-
సమాచారం తెలిసేదెలా?
● నిలిచిన ఉపాధి కూలీల పే స్లిప్లు ● తెలియని మస్టర్లు, వేతన వివరాలు ● జన్మన్రేగా యాప్పై అవగాహనేది?తిర్యాణి: ఉపాధిహామీ పథకంలో మార్పుల కారణంగా కూలీలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఒక్కో కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తుండగా నిరుపేద కూలీలకు ఉపాధి లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1.23 లక్షల జాబ్ కార్డులుండగా 2.47 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. జిల్లాలో 15 మండలాలుండగా ఒకటి, రెండు మండలాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో ఉపాఽధిహామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు వేతన స్లిప్లు ఇవ్వడం లేదు. రెండేళ్ల క్రితం వరకు కూలీలకు సక్రమంగా పే స్లిప్లు అందజేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో నిలిపివేశారు. ప్రధానంగా పే స్లిప్లో కూలీ పేరు, పని ప్రదేశం, మస్టర్ల సంఖ్య, మిగతా పని దినాల సంఖ్య, రోజు కూలి తదితర వివరాలుంటాయి. దీంతో ఒక్కో కూలీ ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారు.. ఎంత వేతనం వస్తుంది.. అనేది సృష్టంగా అర్థమయ్యేది. ప్రస్తుతం స్లిప్లు పంపిణీ చేయకపోవడంతో కూలీకి వారానికి ఎంత వేతనం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతీ వారం వేతన వివరాలు కూలీలకు తెలియడం ద్వారా ఒక వారం తక్కువ పడితే, మరో వారం నుంచి గరిష్ట వేతనం కోసం అధికంగా పని చేసే అవకాశముంది. కూలీలు నష్టపోయే అవకాశంసాధారణంగా ఉపాధిహామీ పనులకు సంబంఽధించిన డబ్బులు పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీస్ ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. అయితే సదరు కూలీలకు సంబంధించి దాదాపు ఒకేసారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వారాలకు సంబంధించిన చెల్లింపులు చేస్తుంటారు. అయితే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా నిరక్ష్యరాసులైన కూలీలుండడంతో తమ ఖాతాల్లో ఎంత నగదు జమ అయ్యిందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బీపీఎంలు నగదు విత్ డ్రా సమయంలో గతంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఒకవేళ కూలీల బ్యాంక్ ఖాతాల్లో వేతన డబ్బులు జమ అయినప్పటికీ దగ్గరలో ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండని కారణంగా మినీ ఏటీఎం నిర్వాహకులను ఆశ్రయించి నగదు విత్డ్రా చేసుకునే సమయంలోనూ అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఉపాధిహామీ కూలీలకు సంబంధించిన వేతన వివరాలను జన్మన్రేగా యాప్లో పొందుపరుస్తున్నప్పటికీ ఆ యాప్పై క్షేత్ర స్థాయిలో కూలీలకు అవగాహన లేకపోవడంతో అది ఉపయోగపడటం లేదు. ఉపాధిహామీ సిబ్బంది జన్మన్రేగా యాప్పై అవగాహన కల్పించాలని, వేతన స్లిప్లు ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు. -
భీం ఆశయ సాధనకు కృషి
కౌటాల: కుమురంభీం ఆశయ సాధనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, కుమురంభీం మనవడు కుమురం సోనేరావు సూచించారు. మండలంలోని తాటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘జల్ జంగల్ జమీ న్’ కోసం పోరాడిన గొప్ప యోధుడు కుమురంభీం అని కొనియాడారు. కుమురంభీం పోరాట స్ఫూర్తి తోనే ఆదివాసీలు తమ హక్కులను కాపాడుకోవాల ని సూచించారు. ఆదివాసీలు ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా వృద్ధి చెందాలని పిలుపుని చ్చారు. అనంతరం కుమురంభీం విగ్రహం వద్ద ఆదివాసీ నాయకులు జెండాలు ఎగురవేశారు. విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. గ్రా మంలో భాజాభజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, ఎంపీటీసీ సభ్యులు గావుడే వనిత, నాయకులు నైతం సీతల్, ఆనంద్రావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్కు సన్నద్ధం
కౌటాల: వేసవి దుక్కులు దున్నే పద్ధతి అనాదిగా వస్తున్న సంప్రదాయం. నీటిని నిల్వ చేసుకునేందుకు ఇదో చక్కటి మార్గం. నేలలో నీటి శాతం పెరుగుతుంది. సుమారు 20రోజుల పాటు వర్షం కురవకపోయినా ఇంకిన నీటితడి మొక్కలకు అందుతుంది. దీంతో ఖర్చులు తక్కువే కాకుండా ప్ర యోజనాలు ఎక్కువగా ఉండటంతో వేసవి దు క్కులు దున్నుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. యాసంగి సాగు అనంతరం భూ సారాన్ని పెంచేందుకు చేపట్టే వేసవి దుక్కులు రైతులకు పలు ప్రయోజనాలను చేకూర్చుతాయ ని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వేసవి లో గతేడాది ఖరీఫ్లో వేసిన పత్తి తీసిన తర్వాత ఎండిన మొక్కలను కాల్చిన అనంతరం రైతులు దుక్కులు దున్నిస్తున్నారు. వేసవిలో ఎండిన పత్తి కర్రను కాల్చడంతో భూమిలోని చీడపీడలు నశి స్తాయి. వేసవి దుక్కులతో మంచి లాభాలున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. సరిపడా తేమ ఉన్న చేన్లు, పొలాల్లో సుమారు తొమ్మిది అంగుళాల లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకుంటే ప్రయోజనముంటుంది. 30వేల ఎకరాల్లో సాగుకౌటాల మండలంలో ఖరీఫ్లో 30వేల ఎకరాల్లో సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఈ సారి పత్తి 20 వేల ఎకరాలు, వరి 8వేలు, కంది 2వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు ఇప్పటికే 40–50 శాతం మేర దుక్కులు దున్నుకున్నారు. మిగతా 50 శాతం మంది సన్నద్ధమవుతున్నారు. తొలకరికి ముందు వేసవిలో వేసిన పంట ను తొలగించడంలో రైతులకు బహుళ ప్రయోజ నం ఉంటుంది. గతంలో వేసిన పంటల అవశేషా లు దుక్కిలో కుళ్లి కర్భన శాతం పెరుగుతుంది. నే లలో పురుగులు, వాటి గుడ్లు ఉన్నట్లయితే దున్ని న తర్వాత పైకి తేలడంతో సూర్యరశ్మి తగిలి చని పోతాయి. నీటి నిల్వ సామర్థ్యం 50 శాతం పెరిగి సుమారు 20రోజుల వరకు వాన కురవకపోయినా ఇంకిన నీటితడి మొక్కలకు అందుతుంది. నేల సారవంతానికి..వేసవి దుక్కులు దున్నే ముందు భూమిలో పశువులు, ఎరువులు, కంపోస్టు, చెరువు మట్టి వెదజల్లితే నేల సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో కలుపు మొక్కలు మట్టి కిందికి చేరి సేంద్రియ ఎరువుగా మారుతాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. లోతు దుక్కులు దున్నినప్పుడు నేల పైపొరల్లో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేయడానికి అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు, కాయలు, దుంపలు, వేర్లు పెకిలించబడి వేసవి ఉష్ణోగ్రతలకు నశించడానికి అవకాశం ఉంటుంది. నేల పైకి తేలిన కాయలు, దుంపలు, వేర్లను ఏరివేయొచ్చు. దున్నకుంటే కలిగే నష్టాలుకోతల తర్వాత దుక్కి దున్నకుండా వదిలేస్తే అవసరమైన సమయంలో భూమి బీడుగా మారే ప్ర మాదముంది. భూమి గాలిని పీల్చుకునే శక్తి కో ల్పోతుంది. లోతైన పొరల నుంచి నీరు ఆవిరై పో తుంది. కలుపు మొక్కలు పెరిగి అవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూసారాన్ని తగ్గిస్తాయి. విత్తడానికి వారం, పదిరోజుల ముందు దుక్కులు దున్నితే ఆశించిన దిగుబడి రాదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఖర్చులు తగ్గుతాయి ఏటా వేసవి దుక్కులు దున్నుకుంటాం. నాకున్న ఐదెకరాల్లో ట్రాక్టర్లతో వేసవిలోనే దున్నిస్తా. లోతుగా దుక్కి దున్నడంతో రాలిన ఆకులు నేలలో కలిసి కుళ్లిపోతాయి. సేంద్రియ ఎరువులు చల్లి మళ్లీ దున్నుకుంటాం. దీంతో వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోనే ఇంకుతుంది. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. – దుర్గం శివారం, యాపలగూడ అధిక దిగుబడి వస్తుంది వేసవిలో దుక్కులు దున్నుకుంటే నేలలోని పురుగులు చనిపోతాయి. నేలలో సేంద్రియ కర్భన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. రైతులు ఆలస్యంగా దున్నితే పురుగులు, తెగుళ్లు ఎక్కువగా వస్తాయి. జీలుగ విత్తనాలు వేస్తే భూమి గుళ్ల బారి నేల సారవంతమవుతుంది. విత్తనాలు మొలకెత్తి, పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. – పాలకుర్తి రాజేశ్, ఏవో, కౌటాల వేసవి దుక్కులతో ప్రయోజనం తెగుళ్ల నివారణకు అవకాశం అన్నదాతలకు అధిక దిగుబడి -
సమస్య పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: మండలంలోని సాలెగూడా గ్రామంలోగల గాంధీచౌక్ బీసీ కాలనీలో ప్రధాన రహదారిపై మోకాళ్లలోతు వర్షపు నీరు నిలిచింది. దీంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి నేపథ్యంలో అడపాదడప కురిసిన వర్షాలకు రహదారిపై నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందాయి. గ్రామస్తులు అనేక రోగాల బారిన పడుతున్నారు. అధికారులు కనీసం నీటిని తొలగించే చర్యలు కూడా తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మిస్తే నీటి నిల్వ సమస్య కొంతమేర తీరుతుందని పేర్కొంటున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వెంటనే రోడ్డుపై మురుగునీటిని తొలగించి భవిష్యత్లో మళ్లీ నిలువకుండా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
న్యూస్రీల్
28 నుంచి సెమిస్టర్ పరీక్షలు కాగజ్నగర్ రూరల్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్–1 పరీక్షలు ఈనెల 28నుంచి ప్రారంభమవుతాయని కళాశాల కోఆర్డినేటర్ తూడూరు దత్తాత్రేయ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్తో పాటు ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. లేనిపక్షంలో పరీక్షాకేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. -
● నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు ● పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తం ● పంచాయతీ కార్యదర్శులపై భారం ● అప్పులు చేసి పనులు చేస్తున్న వైనం
బెజ్జూర్: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే నిధులు లేక పంచాయతీల నిర్వహణ భారంగా మారుతోంది. దీంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కొరవడింది. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాకపోవడంతో కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం క్లస్టర్ గ్రామాలుగా ఎంపిక చేసి జిల్లాలోని 335 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత ఇవ్వకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీ బ్యాంక్ ఖాతాలు ఖాళీగా ఉండటంతో కనీసం విద్యుత్ బిల్లులు, బోరు మరమ్మతులు, చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అలాగే పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఉండగా వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీ కార్యదర్శులుగ్రామపంచాయతీల నిర్వహణ భారంగా మారి పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామపంచాయతీ బ్యాంక్ ఖాతాలు ఖాళీగా ఉండటంతో నిర్వహణ గాడి తప్పింది. గతంలో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ఆటోలు పంచాయతీ కార్యదర్శుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. దీంతో పంచాయతీల్లో ఉన్న నిధులను ముందస్తుగానే వీటి వాయిదాలు చెల్లించడంతో పంచాయతీ బ్యాంక్ ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులైన మురుగు కాలువల మరమ్మతు, తాగునీటి పైపులైన్ లీకేజీలు సరిచేసేందుకు డబ్బులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయక తప్పడం లేదు. వేసవిలో నీటి సౌకర్యం లేక కొన్ని గ్రామపంచాయతీలో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. సమీప వాగుల్లో చెలిమెలు తోడి నీటిని తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ నీరు గ్రామాలకు అందడం లేదు. దీంతో సమీపంలోని వాగులు, వంకలనుంచి తాగునీరు తీసుకువచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో రాత్రి వేళ వీధిదీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులకు వీధిదీపాలు ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ నిధులు రాక ఇబ్బందుల్లో ఉన్నామని సమాధానం చెబుతున్నారు. గ్రామపంచాయతీల్లో తడి, పొడి చెత్త సేకరణ దాదాపు కనుమరుగైనట్లే. గ్రామపంచాయతీ ట్రాక్టర్లు డీజిల్ లేక మూలన పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రత్యేకాధికారులు పట్టనట్లు ఉండడం గమనార్హం.కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులుప్రత్యేకాధికారులు గ్రామపంచాయతీల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ప్రధాన ఆధారం. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15 ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కానీ.. 2022, ఆగస్టు నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. పెద్ద పంచాయతీల్లో ఇంటి, వ్యాపార పన్నులు, తైబజార్, ఇంటి నిర్మాణ ఫీజులు, వ్యాపార వాణిజ్య లైసెన్స్ ఫీజుల ద్వారా డబ్బులు జమవుతాయి. అలాగే చిన్న గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు మినహా ఇతర ఆర్థిక మార్గాలు లేవు. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెత్త తరలింపు వాహనాలతో పాటు నీటిని సరఫరా చేసే ట్యాంకర్ డీజిల్ కొనుగోలుకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జీతాలు రావడం లేదు కొన్ని నెలలుగా జీతాలు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రత్యేకాధికారుల పాలనలోనూ జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలి. – గోరంట్ల వసంత్, మల్టీ పర్పస్ ఉద్యోగి, బెజ్జూర్నీరు రావడం లేదు గ్రామాల్లో నీటి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నాం. వీధిదీపాలు, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రత్యేకాధికారులు గ్రామపంచాయతీల్లో తిరిగిన దాఖలాలు కనిపిస్త లేవు. సమస్యలు తిష్ట వేస్తున్నాయి. అధికారులకు చెప్పినా స్పందించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – బుస సారయ్యయాదవ్, మర్తిడి -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
నార్నూర్: శాంతిభద్రతలకు విఘాతం కలి గించొద్దని, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకు న్నా ఉపేక్షించేది లేదని ఉట్నూర్ డీఎస్పీ నా గేందర్ హెచ్చరించారు. మండల కేంద్రంలో ని స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో వివిధ వ ర్గాల పెద్దలతో ఆదివారం శాంతి కమిటీ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ఏజెన్సీ మండలాలైన జైనూర్, నార్నూర్, ఉట్నూర్ లాంటి ప్రాంతా ల్లో వ్యక్తిగత గొడవలైనప్పటికీ, కొంతమంది రెండు వర్గాల మధ్య గొడవగా సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నా రు. అందరూ సోదర భావంతో కులమతాలకతీతంగా కలిసిమెలిసి ఉంటే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఐ రహీంపాషా, గాదిగూడ ఎస్సై మహేశ్కుమార్, హిందూ ఉ త్సవ సమితి అధ్యక్షుడు జ్ఞానోబా పుష్కర్, స ర్పంచ్ గజానంద్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్, నాయకులు జాక్రుల్లాఖాన్, సత్తార్, హసన్ఖాన్, బాబాఖాన్, ఆటోడ్రైవర్ యూ నియన్ అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్ ఉన్నారు. -
ఫీజు నియంత్రణ చట్టం తేవాలి
ఆసిఫాబాద్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు షేక్ జాఫర్ డిమాండ్ చే శారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. అందరికీ నా ణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా పాఠశాలల ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చే యాలని డిమాండ్ చేశారు. ప్రొఫెషనల్ కో ర్సులకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఎస్ఎఫ్ఆర్సీ) తరహాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ వేయాలని కోరారు. దేశంలో 15 రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలులో ఉందని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, బూట్లు, టై బెల్టులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి సాయి, నాయకులు తిరుపతి, సాయి తదితరులు పాల్గొన్నారు. -
మాఫియా గుప్పిట్లో కాగజ్నగర్!
● అక్రమ దందాలకు అడ్డాగా.. ● రవాణా మార్గాలే కీలకంగా.. ● పెట్రేగుతున్న అక్రమార్కులు చింతలమానెపల్లి/కౌటాల: అయితే గుట్కా.. లేదంటే మద్యం.. కాకుంటే పీడీఎస్ బియ్యం.. ఈ అక్రమ దందాలతో కాగజ్నగర్ నియోజకవర్గం మాఫియాలకు అడ్డాగా మారుతోంది. నియోజకవర్గం మహారాష్ట్రకు, తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలో ఏడు మండలాలుండగా వీటిలో కాగజ్నగర్ మినహా అన్ని మండలాలు మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నాయి. సిర్పూర్(టి), చింతలమానెపల్లి మండలాల నుంచి మహారాష్ట్రకు రోడ్డు మార్గం ఉండగా, కాగజ్నగర్, సిర్పూర్(టి) మీదుగా మహారాష్ట్రకు రైలు మార్గం ఉంది. కాగజ్నగర్ పట్టణం సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం గ్రామీణ మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ అక్రమ మద్యం, దేశీదారు, కల్తీ మద్యం, బెల్ట్ దుకాణాలు, మద్యం ధరల పెంపు, మద్యం దుకాణాల సిండికేట్, భూదందాలు, అక్రమ మైనింగ్, నకిలీ విత్తనాలు, రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు, బియ్యం గోల్మాల్, బెట్టింగ్.. ఇలా అక్రమంగా ఆదాయం పొందేందుకు అవకాశాలను అక్రమార్కులు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే కాగజ్నగర్ మాఫియాల గుప్పిట్లోకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్.. ఇసుక వ్యాపారంకౌటాల మండలం ముత్తంపేటలో భారీగా నిర్వహిస్తున్న కంకర రాయి తవ్వకాలు అక్రమ మైనింగ్తో పలు మండలాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. టిప్పర్లలో మహారాష్ట్రకు అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడ్డారు. కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. ముత్తంపేట సమీపంలో ఐదు కంకర క్వారీలు ఏర్పాటు చేయడం అక్రమార్జనకు నిదర్శనం. దీనికి తోడు కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు, దహెగాం మండలంలోని వాగుల్లో నిర్వహిస్తున్న ఇసుక తవ్వకాలు, గ్రామగ్రామాన మట్టి తవ్వకాలు నిబంధనలు ఉల్లంఘించి మరీ నిర్వహిస్తున్నారు.అక్కడ నిషేధం.. ఇక్కడ ఆదాయ మార్గంమహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమలులో ఉంది. దీంతో మద్యం వ్యాపారులు జిల్లా నుంచి గడ్చిరోలి జిల్లాకు మద్యం సరఫరా చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో కాగజ్నగర్ పరిసరాల్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలో గడ్డిమందుగా వినియోగించే గ్లైసిల్ రౌండప్ మందుపై నియంత్రణ ఉండగా తెలంగాణలో నిషేధం ఉంది. అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోకి వ్యాపారస్తులు తీసుకువచ్చి అమ్ముతున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే బీటీ–3 పత్తి విత్తనాలు మహారాష్ట్ర మార్గాల నుంచే వస్తున్నాయని ఇటీవల కొన్ని ఘటనల్లో స్పష్టమైంది. పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలి ఘటనలు.. కాగజ్నగర్ పట్టణ శివారులో చేపట్టిన మైనింగ్లో అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఓ పత్రికావిలేకరిపై సదరు నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. దీంతో విలేకరుల సంఘాలవారు మైనింగ్ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చింతలమానెపల్లి మండలం గూడెంలో న కిలీ విత్తనాలు చేరవేస్తున్న నలుగురిని జి ల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రూ.1.50లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకుని విచారణ చే పట్టారు. మహారాష్ట్రలోని అహేరితో సంబంధాలుండి బెజ్జూర్ మండలం సోమిని లో మరిన్ని నకిలీవిత్తనాలు పట్టుబడ్డాయి. సిర్పూర్(టి) మండలంలోని రైస్మిల్లులో ఇటీవల జరిగిన దాడుల్లో బియ్యం గోల్మాల్ అయినట్లు వెల్లడైంది. తనిఖీల్లో రూ.కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారుల గుర్తించారు. ఎన్నికల సందర్భంగా బెజ్జూర్ మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తనిఖీలు నిర్వహించిన అధికారులకు మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ పట్టుబడడంతో దుకాణాన్ని సీజ్ చేశారు. -
పరీక్షాకేంద్రం తనిఖీ
రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షాకేంద్రాన్ని శనివా రం కేయూ అడిషనల్ కంట్రోలర్ తిరుమలా దేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థు ల కోసం కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, అబ్జర్వర్ డాక్టర్ కాంపెల్లి శంకర్, ఇన్విజిలేటర్లున్నారు. -
అధికారులపై చర్యలు తీసుకోవాలి
కాగజ్నగర్ రూరల్: గుడిభూమి ఆక్రమణకు పాల్ప డుతున్న వారికి సహకరిస్తున్న అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ, భజ్రంగ్దళ్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడా రు. మండలంలోని జగన్నాథ్పూర్ శివారులోని భీమన్న దేవాలయానికి సంబంధించిన అసైన్డ్ భూమిని రషీద్ అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేయడానికి చూస్తున్నాడని ఆరోపించారు. తహసీల్దార్, ఆర్డీవోతో కుమ్ముకై ్క తనకున్న నాలుగెకరాల భూమి కాకుండా 10 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్ని స్తున్నాడని తెలిపారు. దీనిపై భజ్రంగ్దళ్ నాయకులు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించగా, కాగజ్నగర్ రూరల్ సీఐ రాంబాబు వారిని దుర్భాషలాడి బెది రించారని ఆరోపించారు. భజ్రంగ్దళ్ జిల్లా కన్వీన ర్ శివాగౌడ్ మాట్లాడుతూ.. భూఆక్రమణకు పాల్ప డుతున్న వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల విశ్వేశ్వర్రావు, నియోజకవర్గ కన్వీనర్ వీరభద్రాచారి, జిల్లా కోశాధికారి అరుణ్లోయా, పట్టణాధ్యక్షులు సిందం శ్రీనివాస్, విజయ్, కోనేరు సీతారాం, శ్రీనివాస్ తదితరులున్నారు. -
నకిలీ విత్తనాల బారిన పడొద్దు
● ఎస్పీ సురేశ్కుమార్ ● విత్తన డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం కాగజ్నగర్ రూరల్: రైతులు నకిలీ విత్తనాల బారినపడొద్దని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పట్టణంలోని వినయ్గార్డెన్స్లో విత్తన డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా వ్యవసాయశాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలనే అందించాలని సూచించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు అమ్మితే సహించేదిలేదని, పీడీ యాక్టు నమోదు చేయడంతోపాటు కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ, కల్తీ విత్తనాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీస్ బలగాలతో జాయింట్ టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ విత్తనాల పేరిట నాసిరకం, నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి మోసం చేస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు రాకుండా ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలు రోజువారీగా రిజిష్టర్లో పొందుపర్చాలని పేర్కొన్నారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే దాకా భద్రపర్చుకోవాలని సూచించారు. ఒకవేళ రైతు నష్టపోతే ఆయా కంపెనీల నుంచి పరిహారం పొందే అవకాశముంటుందని తెలిపారు. కాగజ్నగర్ ఆర్డీవో సురేశ్, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని సీఐలు, వ్యవసాయశాఖ అధికారులు, డీలర్లు, ఫర్టిలైజర్షాపు యజమానులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో శంకర్ తెలిపారు. ఉద యం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 319 మంది విద్యార్థులకు 319 మంది హాజ రు కాగా, ఏడుగురు గైర్హాజరయ్యారు. జనర ల్ విభాగంలో 308 మంది విద్యార్థులకు 302 మంది హాజరు కాగా, ఆరుగురు పరీక్ష రాయలేదు. ఒకేషనల్ విభాగంలో 11మంది విద్యార్థులకు గాను 10మంది హాజరు కాగా, ఒక్కరు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెకండ్ ఇయిర్ పరీక్షకు 560 మంది విద్యార్థులకు గాను 532 మంది హాజరు కాగా, 28మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 518 మందికి 494 మంది హాజరు కాగా, 24 మంది పరీక్ష రాయలేదు. ఒకేషనల్ విభాగంలో 42 మందికి 38 మంది విద్యార్థులు హాజరు కాగా, నలుగురు గైర్హాజరయ్యారు. -
No Headline
న్యూస్రీల్5లోపు యూనిఫాంలు సరఫరా చేయాలి ఆసిఫాబాద్రూరల్: జూన్ 5వ తేదీలోపు పాఠ శాలలకు యూనిఫాంలు సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున జూన్ 5వ తేదీన యూనిఫాంలు అందించేలా ఏపీఎం, సీసీలు చర్యలు చేపట్టా లని ఆదేశించారు. యూనిఫాంలు కుట్టేందు కు జిల్లాలో 78 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాలను ఆ ర్థికంగా బలోపేతం చేసే దిశగా వారికి అవకా శం కల్పిస్తూ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపా రు. ప్రతిరోజూ కుట్టు కేంద్రాలను ఏపీఎం, సీసీలు పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారి సురేందర్, అదనపు సంచా లకుడు రామకృష్ణ, సెర్ప్ అధికారులున్నారు. -
విధులను నిర్లక్ష్యం చేయొద్దు
● జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి ● నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలన కాగజ్నగర్ రూరల్: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి హెచ్చరించారు. శనివారం మండలంలోని వంజీరి గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సరీల్లో మొక్కల పెంపకంలో సి బ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో గౌరీశంకర్, పంచా యతీ కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలి కౌటాల: నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా చూడాలని డీపీవో భిక్షపతి సూచించారు. మండల కేంద్రంలోని నర్సరీ, ప్రకృతి వనం, డంప్యార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై మాట్లాడారు. గ్రామాల్లోని నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వానాకాలంలో హరితహారం కింద నాటడానికి మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో చెత్త సేకరించి డంప్యార్డుకు తరలించాలని, చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీఎల్పీవో సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
రెబ్బెన: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని షీ టీం ఇన్చార్జి సునీత సూచించారు. మండలంలోని కై రి గాంలో ఉపాధిహామీ కూలీలకు షీ టీం సేవలతో పాటు, మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలకు పని ప్రదేశాల్లో పోకిరీల ఈవ్ టీజింగ్కు గురైతే వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు. భవిష్యత్లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్ప డకుండా పోకిరీలకు తగిన బుద్ధి చెబుతామని చెప్పారు. మహిళల రక్షణ కోసమే షీ టీం పని చేస్తుందని తెలిపారు. షీ టీం సేవలు సద్వినియో గం చేసుకోవాలని, ఆపద సమయంలో తక్షణ సాయం కోసం ‘డయల్ 100’ను వినియోగించుకోవాలని సూచించారు. షీ టీం సభ్యులు శ్రీలత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
పెంచికల్పేట్: యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణుబాబు పేర్కొన్నారు. మండలంలోని ఎల్లూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ప్రతీ సంచికి అదనంగా ఒక కిలో ధాన్యం సేకరిస్తున్నారని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 15రోజుల నుంచి ధాన్యం విక్రయించటానికి పడిగాపులు కాస్తున్నా కేంద్రం ఇన్చార్జి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రైతుల తెచ్చిన ధాన్యం తేమశాతం పరిశీలించారు. వెంటనే కాంటా పెట్టాలని సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రంలో విధులను నిర్లక్ష్యం చేసిన వెంకటేశ్వర్గౌడ్ను కేంద్రం ఇన్చార్జి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట డీసీఎస్వో వెంకటనరసింహారావు, రైతులున్నారు. -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ 25వ వార్షికోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం ప్రత్యేక హో మాలు, అమ్మవారికి అభిషేకాలు చేశారు. అ నంతరం మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేటకు చెందిన ముదిగొండ నాగరాజుశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు హోమంలో పాల్గొన్నారు. సీనియ ర్ సివిల్ జడ్జి యువరాజ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం వాసవీమాత ఉత్సవ విగ్రహాలతో పట్ట ణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అర్చకుడు ముదిగొండ రాజశేఖరశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు తాటిపెల్లి దిలీప్, గుండ ప్రమోద్, చిలువేరు వెంకన్న, బోనగిరి మురళీధర్, ఎకిరాల శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తూకం.. జాప్యం
ఎల్కపల్లి కేంద్రంలో పేరుకుపోయిన రైతులు తెచ్చిన ధాన్యం ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పెంచికల్పేట గ్రామానికి చెందిన జునుగరి వెంకన్న. తనకున్న ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. 15 రోజుల కిత్రం కోత పూర్తి చేశాడు. సుమారు 400 బస్తాల ధాన్యం రాగా విక్రయించటానికి 12 రోజుల క్రితం ఎల్కపల్లి కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. ధాన్యంలో తాలు ఉందని నిర్వాహకులు కొనుగోలు చేయలేదు. దీంతో ధాన్యం తూర్పార బట్టి తాలు తొలగించాడు. 10రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నాడు. పెంచికల్పేట్(సిర్పూర్): వరి ధాన్యం విక్రయించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి మండుతున్న ఎండల్లో కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. లారీలు, హమాలీలు, గన్నీ సంచుల కొరత కారణంగా పలుచోట్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 50వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ సీజన్లో 46వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికీ 795 మంది రైతుల నుంచి 4,697 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. మరో 10రోజుల్లో యాసంగి ముగియనున్న నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 15రోజుల క్రితం ప్రారంభమైనా..యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయటానికి జిల్లా వ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఐకేపీ ద్వారా నాలుగు, పీఏసీఎస్ ద్వారా 22 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. జిల్లాలో 15రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా నేటికీ ఊపందుకోలేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కొన్నిచోట్ల హమాలీలు రాత్రిపూట మాత్రమే తూకం వేస్తున్నారు. లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. సేకరించిన ధాన్యానికి మూడురోజుల్లో నగదు చెల్లించాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 316 మంది రైతుల ఖాతాల్లో రూ.4కోట్లు మాత్రమే జమ చేశారు. పుంజుకోని ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో అన్నదాతల నిరీక్షణ అకాల వర్షాలతో ఆందోళన జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాలు 4,697 మెట్రిక్ టన్నులే సేకరణ రోజుల తరబడి కేంద్రాల్లోనే..మరో 10రోజుల్లో యాసంగి ముగియనున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. గత 15 రోజుల్లో నాలుగుసార్లు కురిసిన అకా ల వర్షానికి వరి ధాన్యం కాపాడుకోవటానికి అనేక ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం ఆరబెడుతున్నా తేమ పేరిట నిర్వాహకులు కొర్రీలు పెడుతూ కాంటా పెట్టడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం కుప్పల వద్ద రోజుల తరబడి కాపలా ఉంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. -
క్రిమినల్ కేసులు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఆసిఫాబాద్: జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ సురేశ్కుమార్, అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి కృష్ణారెడ్డితో కలి సి శుక్రవారం ఫర్టిలైజర్ వ్యాపారులు, వ్యవసా య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన పురుగు మందులు అమ్మితే సహించేది లేదని, అలాంటి వ్యా పారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ షాపు ముందు ఎరువులు, విత్తనాల ధరల పట్టిక వివరాలు ఉంచాలని, డీలర్ షాప్ లైసెన్సు వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ విత్తన కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు విధిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల రవాణా అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీ సు బలగాలతో జాయింట్ టాస్క్ఫోర్స్ బృందా లు ఏర్పాటు చేశామని తెలిపారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా.. దుకాణాల్లో ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో ఎవరైనా నకిలీ విత్తనా లు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాలతో నష్టపోతే డీల ర్లు, కంపెనీ యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని, ఒకవేళ నష్టపోతే ఆయా కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకా శం ఉంటుందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శా ఖ, పోలీస్ టాస్క్ఫోర్స్ అధికారులు, సమన్వ యం చేసుకుని నకిలీ వ్తితనాల రవాణా అరికట్టా లని ఆదేశించారు. టాస్క్ఫోర్స్ బృందాలతో దుకాణాల్లో తనిఖీలు చేపడతామన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులు, వ్యాపారులతో సమీక్షా సమావేశం -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్ర శాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు ఫస్టియ ర్ ఇంగ్లిష్ పరీక్షకు 648 మంది విద్యార్థులకు 606 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 562 మంది విద్యార్థులకు 530 మంది హాజరు కాగా.. ఒకేషనల్ విభాగంలో 86 మంది విద్యార్థులకు 76 మంది హాజరయ్యారని డీఐఈవో శంకర్ తెలిపారు. మధ్యాహ్నం సెకండియర్ పరీక్షకు 178 మంది విద్యార్థులకు 172 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 159 మంది విద్యార్థులకు 154 మంది హాజరు కాగా ఒకేషనల్ విభాగంలో 19 మందికి 18 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు మాస్ కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో తనిఖీ చేశారు. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారికెరమెరి(ఆసిఫాబాద్): అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులు గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని ఝరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాంనగర్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, వంటగదుల్లో మర్మమతులు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులు వేగవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు కెరమెరిలోని యూనిఫాం కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పాత పద్ధతుల్లో కత్తెరలతో వస్త్రం కట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ యంత్రాలు వస్త్రం కట్ చేయాలని, విద్యుత్ కుట్టు మిషన్లతో యూనిఫాంలు కుట్టాలని సూచించారు. జూన్ 12లోగా విద్యార్థులకు యూనిఫాంలు అందించాలన్నారు. ఆయన వెంట ఎస్వోలు భరత్, శ్రీనివాస్, యూనిఫాం క్లాత్ ఇన్చార్జి మధుకర్, ఏఈ నజీమొద్దిన్, ఎంఈవో సుధాకర్, ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో అంజద్ పాషా, ఏపీఎం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి జైనూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతులు 2024– 25 విద్యాసంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని దబోలి మండల పరిషత్ పాఠశాలలో పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. బాలికల కోసం ప్రత్యేక మూత్రశాలలు నిర్మించాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. -
సిర్పూర్(టి) ఎంపీపీగా ఈర్త సత్యనారాయణ
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక కోసం శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ ఆర్డీవో సురేశ్ సమక్షంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా.. సిర్పూర్(టి) మండల పరిషత్ అధ్యక్షుడిగా వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణను ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆర్డీవో ఈర్త సత్యనారాయణకు ఎన్నిక ధ్రువపత్రం అందజేశారు. కాగా. గత ఎంపీపీ చునార్కర్ సువర్ణపై ఫిబ్రవరిలో ఏడుగురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం అందించిన విషయం తెలిసిందే. ఆర్డీవో సమక్షంలో మార్చి 30న చునార్కర్ సువర్ణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాసం నెగ్గడంతో ఎంపీపీగా సువర్ణ తన పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సోహెల్ అహ్మద్, మంగీలాల్, కారం శైలజ, ఎల్ములే సరిత, తాహెరా బేగం తదితరులు పాల్గొన్నారు. -
వేడి.. ఉక్కపోత
కౌటాల(సిర్పూర్): అకాల వర్షాలు, మబ్బులతో చల్లబడిన వాతావరణంతో జిల్లా ప్రజలకు కొద్దిరోజులపాటు ఎండ నుంచి ఉపశమనం లభించింది. శనివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతుండగా మళ్లీ జిల్లాలో ఎండ వేడి పెరిగింది. పగటి పూట తీవ్రమైన ఉక్కపోత, వేడితో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. మరమ్మతుల పేరుతో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు. శుక్రవారం కాగజ్నగర్లో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిర్యాణిలో 43.6 డిగ్రీలు, సిర్పూర్(టి) 43.5, రెబ్బెన మండలం వంకులం 43.2, ఆసిఫాబాద్ 43.1, పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి 42.6, కౌటాల 42.5, దహెగాం 42.2, జంబుగాలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఎల్కపల్లి కొనుగోలు కేంద్రం తనిఖీ
పెంచికల్పేట్(సిర్పూర్): మండలంలోని ఎ ల్కపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీసీఎస్వో వెంకట నరసింహరావు తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి పది రోజులు గడుస్తు న్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలు కేంద్రం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తేమశాతం పరిశీలించి వెంటవెంటనే కాంటా వేయాలని ఆదేశించారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిబ్బంది, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement