్రెయిన్లు మూడో లైన్ నిర్మాణం, ట్రాక్ మరమ్మతుల పేరుతో రైళ్లు రద్దవుతుండడంతో వేసవిలో ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. ఎప్పుడు ఏ రైలు నడుస్తుందో, ఎప్పుడు ఏ రైలు రద్దవుతుందో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని, కనీసం త్వరలో ఎన్నికయ్యే వారైనా ఈ విషయంపై దృష్టి పెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి
కొత్తగూడెంఅర్బన్: న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయినందున గతేడాది అక్టోబర్లో అర్ధంతరంగా నిలిపివేసిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీపీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. శనివారం టీచర్స్ భవన్లో జిల్లా అధ్యక్షుడు కిషోర్సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా పదోన్నతులు, ఆరేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు. విద్యాశాఖ కమిషనర్ దేవసేన నిర్లక్ష్యంతోనే పదోన్నతుల్లో అవాంతరాలు ఏర్పడ్డాయన్నారు. గురువారం యూఎస్పీసీ, జాక్టో ప్రతినిధులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చర్చలు జరిపారని, ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అనుమతితో పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని సత్వరమే అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణలో సైతం విద్యాశాఖ అసమర్థత వెల్లడైందన్నారు. భద్రాద్రి జిల్లా నుంచి దరఖాస్తు చేసిన వారికి హైదరాబాద్, మెదక్ జిల్లా నుంచి అప్లై చేసినవారికి ఖమ్మంలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ, కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు రాజయ్య, బిక్కు, నాయకులు శంకర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
● జెడ్పీ సమావేశంలో చైర్మన్ కంచర్ల, ఎమ్మెల్యే కూనంనేని ● హాజరైన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చుంచుపల్లి: అధికారులు అంకితభావంతో పనిచేస్తేనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా పరి షత్ సమావేశం అంటే అసెంబ్లీతో సమానమని, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు లేవనెత్తిన సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు సమావేశాలకు హాజరుకావాలని, వారు చెప్పాలనుకునే అంశాలను ముందే క్లుప్తంగా తయారు చేసుకుని రావాలని సూచించారు. జిల్లా అధికారుల్లో పరిపాలన లోపం స్పష్టంగా కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవలి వర్షాల సమయంలో విద్యుత్ శాఖలో నిర్లక్ష్యం స్పష్టమైందన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు నిబద్ధతగా పనిచేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు అధికారులకు తోడ్పాటు అందించాలన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యుడు నుంచి ఎమ్మెల్యే వరకు కృషి చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్చేందుకు వెనుకాడుతున్నారని అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన జిల్లా పరిషత్ ఉద్యోగి శ్రీకృష్ణకు సంతాపం తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రసూనారాణి, డిప్యూటీ సీఈఓ కె.చంద్రశేఖరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
హైవే పనులను అడ్డుకున్న రైతులు
ముదిగొండ: ముదిగొండలోని ఊరచెర్వు తూము వద్ద మినీ అండర్పాస్ ఏర్పాటు చేయకుండా జాతీయ రహదారి పనులు చేస్తున్నారని రైతులు శనివారం అడ్డుకున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. కనుమరుగైన చెర్వు తూమును వెలికితీసి వర్షం నీరు వెళ్లేలా మినీ అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు ఈఈ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. దీంతో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈఈ హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.ప్లాంటేషన్లో మొక్కలు నరికిన వారిపై కేసు కారేపల్లి: కారేపల్లి ఫారెస్టు రేంజ్ పరిధి ఊట్కూర్ నార్త్ బీట్లోని అటవీ ప్లాంటేషన్లో శనివారం ఎర్రబోడుకు చెందిన 20 మంది మొక్కలు, పొరకను నరికివేశారు. నలభై హెక్టార్లోని ఫ్లాంటేషన్లోకి చొరబడిన వ్యక్తులు సుమారు ఐదెకరాల మేర మొక్కలను ధ్వంసం చేశారని కారేపల్లి ఫారెస్టు రేంజ్ అధికారి సిద్ధార్థ్రెడ్డి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేయడమే కాక చట్టపరమైన చర్యలకు కారేపల్లి పోలీస్స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ప్రజలు అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలే తప్ప చట్టవ్యతిరేక పనులకు దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పెనుబల్లి: వరుస వర్షాల నేపథ్యాన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశమున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం డీసీహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. పెనుబల్లి ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు సూచించారు. ఆస్పత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమకూరుస్తామని తెలిపారు. కాగా, ఆస్పత్రి నిర్వహణ, చికిత్స విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అగ్రిమెంట్ ప్రకారం భవన నిర్మాణం నెలలలోగా పూర్తి కావాల్సి ఉన్నా అలా లేదని చెప్పారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. -
● అనుమానాస్పదంగా మొదటి భార్య మృతి
తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లుకు 12 ఏళ్ల క్రితం రంగంబంజరకు చెందన కనకదుర్గతో వివామైంది. వీరికి నీరజ (11), ఝాన్సీ (6) జన్మించారు. రెండేళ్ల కిందట కనకదుర్గ గ్రామంలో వారికి కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇంట్లో మృతి చెందింది. అప్పట్లో భర్త వెంకటేశ్వర్లుపై దుర్గ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున గ్రామంలోని ఎకరం భూమిని ఇద్దరికి చెరో పది కుంటల చొప్పున, వెంకటేశ్వర్లు తల్లి పిట్టల పిచ్చమ్మ (60) పేరిట 20 కుంటల భూమిని పెద్దలు రాయించారు. అలాగే, డబుల్ బెడ్ రూమ్, పాత ఇల్లు కూడా ఇద్దరు పిల్లలు పేరు మీదే రాయించి ఎలాంటి కేసు లేకుండా దుర్గ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆపై వెంకటేశ్వర్లు గ్రామం నుంచి వెళ్లిపోయి నాలుగు నెలల అనంతరం తల్లాడకు చెందిన బూదె త్రివేణిని రెండో వివాహం చేసుకుని ఖమ్మంలో ఉంటున్నాడు. ● స్థలం కోసం వేధింపులు రెండో పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర్లు తరచుగా తల్లి వద్దకు వచ్చి అర ఎకరం భూమి పాస్ పుస్తకం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు. అంతేకాక ఇల్లు కూడా తన పేరిట రాయాలని కోరగా ఆమె నిరాకరించింది. చివరకు తల్లితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. ఈ విషయం గ్రామస్తులు, బంధువులకు తెలియడంతో ఆయనను మందలించి భూమి, ఇళ్లు కూడా పిల్లలు, తల్లికి చెందేలా ఈ ఏడాది జనవరిలో తిరిగి అగ్రిమెంట్ రాయించారు. అప్పటి నుంచే వెంకటేశ్వర్లు తన తల్లిపై కక్ష పెంచుకున్నాడు. ● చంపేస్తే ఆస్తి వస్తుందని.. ఆస్తి తనకు దక్కకుండా అడ్డుగా ఉన్న తల్లి, ఇద్దరు కుమార్తెలను చంపితే ఆస్తి దక్కించుకోవచ్చని వెంకటేశ్వర్లు భావించినట్లు తెలుస్తోంది. ఇందుకు రెండో భార్య త్రివేణి కూడా ప్రోత్సహించినట్లు సమాచారం. ఈ మేరకు ఖమ్మంలో ఉంటున్న వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి తన పక్కింటి వారికి ఫోన్ చేసి తల్లితో మాట్లాడి గ్రామానికి వస్తున్నట్లు చెప్పాడు. అన్నం కూడా వండాలని చెప్పగా ఆమె సరేనంది. ఆపై కాసేపు వేచి ఉన్న పిచ్చమ్మ, పిల్లలు ఎంతకూ వెంకటేశ్వర్లు రాకపోయే సరికి నిద్రించారు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రిస్తున్న సమయాన గ్రామానికివచ్చిన ఆయన ఇంటికి గడియపెట్టి తల్లి పిచ్చమ్మను కొట్టి చంపాడు. ఆ తర్వాత గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు కుమార్తెలు నీరజ, ఝాన్సీలను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఏమీ ఎరగనట్లుగా తలుపులు వేసి పరారయ్యాడు. అయితే, తెల్లవారినా పిచ్చమ్మ, పిల్లలు బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి చూడగా విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి కోసం వెంకటేశ్వర్లే కన్నతల్లి, ఇద్దరు కుమార్తెలను హత్య చేసినట్లు పిల్లల మేనమామ కొప్పెర మరళీకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
108 వాహనంలో ప్రసవం
ములకలపల్లి: 108 వాహనంలో మహిళ ప్రసవించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మండల పరిధిలోని వీకే. రామవరం గ్రామానికి చెందిన మిడియం లక్ష్మి శుక్రవారం రాత్రి పురిటి నొప్పులతో బాధపడుతుండగా, కుటుంబీకులు 108కు ఫోన్ చేశారు. దీంతో సిబ్బంది గ్రామానికి చేరుకుని లక్ష్మిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. లక్ష్మికి నొప్పులు ఎక్కువ కావడంతో డాక్టర్ మనీష్, ఈఎంటీ భాగ్యమ్మ, పైలెట్ అశోక్ అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం వైద్యం కోసం పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులమంటూ బంగారంతో ఉడాయింపుపాల్వంచ: సినీఫక్కీలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తున్న మరో వ్యక్తిని ఆపి, బంగారం లాక్కుని ఉడాయించిన సంఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 16న పెండ్లి సంజీవరెడ్డి స్కూటీపై జగన్నాథపురం నుంచి పాల్వంచ వైపు వస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని, వాహనాన్ని తనిఖీ చేయాలని అడ్డగించారు. దీంతో సంజీవరెడ్డి స్కూటీ దిగి డిక్కీ తెరుస్తుండగా బలవంతంగా మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం తీసుకుని పరారయ్యారు. బంగారం వస్తువుల విలువ రూ. 1.20 లక్షలు ఉంటుంది. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోడు భూమిలో చెట్లు నరికివేతఅశ్వారావుపేట: మండల పరిధిలోని గుమ్మడవల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మడకం భద్రమ్మకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో పలు అటవీ జాతుల చెట్లు నరికివేతకు గురయ్యాయి. శనివారం ఈ విషయం బయటకు వచ్చింది. మడకం భద్రమ్మకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిని గుమ్మడవల్లికి చెందిన బత్తుల చిన్నోడు లీజుకు తీసుకున్నాడు. ఈ భూమిని చదును చేసే క్రమంలో 20 చెట్లు నరికివేశారు. పాల, నల్లమద్ది, తునికి, మారుజాతి చెట్లు వీటిలో ఉన్నాయి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్ చేయగా, అటవీశాఖాధికారులు రూ.15 వేలు పెనాల్టీ విధించినట్లు సమాచారం. కూలిన విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్అశ్వారావుపేట: లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ కూలిన సంఘటన అశ్వారావుపేటలో శనివారం జరిగింది. ఖమ్మం రోడ్లోని బండి సుబ్రమణ్యం నగర్లో ఓ వీధిలోకి వస్తున్న లారీ పైకప్పునకు విద్యుత్ లైన్లను అడ్డు తగిలాయి. లారీ డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయాయి. విద్యుత్ లైన్ల నుంచి నిప్పురవ్వలు వ్యాపించగా, టీవీఎస్ షోరూం వద్ద వాహనాలు నిలిపి ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోగా ట్రాన్స్కో సిబ్బంది పునరుద్ధరించారు. మహిళ ఆత్మహత్యపాల్వంచ: మహిళ ఆత్మహత్య ఘటనలో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దంతెలబోర గ్రామానికి చెందిన మడకం సోని(34) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త పోశయ్య ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
దుమ్ముగూడెం : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సుకుమా ఎస్పీ కిరణ్చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గన్ఫైర్ తొన్లాయ్, టెట్రాయ్ గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా వారికి మావోయిస్టులు తారస పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా దూయి హుంగా అనే మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. అతడిపై వివిధ జిల్లాల్లో 16కు పైగా కేసులు నమోదయ్యాయని, రూ.లక్ష రివార్డు ఉందని ఎస్పీ వివరించారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
మధిర: మండలంలోని రామచంద్రాపురానికి చెందిన రైతు సంపసాల కృష్ణ (55) శనివారం పిడుగుపాటు తో మృతి చెందాడు. పశువులను మేపేందుకు పొలానికి వెళ్లగా వర్షం కురుస్తుండటంతో ఆయన చెట్టు కింద నిలబడ్డాడు. కృష్ణతో పాటు మరో ముగ్గురు రైతులు ఉండగా, పిడుగుపాటుకు కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. కూసుమంచి: జుజుల్రావుపేట సమీపాన ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన దుంపటి ఉపేందర్ (40)బైక్పై ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. -
20న ఇల్లెందుకు కేటీఆర్
ఇల్లెందు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈనెల 20న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇల్లెందులో పర్యటిస్తారని, పట్టభద్రులతో ముఖాముఖి చర్చిస్తారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఇల్లెందులో దిండిగల రాజేందర్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరుపున ఏనుగుల రాకేష్రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన విజయానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సమావేశంలో నాయకులు లక్కినేని సురేందర్, రేణుక, పరుచూరి వెంకటేశ్వర్లు, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, సిలివేరు సత్యనారాయణ, బొమ్మెర వరప్రసాద్, గంగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కులపై దృష్టి పెట్టండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్బజార్(కొత్తగూడెం): బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల అమలు తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సంరక్షణ కేంద్రాల ద్వారా బాలలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. వారికి పూర్తిస్థాయిలో సంరక్షణ అందించి ప్రయోజకులను చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల భద్రత, శ్రేయస్సుకు సంబంధించి ప్రభావితం చేసే సమస్యలపై కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఓపెన్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వీధి బాలల వివరాలు సేకరించి విచారణ జరిపిన తర్వాత తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించాలని చెప్పారు. ఎవరూ ముందుకురాని అనాథలకు శిశు గృహాల్లో చేర్పించి పూర్తి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాలల గృహాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని అన్నారు. బాలల రక్షణ, బాల్య వివాహాల నిరోధం, బాల కార్మికుల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలలు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొని జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ విజేత, ఎస్డీసీ కాశయ్య, ఆర్డీఓలు మధు, దామోదర్రావు, ఎస్సీ సంక్షేమాధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ, డీసీఓ రుక్మిణీదేవి, డీఏఓ బాబురావు, పౌరసరఫరాల డీఎం త్రినాథ్బాబు, డీసీఓ ఖుర్షిద్ పాల్గొన్నారు. -
జీసీసీకి సకాలంలో బిల్లులు
ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా చేస్తున్న నిత్యావసరాలు, కాస్మొటిక్స్కు సంబంధించిన నిధులు జీసీసీకి సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకున్నట్లు ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జీసీసీ ద్వారా సరఫరా అయ్యే వస్తువులను ఏటీడీఓలు, సొసైటీల పర్యవేక్షణలో చేరవేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళలు ఎంఎస్ఎం యూనిట్ ద్వారా తయారు చేసే షాంపూలు, సబ్బుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే మహిళలకు అందించాలని జీసీసీ డీఎం విజయ్కుమార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా నవ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలకు డ్యూయల్ డెస్క్ బల్లలు, డైనింగ్ సామగ్రి, కంప్యూటర్లు సరఫరా చేసేందుకు ముందుకు రాగా, వారిని పీఓ అభినందించారు. సర్వారం, రొంపేడు, ఉంజుపల్లి, పాల్వంచ, బూర్గంపాడులో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలకు అందించాలని సంస్థ చీఫ్ మేనేజర్ను కోరారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, నవ సంస్థ చీఫ్ మేనేజర్ పేడ కృష్ణ, ఏటీడీఓలు నరసింహారావు, రూపాదేవి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీతో బెంబేలు..
కొత్తరకమంటూ విక్రయం.. పాల్వంచ పట్టణంలో ఓ వ్యాపారి రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టాడు. సాధారణంగా వరి పంట 90 రోజులకు అటుఇటుగా కోతకు వస్తుంది. ఎకరాకు సగటున 35 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఇదే వ్యాపారి వద్ద రైతులు గతంలో 25 కేజీల విత్తనాల బస్తాను రూ.950 చొప్పున కొనుగోలు చేశారు. అయితే ఈ రబీ సీజన్లో కొత్తరకం వంగడం మార్కెట్లోకి వచ్చిందని, కేవలం 70 రోజుల్లోనే పంట చేతికొస్తుందని, దిగుబడి కూడా అధికంగా ఉంటుందని రైతులను నమ్మించాడు. మంచి వంగడమంటూ 10 కేజీల బస్తా రూ. 850 చొప్పున అంటగట్టాడు. సదరు వ్యాపారిపై నమ్మకంతో ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా పాల్వంచ మండలంలో అనేక మంది రైతులు ఈ వంగడాన్ని సాగు చేశారు. అయితే వ్యాపారి చెప్పిన మాటకు, పంట దిగుబడికి పొంతనే లేదు. పంట చేతికి రావడానికి అదే 90 రోజులు పట్టగా, దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు మాత్రమే వచ్చాయి. న్యాయస్థానానికి వెళ్లండి.. దిగుబడి తక్కువగా రావడంతో నష్టపోయిన రైతులు సదరు విత్తనాల వ్యాపారి వద్దకు వెళ్లి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. దీంతో ఆయన విత్తనాల కంపెనీతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆగండంటూ సర్దిచెప్పి పంపారు. ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాత రైతులు పరిహారం సంగతేంటని అడిగితే ‘నేను చేసేది ఏమీ లేదు.. న్యాయం జరగాలంటే కోర్టుకు వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆ విత్తనాల వ్యాపారి దుకాణం ఎదుట రైతులు ఆందోళన చేయగా పంచాయితీ పాల్వంచ పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాని(ఐడీఓసీ)కి చేరుకుంది. రైతులు తమకు జరిగిన నష్టాన్ని జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకొచ్చారు. పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు, పూసల తండా నుంచే సుమారు 55 మంది రైతులు నష్టపోయారు. అంతకు వారం ముందు ములకలపల్లి మండలంలోనూ నాసిరకం విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారు. దీంతో ఈ విత్తనాలు అమ్మిన వ్యాపారి, ఎకరాకు రూ. 20,000 చొప్పున పరిహారం చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నట్టు సమాచారం. కంటితుడుపు చర్యలేనా.. ప్రస్తుతం పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో నకిలీ, నాసిరకం విత్తనాల ఘటనలు వెలుగు చూశాయి. ఏజెన్సీలో ఉండే గిరిజన రైతుల్లో అవగాహన తక్కువ. అందుకే వారికి రక్షణగా ప్రభుత్వం తరఫున అనేక ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గిరిజన, సాధారణ రైతులకు మరింత మద్దతు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ, ఆ పని చేయడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. నాసిరకం విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు ఎంత మేరకు న్యాయపోరాటం చేయగలరు.. వారికి ఎవరు మద్దతుగా నిలుస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మోసం జరిగినప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి హామీలు ఇవ్వడం, దగా చేసిన వారిపై కంటి తుడుపు చర్యలు చేపట్టడంతోనే సరిపెడుతున్నారు తప్ప నకిలీ, నాసిరకం విత్తన వ్యాపారంపై ఉక్కుపాదం మోపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవగాహన చర్యలు శూన్యం.. జిల్లాలో గ్రామస్థాయిలో రైతు వేదికలు మొదలు జిల్లా కేంద్రం వరకు వివిధ హోదాల్లో వందల మంది వ్యవసాయ శాఖలో పని చేస్తున్నారు. ప్రతీ వ్యవసాయ అధికారి తమ పరిధిలో ఏ రకం విత్తనాలు వాడుతున్నారు ? వాటికి లైసెన్స్ ఉందా ? గతంలో ఎక్కడైనా ఉపయోగించారా? వాటి తాలూకు ఫలితాలు ఏంటనే అంశాలను పూర్తిగా గాలికొదిలేశారు. గ్రామాల వారీగా ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు, రైతు భరోసా తదితర గణాంకాలు నమోదు చేయడంపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్పితే సాగుబడిపై రైతులకు అవగాహన, చైతన్యం కల్పించడంలో విఫలం అవుతున్నారు. దీంతో రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలపై జిల్లా వ్యవసాయాధికారి బాబూరావును వివరణ కోరగా.. విత్తనాలు విక్రయించిన శ్రీరామ సీడ్స్, శ్రీలక్ష్మీప్రసన్న ఫెర్టిలైజర్స్, సీడ్స్ షాపు యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అందించామని చెప్పారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని, వారి నుంచి నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ అనుమతితో టాస్క్ఫోర్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. రైతులను పీడిస్తున్న కల్తీ విత్తనాలు రబీ సీజన్లో నష్టపోయిన అన్నదాతలు జిల్లా అధికారుల దృష్టికి వచ్చిన సమస్య ఖరీఫ్లోనైనా నకిలీని అరికడతారా..? ఖరీఫ్ సీజన్కు ముందే రైతులను నకిలీ విత్తనాలు బెంబేలెత్తిస్తున్నాయి. సరైన అవగాహన లేకపోయినా కమీషన్లపై ఆశతో కొందరు విత్తన వ్యాపారులు, ఏజెంట్లు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. దీంతో శ్రమకు తగిన ఫలితం రాక రైతులు నష్టపోతున్నారు. ఈ తరహా ఘటనలు గత వారం రోజులుగా జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ ఇన్చార్జిలు సాక్షిప్రతినిధి, ఖమ్మం: వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్చార్జిలు, కో ఆర్డినేటర్లను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేష్కుమార్ గౌడ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జ్లుగా వ్యవహరించనుండగా, కో ఆర్డినేటర్గా నాయకులను నియమించారు. ఖమ్మం ఇన్చార్జిగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కో ఆర్డినేటర్గా నూకల నరేష్రెడ్డి, పాలేరు ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కో ఆర్డినేటర్గా ఎం.రఘునాథ్యాదవ్, మధిర ఇన్చార్జిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోఆర్డి నేటర్గా మహమ్మద్ జావీద్, వైరా ఇన్చార్జిగా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, కోఆర్డినేటర్గా బొర్రా రాజశేఖర్, సత్తుపల్లి ఇన్చార్జిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి, కో ఆర్డినేటర్గా రాయల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారు. ఇక కొత్తగూడెం ఇన్చార్జిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కో ఆర్డినేటర్గా టి.బ్రహ్మయ్య, అశ్వారావుపేట ఇన్చార్జిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కోఆర్డినేటర్గా పిడమర్తి రవి, భద్రాచలం ఇన్చార్జిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కోఆర్డినేటర్గా తోటకూర రవిశంకర్, ఇల్లెందు ఇన్చార్జిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, కోఆర్డినేటర్గా మువ్వా విజయ్బాబు, పినపాకకు ఇన్చార్జిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్గా బి.నాగేశ్వరరావు వ్యవహరిస్తారని వెల్లడించారు. ఇంటర్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 23న బాలికలకు భద్రాచలంలోని టీటీడబ్ల్యూఆర్జేసీలో, బాలురకు 25వ తేదీన కిన్నెరసానిలోని టీటీడబ్ల్యూఆర్జేసీలో కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులు టీసీ, ఎస్సెస్సీ మెమో, కులం, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్తో హాజరు కావాలని సూచించారు. ఆదివాసీ మహిళకు డాక్టరేట్దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కుంజా బేబీ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ సాధించారు. ఈ విభాగంలో డాక్టరేట్ పొందిన మొదటి ఆదివాసీ మహిళ ఆమె కావడం విశేషం. ‘తెలంగాణ రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీలు – ప్రజలు సమాచార సేవలు ఎలా వినియోగించుకుంటున్నారు’ అంశంపై ఆమె డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ అధిపతి డాక్టర్ ఏ.ఎస్.చక్రవర్తి పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ డీఈడీ కళాశాలలో లైబ్రేరియన్గా విధులు నిర్వర్తిస్తున్న బేబీ మాట్లాడుతూ కళాశాల, ఓయూ లైబ్రరీ విభాగం అధ్యాపకులతో పాటు తన భర్త కొర్స వెంకటేశ్వర్లు సహకారంతోనే డాక్టరేట్ సాధించానని తెలిపారు. -
అందరికీ బోనస్ చెల్లించాలి
ఇల్లెందు: సన్న, దొడ్డు ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇల్లెందులోని తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేస్తూ మాట మార్చటం కాంగ్రెస్కు అలవాటేనని ఆరోపించారు. కేవలం సన్న ధాన్యం పండించిన రైతులకే బోనస్ చెల్లిస్తానని అనటం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎప్పటికీ రైతుల పక్షమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగాల రాజేందర్, లక్కినేని సురేందర్, సిలివేరు సత్యనారాయణ, ఐదు మండలాల అధ్యక్షులు తాతా గణేష్, గంగుల సత్యనారాయణ, బొమ్మెర వర ప్రసాద్, దాస్యం ప్రమోద్ కుమార్, గంగావత్ లక్ష్మణ్నాయక్, ఆందోటి అచ్చయ్య, మూడు కృష్ణ ప్రసాద్, మల్లంపాటి శ్రీనివాస్, పరుచూరి వెంకటేశ్వరరావు, రేణుక, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో నేలవాలిన వరి
గుండాల/ఇల్లెందురూరల్/కరకగూడెం: జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గుండాల మండలం పోతిరెడ్డిగూడెంలో గాలిదుమారంతో కూడిన భారీ వర్షానికి ఓ పెంకుటిల్లు కూలిపోగా అందులో నివసించే దివ్యాంగుడు ఎట్టి అబ్బయ్య సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. శుక్రవారం ఎంపీపీ ముక్తి సత్యం, మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు అతన్ని పరామర్శించారు. ప్రభుత్వం అతనికి నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలో ఆలస్యంగా నాట్లు వేసిన వరి పంట ప్రస్తుతం కోత దశకు చేరుకోగా, వర్షానికి మొత్తం నేలవాలింది. పోలారం గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 20 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కరకగూడెం మండలంలో పలుచోట్ల కోసిన వరి పనలు తడిసిపోయాయి. పలుచోట్ల ధాన్యం రాశులు కూడా తడిసిపోయాయి. కొందరు రైతులు రాత్రి వేళ ధాన్యం రాశులు తడవకుండా కాపాడుకునేందుకు అగచాట్లు పడ్డారు. గుండాలలో కూలిన పెంకుటిల్లు -
సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో 23 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రథమ సంవత్సరం వారు 5,408, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 2,726 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. సమావేశంలో డీఐఈఓ సులోచనారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
బూర్గంపాడు: అప్పుల బాధతో ఉరి వేసుకుని ఓ యువకుడు శుక్రవారం తెల్ల వారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన ఉల్లోజు హరీశ్( 27) బతుకుదెరువు కోసం అప్పు చేసి ఎనిమిది నెలల క్రితం టిప్పర్ లారీ కొన్నాడు. టిప్పర్ సరిగా నడవకపోవటంతో అప్పులు పెరిగి మనోవేదనకు గురవుతున్నాడు. గురువారం రాత్రి తన గదిలో నిద్రించగా, శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గది తలుపు తెరిచి చూసేసరికి ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత సందర్శించి నివాళులర్పించారు. దహన సంస్కారాలకు మృతుని కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయమందించారు.కారు, ఆటో ఢీ : ఒకరి మృతిమణుగూరు టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని లారీ కాంటా రాజుపేట మార్గంలో కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజుపేటకు చెందిన ఊడల నరేష్(42) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మణుగూరు నుంచి రాజుపేట వెళ్తున్న ఆటోను లారీ ట్రాన్స్పోర్ట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జుయింది. క్షతగాత్రుడిని స్థానికులు 100 పడకల ఆస్పత్రికి తరలించగా పరీక్షలు చేస్తున్న క్రమంలో మృతి చెందాడు. కాగా మృతుడు నరేష్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కావడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. మృతదేహాన్ని కాంగ్రెస్ నాయకులు గాండ్ల సురేశ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు సందర్శించి సంతాపం తెలిపారు. విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతికరకగూడెం: విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కలవలనాగారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు ఇస్లావత్ రాధాకృష్ణ దుక్కిటెద్దు మేతకు వెళ్తున్న క్రమంలో ట్రాన్ఫార్మర్ వద్ద ఉన్న తీగలను తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడింది. మృతి చెందిన దుక్కిటెద్దు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్షకొత్తగూడెంటౌన్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మైనర్ బాలిక కాళ్లకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉండగా నాటు వైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు అశ్వాపురం మండలం మంచికంటి నగర్లోని అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లారు. కాగా ఇంటి సమీపంలోనే జవ్వాజి సాంబశివరావు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. తన ఇంట్లో టీవీ చూపించే నెపంతో 2021 డిసెంబర్ 30న ఒంటరిగా ఉన్న బాలికను బలవంతంగా ఎత్తుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయగా బయటకు వదిలి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. 12 మంది సాక్షుల విచారణ అనంతరం సాంబశివరావుపై నేరం రుజువైనందున 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి పునరావాస పరిహారం కింద రూ.ఐదు లక్షలు చెల్లించే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ పెట్రోల్బంక్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన రవికృష్ణ ట్రాలీ నడుపుకుంటూ ఇల్లెందు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఇల్లెందు పట్టణంలోని 14 నంబర్ బస్తీకి చెందిన నవనీత్, ఇందిరానగర్కు చెందిన ఆరిఫ్ బైక్పై కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు వస్తున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
కొత్తగూడెంఅర్బన్: రైలులో ప్రయాణించిన ఓ వ్యక్తి పొగొట్టుకున్న బ్యాగును ఆర్పీఎఫ్ పోలీసులు శుక్రవారం తిరిగి అప్పగించారు. మణుగూ రు నుంచి కొత్తగూడెం వరకు ప్రయాణం చేసిన శ్రీ అనే ప్రయాణికుడు తన బ్యాగు పోయిందని కొత్తగూడెం రైల్వే స్టేషన్లోని ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు విచారించి బ్యాగును రికవరీ చేసి బాధితుడికి అప్పగించా రు. భద్రాచలం రోడ్డు స్టేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు ప్రయాణికులు పోగొట్టుకు న్న రూ.3,22,500 విలువైన వస్తువులను తిరిగి అప్పగించినట్లు ఆర్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. రైల్వేకు సంబంధించిన సమస్యల కోసం టోల్ ఫ్రీ 139ను వినియోగించుకోవాలని కోరారు. సినిమా థియేటర్లు బంద్కొత్తగూడెంటౌన్: థియేటర్లకు ప్రజల నుంచి సరైన ఆదరణ లేనందున తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం మేర కు జిల్లాలో శుక్రవారం నుంచి సినిమా థియేట ర్లను బంద్ చేశారు. జిల్లా కేంద్రంలోని నాలుగు థియేటర్లతోపాటు జిలావ్యాప్తంగా సుమారు 25 థియేటర్లను బంద్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పది రోజులపాటు సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంత రహదారుల పరిశీలనదుమ్ముగూడెం: మండలంలోని పైదిగూడెం – దబ్బనూతుల కొత్తూరు, ముల్కనపల్లి – ఆర్లపెంట అటవీ ప్రాంతాల్లోని రహదారులను డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ శుక్రవారం పరిశీలించారు. ఈ గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండడంతో వాటి మరమ్మతులకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నందున డీఎఫ్ఓ పరిశీలించారు. రహదారి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేందుకే తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది. ఆయన వెంట రేంజర్ కనకమ్మ, అటవీ శాఖ సిబ్బంది, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు. కేటీపీఎస్ పైపుల చోరీపై కేసు నమోదుపాల్వంచ: కేటీపీఎస్ యాష్ పాండ్ పైపుల చోరీపై శుక్రవారం కేసు నమోదైంది. పాల్వంచ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 16న కేటీపీఎస్ ఏఈ రామారావు మండలంలోని సూరారం సమీపంలో ఉన్న కేటీపీఎస్ యాష్ పాండ్ పరిశీలనకు వెళ్లారు. అక్కడ 30 మీటర్ల ఐరన్ పైపులు చోరీ అయినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పైపులను కట్ చేసి చోరీ చేశారని, వాటి విలువ రూ.80 వేలు ఉంటుందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక నిల్వలు సీజ్బూర్గంపాడు: మండలంలోని సారపాక, నాగినేనిప్రోలు గ్రామాల్లో ఇసుక నిల్వలను రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరి నుంచి ఇసుక అక్రమంగా తరలించి గ్రామాల్లో భారీగా నిల్వచేశారు. ఇక్కడి నుంచి లారీలతో తరలించి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఆర్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో ఎనిమిది ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను వేలంపాట నిర్వహించి విక్రయించనున్నట్లు తహసీల్దార్ ముజాహిద్ తెలిపారు. సారపాక నుంచి ఇసుక తరలిస్తున్న లారీలను తహస్దీలార్ పట్టుకుని అనుమతి పత్రాలను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు దృష్టి సారించినట్లు తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్లు..పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణ పరిధిలోని కుంటినాగులగూడెం వద్ద మొర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో ఎస్ఐ బి.రాము పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమానులు పవన్కల్యాణ్, బొజ్జా రవితో పాటు ట్రాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement