-
రైతులకు సరైన సలహాలు ఇవ్వాలి
డిచ్పల్లి : శిక్షణలో నేర్చుకున్న అంశాలను చక్కగా అర్థం చేసుకుని పంటల సాగులో రైతులకు సరైన సలహాలు ఇవ్వాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిజామాబాద్ పథక సంచాలకులు (పీడీ) ఆర్ తిరుమల ప్రసాద్ సూచించారు. ఆత్మ ఆధ్వర్యంలో శనివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్ రైతు వేదిక లో ‘డిప్లమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ (డీఏఈఎస్ఐ)’ 2023–24 బ్యాచ్ –2 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పీడీ మాట్లాడుతూ.. ఈ కోర్సుతో డీలర్లకు వ్యవసాయంలో మెళకువలు, పంటల సాగులో నూతన పద్ధతులు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం శిక్షణ సంబంధిత పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ అధికారులు, ఇన్ఫుట్ డీలర్లు పాల్గొన్నారు. -
విత్తన విక్రయ వివరాలు నమోదు చేయాలి
డిచ్పల్లి : విత్తనాలు విక్రయించే డీలర్లు, ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలు రైతులు కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ సూచించారు. శనివారం డిచ్పల్లి మండల వ్యవసాయాధికారి రాంబాబుతో కలిసి ఏడీఏ మండల కేంద్రంలోని పలు విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విత్తన విక్రయ డీలర్లు రిజిస్టర్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జక్రాన్పల్లి : మండలంలోని పలు ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి దేవిక శనివారం తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు ఎమ్మార్పీకే విక్రయించాలని, రైతులకు రసీదు ఇవ్వాలని సూచించారు. -
వద్దన్నా అక్కడే విధులు
నిజామాబాద్ నాగారం : వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేసినా ఆ అధికారి మాత్రం ఇంకా డిప్యుటేషన్పైనే కొనసాగుతున్నాడు. మున్సిపల్లో పనిచేస్తున్న ఆయనను సొంత శాఖకు రమ్మని డీఎంహెచ్వో చెప్పినా వినడం లేదు. వైద్యారోగ్య శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యుటేషన్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లా వైద్యారోగ్య శాఖలోని సూపర్వైజర్ కేడర్కు చెందిన నటరాజ్గౌడ్ మాత్రం మున్సిపాలిటీ శానిటేషన్ విభాగంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. డీఎంహెచ్వో తుకారాంరాథోడ్ డిప్యుటేషన్లు రద్దయ్యాయని, తిరిగి రావాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో డీఎంహెచ్వో ఆయన నెల జీతం ఆపారు. అంతేగాకుండా మున్సిపల్ కార్యాలయానికి నోటీసు పంపారు. 16 ఏళ్లుగా బల్దియాలోనే.. శానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నటరాజ్గౌడ్ 16 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మాతృసంస్థ డీఎంహెచ్వో కార్యాలయం నుంచి డిప్యుటేషన్పై వచ్చారు. రెండేళ్ల చొప్పున పొడిగించుకుంటూ ఇక్కడే తిష్ట వేశారు. గతంలో డిప్యుటేషన్ గడువు ముగిసినా అలాగే విధులు నిర్వహిస్తూ పైరవీలు చేసుకుంటూ కొనసాగుతూ వచ్చారు. ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా సమయంలో కూడా గడువు ముగిసినా, మళ్లీ ఏడాది పొడిగించుకున్నారు. సొంతశాఖకు వస్తేనే వేతనం వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దయ్యాయి. ఇ తర శాఖల్లో ఉన్న సరే సొంతశాఖకు రావాల్సిందే. నటరాజ్గౌడ్కు సైతం ఇదే విషయం చెప్పాం. ఆ యన స్పందించకపోవడంతో వేతనం ఆపేశాం. మున్సిపల్ కార్యాలయానికి నటరాజ్గౌడ్ను వెనక్కి పంపించాలని నోటీసు ఇచ్చాం. – తుకారాం రాథోడ్, డీఎంహెచ్వో జీతం ఆపినా.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ నటరాజ్గౌడ్ వైద్యారోగ్యశాఖలో హెల్త్సూపర్వైజర్గా విధులు నిర్వహించాలి. అయితే డిప్యుటేషన్పై మున్సిపాలిటీకి వచ్చాడు. ఏళ్ల తరబడిగా ఇక్కడే ఉండిపోయాడు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ డిప్యుటేషన్లు ఫిబ్రవరిలో రద్దు చేశారు. అందరూ తమ సొంత శాఖకు వెళ్లిపోయారు. ఈయన మాత్రం ఇక్కడే ఉన్నారు. వైద్యరోగ్య శాఖాధికారులు జీతం ఆపినా స్పందించలేదు. దీంతో మున్సిపల్ కార్యాలయానికి సైతం నోటీసు అందజేశారు. వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు మున్సిపల్ శానిటేషన్ విభాగంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సొంత శాఖకు రావడానికి విముఖత నోటీసు పంపిన డీఎంహెచ్వో -
ఎన్సీసీ జాతీయ శిబిరంలో రాంపూర్ విద్యార్థులు
డిచ్పల్లి : మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ నెల 14 నుంచి 25వరకు జరిగిన ‘ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్’ ఎన్సీసీ కేడెట్ల జాతీయ స్థాయి శిబిరంలో డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ ఉన్నత పాఠశాల కేడెట్లు (విద్యార్థులు) ఏ భావన, పి వైష్ణవి పాల్గొన్నారు. ఈ శిబిరంలో తెలంగాణ తో పాటు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నట్లు ఎన్సీసీ అధికారి శ్రీనివాస్ ఖత్రి తెలిపారు. అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ప్రచారం ధర్పల్లి : మండలంలోని దుబ్బాక, చల్లగరిగే గ్రామాల్లో ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం అధ్యాపకులు శనివారం ప్రచారం చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కలిసి ప్రవేశాలు పొందాల్సిందిగా కోరారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్న సౌకర్యాలను విద్య బోధన గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ, సీఈసీ కోర్సులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ రాజీయోద్దీన్ తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్స్పై విచారణ జరపాలి నిజామాబాద్ అర్బన్ : నగరంలోని శ్రీచైతన్య, నా రాయణ విద్యాసంస్థలు నకిలీ డాక్యుమెంట్లతో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థలు విద్యాశాఖకి ఇచ్చిన ఫీజుల వివరాల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. నాయకులు వంశీ, సునీల్, ఉదయ్, శశాంక్, రాజు, గోపి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్హెచ్ గెలవాలని పూజలు ఇందల్వాయి : ఐపీఎల్లో ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజేతగా నిలవాలని ఇందల్వాయి గ్రామానికి చెందిన పలువురు యువకులు రామాలయంలో శనివారం పూజలు చేశారు. అభిమానులు లోకాని గోపి, అశోక్, విశాల్, సందీప్, బబ్లూ, అరుణ్, అర్వింద్, అనిల్, శ్రీకాంత్ ఉన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
డిచ్పల్లి : విత్తన దుకాణాల డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్ప వని నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ హెచ్చరించారు. శనివారం డిచ్పల్లి మండలం నడిపల్లి రైతు వేదికలో డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి మండ లాలకు చెందిన విత్తన దుకాణాల డీలర్లకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ.. డీలర్లు రైతులకు విధిగా రశీదు ఇవ్వాలని, వి త్తన లైసెన్స్ వివరాలు, ధరల పట్టిక ఏర్పాటు చే యాలని సూచించారు. అలాగే విత్తనాలు కొనుగో లు చేసిన రైతుల వివరాలను రోజూవారిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు రాంబా బు, దేవిక, ఏఈవోలు, ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు. రైతుల వివరాలు నమోదు చేయాలి నిజామాబాద్ రూరల్ : విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు తమ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చే యాలని ఏవో జాదవ్ హీరా ఆదేశించారు. నిజామాబాద్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మో పాల్, రూరల్ డీలర్లు, సొసైటీ సీఈవోలతో శనివా రం ఆమె సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనా లు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆధ్యాత్మికం..
7 నుంచి శ్రీ సూక్త సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం సుభాష్నగర్ : నగరంలోని శ్రీ లక్ష్మి గణపతి మహా ఆలయంలో శ్రీ సూక్త సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం జూన్ 7, 8, 9వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులుఅరుణ్ కుమార్ శర్మ తెలిపారు. శనివారం నగరశివారులోని బోర్గాం(పి)లోగల శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో ఆయన మాట్లాడారు. 7న యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, శ్రీ సూక్త పారాయణం, 8న శ్రీ సూక్త పారాయణం తర్పణములు, శ్రీ సూక్త యజ్ఞం, శ్రీ చక్రానికి కుంకుమార్చనలు ఉంటాయన్నారు. 9న శ్రీ సూక్త యజ్ఞం సిద్ధిబుద్ధి గణపతి కల్యాణం, పూర్ణహుతి కార్యక్రమంతో ముగుస్తాయని వివరించారు. మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ప్రముఖులతో ప్రవచనాలు, సంగీతం, సాహిత్యం, కవి సమ్మేళనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, ఆదివారం ఉదయం యాగశాలకు భూమిపూజ ఉంటుందని తెలిపారు. ఆలయ ప్రతినిధి అంకం జగదీశ్వర్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి రజతోత్సవం ధర్పల్లి : ధర్పల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రజతోత్సవ శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సత్యసాయి పల్లకీ సేవా చేపట్టారు. అనంతరం ప్రవచనాలను బోధించారు. బాలవికాస్ చిన్నారులచే సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సిద్దిపేట జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ యమునారాణి, జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్, చిలక శంకర్, గంగాధర్, బుచ్చన్న, శోభ, వినిత, జ్యోతి, నవనీత, లక్ష్మి, రాజమణి పాల్గొన్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
బాల్కొండ: క్రీడల్లో గెలుపోటములు సహజమని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బా ల్కొండ చాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడా రు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మండల కేంద్రంలో అ సంపూర్తిగా ఉన్న క్రీడా మైదాన పనులు పూర్తయ్యే లా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేస్తోందన్నా రు. అనంతరం గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. నాయకులు యూనిస్, అన్వర్, కుందారుపు శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ రిటైల్టమాట 24 40 బెండకాయ 25 50 బీరకాయ 50 75 దొండకాయ 25 50 బీర్నిసుకాయ 100 130 కాకరకాయ 40 60 వంకాయ 20 40 పాలకూర 15 30 మెంతికూర 50 80 కొత్తిమీర 40 60 పుదీనా 60 80 క్యాప్సికం 50 80 గాజరుగడ్డ 30 50 పచ్చిమిర్చి 50 80 దోసకాయ 15 30 ఆలుగడ్డ 25 40 గోబిగడ్డ 20 40 గోబిపువ్వు 25 50 బీట్రూట్ 30 60 కరివేపాకు 40 70 చామగడ్డ 40 70 గోరుచిక్కుడు 50 80 చిక్కుడుకాయ 40 80 – సుభాష్నగర్కూరగాయల ధ రలు(రూ.) -
సమాచారం..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నిజామాబాద్నాగారం : నగరంలోని సుభాష్నగర్ సబ్స్టేషన్లో మరమ్మతులతో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఆపరేషన్ టౌన్–2 తోట రాజశేఖర్ తెలిపారు. సుభాష్నగర్, కంఠేశ్వ ర్, పాములబస్తి, హమల్వాడి, నాందేవ్వాడ, హౌ సింగ్ బోర్డ్, బ్యాంక్ కాలనీలో కరెంట్ ఉండదన్నా రు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్నాగారం : ప్రైవేట్ కాలేజీల్లో ఉచిత ప్రవేశం కోసం దివ్యాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రసూల్బీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో 7.0, ఆపై జీపీఏ వచ్చిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 30లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, 08462 –251690 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
బాధితులకు అండగా ఉంటాం
జక్రాన్పల్లి : మండలంలోని చింతలూరులో మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త అశోక్ కుటుంబా న్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారెడ్డి, సాయా రెడ్డి, వినోద్, లక్ష్మణ్, నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ ఉన్నారు. ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి లో అనారోగ్యంతో మృతి చెందిన జాన గంగాధర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివా రం పరామర్శించారు. నవీన్గౌడ్, సాయిరెడ్డి, వెంకట్రెడ్డి, గంగాధర్, మల్లయ్య, మురళి ఉన్నారు. ఉపాధి కూలి రూ.600 చెల్లించాలి ఇందల్వాయి: ఉపాధి హామీ కూలి రూ.600 చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మండలంలోని అన్సాన్పల్లిలో ఉపాధి కూలీలతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ పథకం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. నాయకులు రమేష్, సాయారెడ్డి, కిశోర్, దామోదర్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న వెంట్రిలాక్విజం నిజామాబాద్ అర్బన్: బాలభవన్లో వేసవి శిక్షణ తరగతులలో భాగంగా శనివారం జాదూ రంగనాథ్ వెంట్రిలాక్విజం ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయన బొమ్మతో మాట్లాడించగా చిన్నారులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, ఉమాబాల, పుష్పలత, అర్చన, శ్రీలత, గణేశ్ పాల్గొన్నారు. ఆర్థికసాయం నిజామాబాద్ నాగారం: నగరంలోని బ్రహ్మపురిలో నివాసముంటున్న పద్మావర్ సంతోష్ కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతూ మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో శనివారం శ్రీలక్ష్మి చేయూత సేవా సమితి సభ్యులు ఆయన భార్యకు రూ.5,755 అందజేశారు. చెన్నోజి బాలరాజు, అలవాల లక్ష్మణ్, గాదెవారి ప్రవీణ్ పాల్గొన్నారు. యువకుల రక్తదానం నిజామాబాద్నాగారం : నగరంలోని సాయినగర్కు చెందిన భవానీ యూత్ సభ్యులు శేఖర్, యువకులు శనివారం నగరంలోని రెడ్క్రాస్కు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నగరంలో రక్తం కొరత ఉందని రెడ్క్రాస్ అర్బన్ చైర్మన్ నరాల సుధాకర్ ద్వారా తెలుసుకొని దాదాపు పదిమంది యువకులు రక్తదానం చేశారు. ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూప్ సభ్యులు రామకృష్ణ, సాయికృష్ణ, రఘురాం, సంతోష్, వెంకటేశ్ రవీందర్, అనిల్, రాకేశ్ పాల్గొన్నారు ఎమ్మెల్సీని కలిసిన కార్పొరేటర్ ఖలీల్వాడి : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ను శనివారం హైదరాబాద్లో 47 డివిజన్ కార్పొరేటర్ అరుణ్ తోపాటు కాంగ్రెస్ నేతలు కలిశారు. డివిజన్కు సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టాలి నిజామాబాద్ అర్బన్ : ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దామ సునీల్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకులు బాలకృష్ణ, సాయికుమార్, దుర్గాదాస్, రితేష్, అలంకార్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
● బోధన్లో 45 డిగ్రీలు నమోదు ● హడలెత్తిస్తున్న వడగాల్పులు●● ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరిసుభాష్నగర్: రోహిణి కార్తెలో అడుగు పెట్టిన మరు సటిరోజు నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నా డు. మూడ్రోజుల నుంచి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. చాలారోజుల తర్వాత జిల్లా లోని బోధన్లో శనివారం అత్యధికంగా 45.3 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైంది. దీనికితోడు వడగాల్పులు తీవ్రంగా వీచాయి. ఉదయం 12 గంటల తర్వాత వడగాల్పులతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందు లు పడ్డారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలతో రాత్రి ఉష్ణోగ్రతలు పోటీపడుతున్నాయి. మోర్తాడ్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 37.4 డిగ్రీలు నమోదైంది. కూ లర్లు పనికిరావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఉక్కపోత వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. కాగా వడగాల్పులకు వాహనదారులు టోపీలు, ముఖానికి మాస్కు లు, చేతిరుమాళ్లు వంటి వాటితో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలను బయటకు తీసుకురావద్దని చెబుతున్నారు. -
విద్యను వ్యాపారంగా మార్చడం తగదు
నిజామాబాద్ అర్బన్ : కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చడం తగదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని నాందేవ్వాడాలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో ‘ఫీజుల నియంత్రణ– ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేశ్ అధ్యక్షత వహించగా రిటైర్డ్ హెడ్మాస్టర్ నర్రా రామారావు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రూ.లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్నారు. ప్రతి పాఠశాలలో పేద వర్గాల విద్యార్థులకు 25 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ ప్రైవేట్ బడుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించాలని డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటింగ్ అథారిటీ చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్క గణేశ్, అంజలి, రఘురాం, జన్నారపు రాజేశ్వర్, రామ్మోహన్రావు, రమేశ్బాబు, సుజాత, నరేశ్, దీపిక పాల్గొన్నారు. -
విలువ ఆధారిత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి
రుద్రూర్: రైతులు విలువ ఆధారిత వ్యవసాయం వైపు దృష్టి సారించి ఆదాయాన్ని పెంపొదించుకోవాలని ఐసీఏఆర్– ఏటీఏఆర్ఐ హైదరాబాద్ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా సూచించారు. శనివారం ఆయన రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కేవీకేలో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రం, వ్యవసాయ సమాచార కేంద్రాలను ప్రారంభించారు. వర్మి కంపోస్ట్ విభాగం, మామిడి అంట్ల విభాగం పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్న కార్యక్రమాలపై కేవీకే సిబ్బంది, రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వివిధ మాధ్యమాల ద్వారా వినూత్నంగా మార్కెటింగ్ చేయడం వల్ల ఆదాయం పొందవచ్చన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పంటలు వేయాలని, ఆదాయమే లక్ష్యంగా పాడితో పాటు వ్యవసాయాధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి ఆన్లైన్ అమ్మకాలు చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులను బ్రాండింగ్ చేస్తూ విక్రయిస్తున్న మోర్తాడ్ ఫెడ్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులను ఆయన అభినందించారు. రుద్రూర్ కేవీకేకు స్పెషల్ ఫండ్స్ ఇరవై ఏళ్లుగా రైతులకు సేవలందిస్తున్న రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రానికి స్పెషల్ ఫండ్ మంజూరు చేస్తామని డాక్టర్ మీరా తెలిపారు. రైతుల భాగస్వామ్యంతో వ్యవసాయాభివృద్ధికి, వ్యవసాయంలో మంచి మార్పులు తీసుకురావడానికి ప్రతిపాదనలు చేస్తే నాబార్డు ద్వారా అవసరమైన సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో రుద్రూర్, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు డాక్టర్ అంజయ్య, శివకృష్ణ, నాబార్డు డీడీఎం మోహన్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల డీన్ కల్పన, కేవీకే శాస్త్రవేత్తలు బీవీ రాజ్కుమార్, పి.విజయ్ కుమార్, ఎం.శ్వేత పాల్గొన్నారు. ఐసీఏఆర్– ఏటీఏఆర్ఐ హైదరాబాద్ జోన్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా -
No Headline
ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–2 ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (తెలుగు)– 10.45, 1.45,7.40,10.40 ప్యూరియస్ మ్యాడ్ మాక్స్–(ఇంగ్లీష్)–4.45 స్క్రీన్–3 రాజు యాదవ్ (తెలుగు)– 1.45, 4.40, 10.30, ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) – 7.30 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (తెలుగు)– 1.15, ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (ఇంగ్లిష్) – 4.30, 7.45, 11.00 స్క్రీన్–2 శ్రీకాంత్ (హిందీ) – 1.15, రాజు యాదవ్ (తెలుగు) – 4.15, ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (తెలుగు) – 6.55 స్క్రీన్–3 డర్టీ ఫ్లవర్ (తెలుగు) – 1.25, ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) – 4.05, శ్రీకాంత్ (హిందీ) – 7.00, సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్ (తెలుగు) – 10.00 స్క్రీన్ –4 బిగ్ బ్రదర్ (తెలుగు) – 11.25, సిల్క్ సారీ (తెలుగు) – 2.00, రాజు యాదవ్ (తెలుగు) – 7.50, 10.30 దేవి రాజు యాదవ్ నటరాజ్ ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (తెలుగు) విజయ్ లవ్మీ(తెలుగు)వెండితెరతెలుగు/హిందీ/ఇంగ్లిష్ -
నెట్బాల్ టోర్నమెంట్
నవీపేట: మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో జిల్లా స్థాయి నెట్బాల్ టోర్నమెంట్ను శనివారం నిర్వహించారు. టోర్నమెంట్లో బాలికలు, బాలుర విభాగంలో ఆరు జట్లు పోటీప డ్డాయి. బాలికల విభాగంలో సుద్దులంకు చెందిన శ్రీకర్స్ జట్టు విజేతగా నిలువగా నిజామాబాద్కు చెందిన వారియర్స్ జట్టు రన్నర్గా నిలిచింది. బాలుర విభాగంలో నిజామాబాద్కు చెందిన వారియర్స్ జట్టు విజేతగా నిలువగా.. తాడ్బిలోలికి చెందిన థండర్స్ జట్టు రన్నర్గా నిలిచింది. అనంతరం విజేత జట్లకు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య, నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు బహుమతులను అందజేశారు. -
చనిపోయిందని వదిలేశారు..
ఎడపల్లి(బోధన్): నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లే.. తన కూతురిని చంపించాలని చూ సింది. తమ శారీరక సంబంధానికి అడ్డుగా ఉందని తల్లి, ప్రియుడు కలిసి మరొకరి సహాయంతో హత్యాప్రయత్నం చేశారు. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్, జాన్కంపేట్ గ్రామ శివారులో మైనర్ బాలిక(15) గురువారం తీవ్ర గాయాలతో పడి ఉండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీ సులు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో శనివారం హత్యాయత్నం కుట్ర వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నిజామా బాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన సరితకు విడాకులయ్యాయి. అనంతరం సరితకు అల్తాఫ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న మైనర్ బాలికను తొలగించుకోవాలన్న ప్రియు డి ప్లాన్కు సరిత ఒకే చెప్పింది. మైనర్ బాలికను ఠాణాకలాన్, జాన్కంపేట్ శివారు లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద గల మల్లన్నగుడి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. వీరితో పాటు అల్తాఫ్ స్నేహితుడైన ఆటో డ్రైవర్ ఆరిఫ్ ఉన్నాడు. బాలికను తీవ్రంగా గాయపర్చి న తర్వాత ఉరి వేశారు. చనిపోయిందని భావించి బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. నిందితులు ఆటోలో మైనర్ బాలిక తమ్ముడిని(10) కూడా తీసుకెళ్లారు. తీవ్రగాయాలతో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. బాలిక తమ్ముడిని పోలీసులు సదరం హోంకు తరలించారు. బాధితురాలిని ఐద్వా నాయకులు పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక హత్యాయత్నంలో నిందితులైన సరిత, అల్తాఫ్, ఆరిఫ్లను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపారు. కూతురి హత్యాయత్నంలో తల్లి కుట్ర ప్రియుడితో కలిసి అటవీ ప్రాంతంలో దారుణంగా దాడి తీవ్రగాయాలతో పడి ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలింపు -
జిల్లాలో నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు..
జక్రాన్పల్లి 34.7 43.2 కోటగిరి 35.1 43.2 సాలూర 36.1 43.1 బెల్లాల్ 33.8 43.0 మెండోరా 35.1 42.9 డొంకేశ్వర్ 33.9 42.9ఏర్గట్ల 35.6 43.9 ని.రూరల్ 34.0 43.8 ఎడపల్లి 34.0 43.7 చిన్నమావంది 35.6 43.6 మోస్రా 35.1 43.5 రెంజల్ 36.2 43.4 మండలం కనిష్ట గరిష్ట బోధన్ 35.5 45.3 వర్ని 34.8 44.8 ముప్కాల్ 35.8 44.6 వేల్పూర్ 36.1 44.6 ఆర్మూర్ 34.1 44.3 ఇస్సాపల్లి 34.2 44.1 -
మేఘాలయలో సేంద్రియ పసుపు క్షేత్ర సందర్శన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మేఘాలయ రాష్ట్రంలోని వెస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో గల మూలియ్ గ్రామాన్ని జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి శనివారం సందర్శించారు. ఆ గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పసుపు పండిస్తున్న మహిళా రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ట్రినిటీ సాయోను కలిశారు. ట్రినిటీ సాయో ఎఫ్పీవో(ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్)ను స్థాపించి దాన్ని నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించా రు. ఆమె సేంద్రియ విధానంలో పండిస్తున్న ‘లకడాన్’ అనే రకం పసుపును పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ట్రినిటీ సాయో పండిస్తున్న లకడాన్ పసుపు లో కర్క్యుమిన్ 7 నుంచి 13 శాతం వరకు వస్తోందన్నారు. మహిళా రైతులు కలిసి ఒక సొసైటీగా ఏర్పడి పసుపు పండిస్తుండడంతో పాటు, ట్రినిటీ సాయో చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆమె కు ఉత్తమ మహిళా రైతు అవార్డుతో పాటు పద్మశ్రీ అవార్డు ఇచ్చిందన్నారు. ఈమె పసుపు పంటను సేంద్రియ విధానంలో పండించి, ఆ పంటను ఉడకబెట్టకుండా ఆరబెట్టి, తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి అనంతరం పసుపు పౌడర్ తయారు చేసి 200 గ్రాముల నుంచి 50 కిలోల వరకు ప్యాకేజ్ చేసుకుంటూ మార్కెటింగ్ చేస్తున్నారన్నారు. ఈమెకు కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున సబ్సిడీలు అందజేస్తూ అధిక కర్క్యుమిన్ సాధించేలా ప్రోత్సహిస్తోందన్నారు. ఈ గ్రామానికి తాను పసుపు రైతుగా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే తెలంగాణలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బలంగా లేవన్నా రు. మన పసుపు పంటలో కుర్క్యుమిన్శాతం కేవ లం 3 నుంచి 4 శాతం ఉంటుందన్నారు. మేఘాల య రైతులు 7 నుంచి 13 శాతం తీస్తున్నారన్నారు. తెలంగాణలోనూ ఈవిధంగా పసుపు సాగు చేస్తే 5 నుంచి 10 శాతం వరకు కర్క్యుమిన్ వచ్చేలా చేయవచ్చన్నారు. దీంతో ఇందూరు ప్రాంత పసుపునకు డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచన మేరకు మేఘాలయలోని ఉత్తమ పసుపు రైతును కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నానన్నారు. వివరాలను ఎంపీకి ఇవ్వనున్నట్లు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మన ప్రాంతంలోనూ ఇలాంటి ఎఫ్పీవోలను ఏర్పా టు చేసి సేంద్రియ పద్ధతిలో పసుపు సాగుచేసే విషయమై ఎంపీకి నివేదిక అందిస్తానన్నారు. మహిళా పసుపు రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీతను కలిసిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి -
అధికారుల్లో విజిలెన్స్ గుబులు..!
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో చెక్డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలను వెలుగులోకి తేవాలని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు రాష్ట్ర విజిలెన్స్ ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గంలోని కప్పల వా గు, పెద్దవాగులపై 12 చోట్ల చెక్డ్యాంలను నిర్మించారు. మరో ఐదు చెక్డ్యాంలను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాల కంటే వాటి నాణ్య తా లోపాలు, నీటి లీకేజీ, కట్టలు తెగిపోవడం వల్ల నష్టమే ఎక్కువగా జరిగింది. ఫలితంగా వాగులకు ఇరువైపులా ఉన్న వందల ఎకరాల పంట భూము లు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో చెక్డ్యాంకు రూ. 4.50 కోట్ల నుంచి రూ. 9.80 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ప్రతి చెక్డ్యాం నిర్మాణంలో ఎక్కడో ఒక చోట లోపాలు తలెత్తాయి. చెక్డ్యాంల నిర్మాణం విష యంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని అనవసరంగా అంచనాలను పెంచి ఎక్కువ నిధులను ఖర్చు చేయించారనే ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కో చెక్డ్యాం విషయంలో ఒక విధమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి చెక్డ్యాంల నిర్మాణం నిధుల మంజూరు విషయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందించారు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్కు కూడా విన్నవించారు. దీనికి స్పందించిన విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖ నుంచి అన్ని చెక్డ్యాంల ఫైళ్లను పంపాలని కోరారు. ఇరకాటంలో కింది స్థాయి ఉద్యోగులు చెక్డ్యాం నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను అప్పగించాలని నీటిపారుదల శాఖ బాల్కొండ ఈఈ భా నుప్రకాశ్ను విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. ఆయనను ఇటీవల విజిలెన్స్ రాష్ట్ర కార్యాలయానికి రప్పించి ప్రతి చెక్డ్యాంకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులు, టెక్నికల్ అనుమతి, ఎంబీ రికార్డులు ఇతర నివేదికలను ఇవ్వాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారుల ఆదేశాలతో నీటిపారుదల శా ఖలోని కిందిస్థాయి ఉద్యోగుల, ఇతర అధికారులు ఇరకాటంలో పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నేతల ఒత్తిడికి తలొగ్గి సాధ్యం కాని పనులను కూడా సుసాధ్యం చేసి ఇప్పుడు తాము ఇబ్బందుల్లో పడుతున్నామని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్ విచారణ జరిగితే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లకు ఏమి కాదని ఏదైనా లోపాలు కనిపిస్తే తమకే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. చెక్డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ చేయించాలని సీఎంకు ఫిర్యాదు రికార్డులను ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించిన విజిలెన్స్ -
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్నాగారం: జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల నుంచి పద్మ అవార్డు కోసం సిఫార్సు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లను సెట్లు, 800 పదాలకు మించకుండా అభ్యర్థి చేసిన కార్యక్రమాల గురించి వివరిస్తూ రాసిన పత్రాన్ని జూన్ ఒకటో తేదీలోపు జిల్లా యువజన, క్రీడల కార్యాలయం(స్టెప్), సుభాష్ నగర్, ఇన్కం టాక్స్ కార్యాలయం వద్ద సమర్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం www.padma awards.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
ఆగని ఆగడాలు!
నిజామాబాద్డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసా గుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ముగ్గురు డిబార్ అయ్యారు.ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024– 8లో uతాను కేసీఆర్ దత్తపుత్రుడినంటూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్లు పేట్రేగిపోయిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి వ్యవహారం నిరంతరం వివాదాలమయంగా నడిచింది. అయితే అధికారం కోల్పోయిన తరువాత సైతం జీవన్రెడ్డి ఈ దౌర్జన్యాలను, బెదిరింపుల పర్వాన్ని మాత్రం వదలడం లేదు. ప్రజాప్రతినిధిగా ఉండి పూర్తి ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిన జీవన్రెడ్డి తీరుపై ప్రభుత్వం ఇప్పటికై నా సీరియస్గా స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జీవన్రెడ్డి కుటుంబ సభ్యులపై తాజాగా చేవెళ్ల పోలీస్స్టేషన్లో ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చేవెళ్ల సమీపంలోని ఎర్రపల్లి వద్ద దామోదర్రెడ్డి అనే వ్యక్తికి చెందిన 20 ఎకరాల 20 గుంటల భూమిని కబ్జా చేసి, పైగా ఆయనపై పంజాబ్ గ్యాంగ్తో మారణాయుధాలతో దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ● జీవన్రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూనే అనేక అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఈ అరాచకాలు కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ ప్రజలు ఏమీ చేయలేక, ప్రశ్నించలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డి అక్రమ, అరాచక వ్యవహారాలపై ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇతర పార్టీలతో పాటు బీఆర్ఎస్లోనే ఉన్న దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులందరినీ ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, బెదిరింపులకు గురి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలపై ‘సాక్షి’ కథనాలను ప్రచురించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు జీవన్రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించిన, దౌర్జన్యాలకు సంబంధించి, భూకబ్జాలు, అక్రమ మొరం తవ్వకాలు తదితరాలపై వరుస కథనాలను ‘సాక్షి’ ప్రచురించింది. లక్కంపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఏర్పాటు చేసిన సెజ్లో పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకుని, ఆ సెజ్లోని 429 ఎకరాల భూమిలో 200 ఎకరాలు ఆక్రమించి వెంచర్ వేసేందుకు జీవన్రెడ్డి చేసిన కుట్రను సైతం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అదేవిధంగా జీవన్రెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై నెలల తరబడి తల్వెద గ్రామస్తులు చేసిన పోరాటం గురించి కథనాలు ఇవ్వడం జరిగింది. కథనాలు రాసిన పాత్రికేయులపైనా జీవన్రెడ్డి అనుచరులు దాడులు, హత్యాప్రయత్నాలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక కల్లెడ సర్పంచ్ లావణ్య, ఆమె భర్త ప్రసాద్గౌడ్పై నాటకీయంగా హత్యాయత్నం కేసులు పెట్టించాడు. మరోవైపు స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్పై సైతం ఆలూరు వద్ద దాడి, హత్యాయత్నం చేయించాడు. ఇంత అరాచకంగా, అనైతికంగా వ్యవహరించాడని జీవన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు బ్యానర్లు కట్టారు. ఇలా వచ్చిన ప్రజావ్యతిరేకతతో జీవన్రెడ్డి గత ఎన్నికల్లో మూడోస్థానంతో చిత్తుగా ఓడిపోయాడు. కాగా ఇప్పటికీ మారని జీవన్రెడ్డి ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై బెదిరింపు ప్రకటనలు ఇవ్వడం, చేవెళ్లలో దామోదర్రెడ్డి భూమిని కబ్జా చేసి పంజాబ్ ముఠాతో మారణాయుధాలతో దాడులు చేయించిన విషయమై తక్షణమే ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. న్యూస్రీల్ వివాదాలమయం.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారం అధికారంలో ఉన్నప్పుడూ.. కోల్పోయాకా అవే దందాలు గతంలోనూ.. ఇప్పుడూ దాడులకు ప్రోత్సాహం అడుగడుగునా దౌర్జన్యాలు.. బెదిరింపులు ఇప్పటికీ అదే వైఖరి.. ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించాలంటున్న జనం ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కింద జీవన్రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మించాడు. దీని అద్దె బకాయి లు చెల్లించకపోవడంతో టీజీఎస్ఆర్టీసీ అధికారు లు స్వాధీనం చేసుకునేందుకు నోటీసులిచ్చి సీజ్ చేశారు. హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న జీవన్రెడ్డి శుక్రవారం మాల్ను తిరిగి తెరిచారు. అయితే హైకోర్టు వారంరోజుల గడు వు మాత్రమే ఇచ్చింది. వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే ఎలాంటి నోటీసులు లేకుండానే మాల్ను స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం సబ్ లీజుదారుల ప్రయోజనాల దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల మేరకు మాల్ను తెరిచేందుకు వారం రోజులు గడువు ఇచ్చినట్లు ప్రకటనలో సజ్జనార్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో అద్దె బకాయిల కు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చిన సందర్భంలో వారిని పలుసార్లు జీవన్రెడ్డి బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. -
ఈడబ్ల్యూఎస్తో పేద ముస్లింలకు అన్యాయం
ఖలీల్వాడి: ఈడబ్ల్యూఎస్ ద్వారా ధనిక ముస్లింలకే మేలు జరుగుతుందని, పేద ముస్లింలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఆయన శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. కానీ ప్రధాని మోదీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముస్లిం రిజర్వేషన్లు తొలిగించి ఓబీసీలకు అందిస్తామని చెప్పుడం సరైందికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అనేది వారి ఆర్థిక పరిస్థితులను విద్య, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని చేశారని పేర్కొన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వారికి కాకుండా ఆర్థికంగా ఉన్నవారికి రిజర్వేషన్ కల్పించే జీవోను తీసుకువచ్చిందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించదని, ఇది కేవలం రిజర్వేషన్ లేని ఆర్థికంగా ఉన్న వారి కోసమే బీజేపీ తీసుకువచ్చిందన్నారు. ఈ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10 శాతం రిజర్వేషన్లో అవకాశం ఉండదని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని, వీటి ని రద్దు చేయాలన్నారు. నరేంద్రమోదీ దిగిపోయే లోపు చేసిన తప్పులను సవరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రామర్తి గోపి, వేణు రాజ్, సంతోష్, రాజ నరేందర్, సాయిలు, ప్రమోద్, కేశ రాజు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అందించాలి నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి -
ప్రాణం పోస్తున్నారు..
ఆర్మూర్ టౌన్. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిన వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ పైలట్లు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు సమీప ఆస్పత్రులకు తరలించి ప్రాణాలను కాపాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి 2005 ఆగస్టు 15న ‘108 అంబులెన్స్’ సేవలను ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఆదర్శంగా తీసుకొని దేశంలోని 16 రాష్ట్రాల్లో ‘108’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పక్కన దేశమైన శ్రీలంకలోనూ సేవలందుతున్నాయి. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్ పైలట్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది రోగులను ఆస్పత్రులకు తరలించి ప్రాణాలను కాపాడారు. ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలం నుంచి బాధితులను గంటలోపు ఆస్పత్రికి తరలించే సమయాన్ని గోల్డెన్ అవర్గా భావిస్తారు. ఈ సమయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, నిర్లక్ష్యం వహించినా భారీమూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని 108 సిబ్బంది క్షతగ్రాతులను దేవుళ్లలా కాపాడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 17 అంబులెన్సులు ఉండగా, 34 మంది పైలట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా సుమారు 2500మంది ప్రాణాలను 108 పైలట్లు కాపాడుతున్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడుతున్న 108 పైలట్లు నేడు ‘108 పైలట్ డే’ ఆనందంగా ఉంది 108 అంబులెన్స్లో పని చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడం ఆనందంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు చికిత్స అందించి రెట్టింపు వేగంతో ఆస్పత్రులకు తరలించడం మా విధి. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వేలాది మందికి సేవలు అందిస్తున్నాం. – ఎల్ గణేశ్, 108 పైలట్, ఆర్మూర్ గోల్డెన్ అవర్ కీలకం ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నుంచి గంటలోపు ఆస్పత్రికి తరలించాలి. దీనినే గోల్డెన్ అవర్గా భావిస్తాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడినప్పుడు ఎంతో సంతృప్తి ఉంటుంది. – జి రూపేశ్, 108 పైలట్, ఆర్మూర్ -
షహీన్ ఆస్పత్రికి నోటీసులు
● తాత్కాలికంగా వైద్య సేవలు రద్దు నిజామాబాద్నాగారం: చికిత్స అందించే క్రమంలో మహిళ గర్భసంచిని తొలగించిన నగరంలోని ఖిల్లా రోడ్డులో ఉన్న షహీన్ ఆస్పత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చి తాత్కాలికంగా వైద్య సేవలను రద్దు చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి తుకారాం రాథోడ్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఘటనపై ఫిర్యాదు అందడంతో కలెక్టర్, డీఎంహెచ్వో ఆదేశాల మేరకు వైద్యారోగ్య సిబ్బంది విచారణ చేపట్టారు. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం అందించి మహిళ గర్భసంచిని తొలగించారని నిర్దారిస్తూ నివేదికను అందించారు. దీంతో శనివారం సదరు ఆస్పత్రికి నోటీసులు అందజేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వైద్య సేవలను నిలిపివేయాలని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ అటెండర్ సస్పెన్షన్నిజామాబాద్నాగారం: జిల్లా వైద్యారోగ్యశాఖలో అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్న అటెండర్ అనిల్పై కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ శనివారం సస్పెన్షన్ వేటు వేశారు. పీఆర్సీ ఏరియర్స్ ఇప్పిస్తానని ముత్యం అనే ఉద్యోగి వద్ద నుంచి డీఎంహెచ్వో పేరు చెప్పి అనిల్ రూ.80వేలు తీసుకున్నా డు. గత రెండేళ్లుగా ముత్యం కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోగా, డీఎంహెచ్వో సుదర్శనం పదవీవిరమణ పొందడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై కలెక్టర్కు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు లేఖరాయడంతో విచారణ అనంతరం అనిల్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనిల్ చాలా మంది ఉద్యోగులు వద్ద డబ్బులు తీసుకొని ముప్పుతిప్పలు పెట్టాడని శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ‘ఓపెన్’ ఫీజు చెల్లింపునకు అవకాశం నిజామాబాద్అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గతంలో అడ్మిషన్ పొంది పరీక్షలు రాయని విద్యార్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించి పరీక్షలు రాయొచ్చని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్రావు, అధ్యయన కేంద్రం రీజినల్ కో ఆర్డినేటర్ కె రంజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరానికి అడ్మిషన్ తీసుకున్న మొదటి సంవత్సరం సెమిస్టర్–1 విద్యార్థులు, 2018 నుంచి 2023 వరకు అడ్మిషన్ తీసుకుని సెమిస్టర్–1 పరీక్షలు రాయని విద్యార్థులు రూ.1000 అపరాధ రుసుముతో ఈనెల 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు 28వ తేదీ నుంచి అధ్యాయన కేంద్రంలో నిర్వహించనున్నామని, హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 73829 29612 సంప్రదించాలని సూచించారు. అథ్లెటిక్స్ ఎంపికలు నిజామాబాద్నాగారం: నగరంలోని రాజారాం స్టేడియంలో ఈ నెల 31, జూన్ 1వ తేదీన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–8,10,12,14,16 విభాగంలో బాలబాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయని అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజా గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 8గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని, రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఎంట్రీ ఫీజుగా రూ.100 తీసుకోను న్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులకు సర్టిఫికెట్, మెరిట్ సర్టిఫికెట్, మెడల్స్, వ్యక్తిగత చాంపియన్షిప్ అందజేస్తామన్నారు. ఈ నెల 29న సాయంత్రం 5గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే సర్టిఫికేట్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఎంపికై న వారిని జూన్ 6, 7 తేదీల్లో హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 99890 40776 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
యువతి అదృశ్యం
ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ శనివారం తెలిపారు. శనివారం ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన యువతి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారు. యువతి ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. లిఫ్ట్ గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కామారెడ్డి క్రైం: పట్టణంలోని గంజ్ మార్కెట్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు శనివారం సమాచారం అందింది. ఈ మేరు పట్టణ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. మద్యానికి బానిసై ఆత్మహత్య బోధన్ రూరల్ : మద్యానికి బానిసై మండలంలోని ఊట్పల్లికి చెందిన మల్లేశ్(32) ఆత్మహత్య కు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై నాగనాథ్ తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే మల్లేశ్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగనాథ్ తెలిపారు. ఎట్టకేలకు చల్లారిన మంటలు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణ అభివృద్ధి సంస్థ (టీటీడీసీ)లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు 24 గంటల తర్వాత చల్లారాయి. ఫైరింజన్ సిబ్బంది సూచన మేరకు డీఆర్డీవో సిబ్బంది శుక్రవారం రాత్రి జేసీబీని రప్పించి భవనం గోడను కూల్చి వేయించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను ఆర్పారు. శనివారం ఉదయం వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
- మాక్ డ్రిల్.. పవర్ఫుల్
- బుల్లి చేపలతో భలే మేలు!
- మీషో కూపన్ల పేరిట సైబర్మోసం
- Lok Sabha Election 2024: డమ్ డమ్లో... విజయఢంకా మోగించేదెవరో!
- గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్
- Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
- ‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
- Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
Advertisement