-
వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి
సింగరేణి(కొత్తగూడెం): వ్యవసాయ కూలీలకు మొదటి ప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. దేశంలో పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల రోజురోజుకూ పేదరికం పెరిగిపోతోందని తెలిపారు. ఈ నేపథ్యాన ఏ ఆధారం లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సాగుభూమి లేని నిరుపేదలకు స్థలం ఇవ్వాలని ఆయన కోరారు. కాగా, ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడంతో పాటు రోజుకు రూ.600 కూలి ఇచ్చేలా ఉద్యమాలు ఉధృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉందని, రక్తపోటుకు కారణం ఉప్పు అధిక వినియోగమేనని ఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రక్తపోటు – ఒక అవగాహన’పేరిట రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గిరిసింహారావు మాట్లాడుతూ.. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉండగా.. క్రమం తప్పని వ్యాయామం, బరువు తగ్గించుకోవడం, యోగా, ధ్యానం, ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ‘సాల్ట్ సత్యాగ్రహా‘నినాదంతో అందరూ రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.ఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ గిరిసింహారావు -
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు శనివారం విరాళం అందచేశారు. సత్తుపల్లి మండలం రేచర్లకు చెందిన కొప్పుల రాఘవరెడ్డి – సత్యవతి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, అర్చకులు, దాత కుటుంబీకులు పాల్గొన్నారు. పండ్ల తోటల సాగుకు ‘ఉపాధి’ చేయూతఅశ్వాపురం: పండ్ల తోటలు సాగు చేయాలనుకునే రైతులకు మహత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి జరగనున్నందున సద్వినియోగం చేసుకోవాలని అశ్వాపురం ఎంపీడీఓ వరప్రసాద్ సూచించారు. మామిడి, జామ, తైవాన్జామ, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి, సపోటా, జీడిమామిడి, కొబ్బరి, సీతాఫలంతోపాటు ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశముందని తెలిపారు. ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ, ఐటీడీఏ ద్వారా సాగు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. మొక్కల కొనుగోలుతో పాటు గొయ్యిలు తీయడం, మొక్క నాటడం పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేయిస్తారిన, మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఉపాధి హామీ ద్వారా అందుతాయని తెలిపారు. అలాగే, ఉద్యాన, వ్యవసాయశాఖలు, ఐటీడీఏ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటుచేసుకుంటే నీటి వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకు పథకాలు వర్తిస్తాయని, పూర్తి సబ్సిడీపై అందే ఈ పథకం కోసం రైతులు ఉపాధి హామీ సిబ్బంది లేదా గ్రామపంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని ఎంపీడీఓ సూచించారు. కాగా, పండ్ల తోటలు నాటాక మూడు, నాలుగేళ్ల తర్వాత ఎకరం తోటకు ఏటా రూ.2 లక్షల పైబడి ఆదాయం వస్తుందని తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు
● హైదరాబాద్ నుంచి సమీక్షించిన టీజీపీఎస్సీ చైర్మన్ ● జిల్లాలో ఏర్పాట్లను వివరించిన కలెక్టర్ఖమ్మం సహకారనగర్: వచ్చేనెల 9న జరగనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ప్రతీ జిల్లాకు ఒక రీజినల్ కోఆర్డినేటర్ను నియమించామని చెప్పారు. జూన్ 9న ఉదయం 10–30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుండగా, అభ్యర్ధుల బయోమెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 9 గంటల నుండే అనుమతిస్తూ, 10 గంటలకు గేట్లు మూసివేయాలని సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్ వీ.పీ.గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 18,600 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్షా కేంద్రాలను గుర్తించామని తెలిపారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాక లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లలను నియమించామని వెల్లడించారు. వీసీలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్, వివిధ శాఖల అధికారులు డీఎంహెచ్ఓ మాలతి, జిల్లా రవాణా శాఖాధికారి ఆఫ్రిన్ సిద్ధిఖీ, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, ఏఓ అరుణ పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ తనిఖీ ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను ఖమ్మం ఆర్ఓ, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ శనివారం తనిఖీ చేశా రు. వర్షాలు కురుస్తున్న నేపథ్యాన ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడ కూడా జల్లులు పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఆతర్వాత స్ట్రాంగ్ రూంల భవనం స్లాబ్ను పరిశీలించిన ఆయన మరమ్మతులపై సూచనలు చేశారు. ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, ఆర్ అండ్ బీ ఏఈ విశ్వనాథ్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, ఎంపీఓ రాజారావు పాల్గొన్నారు. -
‘గాడి’న పడేదెప్పుడో?
● అడ్రస్ లేకుండా పోయిన కాజీపేట ప్యాసింజర్ ● తరచూ రద్దవుతున్న బెళగావి, విజయవాడ రైళ్లు ● మూడో లైన్ నిర్మాణం, ట్రాక్ రిపేర్లతో చిక్కులు ● గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న మిగతా ట్రెయిన్లు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మూడో లైన్ నిర్మాణం, ట్రాక్ మరమ్మతుల పేరుతో రైళ్లు రద్దవుతుండడంతో వేసవిలో ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. ఎప్పుడు ఏ రైలు నడుస్తుందో, ఎప్పుడు ఏ రైలు రద్దవుతుందో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని, కనీసం త్వరలో ఎన్నికయ్యే వారైనా ఈ విషయంపై దృష్టి పెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. తగ్గిన రైళ్లు.. ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న భద్రాద్రి జిల్లాకు ఇప్పటికీ రైలు సౌకర్యం అరకొరగానే ఉంది. అది కూడా కొత్తగూడెం కేంద్రంగానే ఎక్కువ రైళ్లు నడుస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందు కొత్తగూడెం (భద్రాచలం రోడ్) స్టేషన్ నుంచి విజయవాడ, డోర్నకల్, బల్లార్షా, కాజీపేటలకు ఒక రైలు, హైదరాబాద్కు మణుగూరు సూపర్ఫాస్ట్, కొల్హాపూర్, కాకతీయ రైళ్లు నడిచేవి. కరోనా తర్వాత డోర్నకల్, కాజీపేట రైళ్లను ఇప్పటికీ పునరుద్ధరించ లేదు. కొల్హాపూర్ రైలు స్థానంలో బెళగావి ఎక్స్ప్రెన్ను ప్రవేశపెట్టారు. అయితే పునరుద్ధరించిన రైళ్లు సైతం ఎప్పుడు నడుస్తాయో, ఎప్పుడు నడవవో తెలియని పరిస్థితి నెలకొంది. మూడో లైన్ పేరుతో.. రాష్ట్రంలో కీలకమైన బల్లార్షా – కాజీపేట – డోర్నకల్ – విజయవాడ మార్గంలో గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ మూడో లైన్ నిర్మాణ పనులు చేపడుతోంది. ఇందులో నెక్కొండ – వరంగల్, ఖమ్మం – విజయవాడ సెక్షన్ల మధ్య మూడో లైన్ ట్రాక్ నిర్మాణం పూర్తయింది. అయితే సిగ్నలింగ్ పనులు చేపట్టాలంటూ గతేడాది కాలంగా పగటి వేళ నడుస్తున్న విజయవాడ, సింగరేణి, కాకతీయ, బెళగావి ఎక్స్ప్రెస్ రైళ్లను తరచుగా రద్దు చేస్తున్నారు. ఇందులో విజయవాడ, సింగరేణి, బెళగావి రైళ్లు సాఫ్ట్ టార్గెట్గా మారాయి. దీంతో ఇప్పటికే విజయవాడ రైలును జిల్లా వాసులు మరిచిపోయే పరిస్థితి రాగా బెళగావి ఎక్స్ప్రెస్ రెగ్యులర్గా నడుస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. వేసవి సెలవులతో రద్దీ.. గత నెల రోజులుగా విద్యాలయాలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణాలు జరుగుతున్నాయి. అయితే కొత్తగూడెం మీదుగా వెళ్తున్న రైళ్లు రద్దు కావడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. మరో రెండు వారాల్లో విద్యాలయాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రద్దయిన రైళ్లను నడిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఎప్పుడు సమయపాలన పాటిస్తాయో, ఎప్పుడు పాటించవో తెలియని గందరగోళం నెలకొంది. గత మూడు దశాబ్దాలుగా చూస్తే సింగరేణి రైలు సమయపాలన పాటించడమే లేదు. నూటికి 90 రోజులు ఆలస్యంగానే నడుస్తోంది. ఇప్పుడు దీనికి కాకతీయ ఎక్స్ప్రెస్ కూడా తోడయింది. మరోవైపు రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరాల్సిన మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వారంలో సగం రోజులు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరుతోంది. దీంతో అర్ధరాత్రి వేళ రాష్ట్ర రాజధానిలోని ప్రధాన స్టేషన్లో జిల్లాకు చెందిన ప్రయాణికులు పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నారు.ఇంకెన్నాళ్లిలా.. నాలుగేళ్ల క్రితం కరోనా, ఇప్పుడు మూడో లైన్ నిర్మాణం పేరుతో ఇష్టారీతిగా రైళ్లను రద్దు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ – నెక్కొండ మధ్యనే మూడో లైన్ నిర్మాణం పూర్తయింది. నెక్కొండ – మహబూబాబాద్ – డోర్నకల్ మధ్య ట్రాక్ నిర్మాణ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. మరోవైపు భద్రాచలం రోడ్ – డోర్నకల్ సెక్షన్లో రెండో లైన్, డోర్నకల్ – ఖమ్మం సెక్షన్లో మూడో లైన్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఈ నిర్మాణ పనుల వంకతో ఎన్ని నెలల పాటు రైళ్లు రద్దు చేస్తారో తెలియడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తెచ్చి రైళ్ల రద్దును అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. రద్దు తప్పనిసరైన పక్షంలో కనీసం హేతుబద్ధత పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాకు అరకొరగా ఉన్న కొద్దిపాటి రైలు ప్రయాణ సౌకర్యాన్ని దూరం చేయొద్దని కోరుతున్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పాఠశాలలు తెరిచే నాటికి పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 753 పాఠశాలలకు రూ.2,138లక్షలకు పైగా కేటాయించగా, అడ్వాన్స్గా రూ.518.5 లక్షలు చెల్లించామని తెలిపారు. ఈ మేరకు పురోగతిలో ఉన్న పనులతో పాటు అసలే ప్రారంభం కాని పనులను త్వరగా మొదలుపెట్టి పూర్తిచేయాలని, ఇందుకోసం అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ వినోద్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళీశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, పీఆర్ ఈఈలు వెంకటరెడ్డి, కేవీకే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిచేయండి ఖమ్మం సహకారనగర్: వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ సూచించారు. పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వనున్న మాస్టర్ ట్రెయినీలతో కలెక్టరేట్లో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తూనే, పోలింగ్ బాక్సుల తరలింపు, సీజ్ తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి మాస్టర్ ట్రెయినీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విధులు, బాధ్యతలను వివరించారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రెయినీలు కె.శ్రీరామ్, మదన్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
నడివేసవిలో భానుడు ముఖం చాటేయగా.. వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో మండిపోయే ఎండల స్థానంలో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు సేద తీరుతున్నారు. ఏప్రిల్తో పాటు మే మొదటి వారంలో ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. అయితే ప్రస్తుతం ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాకాలం వచ్చిందా అన్న రీతిలో వాతావరణం నెలకొంది. అయితే రోహిణికార్తె మొదలైతే మళ్లీ ఎండలు విజృంభిస్తాయని చెబుతున్నా.. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో ఈసారి ఎండల బాధ తప్పినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంనడివేసవిలో భానుడు ముఖం చాటేయగా.. వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో మండిపోయే ఎండల స్థానంలో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు సేద తీరుతున్నారు. ఏప్రిల్తో పాటు మే మొదటి వారంలో ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. అయితే ప్రస్తుతం ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాకాలం వచ్చిందా అన్న రీతిలో వాతావరణం నెలకొంది. అయితే రోహిణీకార్తె మొదలైతే మళ్లీ ఎండలు విజృంభిస్తాయని చెబుతున్నా.. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో ఈసారి ఎండల బాధ తప్పినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూల విరాట్కు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మం రూరల్/ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించనున్నారు. నేరుగా ప్రజల చెంతకే వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ టి.దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి పూజలు చేశాక 19 గ్రామాల్లో మంత్రి పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈమేరకు గ్రామాల్లో నివాసాలు, ప్రధాన సెంటర్లలో గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారని తెలిపారు. విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో చదివే గిరిజ న విద్యార్థినీ, విద్యార్థులు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల కోసం ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి సూచించారు. విదేశాల్లో మాస్టర్స్ స్థాయి పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే గిరిజన విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలి పారు. ఎంపికై న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు అందుతాయని, ఆసక్తి ఉన్న వారు overseas.tribal.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21న క్రికెట్ జట్టు ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లో ఈనెల 24 నుంచి జరగనున్న అంతర్ జిల్లాల టీ20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టును ఈనెల 21న ఎంపిక చేయనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చేకూరి వెంకట్, కోఆర్డినేటర్ ఎం.డీ.మసూద్పాషా తెలిపారు. 25 ఏళ్లలోపు వారు ఖమ్మం పెవిలియన్ మైదానంలో ఉదయం 9గంటలకు మొదలయ్యే ఎంపిక పోటీలకు హాజరుకావాలని సూచించారు. కాగా, హైదరాబాద్లో ఏడు రోజుల పాటు కొనసాగే టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు వసతి, భోజన, రవాణా సౌకర్యం హెచ్సీఏ కల్పిస్తుందని తెలిపారు. ఇతర వివరాల కోసం 98486 62125 నంబర్లో సంప్రదించాలని వారు సూచించారు. -
చలచల్లగా!
జిల్లాలో అకాల వర్షాలు ● భానుడి భగభగ నుంచి ఉపశమనం ● ఈనెల మొదటి వారం నుంచి అడపాదడపా వానలు ● నాలుగైదు రోజులుగా జిల్లాను వదలని వర్షం ● రోహిణి కార్తె గడిస్తే ఎండల గండం దాటినట్లే...ఖమ్మంలో శనివారం ఉదయం మేఘావృతమైన ఆకాశం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇక ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. ఈనెల అత్యంత ఉష్ణమయంగా మారింది. ఉక్కపోత, విపరీతమైన ఎండతో ప్రజలు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపించడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. వేసవి తాపంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనగా.. పలువురు వడదెబ్బ బారిన పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు తట్టుకోలేకపోయారు. ఏప్రిల్ మొత్తం ఇదే పరిస్థితి ఉండగా, ఈనెల మొదటి వారం వరకు అలాగే కొనసాగింది. ద్రోణి ప్రభావంతో.. ఉపరితల ద్రోణి కారణంగా గత నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు వరుసగా కురుస్తున్నాయి. సహజంగా వేసవిలో వర్షాలు కురిస్తే ఒకటి, రెండు రోజుల తర్వాత ఎండలు విపరీతంగా ఉంటాయి. కానీ ఈసారి ప్రతిరోజూ వర్షం కురుస్తుండడం లేదంటే మబ్బులు పట్టడంతో వాతావరణం చల్లగా మారుతోంది. నడివేసవిలో ఈ వాతావరణం ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుండగా వేసవి సెలవుల్లో చిన్నారులు ఆటపాటలతో హాయిగా గడుపుతున్నారు. శుక్రవారం సైతం చిరుజల్లులు కురవగా.. రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక శనివారం కూడా చిరు జల్లులు కురవడంతోపాటు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అకాల వర్షాలతో వాతావరణం చల్లబడి ప్రజలు ఉత్సాహంగా ఉన్నా.. రైతన్నలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ధాన్యం తడిసి ముద్ద కాగా.. ఈదురుగాలులు, వడగళ్ల వానల ప్రభావంతో కోతకు వచ్చిన వరికే కాక మామిడి, బొప్పాయి వంటి ఉద్యానవన పంటలకూ నష్టం వాటిల్లింది. పల్లెగూడెంలో 1.5 సెం.మీ.వర్షం.. జిల్లాలో శనివారం పలు ప్రాంతాల్లో వర్షం కురవగా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కల్లూరులో 1.2 సెం.మీ. నమోదవగా మధిర, పెనుబల్లి, తల్లాడ, ఖమ్మంలోని ప్రకాష్నగర్, నేలకొండల్లి, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, ముదిగొండ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక వైరాలో అత్యధికంగా 39.7 డిగ్రీలు, తిరుమలాయపాలెంలో 33.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 28 ప్రాంతాల్లో 35 నుంచి 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా.. 12 ప్రాంతాల్లో 33.2 నుంచి 34.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.మళ్లీ ఎండలేనా? ప్రస్తుతం వర్షాలు కురుస్తుండగా ఇంకా వేసవి కాలం మాత్రం ముగియలేదు. ఈ కారణంగా మళ్లీ ఎండలు దంచి కొడతాయనే భావన వ్యక్తమవుతోంది. త్వరలో మొదలుకానున్న రోహిణి కార్తెలో ఎండలు విపరీతంగా ఉంటాయని చెబుతున్నారు. మరో రెండు నుంచి నాలుగు రోజులపాటు వాతావరణం చల్లగా ఉండే అవకాశమున్నా ఆతర్వాత ఎండలు మొదలవుతాయని భావిస్తున్నారు. మరో పది నుంచి పదిహేను రోజులపాటు ఎండలు తప్పకున్నా.. ఏప్రిల్ స్థాయిలో కాకపోయినా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇక జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
నేనేం చేయాలో మీరు చెబుతారా?
నేలకొండపల్లి: విద్యుత్ సమస్యను వివరించేందుకు వెళ్లిన తమను ఏఈ అవమానించారని పేర్కొంటూ రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని రాజేశ్వరపురం విద్యుత్ సబ్స్టేషన్కు మోటాపురానికి చెందిన రైతు బాగం మురళి శనివారం వెళ్లి ఏఈ మురళిని కలిశాడు. తమ విద్యుత్ లైన్కు ఎక్కువ కనెక్షన్లు ఇస్తుండటంతో సమస్య వస్తోందని, ఒకవేళ కొత్త కనెక్షన్లు తప్పనిసరైతే అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని కోరారు. దీంతో ఏఈ ‘నా విధులు మీరు చెబుతారా’ అని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని వివాదానికి దారితీసింది. దీంతో ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపో అన్నారని రైతు ఆవేదన వ్యక్తం చేయగా మరికొందరు రైతులు చేరుకుని సబ్స్టేషన్ గేట్ మూసివేసి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని రైతులతో చర్చించగా ఆందోళన విరమించారు. ఈ విషయమై ఏఈ బాలాజీని వివరణ కోరగా వ్యక్తిగత తగాదాలతో ఇతర రైతులకు కనెక్షన్ ఇవ్వొద్దని చెప్పగా తమ విధులు కూడా మీరే చెబుతారా అని ప్రశ్నించానే తప్ప తాను రైతులను అవమానించలేదని తెలిపారు. విద్యుత్ ఏఈ ఆగ్రహం వ్యక్తం చేశారని రైతుల నిరసన -
గ్రామీణ రైతుల ఆధునిక సేద్యం
● ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ ● ప్రస్తుతం పెరుగుతున్న డ్రోన్ల వినియోగం ● సులువవుతున్న పురుగు మందుల పిచికారీబూర్గంపాడు / చండ్రుగొండ: గ్రామీణ ప్రాంత రైతులు సంప్రదాయ విధానాలను పాటిస్తూనే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే దుక్కులు, దమ్ములు, పంటల్లో పాటుచేయడం వంటి పనులకు యంత్రాల వినియోగం పెరిగింది. ఆపై పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణ కోసం మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు డ్రోన్లతో వరి, ఆయిల్పామ్ పంటల్లో మందులు పిచికారీ చేస్తుండగా మంచి ఫలితాలు రావడంతో ఇతరులు కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానంలో సమయం ఆదా కావడంతోపాటు కూలీల కొరతను అధిగమించవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల క్రితమే ఆరంభం రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు సాగవుతాయి. ఆయిల్పామ్ సాగు జిల్లా పెట్టింది పేరు కాగా.. ఇతర వాణిజ్య పంటలు కూడా సాగవుతున్నాయి. ఈ నేపథ్యాన ఐదేళ్ల క్రితమే పలువురు రైతులు డ్రోన్ల ద్వారా మందుల పిచికారీని ప్రారంభించారు. తొలినాళ్లలో ఇతర రైతులు పెద్దగా ఆసక్తి చూపించకున్నా గత రెండేళ్లుగా మాత్రం కాస్త స్థోమత ఉన్న రైతులు డ్రోన్ల వినియోగంపై మక్కువ కనబరుస్తున్నారు. చకచకా.. ఖర్చు తక్కువ రైతులు పంటలపై మందుల పిచికారీకి హ్యాండ్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను వినియోగిస్తున్నారు. వీటితో మందులు పిచికారీ చేయాలంటే కూలీల అవసరం తప్పనిసరి. ప్రస్తుతం కూలీల కొరత ఉండడతో పంటలను నష్టపోవాల్సి వస్తోంది. మరోపక్క వీటి ద్వారా మందుల పిచికారీతో విష ప్రభావం రైతులు, కూలీలపై పడుతోంది. దీంతో ట్రాక్టర్లకు పెద్ద స్ప్రేయర్లు బిగించి మందులు పిచికారీ చేసినా పత్తి మొక్కలను నష్టపోతున్నారు. ఇక వరి, మిర్చి, పెసర, మినుము, శనగ, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలలో ట్రాక్టర్లతో స్ప్రే చేయడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు డ్రోన్లు ఆశాకిరణంగా మారాయి. రెండేళ్లుగా వీటి వాడకం పెరగగా ఇప్పుడిప్పుడే గ్రామాల్లోనూ వినియోగం మొదలవుతోంది. కొందరు నేరుగా కొనుగోలు చేస్తుండగా.. ఇంకొందరు పురుగు మందుల కంపెనీల నుంచి అద్దెకు డ్రోన్లు తెచ్చుకుంటున్నారు. తద్వారా వ్యయం తగ్గడంతోపాటు సమయం కలిసొస్తుందని చెబుతున్నారు. డ్రోన్కు కెమెరా కూడా... కెమెరా అమర్చి ఉండే అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్ బ్యాటరీలతో నడుస్తుంది. రిమోట్ కంట్రోల్తో దీనిని నియంత్రిస్తూ కేవలం పది నిమిషాల్లోనే ఎకరం పంటపై పురుగు మందులు పిచికారీ చేయొచ్చు. డ్రోన్ స్ప్రేయర్కు పది లీటర్ల ట్యాంక్ ఉండగా.. బ్యాటరీతో కలిపి స్ప్రేయర్ బరువు 13 కిలోల వరకు బరువు ఉంటుంది. ప్రతీ ఎకరం పొలంలో పిచికారీ అనంతరం బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుంది. కాగా, స్ప్రేయర్కు ఉండే కెమెరా ఆధారంగా పిచికారీ సమపాళ్లలో జరిగేలా పర్యవేక్షించే అవకాశముండడంతో పని సులవవుతోంది. కాగా, ప్రభుత్వం అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్లను రాయితీపై అందించి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.ఇబ్బందులు చూడలేక తీసుకొచ్చా.. పంటల్లో మందుల పిచికారీ చేసేందుకు కూలీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్వతహాగా రైతు అయిన నేను అందరికీ ఉపయోగంగా ఉంటుందని డ్రోన్ తీసుకొచ్చా. డ్రోన్ వినియోగంతో సమయం, మందు, నగదు ఆదా అవుతాయి. – జిల్లెళ్ల రాము, రైతు, దామరచర్లమంచి ఫలితం కన్పించింది... డ్రోన్ వినియోగించి పంటలపై పురుగుల మందు పిచికారీ చేయడంతో మంచి ఫలితం కనిపించింది. సగానికి సగం పురుగుల మందు ఆదా అయింది. ఒక ఎకరాకు 90 గ్రాములు పట్టాల్సిన మందు 50 గ్రాములతోనే సరిపోయింది. ఇది రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – నరుకుళ్ల అప్పారావు, రైతు, అయన్నపాలెం -
ఖమ్మంలో యూనివర్సిటీ స్థాపించాలి
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు మద్దతు ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ, లక్ష్మణ్ ఖమ్మంమయూరిసెంటర్: విద్యా గుమ్మంగా భాసిల్లుతున్న ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో పేరున్న ఖమ్మంపై ఆది నుంచి పాలకవర్గాలు వివక్ష ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని విమర్శించారు. బీజేపీ విద్యను కాషాయీకరణ చేసేందుకు యత్నిస్తూ నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకురాగా తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని.. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఏఐఎస్ఎఫ్ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాసంవత్సరం సమీపిస్తున్న నేపథ్యాన ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై దృష్టి సారించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నియామకాలు చేపట్టి వసతులను కల్పించాలని మణికంఠ, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో టెట్ కేంద్రాల కేటాయింపులో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ఇటికాల రామకృష్ణ, సతుకు ప్రవీణ్, మడుపల్లి లక్ష్మణ్, వెంకటేశ్, మధు, శివ, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణలో నేర్పించే అంశాలు
● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ సై ్టల్స్ ● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ కేర్ ● ఫేషియల్స్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● మేకప్స్ (బ్రైడల్, పార్టీ మరియు లైట్ మేకప్స్) ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● శారీ డ్రాపింగ్ -
● వెలాసిటీకి ర్యాంకులు
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని వెలాసిటీ జూనియర్ కళాశాల అకడమిక్ డీన్ మహ్మద్ యాకూబ్, చైర్మన్ శెట్టి లక్ష్మణ్రావు, కరస్పాండెంట్ మల్లోలు రవి తెలిపారు. శనివారం కళాశాలలో విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడుతూ.. పి.రమాదేవి 3,396వ ర్యాంక్, కె.అనూష 4,679, సీహెచ్.లాస్య 4,866, వి.వాణి 4,957, డి.రాహుల్ 5,698, వి.నిఖిలేశ్ 6,356, ఎస్కే సోహాన్ అఫ్రోజ్ 6,926, ఎల్.హేమంత్సాయి 7,564, ఆర్.జస్విత్కుమార్ 8,245, వి.రజిని 9,456, ఎండీ హసీనా 10,432, ఎస్.లక్ష్మీనవ్యశ్రీ 11,850, బి.రవి 11,986, జి.వెంకటేశ్ 12,459, ఆర్.సంతోష్ 13,246, బి.శ్రివేణి 13,654, ఎ.నిహారిక 14,686, కె..నిషిత 15,747, జె.జీవని 16,878వ ర్యాంక్ సాధించారని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సీహెచ్.వెంకట్, తోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
● హార్వెస్ట్కు ఉత్తమ ర్యాంక్లు
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి తెలిపారు. శనివారం విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విభాగంలో కె.ప్రణయ్ సంజన్ రాష్ట్రస్థాయిలో 684వ ర్యాంక్, జి.చిన్మయి 695, వి.జస్వంత్ 723, జి.రాజ్వర్ధన్ 900, ఎన్.అనీశ్ 1,156, ఆర్.సాయిసంజ్ 1,197, వి.విష్ణుతేజ 1,483వ ర్యాంక్ సాధించారన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో కె.శ్రీప్రియతమ్ 371వ ర్యాంక్, ఎస్.గోకుల్ కిశోర్రెడ్డి 882, ఎం.నవదీప్ 984, జి.హేమసాయి 1,234, కె.షారోస్ పెర్సిన్ 3,355వ ర్యాంక్ సాధించారని తెలిపారు. -
కిరాతకుడు..
ఆస్తి కోసం కన్నతల్లి దారుణహత్య ● కన్నబిడ్డలనూ వదలని దుర్మార్గుడు ● తల్లి దివ్యాంగురాలనే కనికరమూ చూపని వైనం ● అన్నం తినేందుకు వస్తున్నానని చెప్పి హతమార్చిన నిందితుడు ● తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం మానవత్వం మంట గలిసింది.. చెడు తిరుగుళ్లు, మద్యానికి బానిసైన వ్యక్తి ఆస్తి మొత్తం దక్కించుకోవాలనే పన్నాగంతో కన్నతల్లినే కాదు రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు కుమార్తెలనూ హత్య చేశాడు. కుటుంబంలో మిగిలిన వీరిని చంపితే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనే భావనతో దివ్యాంగురాలైన తల్లినే కాక అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హతమార్చాడు. అన్నం తినేందుకు వస్తున్నానని చెప్పిన కుమారుడి కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్న తల్లి.. తండ్రి వస్తున్నాడని ఆశగా చూసిన పిల్లలకు అదే చివరిరాత్రి అయింది. తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. – తల్లాడ -
అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో తలుపు వద్ద నిలుచున్న వివాహిత ప్రమాదవశాత్తు జారి వెనుక టైరు కింద పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్లో పనిచేస్తోంది. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కొణిజర్లలో ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కింది. అప్పటికే ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆమె ఫుట్బోర్డ్పై నిలబడింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. ఇంతలోనే ఎదురుగా ద్విచక్రవాహనం రాగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో తలుపు వద్ద నిలబడిన అనూష జారి రోడ్డుపై పడింది. అప్పటికే బస్సు కదలడంతో వెనుక టైరు ఆమె పైనుంచి వెళ్లగా నడుము భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త అశోక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఆమె మృతి చెందిందనే సమాచారంతో కుటుంబీకులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, అనూష మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
మధిర: మండలంలోని రామచంద్రాపురానికి చెందిన రైతు సంపసాల కృష్ణ (55) శనివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. పశువులను మేపేందుకు పొలానికి వెళ్లగా వర్షం కురుస్తుండటంతో ఆయన చెట్టు కింద నిలబడ్డాడు. కృష్ణతో పాటు మరో ముగ్గురు రైతులు ఉండగా, పిడుగుపాటుకు కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ప్రమాదవశాత్తు వ్యక్తి.. మధిర: మండలంలోని రొంపిమళ్ల గ్రామంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీ రాజేశ్ (42) శుక్రవారం మృతి చెందాడు. కూలీ పనికి వెళ్లిన ఆయన సిమెంట్ బొంగును పైకి ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. కూసుమంచి: మండలంలోని జుజుల్రావుపేట సమీపాన ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ససూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన దుంపటి ఉపేందర్ (40) ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందగా.. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతుడి జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా గుర్తించిన పోలీసులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. -
బైక్లు ఢీకొని బయటపడ్డ గంజాయి
మోటార్ సైకిల్, గంజాయి వదిలి ఇద్దరు యువకుల పరార్బూర్గంపాడు: రెండు బైక్లు ఢీకొని ప్రమాదం జరగడంతో మోటార్ సైకిల్, గంజాయిప్యాకెట్లు వదిలి ఇద్దరు వ్యక్తులు పరారైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... భద్రాచలం వైపు నుంచి ఇద్దరు యువకులు బైక్పై వేగంగా వస్తున్నారు. ఈ క్రమంలో సారపాక ప్రధాన కూడలిలో ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొట్టారు. దీంతో వారి బైక్పై ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. అయితే ఆ ఇద్దరు బ్యాగ్ తీసుకోకుండా, మోటార్ సైకిల్ను అక్కడే వదిలేసి పరారయ్యారు. మరో మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి, స్థానికులు బ్యాగు తెరిచి చూడగా అందులో సుమారు 4 కిలోల బరువు కలిగిన రెండు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. స్థానికులు పరారైన యువకుల కోసం కొద్ది దూరం వెంబడించగా, వారు రూట్ మార్చి తప్పించుకున్నారు. గంజాయి దొరికిన విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భద్రాచలం వైపు నుంచి వస్తున్న గంజాయి స్మగ్లర్లు తమను వెనుక నుంచి ఎవరో అనుసరిస్తున్నట్లు అనుమానం రావటంతో వేగంగా బైక్ నడుపుతుండగా, ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. అంతకుముందు మరో బైక్ను ఢీకొట్టి వచ్చినట్లు పేర్కొన్నారు. పోలీసులమంటూ బంగారంతో ఉడాయింపుపాల్వంచ: సినీఫక్కీలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తున్న మరో వ్యక్తిని ఆపి, బంగారం లాక్కుని ఉడాయించిన సంఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 16న పెండ్లి సంజీవరెడ్డి స్కూటీపై జగన్నాథపురం నుంచి పాల్వంచ వైపు వస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని, వాహనాన్ని తనిఖీ చేయాలని అడ్డగించారు. దీంతో సంజీవరెడ్డి స్కూటీ దిగి డిక్కీ తెరుస్తుండగా బలవంతంగా మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం తీసుకుని పరారయ్యారు. బంగారం వస్తువుల విలువ రూ. 1.20 లక్షలు ఉంటుంది. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● శ్రీ చైతన్య ప్రభంజనం
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన వారు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో తమ విద్యార్థులు పి.సాయిదినేశ్రెడ్డి రాష్ట్రస్థాయిలో 188వ ర్యాంక్, జి.అక్షయ్రెడ్డి 215, వి.తుషార్చౌదరి 297, ఎస్.వర్షిత్కౌండిన్య 321, టి.శ్రీరాంతేజ 348, కె.నవదీప్ కిరణ్ 351, ఎస్.సాత్విక్ 387, కె.మణిదీప్ 423, డి.శ్రీసాత్విక్ 457, డి.సింధు 481, జి.మనోహర్ 506, బి.నాగశ్రీ 517, బి.మధు 528, సీహెచ్.సంజయ్ 663, ఎస్కే నసీమ్ 731, బి.అభిలాష్ 736, ఆర్.కౌశిక్రెడ్డి 816, టి.రోహిణి 931, సీహెచ్.సాహిష్ణ మెహర్ 1,130, పి.బ్రాహ్మిణి 1,251, వి.సందీప్ 1,284, ఎస్కే జాన్బీ 1,296వ ర్యాంక్ సాధించగా.. ఇంకా పలువురు అత్యుత్తమ ర్యాంక్లు సాధించారన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్ చేతన్మాథూర్, అకడమిక్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, ఏజీఎంలు సీహెచ్ బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
● అనుమానాస్పదంగా మొదటి భార్య మృతి
తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లుకు 12 ఏళ్ల క్రితం రంగంబంజరకు చెందన కనకదుర్గతో వివామైంది. వీరికి నీరజ (11), ఝాన్సీ (6) జన్మించారు. రెండేళ్ల కిందట కనకదుర్గ గ్రామంలో వారికి కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇంట్లో మృతి చెందింది. అప్పట్లో భర్త వెంకటేశ్వర్లుపై దుర్గ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున గ్రామంలోని ఎకరం భూమిని ఇద్దరికి చెరో పది కుంటల చొప్పున, వెంకటేశ్వర్లు తల్లి పిట్టల పిచ్చమ్మ (60) పేరిట 20 కుంటల భూమిని పెద్దలు రాయించారు. అలాగే, డబుల్ బెడ్ రూమ్, పాత ఇల్లు కూడా ఇద్దరు పిల్లలు పేరు మీదే రాయించి ఎలాంటి కేసు లేకుండా దుర్గ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆపై వెంకటేశ్వర్లు గ్రామం నుంచి వెళ్లిపోయి నాలుగు నెలల అనంతరం తల్లాడకు చెందిన బూదె త్రివేణిని రెండో వివాహం చేసుకుని ఖమ్మంలో ఉంటున్నాడు. ● స్థలం కోసం వేధింపులు రెండో పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర్లు తరచుగా తల్లి వద్దకు వచ్చి అర ఎకరం భూమి పాస్ పుస్తకం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు. అంతేకాక ఇల్లు కూడా తన పేరిట రాయాలని కోరగా ఆమె నిరాకరించింది. చివరకు తల్లితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. ఈ విషయం గ్రామస్తులు, బంధువులకు తెలియడంతో ఆయనను మందలించి భూమి, ఇళ్లు కూడా పిల్లలు, తల్లికి చెందేలా ఈ ఏడాది జనవరిలో తిరిగి అగ్రిమెంట్ రాయించారు. అప్పటి నుంచే వెంకటేశ్వర్లు తన తల్లిపై కక్ష పెంచుకున్నాడు. ● చంపేస్తే ఆస్తి వస్తుందని.. ఆస్తి తనకు దక్కకుండా అడ్డుగా ఉన్న తల్లి, ఇద్దరు కుమార్తెలను చంపితే ఆస్తి దక్కించుకోవచ్చని వెంకటేశ్వర్లు భావించినట్లు తెలుస్తోంది. ఇందుకు రెండో భార్య త్రివేణి కూడా ప్రోత్సహించినట్లు సమాచారం. ఈ మేరకు ఖమ్మంలో ఉంటున్న వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి తన పక్కింటి వారికి ఫోన్ చేసి తల్లితో మాట్లాడి గ్రామానికి వస్తున్నట్లు చెప్పాడు. అన్నం కూడా వండాలని చెప్పగా ఆమె సరేనంది. ఆపై కాసేపు వేచి ఉన్న పిచ్చమ్మ, పిల్లలు ఎంతకూ వెంకటేశ్వర్లు రాకపోయే సరికి నిద్రించారు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రిస్తున్న సమయాన గ్రామానికివచ్చిన ఆయన ఇంటికి గడియపెట్టి తల్లి పిచ్చమ్మను కొట్టి చంపాడు. ఆ తర్వాత గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు కుమార్తెలు నీరజ, ఝాన్సీలను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఏమీ ఎరగనట్లుగా తలుపులు వేసి పరారయ్యాడు. అయితే, తెల్లవారినా పిచ్చమ్మ, పిల్లలు బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి చూడగా విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి కోసం వెంకటేశ్వర్లే కన్నతల్లి, ఇద్దరు కుమార్తెలను హత్య చేసినట్లు పిల్లల మేనమామ కొప్పెర మరళీకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
● రెజొనెన్స్ ప్రభంజనం
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని రెజొనెన్స్ డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. కళాశాలలో ర్యాంకర్లను శనివారం అభినందించిన వారు మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగంలో బి.కిరణ్కుమార్రెడ్డి 1,541వ ర్యాంక్, ఎం.సాయిశ్రీహర్ష 2,205, కె.యశ్వంత్ 3,699, పి.జాహ్నవి రాధ 3,748, పి.నిఖిల్సాయి 4,451, డి.శ్రవిష్ట 4,739, ఎం.సాయిలక్ష్మీఅంకిత 5,389, ఎ.జీవన్కుమార్ 7,295వ ర్యాంక్ సాధించారన్నారు. అలాగే, అగ్రికల్చర్ విభాగంలో గాదె హారిక 2,543వ ర్యాంక్, వై.లిఖిత 4,527, ఏ.సాయి ప్రగ్న్యా 7,777, ఎండీ పర్వీన్ బేగం 8,405వ ర్యాంక్ సాధించారని తెలిపారు. ఇంకా పలువురు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
దుమ్ముగూడెం : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సుకుమా ఎస్పీ కిరణ్చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గన్ఫైర్ తొన్లాయ్, టెట్రాయ్ గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా వారికి మావోయిస్టులు తారస పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా దూయి హుంగా అనే మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. అతడిపై వివిధ జిల్లాల్లో 16కు పైగా కేసులు నమోదయ్యాయని, రూ.లక్ష రివార్డు ఉందని ఎస్పీ వివరించారు. -
● కృష్ణవేణి సత్తా
ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులతో సత్తా చాటారని కృష్ణవేణి కళాశాలల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులను అభినందించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్.భరత్తేజ 162వ ర్యాంక్, సీహెచ్.భరత్ వంశీ 862, కె.స్వాతి 1,260, వై.గీతిక 1,352, ఏ.ఇందు 4,158, ఎండీ మెహెక్ తబస్సుమ్ 4,380, ఎన్.ప్రవళిక 5,327, సీహెచ్ లక్ష్మి 5,788, టి.కోమలి 6,686, వై.ఉమేశ్చంద్రస్ 7,021, శ్రీహిత 7,045, జి.సాయిసైనిక 7,484, పి.నవదీప్ 7,657, కె.హరిప్రియ 7,928, బి.మెర్సీ 8,087, టి.వర్ష 8,108, కె.అశ్రిత 8,967, జి.దీప్తి 9,762, వి.దేవిప్రియ 9,828, బి.గణేశ్ 9,981వ ర్యాంక్ సాధించగా.. పలువురు అత్యుత్తమ ర్యాంక్లు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ ఇన్చార్జ్ వంశీకృష్ణ, ఏఓ నిరంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● న్యూవిజన్దే అగ్రస్థానం
టీఎస్ ఎప్సెట్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ తెలిపారు. విద్యార్థులను కళాశాలలో అభినందించిన ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో తమ విద్యార్థులు జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంక్, జి.శ్రీరామ్ 157, ఎస్.రుషిధర్రెడ్డి 231, కె.వర్షిత్ 245, ఎం.నితీశ్కుమార్ 409, పి.సుష్మిత 465, జి.సాయిలిఖిత 492, ఎండీ రిడసమ్రీన్ 563, పి.రేవంత్ 625, ఎం.పవన్కుమార్ 739, పి.గోవర్దన్సాయి 853, బి.ప్రభంజన్యాదవ్ 883, సీహెచ్ నయాన్ 1,179, వై.ప్రశాంతి 1,245, సీహెచ్ భువన 1,322వ ర్యాంక్ సాధించారన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో 550 మంది పరీక్షకు హాజరు కాగా 10 వేల లోపు 86 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. డైరెక్టర్లు సీహెచ్ గోపీచంద్, సీహెచ్ కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement