-
నకిలీ విత్తనాలు అరికట్టాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా మండలాల్లో టాస్క్ఫోర్స్ టీంలు విస్తృతంగా పర్యటించి విత్తన డీలర్ ఔట్లెట్లను తనిఖీ చేయాలన్నారు. ముఖ్యంగా విత్తన లైసెన్స్, వ్యాలిడిటీ చెక్ చేయాలని, స్టాక్, ధరలను బోర్డుపై రాసి ఉంచాలన్నారు. రైతులకు విత్తనం విక్రయించినప్పుడు తప్పకుండా రశీదు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లూజ్ పాకెట్లు, పగిలిన సంచులు, డబ్బాల విత్తనాలు, గడువు ముగిసినవి కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఏఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ యశ్వంత్, డీఎస్పీ రమణారెడ్డి పాల్గొన్నారు. -
బీటీ–3 పత్తి విత్తనాల పట్టివేత
జడ్చర్ల: రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన నిషేధిత బీటీ– 3 పత్తి విత్తనాలను శుక్రవారం వ్యవసాయ శాఖ టాస్క్ఫోర్స్ బృందం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో డీఏఓ వెంకటేష్, ఏఎస్పీ రాములు వెల్లడించారు. జడ్చర్ల మండలం గోప్లాపూర్లో సుధాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి గుట్టుగా లూజ్ పత్తి విత్తనాలను గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి తెచ్చి రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వ్యవసాయాధికారులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి స్థాని క పోలీసుల సహకారంతో గోప్లాపూర్లో నిందితుల పై ఇంటిపై ఏకకాలంలో దాడులు చేసి పత్తి విత్తనా ల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులను జడ్చర్ల పోలీస్స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి పరీక్షిస్తామని చెప్పారు. 2.21 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ రాములు చెప్పారు. సమావేశంలో సీఐ ఆదిరెడ్డి, ఏఓ గోపినాథ్ పాల్గొన్నారు. -
వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలి
మహబూబ్నగర్ క్రైం: కొత్తగా శిక్షణ పొందుతున్న ప్రతిఒక్కరూ సమాజంలో ఆదర్శవంతమైన పోలీస్ అధికారిగా తయారవ్వాలని మల్టీజోన్–2 ఐజీ జి.సుధీర్బాబు అన్నారు. జడ్చర్లలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి ముందుగా మొక్క నాటారు. ఆ తర్వాత కొత్తగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఐజీ మాట్లాడారు. పోలీస్ శాఖలో ఉద్యోగం చేయడం అంటే సమాజ సేవలో పాల్గొనడమే అన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతిఒక్కరూ వృత్తి జీవితంలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రతినిత్యం ఇండోర్, అవుట్ డోర్లో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణలో విజ్ఞానం పెంచుకోవాలన్నారు. విధుల్లో చేరిన తర్వాత సమాజం గర్వించే విధంగా మీ ప్రవర్తన ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేసే విధానాలు చాలా మారాయని, వీటిలో అతి ముఖ్యమైంది సైబర్ నేరాలని, దీనిపై ప్రతిఒక్కరూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాల్లో మంచి శిక్షణ తీసుకుని, వాటిపై పట్టుసాధించి విధుల్లో చేరిన తర్వాత సైబర్ నేరాలు ఛేదించడంలో కీలకపాత్ర పోషించాలని చెప్పారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్ చిత్తరంజన్, ఏఎస్పీ రాములు, డీటీసీ డీఎస్పీ నర్సింహులు, మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
గండేడ్/ మహమ్మదాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను జూన్ 2 కల్లా పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రే ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికై న చిన్నవార్వాల్, అంచన్పల్లి, మహమ్మదాబాద్ మండలంలోని బొమ్మికుంటతండా, మంగంపేట్తండా ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికై న అన్నిచోట్ల పనులు వేగవంతం చేయాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, లీకేజీలు ఇతరత్రా మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. నిధులు ఉన్నాయని పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తారన్నారు. అమ్మ ఆదర్శ కమిటీలు వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో విద్యార్థులకు కోసం కుడుతున్న యూనిఫాంలను పరిశీలించారు. నిర్దేశించిన మేరకు 4 వేల మంది విద్యార్థులకు యూనిఫాంలు కుట్టాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం కాక ముందే అన్నింటినీ సిద్ధంగా ఉంచి.. జూన్ 10 వరకు పాఠశాలలకు అందజేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ దేవన్న, ఎంఈఓ వెంకటయ్య తదితరులున్నారు. -
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహ (ఓబులేశు) స్వామివారి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలకు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయ రీతిలో స్నానం జరిపించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో గరుడ వాహన సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవతామూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన మంటపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ సేవ ముందుకు కదిలింది. భక్తుల హరినామస్మరణతో సేవా ప్రాంతం మార్మోగింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో స్వామివారు గరుడ వాహనంపై దేవస్థానం పరిసరాల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి విశేషోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, అర్చకులు పాల్గొన్నారు. -
బీభత్సం..
ఈదురుగాలుల ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందిన ప్రజలు.. అదే సమయంలో వీచిన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి నిప్పులు కక్కిన భానుడు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాకేంద్రంతోపాటు మూసాపేట, బాలానగర్, మహబూబ్నగర్ అర్బన్, నవాబ్పేట, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాకేంద్రంలో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇదే సమయంలో గాలి దుమారం రేగడంతో తెలంగాణ చౌరస్తా సమీపంలో చెట్టు, విద్యుత్ స్తంభం విరిగిపడి అటు వైపు వాహనాల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే నవాబ్పేటలో శుక్రవారం తూకాలు చేస్తున్న సమయంలో అకాల వర్షం కురవడంతో సుమారు 23 వేలకు పైగా బస్తాల ధాన్యం తడిసిపోయింది. కారూర్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కిషన్గూడలో రేకులు గాలికి ఎగిరిపోగా ప్లాట్ల స్థలాలకు వేసుకున్న ప్రహరీ కూలిపోయింది. మూసాపేటలో రోడ్డు పక్కన ఉన్న భారీ వేప చెట్టు విరిగిపోయింది. రోడ్డు వైపు పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే వేముల స్టేజీ వద్ద హనుమాన్ విగ్రహం వద్ద కూడా పెద్ద చెట్టు నేలకొరిగింది. ఈదురు గాలుల ఉధృతికి జాతీయ రహదారిపై వాహనదారులు రోడ్డు పక్కన తమ వాహనాలను కొద్దిసేపు నిలుపుకొని తర్వాత వెళ్లిపోయారు. అడ్డాకుల మండలంలో పెద్దఎత్తున ఈదురు గాలులు రాగా స్వల్పంగా వర్షం కురిసింది. బాలానగర్ మండలంలోని వాయిల్కుంట తండాలో సభావత్ దేవ్య ఇంటిపై ఉన్న రేకులకప్పు ఎగిరిపోయి నిరాశ్రయులయ్యారు.● విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ● నవాబ్పేటలో తడిసిన వరిధాన్యం ● చల్లబడిన వాతావరణం.. ఉక్కపోత నుంచి ఉపశమనం – మహబూబ్నగర్ (వ్యవసాయం)/ అడ్డాకుల/ బాలానగర్/ నవాబ్పేట -
ప్రశాంతంగా పాలిసెట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు జిల్లాకేంద్రంలో 5 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మొత్తం 3,332 మంది విద్యార్థులకు గాను 2,985 మంది హాజరవగా.. 347 మంది గైర్హాజరయ్యారరు. జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కోఆర్డినేటర్ నాగరాజు, స్పెషల్ అబ్జర్వర్ శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మొదటిరోజు తెలుగు సబ్జెక్టు పరీక్ష జరిగింది. 21 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్న 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం వారు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 1,696 మందికి గాను 1,573 మంది హాజరవగా.. 123 మంది గైర్హాజరయ్యారు. రెండో సంవత్సరంలో 700 మందికి గాను 627 మంది హాజరవగా.. 73 మంది గైర్హాజరయ్యారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తనిఖీ చేశారు. నేడు ఎస్టీ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఆల్మదీనా కళాశాలలో ఉన్న ఎస్టీ గురుకుల బాలికల కళాశాలలో శనివారం స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్సీఓ నాగార్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం సెల్ నం.83339 25369 సంప్రదించాలని సూచించారు. ఎస్సీ గురుకులాల్లో.. జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ కళాశాల గురుకులాల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు ఇస్తున్నట్లు ఆర్సీఓ ఫ్లారెన్స్రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. స్ట్రాంగ్రూం పరిశీలన మహబూబ్నగర్ క్రైం: మహబూబ్నగర్ ఎస్పీ హర్ష్వర్ధన్ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సెలవులో వెళ్లారు. ఇన్చార్జ్ ఎస్పీగా వనపర్తి ఎస్పీ రక్షిత కె.మూర్తి వ్యవహరించనున్నారు. ఎస్పీ తిరిగి ఈ నెల 27న విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం గదులను శుక్రవారం రాత్రి ఇన్చార్జ్ ఎస్పీ రక్షిత కె.మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూంల దగ్గర కొనసాగుతున్న విధులపై అక్కడ ఉన్న అధికారులతో ఆరా తీశారు. సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షణ కొనసాగాలని, విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆమె వెంట ఏఎస్పీలు రాములు, సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
హత్యపై అనుమానాలెన్నో..
వనపర్తి/ చిన్నంబావి: రాష్ట్రస్థాయిలో రాజకీయ దుమారం రేపిన బీఆర్ఎస్ నేత లక్ష్మీపల్లి శ్రీధర్రెడ్డి హత్య కేసుపై పోలీసు ఉన్నతాధికారులు సైతం దృష్టిసారించారు. ఈ మేరకు శుక్రవారం ఐజీ సుధీర్బాబు వనపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అంత కంటే ముందే ఎస్పీ రక్షితా కె.మూర్తి ఘటనా స్థలాన్ని పరిశీంచడం, చిన్నంబావి పోలీస్స్టేషన్ను సందర్శించి అక్కడి అధికారులతో వివరాలు తెలుసుకోవడం, సాయంత్రం సుమారు 150 మంది పోలీసులతో లక్ష్మీపల్లిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం చకచకా జరిగిపోయాయి. కరెంట్ పోయిందా.. తీశారా? శ్రీధర్రెడ్డి హత్య ఘటన చోటుచేసుకున్న బుధవారం అర్ధరాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా అధికారికంగా నిలిచిపోయిందా.. లేక హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్న దుండగులు ఉద్దేశపూర్వకంగా విద్యుతత్ సరఫరా నిలిపివేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ హత్యగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఆయుధాలెక్కడ.. శ్రీధర్రెడ్డిని హతమార్చేందుకు ఉపయోగించిన మారణాయుధాలు ఎక్కడ ఉన్నాయనేది ఇప్పటి వరకు తెలియలేదు. హత్య పక్కా ప్లానింగ్ చేశారనేందుకు దాడికి ఉపయోగించిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లిన ఉదంతం బలం చేకూరుస్తోంది. ఈ విషయమై విచారణ అధికారి నాగభూషణరావును వివరణ కోరగా ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, గ్రామంలో సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ● లక్ష్మీపల్లిలో గురువారం సీఐ నాగభూషణం ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీస్ బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అ నంతరం సీఐ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్ర తలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరారు. ● లక్ష్మీపల్లిలో అర్ధరాత్రి కరెంట్ కట్ ● ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎస్పీ ● వనపర్తి ఎస్పీ కార్యాలయంలో ఐజీ సమీక్ష -
మహిళ దారుణ హత్య
● గొంతు కోసి బండరాయితో ముఖంపై బాదిన ఆనవాళ్లు భూత్పూర్: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పుర పరిధిలోని అమిస్తాపూర్ సమీపంలో మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేటకు చెందిన దాసరి లక్ష్మి (32)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. అమిస్తాపూర్ సమీపంలో మహిళ మృతదేహం పడి ఉందని శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందితో కలిసి పరిశీలించినట్లు వివరించారు. లక్ష్మి గొంతు కోసి, ముఖంపై బండరాయితో బాధడంతో మృతిచెంది ఉంటుందని చెప్పారు. దాసరి లక్ష్మికి నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చిన్న సాయిలుతో వివాహం జరిగింది. వారం క్రితం తల్లి గారి ఊరైన గాజులపేటకు వచ్చింది. రోజు మహబూబ్నగర్లో అడ్డా కూలీకి వెళ్లేదని.. గురువారం కూడా కూలీ పనికి వెళ్తున్నట్లు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరిందని సీఐ తెలిపారు. లక్ష్మి ఎవరి వద్ద కూలీకి వెళ్లిందనే వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం జడ్చర్ల: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడని ఘటన జడ్చర్ల మండలం గోప్లాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఆదిరెడ్డి వివరాల మేరకు.. గోప్లాపూర్కు చెందిన సుధాకర్ (33) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. యువకుడి అనుమానాస్పద మృతి మహబూబ్నగర్ క్రైం: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్ఐ విజయ్భాస్కర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహబూబ్నగర్ పాల్సాబ్గుట్టకు చెందిన రాయల సందీప్రెడ్డి (27) గురు వారం సాయంత్రం ఇంట్లో మృతిచెంది కనిపించాడని, మృతుడి గొంతుకు ఉరి వేసిన గుర్తు ఉందన్నారు. అన్న రాయల ఇంద్రసేనారెడ్డి ఫిర్యా దుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి.. పెద్దకొత్తపల్లి: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిర్మలాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ సతీష్ వివరాల మేరకు.. దేవల్ తిర్మలాపూర్కు చెందిన మొగలి బాలస్వామి (50) గురువారం రాత్రి గ్రామ సమీపంలోని రాంబాయి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు వల అతడి కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం చెరువులో బాలస్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు ఉపేందర్, కూతురు విజయ ఉన్నారు. పిడుగుపాటుతో రైతు.. మక్తల్: పిడుగుపాటుకు గురై ఓ రైతు మృతిచెందిన మక్తల్ మండలం మంతనుగోడులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మంతనుగోడుకు చెందిన రైతు సాకలి కురుమయ్య (50) వ్యవసాయ పొలానికి వెళ్లగా.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈక్రమంలో పిడుగుపాటుకు గురై అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా శవమై కనిపించాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. యువకుడి ఆత్మహత్య గోపాల్పేట: ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రేవల్లి మండలం కేశంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతిరెడ్డి వివరాల మేరకు.. కేశంపేటకు చెందిన కంకెల్ల మల్లేష్ (24) చిన్నతనంలోనే తల్లి మరణించింది. అతడి తండ్రి మరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లిపోగా.. మల్లేష్ తన బాబాయ్ నాగరాజు వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో మల్లేష్ మూడేళ్ల కిందట వనపర్తి మండలం చందాపూర్లో ఓ పాత ఇంటిని కొనుగోలుచేసి, అక్కడే నివాసం ఉంటున్నాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. తననే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తన కుటుంబ సభ్యులకు చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో పురుగుమందు తాగి చనిపోయేందుకు యత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం చందాపూర్ నుంచి కేశంపేటకు వచ్చిన మల్లేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బాబాయ్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టీ– 20 లీగ్లో జిల్లా జట్టు శుభారంభం
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ అంతర్ జిల్లాల టీ–20 లీగ్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్లోని జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన టీ–20 లీగ్లో జిల్లా జట్టు 5 వికెట్ల తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 నాలుగు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. జట్టులో తేజరాం 47, టీవీఎస్ నారాయణతేజ 47 పరుగులు చేయగా విశాల్యాదవ్ 47 పరుగుల తేడాతో నాటౌట్గా నిలిచాడు. జిల్లా బౌలర్లు జయసింహ, శ్రీకాంత్యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. జట్టులో గణేష్ అద్భుతమైన సెంచరీ చేసి జిల్లా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేవలం 65 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 105 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఎండీసీఏ అభినందనలు ఉమ్మడి జిల్లా జట్టు టీ–20 లీగ్లో తొలి మ్యాచ్ను గెలుపొందడంపై మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో ఇదే స్ఫూర్తితో రాణించి లీగ్లో చాంపియన్గా నిలవాలని ఆకాంక్షించారు. ఖమ్మంపై 5 వికెట్ల తేడాతో విజయం అజేయ సెంచరీతో రాణించిన గణేష్ -
బైక్, లారీ ఢీ : ఇద్దరి దుర్మరణం
మహబూబ్నగర్ క్రైం/భూత్పూర్: లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రం సమీపంలోని ఆల్–మదీనా కళాశాల సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. భూత్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన బాబు (50), శ్రీకాంత్ (25) శుక్రవారం బైక్పై మైలారం వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. జిల్లాకేంద్రం సమీపంలోని ఆల్–మదీనా కళాశాల సమీపానికి రాగానే మహబూబ్నగర్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న లారీ బైక్ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాంత్కు 40 రోజుల కిందట వివాహం కాగా హైదరాబాద్లో కారు నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. ఇటీవల గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాలకు వచ్చాడు. బాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాలను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మదిగట్లలో విషాదఛాయలు.. బండమీది బాబు, పల్లె శ్రీకాంత్ మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
వనపర్తిలో గద్దకు వైద్యం
వనపర్తి: హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి షాక్కు గురైన గద్దకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలిలా.. వనపర్తి జిల్లా ఖాశీంనగర్ శివారులో రైతు వెంకటస్వామి తన వ్యవసాయ పొలంలో హైటెన్షన్ వైర్ల కింద ఎగరలేక పడి ఉన్న గద్దను చూసి స్నేక్స్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. దీంతో కృష్ణసాగర్ అక్కడికి చేరుకుని గద్దకు కుడిరెక్క ఎముక విరిగినట్లు గుర్తించి జిల్లాకేంద్రంలోని పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స చేశారు. గద్ద వయస్సు 35– 40 ఏళ్లు ఉంటుందని వైద్యశాఖ సిబ్బంది గోళ్లు, ముక్కు పొడవు చూసి అంచనా వేశారు. కుడిరెక్క ఎముక విరగడంతో ఎగరలేక కిందపడిపోయి ఉంటుందన్నారు. వైద్యం చేయడం వల్ల వారం రోజుల్లో కోలుకుంటుందని చెప్పారు. వైద్యం చేయించిన స్నేక్ సొసైటీ కృష్ణసాగర్ ఇంటి వద్దనే ఉంచుకుని బలమైన ఆహారం ఇస్తూ పశువైద్యశాఖ సిబ్బంది సూచన మేరకు అటవీశాఖ అధికారుల అనుమతితో పర్యవేక్షణలో ఉంచుకున్నారు. వైల్డ్ ఎనిమిల్స్ పరిధిలోకి వచ్చే ఈ గద్దకు అయిన గాయం మాని ఎగిరే వరకు చికిత్స అందిస్తామని, ఒకవేళ ఎగురలేకపోతే పక్షి రక్షణ కోసం హైదరాబాద్ ప్రాంతంలోని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. అలాగే శుక్రవారం మదనాపురం మండలంలో గాయపడిన ఓ జింకపిల్లకు వైద్యం అందించినట్లు ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగకు రిమాండ్
గద్వాల క్రైం: చీరలు, నగదు చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రం చీరాలకు చెందిన దేవర శివ, బన్ని, కల్పన, ఇమ్మానేయులు గత ఏప్రిల్ 20న గద్వాల పట్టణంలోని విఘ్నేశ్వర చీరల దుకాణానికి వచ్చారు. చీరలు కొనుగోలు చేస్తున్నట్లు దుకాణ నిర్వాహకులను నమ్మించి, రూ. 38 వేల విలువగల చీరలను చోరీ చేశారు. దుకాణ యాజమాని సీసీ కెమెరాలో గుర్తించి, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తృటిలో తప్పించుకుని పారిపోయారు. దీంతో అదే రోజు దుకాణ యాజమాని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం పట్టణ శివారులో దేవర శివను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న బన్ని, కల్పన, ఇమ్మానేయులును త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. వీరిపై గతంలోనూ రాజమండ్రి, హైదరాబాద్, చీరాల పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్ఐ తెలిపారు. ● గద్వాలకు చెందిన వెంకటేష్ గత ఏప్రిల్ 24న స్థానిక శిల్పా లేడిస్ కార్నర్లో చొరబడి రూ. 20వేల నగదు చోరీ చేశాడని.. నిందితుడిని సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు దొంగలను గద్వాల కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు ఛేదనలో కృషిచేసిన సాంకేతిక సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయేల్లను ఎస్ఐ అభినందించారు. -
రెండు ఇళ్లలో చోరీ
పెబ్బేరు రూరల్: వనపర్తి మండలం అప్పాయిపల్లిలో గురువారం గుర్తుతెలియని దుండగులు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి వివరాల మేరకు.. అప్పాయిపల్లికి చెందిన దామరగిద్ద శంకర్రావు, అతడి తమ్ముడు ఆనంద్రావు ఇళ్లలోకి దొంగలు చొరబడి వెండి వస్తువులతో పాటు కొంత నగదును చోరీ చేశారు. ఆనంద్రావు ఇంట్లో 10 తులాల వెండి విగ్రహం, రూ.5వేలు, శంకర్రావు ఇంట్లో 20 తులాల వెండి వస్తువులు, రూ 10వేల నగదు చోరీ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా బాండుపేపర్లు, ప్రాంసరీ నోట్లను కాల్చి బూడిద చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వరి వంగడాల కోసం బారులు..
పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన విత్తన మేళాకు ఉమ్మడి జిల్లాలోని రైతులు పోటెత్తారు. పాలెం ఆర్ఏఆర్ఎస్తోపాటు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు పలు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచగా.. వరి వంగడాల కోసం బారులుతీరారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లాలో వాతావరణం, నేల స్థితిగతుల మేరకు ఏ పంట ఎప్పుడు సాగుచేయాలన్న అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాల రకాలు, యంత్ర పరికరాల పనితీరును వివరించేందుకు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించి, సందేహాలను నివృత్తి చేశారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
నవాబుపేట: సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అభిషేక్రెడ్డి కథనం మేరకు.. మండలంలోని యన్మన్గండ్లకు చెందిన ఆంజనేయులు (26) మిత్రులు, సోదరుడితో కలిసి మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు ఈతకు వెళ్లాడు. అందరూ కలిసి చెరువు ఇవతలి ఒడ్డు నుంచి అవతలికి ఈత ప్రారంభించారు. మధ్యకు వెళ్లాక ఆంజనేయులుకు ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుండగా స్నేహితులు, సోదరుడు అతడిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కాని సాధ్యం కాకపోవడంతో వారు చూస్తుండగా నీటిలో మునిగిపోయాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వారు వచ్చి మూడుగంటల పాటు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. కాగా ఆంజనేయులుకు రెండేళ్ల కిందటే జిల్లాకేంద్రానికి చెందిన వేదా అనే యువతితో వివాహమైంది. -
ఆన్లైన్ మోసం.. రూ.70వేలు మాయం
ఉండవెల్లి: తమ వద్ద ఎంత నగదు పెట్టుబడి పెడితే దానికి రెట్టింపు డబ్బులు ఇస్తామని ఫోన్లో నమ్మించారు. ఈ మాటలు నమ్మిన బాధితుడు రెండు దఫాలుగా రూ.30వేలు, రూ.40వేలు.. మొత్తం రూ.70వేలు వారి ఫోన్కు పంపించాడు. అనంతరం డబ్బు రాకపోవడంతో వారికి ఫోన్ చేయగా.. సదరు నంబర్ పనిచేయడంలేదు. దీంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా.. బైరాపురానికి చెందిన సంజీవ్కుమార్ గత ఫిబ్రవరి 27న మొబైల్లో ఇన్స్ర్ట్రాగామ్ రీల్స్ చూస్తుండగా ‘నైట్ కల్యాణ్’ అనే మట్కాకు సంబందించిన రీల్లో కొంత నగదు జమ చేస్తే దానికి రెట్టింపు డబ్బులు వస్తాయని తెలపడంతో అందులో ఉన్న సెల్ నంబర్కు ఫోన్ చేశాడు. వారు సైతం రెట్టింపు నగదు వస్తాయని తెలపడంతో మొదటిసారి రూ.30 వేలు పంపించాడు. కానీ, ఎంత నగదు జమ కాకపోవడంతో రీల్స్లో ఉన్న నెంబర్కు కాల్ చేశారు. ఇంకా కొంత అమౌంట్ పంపిస్తే త్వరగా జమ అవుతుందనడంతో మరో రూ.40 వేలు జమ చేశారు. అనంతరం ఆ నంబర్కు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని రావడంతో బాధితుడు సంజీవ్కుమార్ అయోమయంలో పడ్డారు. అదే రోజున బాధితుడి నానమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో అక్కడి వెళ్లాడని, తిరిగి శుక్రవారం గ్రామానికి చేరుకొని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన కొత్తకోట రూరల్: ఫ్రెండ్లీ పోలీసింగ్, మీ రక్షణ కోసమే మేమున్నామంటూ పోలీసుశాఖ ఎన్ని ప్రకటనలిస్తున్నా.. పోలీసులంటే ఇప్పటికీ ప్రజల్లో భయమే. ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లాలంటేనే బాధితులు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు పోలీసుల ప్రవర్తనే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన ఇన్పునూరి రాజు తన అన్న మాసన్న కొట్టాడంటూ ఈ నెల 20న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం మరోమారు భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చారు. అయితే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణ ‘ఫిర్యాదు చేశావుగా.. మళ్లీ స్టేషన్కు ఎందుకు వచ్చావు? ఏం పని లేదా?’ అంటూ దురుసుగా మాట్లాడాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా కొత్తకోట పోలీస్స్టేషన్లో కిందిస్థాయి సిబ్బంది తీరు బాగోలేదని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఐ రాంబాబు వద్ద ప్రస్తావించగా.. ఫిర్యాదుదారులతో సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఇదివరకే సూచించామన్నారు. దురుసుగా మాట్లాడినట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. -
ఆరోగ్యకరమైన పంటలపై దృష్టి
బిజినేపల్లి: రైతులు సేంద్రియ పద్ధతలో ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించాల్సిన అవసరం ఉందని పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ మల్లారెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో శుక్రవారం విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలతోపాటు సేంద్రియ పద్ధతిలో ఆహార పంటలను సాగు చేయాలని.. తద్వారా భవిష్యత్ తరాలకు వ్యవసాయం ఒక అలవాటుగా మారుతుందన్నారు. పంటల సాగులో సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాలు విధిగా పాటించాలన్నారు. రైతులు సాగుచేసే ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, తెల్లజొన్న, పచ్చజొన్న, కంది, ఆముదం, మినుము, పెసర, ఉలువలు ఇతర చిరుధాన్యాలు రాగులు, సజ్జ, కొర్ర, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని.. నేల చలవకు వచ్చిన తర్వాతే విత్తనాలు నాటాలన్నారు. వాణిజ్య పంటలను సాగు చేసినప్పుడు అంతర పంటలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల ఒక పంటకు నష్టం జరిగితే మరో పంట అయినా రైతు చేతికి వస్తుందని.. తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చన్నారు. పత్తి పంటలో దీర్ఘకాలిక రకాల కంటే స్వల్పకాలిక రకాలతోపాటు గింజ పొడవుగా ఉండే రకాలను ఎంచుకోవాలన్నారు. పత్తిలో కంది, నువ్వులు వంటివి అంతర పంటగా ఎంచుకోవాలని సూచించారు. విత్తన ఎంపిక కీలకం.. ఉమ్మడి జిల్లాలో రైతులు అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలను సాగుచేస్తారని, ప్రైవేట్లో కొనుగోలు చేసే విత్తనాలకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ప్రభాకర్రెడ్డి అన్నారు. పంట దిగుబడిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ రసీదు ఆధారంగా అధికారులకు ఫిర్యాదు చేసి, నష్టాన్ని నివారించుకోవచ్చన్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద విత్తనాలు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేయరాదన్నారు. పంటలలో కలుపు నివారణ కోసం చేసే ముందస్తు పిచికారీలపై శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని చెప్పారు. ఆహారంలో నూనె గింజల ఆవశ్యకత.. మానవ ఆహారంలో నూనె గింజల ఆవశ్యకత ఎంతో ఉందని.. రైతులు నువ్వులు, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలపై దృష్టిసారించాలని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త నళిని సూచించారు. మారె్క్ట్లో డిమాండ్ మేరకు చిరుధాన్యాలతోపాటు నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పంట సాగుతోపాటు నూనె ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుందన్నారు. సేంద్రియ సాగు, స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యం పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ మల్లారెడ్డి విత్తనాల కొనుగోలు మోసాలపై గళమెత్తిన అన్నదాతలు విత్తన మేళాకు తరలివచ్చిన ఉమ్మడి జిల్లా రైతులు పాలెం విత్తనానికి పేరుంది.. పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానంలో విక్రయించే విత్తనానికి పేరుందని, అందుకే ఇక్కడి విత్తనం కొనుగోలు చేయడానికి వచ్చాను. నా పొలంలో వరి పంట సాగు చేస్తా. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనలు తెలుసుకున్నాను. పాలెం ఆర్ఏఆర్ఎస్ నుంచి కొనుగోలు చేసిన విత్తనాల నుంచి మంచి దిగుబడులు వచ్చాయి. నాతోపాటు మా ఊరి నుంచి మరికొంత మంది రైతులం వచ్చాం. – లింగయ్య రైతు, కొడ్గల్, జడ్చర్ల క్లుప్తంగా సమాచారం.. పాలెం ఆర్ఏఆర్ఎస్ నుంచి శాస్త్రవేత్తలు ఆయా పంటల సాగుపై ఇచ్చే సమాచారం చాలా క్లుప్తంగా ఉంటుంది. ఈసారి నా పొలంలో వరితోపాటు పత్తి పంట సాగు చేస్తా. పత్తిలో అధిక సాంధ్రతలో వ్యవసాయంపై శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం బాగా ఉపయోగపడింది. వ్యవసాయంలో లోతు దుక్కులు, కలుపు నివారణ, యంత్రాల వినియోగం, పంటల్లో చీడపీడల నివారణపై అవగాహన వచ్చింది. – శివకాంత్రెడ్డి, రైతు, వెల్గొండ, బిజినేపల్లి -
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..
ఆహార పదార్థాల కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా కల్తీ ఆహార నియంత్రణ అధికారులతోపాటు తూనికలు, కొలతల విభాగం సిబ్బంది కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నిల్వ చేసిన ఆహార పదార్థాలు, కల్తీ వంట నూనెలు, నెయ్యి పదార్థాలు పట్టుపడుతున్నాయి. ప్రధానంగా హోటళ్లు, కిరాణ దుకాణాలు, పాల తయారీ కేంద్రాలు, నూనె తయారీ కేంద్రాలు, పాస్ట్ఫుడ్ సెంటర్లను పరిశీలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా అమ్మకాలు నిర్వహిస్తున్న వస్తువులపై ఆరా తీశారు. తనిఖీలు చేసిన తర్వాత ఆయా కేంద్రాల్లో పట్టుబడిన కల్తీ పదార్థాలకు సంబంధించిన నమూనాలను సేకరించి ల్యాబ్కు తరలించారు. జిల్లాలో మూకుముడిగా కల్తీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేయడంతో వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలను తారుమారు చేసే సమయం ఇవ్వకుండా అధికారులు రంగప్రవేశంతో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 16 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా.. 40 చోట్ల శాంపిల్స్ సేకరించారు. దీంతోపాటు నాలుగు కేసులు నమోదు చేశారు. -
తెలంగాణ క్రికెట్ లీగ్లో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ క్రికెట్ లీగ్లో జిల్లా జట్టు మెరుగైన ఆటను ప్రదర్శించి విజేతగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో తెలంగాణ టీ–20 లీగ్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు గురువారం తరలివెళ్లింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇటీవలే వేసవి క్రికెట్ సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లీగ్లో పాల్గొంటున్న జిల్లా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ హెచ్సీఏ ఆధ్వర్యంలో టీ–20 లీగ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. లీగ్లో 7 జట్లు పాల్గొంటాయని, తొలిమ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు ఖమ్మంతో తలపడతుందన్నారు. గతంలో జరిగిన తెలంగాణ టీ–20 లీగ్లో జిల్లా జట్టు రన్నరప్గా నిలిచిందని, ఈసారి సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ జిల్లా జట్టుకు క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కృష్ణమూర్తి, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు.. గణేష్ (కెప్టెన్), హర్షవర్ధన్, డేవిడ్, అబ్దుల్రాఫె (వికెట్ కీపర్), శ్రీకాంత్యాదవ్, ముఖిత్, అద్నాన్, జి.శశాంక్, మనోజ్, అరుణ్ (వైస్ కెప్టెన్), ఖయ్యూం, జయసింహ, అరవింద్, శ్రీకాంత్, అనిల్, కె.శ్రీకాంత్, అభినవ్, బురాన్, జట్టుకు బ్యాటింగ్ కోచ్గా అబ్దుల్లా బిన్ అహ్మద్, ఫీల్డింగ్ కోచ్గా బి.శ్రీనివాస్, హెడ్కోచ్గా గోపాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. -
విత్తన మేళాకు వేళాయె
అందుబాటులో ఉన్న విత్తనాలు, వాటి ధరలు ఇలా.. విత్తనం రకం బస్తా కిలో ధర (కిలోల్లో) (రూ.లలో) వరి ఆర్ఎన్ఆర్–15048 15 50 వరి జేజీఎల్–24423 25 44 వరి కేఎన్ఎం–1638 20 48 వేరుశనగ విశిష్ట రకం 30 108 తెల్లజొన్న సీఎస్వీ–41 3 90 పచ్చజొన్న పీవైపీఎస్–2 3 150 కంది పీఆర్జీ–176, టీడీఆర్జీ–59 3 150 మినుము ఎంబీజీ–1070 6 150 పెసర ఎంజీజీ–385 6 140 సాక్షి, నాగర్కర్నూల్: రైతులకు నాణ్యమైన విత్తనాల ను అందించేందుకుగాను శుక్రవారం పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించనున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. రైతులు వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో వివిధ రకాల విత్తనాలతో పాటు నాసిరకం విత్తనాల బెడద పొంచి ఉంది. మేలైన విత్తనాల విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు, వారికి తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలను అందించాలనే లక్ష్యంతో విత్తన మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేవీకే శాస్త్రవేత్తల సూచనలు.. పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతులకు అవసరమైన వరి, వేరుశనగ, జొన్న, కంది, మినుము, పెసర విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. అందుకోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటుచేయనున్నారు. కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఆధునిక వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇటీవల కాలంలో పంటలను పట్టిపీడిస్తున్న చీడపీడలు, ఎరువుల వాడకం, సేంద్రియ సాగుపై సూచనలు అందిస్తారు. పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచారు. 94904 09163, 63008 20238 నంబర్లను సంప్రదించి విత్తనాలను పొందవచ్చు. -
నేటినుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి సంవత్సరం 6,585, రెండో సంవత్సరం 3,719 మంది విద్యార్థులు కలిపి 10,304 మంది పరీక్ష రాయనున్నారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా వైద్య సిబ్బంది, విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు జిరాక్సు సెంటర్లను మూసివేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు డీఐఈఓ కార్యాలయంలో కస్టోడియన్లు, స్క్వాడ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఐఈఓ శ్రీధర్సుమన్ మాట్లాడుతూ పరీక్షల్లో కాపీయింగ్కు ఆస్కారం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 21 కేంద్రాల ఏర్పాటు.. హాజరు కానున్న 10,304 మంది విద్యార్థులు -
కల్తీపై ఉక్కుపాదం
ప్రజారోగ్యానికి పెనుముప్పు అధికారుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. ఆహార కల్తీల నియంత్రణపై అలసత్వం ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. తినుబండారాలు, ఆహార పదార్థాల అమ్మకాల్లో వ్యాపారులు ప్రమాణాలు పాటించని కారణంగా ప్రజలకు నాణ్యత లేని, నాసిరకం ఆహారం అందుతోంది. అదికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. పట్టణంలో సుమారు 70పైగా హోటళ్లు ఉండగా, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు, టిఫన్ సెంటర్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు వంద వరకు ఉంటాయి. చూసేందుకు ఏసీలతో అందంగా ముస్తాబై ఉన్న హోటళ్లు ఆహారం విషయంలో నాణ్యత పాటించడం లేదు. ఆహారాన్ని ఫ్రిజ్లలో నిల్వ ఉంచి మళ్లీ వేడి చేసి అమ్ముతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. నెల రోజుల క్రితం ఓ కిరాణ వ్యాపారి కల్తీ నూనె ప్యాకెట్ విక్రయించాడని పెద్ద గొడవే జరిగింది. ఆహార భద్రత అధికారులతోపాటు మున్సిపల్ అధికారులు హోటళ్లు, కిరాణ దుకాణాల తనిఖీ విషయమై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాల కల్తీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో వారం రోజులుగా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ.. శాంపిళ్లు సేకరించడం, నిర్వాహకులకు నోటీసులు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని పరిశ్రమల ఏరియాలో గురువారం జిల్లా ఆహార భద్రత అధికారి మనోజ్కుమార్ ఆధ్వర్యంలో చిప్స్ తయారీ కేంద్రాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం ఆహార వస్తువుల తయారీ డేట్, కాలం చెల్లిన తేదీ లేకపోవడం, సరైన పదార్థాలు వాడకపోవడం గుర్తించారు. మొత్తం ఐదు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. అలాగే చిప్స్ తయారు చేసే రెండు ఫ్యాక్టరీల నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. వంట నూనె తయారు.. జిల్లాకేంద్రంలో కల్తీ వంట నూనె తయారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కల్తీ నూనె సరఫరా జరుగుతోందని ఆరోపణలున్నాయి. ప్యాకింగ్లో విక్రయించే వంట నూనెలపై తయారు చేసిస సంస్థ పేరు, ఎప్పుడు తయారు చేశారు.. దాని ధర వంటి వివరాలు ముద్రించాల్సి ఉండగా ఇక్కడ ఏ వివరాలు కనిపించవు. జిల్లా కేంద్రంలో ఇంత దందా జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదు. జిల్లాలో ముమ్మరంగా తూనికలు, కొలతల శాఖ దాడులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు అధిక స్థాయిలో నిల్వ ఉన్న ఆహారం వెలుగులోకి.. పలుచోట్ల శాంపిళ్ల సేకరణ, నోటీసుల అందజేత ఆకస్మిక తనిఖీలతో బెంబేలెత్తుతున్న నిర్వాహకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.. రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆదేశాలతోపాటు ఇటీవల రెస్టారెంట్, హోటళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే ఆహార తయారీ కేంద్రాలు, పండ్ల విక్రయ కేంద్రాలు, కిరాణ స్టోర్లు ప్రతి వాటిపై తనిఖీలు ముమ్మరం చేశాం. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం తయారు చేస్తున్నారా.. లేదా విక్రయాలు చేస్తున్నారా అనేది చూస్తున్నాం. నాణ్యత తీరు, కాలం చెల్లిన వస్తువులు ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. – మనోజ్కుమార్, జిల్లా ఆహార భద్రత అధికారి -
వైభవంగా లక్ష్మీనారసింహుడి కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మధ్య కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. ముందుగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ ఆలయం ముందు మైదానంలో పూల అలంకరణతో తయా రు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు కొనసాగింది. సంప్రదాయబద్ధంగా.. కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జీలకర్ర బెల్లం తదితర పూజల అనంతరం అమ్మవారికి మంగళసూత్రధారణ జరిపించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవతామూర్తులకు పట్టువస్త్రధారణ, తలంబ్రాలు పోశారు. ఈ సందర్భంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య దేవతామూర్తుల దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించి పునీతులయ్యారు. కల్యాణోత్సవం అనంతరం దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ మండపం నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలామంది దేవస్థానంలో కూడా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాశ్రీ, ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యధ్యక్షుడు దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కోటకదిర మాజీ సర్పంచ్ రమ్య, నాయకులు వెంకటస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ ఆలయంలో భక్తజన సందోహం
జోగుళాంబ శక్తిపీఠం: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలు గురువారం భక్తులతో కిక్కిరిశాయి. వైశాఖ మాసం అందులో పౌర్ణమి కలిసిరావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ తగ్గలేదు. బాల్రబహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. అమ్మవారి ఆలయంలో ఉదయం సాయంత్రం కుంకుమార్చనలు, త్రిశతి, ఖడ్గమాల వంటి అర్చనలు చేశారు. ఆలయంలో చండీహోమాలు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజులలో భక్తుల చేత సామూహిక చండీహోమాలు చేయిస్తుంటారు. గురువారం వైశాఖ పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యల తరలివచ్చారు. 114 మంది ఈ హోమాలలో పాల్గొన్నట్టు ఈఓ పురేందర్కుమార్ తెలిపారు. చండీహోమాల ద్వారా ఆలయానికి రూ.1.14లక్షల ఆదాయం చేకూరినట్లు దేవస్థానం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు ఆలయాలను పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి భవాని, గద్వాల అదనపు కలెక్టర్ మాసాని వెంకటేశ్వర్లు, నంద్యాల అడిషనల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రథాప్రెడ్డి, రాయచూరు ఎమ్మెల్యే బసన్నగౌడ దద్దాల్, ప్రముఖ సింగర్ మంగ్లి ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు చండీహోమానికి హాజరైన భక్తులు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ముగిసిన ఆరవ విడత పోలింగ్... ప్రధాని మోదీ కీలక ట్వీట్
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్లో తగ్గని ఈవీ సేల్స్
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్సెల్ ఫౌండర్ ఆవేదన
హార్ట్ టచింగ్ సబ్జెక్ట్తో 'నాన్నంటే' సినిమా
IPL 2024 Final: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు!?
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!
మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జ్.. ఇది చేయగలమా?: ఆనంద్ మహీంద్రా
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement