-
ఈవీఎంల మొరాయింపు
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో 7 ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటిని మార్చి కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభించాక నారాయణఖేడ్ పట్టణంలోని 170వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించి 45నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు ఈవీఎం, వీవీ ప్యాట్ రెండింటినీ మార్చి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. పోలింగ్ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు గోపాల్ తివారీ, కలెక్టర్ వల్లూరి క్రాంతిలు పర్యవేక్షించారు. నారాయణఖేడ్లోని కంట్రోల్ రూంలో 12 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడమే కాకుండా ఉన్నతాధికారులకు అందించినట్లు ఆర్డీవో అశోక చక్రవర్తి తెలిపారు. ఎన్నికల తీరు తెన్నులను జిల్లా అధనపు ఏస్పీ సంజీవరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక అనేకచోట్ల వెలవెల బోయాయి. -
ఉదయం నుంచే ఉత్సాహంగా..
పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుంచే ఓటర్లలో ఉత్సాహం కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ వేగంగా సాగగా.. మూడు గంటల వరకు కొంత మందకొడిగా సాగింది. మళ్లీ సాయంత్రం 4 తర్వాత ఊపందుకుంది. దీంతో ఓటింగ్ శాతం పెరిగింది. పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటలలోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రామచంద్రాపురం మండలంలో పలు కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూలైన్లు కనిపించాయి. 6 గంటలు కాగానే పోలింగ్ కేంద్రాలకు తాళం వేసి ఓటర్లను లోపలికి అనుమతించలేదు. సంగారెడ్డిలో వృద్ధురాలిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకు వస్తున్న సిబ్బంది -
పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పలు చోట్ల మొరాయించాయి. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిర్వహించే మాక్ పోలింగ్లోనే కొన్ని ఈవీఎంలలో సమస్య తలెత్తింది. దీంతో వాటిని సరిచేసి పోలింగ్ను ప్రారంభించారు. పోలింగ్ ప్రారంభమయ్యాక కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. తెల్లాపూర్లో ఈవీఎం మొరాయించడంతో ఓటేయడానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో సహా ఓటర్లు క్యూలైన్లో సుమారు గంట వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే నారాయణఖేడ్, తెల్లాపూర్, జోగిపేట్లలో టేక్మాల్ మండలం పల్వంచల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్య వచ్చింది. హత్నూర, చీక్మద్దూర్, పల్పనూర్, గుండ్లమాచనూర్లలో కూడా ఇబ్బంది కలిగించాయి. ఆయా సెక్టోరల్ అధికారులు సాంకేతిక నిపుణుల సహాయంతో సరిచేసి పోలింగ్ను కొనసాగించారు. ఈ క్రమంలో ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. -
పోలింగ్ సరళి ఇలా.. (ఓటింగ్ శాతం) ఉదయం 9 గంటలకు 12.88 ఉదయం 11 గంటలకు 31.83
మధ్యాహ్నం 1 గంటకు 50.71 మధ్యాహ్నం 3 గంటలకు 63.96 సాయంత్రం 5 గంటలకు 71.91 పోలింగ్ ప్రక్రియ ముగిశాక 80 (సుమారు) అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..(సాయంత్రం 5 గంటల వరకు..) జహీరాబాద్ 71.91 అందోల్ 73.69 నారాయణఖేడ్ 70.83 కామారెడ్డి 67.79 ఎల్లారెడ్డి 74.74 జుక్కల్ 72.91 బాన్సువాడ 73.99 నియోజకవర్గం సగటు 71.91 -
12 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపు
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట(అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లోని 196 పోలింగ్ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ప్రజలు దేశంలో కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ జి.మల్లయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
ప్రముఖులు ఓటేశారు..
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ తన కుటుంబసభ్యులతో కలిసి జోగిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్ మున్సిపాలిటీలో, పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బొప్పాపూర్లో ఓటేశారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనీల్కుమార్ మొగుడంపల్లి మండలం మాడ్గిలో, నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్, కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి పాతబస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో, ఎస్పీ చెన్నూరి రూపేష్ 106 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేశారు. -
బొల్లారం, ఖేడ్లో ఉద్రిక్తత
జిన్నారం(పటాన్చెరు): లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీసీ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు డబ్బుతో పాటు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయటాన్ని కౌన్సిలర్ గోపాలమ్మ, రాములు అడ్డుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే బొల్లారం న్యూబస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. డబ్బులు పంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రారెడ్డి, అనిల్కుమార్రెడ్డి, మహేందర్రెడ్డి పోలీసులకు సూచించారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో సీఐ గంగాధర్ కల్పించుకొని చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ రవీందర్రెడ్డి ఆరోపించారు. నారాయణఖేడ్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నారాయణఖేడ్లో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పట్టణంలోని మినీ స్టేడియం వద్ద బీజేపీ కార్యకర్త దుదన్కర్ సంతోష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిల్చొని ఉండగా అటుగా వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ గమనించి ఓట్లు వేసేందుకు వెళ్తున్న ఓటర్లను ఎందుకు మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్యన మాటామాట పెరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పక్కనున్న వారు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దుదన్కర్ సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని మర్వెళ్లిలో పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో బీఆర్ఎస్ ఎంపీటీసీ సంగన్నపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపారు. -
ఐలాపూర్లో ఓటర్లకు డబ్బు పంపిణీ
అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న మల్లేశం అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్నుర మండలం శేర్ఖాన్పల్లిలో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీల ఏజెంట్లకు మధ్య కొంత వివాదం నెలకొంది. పోలింగ్ అధికారి ఒకరు ఓటేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలిని ఓ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పారంటూ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. జిన్నారం మండలం బొల్లారంలో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. -
80 శాతానికి చేరువలో పోలింగ్..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఓటర్లు అప్పటికే కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించినప్పటికీ.. ఈ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోని వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటేశారు. వాతావరణం కూడా అనుకూలించడం, ఎండల తీవ్రత కాస్త తగ్గడం కూడా ఓటింగ్శాతం పెరగడానికి కారణమైంది. జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించింది. పలు కేంద్రాల వద్ద వెబ్క్యాస్టింగ్ నిర్వహించారు. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎన్నికల బందోబస్తును ఎస్పీ చెన్నూరి రూపేష్ పర్యవేక్షించారు. మొత్తం మీద జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జహీరాబాద్ లోక్సభ నియోజవర్గ పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం సంతోషం వ్యక్తం చేసింది.ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50 శాతం దాటింది. సాయంత్రం 5 గంటల వరకు 71.91 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే వరకు సుమారు 80 శాతానికి చేరువలో పోలింగ్ ఉంటుందని అంచనా వేశారు. పూర్తి పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. -
రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలి
సంగారెడ్డి: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు.. మోదీపై లేనిపోని మాటలు చెప్పడ మే కాకుండా రైతుబంధు, రైతు బీమా పథకాలపై ఎలక్షన్ రోజు మధ్యాహ్నమే మాట్లాడడం సరికాదన్నారు. ఈసీకి రేవంత్ పై ఫిర్యాదు చేశానన్నారు. అంతకు ముందు సంగారెడ్డిలో పోలింగ్ బూత్లను సందర్శించి, ఆర్అండ్బీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ బూత్ను సందర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు -
ఓటెత్తారు
సంగారెడ్డి7సంగారెడ్డిలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ క్రాంతిమంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024● సాయంత్రం 5 గంటల వరకే 71.91 శాతం నమోదు ● ఉత్సాహంగా తరలివచ్చి ఓటేసిన ఓటర్లు ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ● పలు ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ ● సరిచేసే వరకు ఇబ్బంది పడిన ఓటర్లు ● సాయంత్రం 6 తర్వాత కూడా పలు కేంద్రాల్లో క్యూలైన్లో ఉండి ఓటేశారు జహీరాబాద్ సెగ్మెంట్లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్జిల్లాలో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం సంగారెడ్డిలో మొదటి సారి ఓటేసిన యువతి -
ఊర కుక్కల దాడిలో 48 జీవాలు మృతి
వర్గల్(గజ్వేల్): ఊరకుక్కల దాడిలో 48 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సోమవారం ఉదయం వర్గల్ మండలం అంబర్పేటలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. వర్గల్ మండలం అంబర్పేటకు చెందిన గొర్రెల పెంపకందారు బండ సత్యనారాయణకు 150 దాకా గొర్రెలు ఉన్నాయి. వాటిని గ్రామ సమీపంలోని గొర్రెల కొట్టంలోకి పంపి వంతుల వారీగా కుటుంబసభ్యులు కాపలా ఉంటారు. ఆదివారం సాయంత్రం జీవాలను కొట్టంలోకి పంపి భోజనం చేసేందుకు ఇంటికెళ్లాడు. భోజనం చేసిన తర్వాత గాలి, వాన రావడంతో సత్యనారాయణ ఇంటి వద్దే ఉండిపోయాడు. అదే రాత్రి కొట్టంపై ఊరకుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అనేక గొర్రెలు గాయాలపాలయ్యాయి. సోమవారం ఉదయం కొట్టం వద్దకు వెళ్లిన సత్యనారాయణ గొర్రెలు మృత్యువాత పడినట్లు గుర్తించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. మృతిచెందిన గొర్రెలను వర్గల్ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ పరిశీలించి బాధితుడిని ఓదార్చి ఆర్థికసాయం అందజేశారు. -
మహిళ ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమ వారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం సోన్ జిల్లా గన్సోర్ తాలుకా, గుటియా తోల గ్రామానికి చెందిన జైన్లాల్ వర్కడే మూడేళ్ల కిందట ఊర్మిళ (30) అనే మహిళను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. కాగా ఊర్మిళకు ఇది వరకే పెళ్లి కాగా, ముగ్గురు పిల్లలున్నారు. ఊర్మిళ, జైన్లాల్ వర్కడే ఇద్దరూ కలిసి ఏడాది కిందట మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామానికి వచ్చి అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఊర్మిళకు మునపటి పిల్లలు గుర్తుకు రావడంతో ఆదివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జైన్లాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడిపై కుక్క దాడి దుబ్బాకటౌన్: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11 వార్డులో ఓ కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఆరు బయట ఆడుకుంటున్న అబ్దుర్ రౌఫ్ (2)పై కుక్క దాడి చేసి ముఖంపై కరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటకు తరలించారు. వంట చేస్తుండగా నిప్పంటుకొని గాయాలు చికిత్స పొందుతూ మహిళ మృతి ములుగు(గజ్వేల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన ములుగులో చోటు చేసుకుంది. ములుగు పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు.. ములుగుకు చెందిన తోడేటి లక్ష్మీ(46)కుటుంబీకులతో కలసి కొంత కాలంగా ములుగులోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాస ముంటుంది. ఏప్రిల్ నెల 8వ తేదీన లక్ష్మి ఇంటిలో వంట పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బట్టలకు నిప్పంటుకొని గాయాల పాలైంది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ లక్ష్మి సోమవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త కిష్టయ్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
నా ఓటు నీకు.. నీ ఓటు నాకు
కోహెడ(హుస్నాబాద్): నా ఓటు నువ్వేస్తే.. నీ ఓటు నేను వేస్తా అన్న చందంగా ఇరువురు ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న ఘటన హుస్నాబాద్ నియోజక వర్గం–32 మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 99 పోలింగ్ బూత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వేల్పుల మైసవ్వ భర్త మల్లయ్య ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు వచ్చింది. నీ ఓటు వేసినట్లు ఉందని ఎన్నికల సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా నివ్వెరపోయింది. తాను ఇప్పుడే వచ్చానని.. ఓటు వేయలేదని సిబ్బందితో వాగ్వాదం చేసింది. అనంతరం ఓటరు జాబితాను అధికారులు పరిశీలించారు. మరో ఇద్దరు ఓటర్లు వేల్పుల మైసవ్వ భర్త ఎల్లయ్య, వేల్పుల మైసవ్వ భర్త బాలయ్య పేర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. సాయంత్రం వేల్పుల మైసవ్వ భర్త బాలయ్య క్రమ సంఖ్య 930 తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి కేంద్రానికి వచ్చారు. ఓటరు చీటిని పరిశీలించిన ఎన్నికల సిబ్బంది వేల్పుల మల్లయ్య భార్య మైసవ్వ ఓటును వేల్పుల ఎల్లయ్య భార్య మైసవ్వ క్రమ సంఖ్య 873 వేసినట్లు నిర్ధారించారు. అనంతరం వేల్పుల మైసవ్వ భర్త మల్లయ్య అనే బాధితురాలు ఓటును వేల్పుల మైసవ్వ భర్త ఎల్లయ్య ఓటు క్రమ సంఖ్యలో నమోదు చేసి ఓటును వేయించారు. ఎట్టకేలకు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం పై పలువురు ఓటర్లు మండి పడ్డారు.కోహెడలో ఇరువురి ఓటు తారుమారు -
హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య
తూప్రాన్: హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య(65) భార్య కొంతకాలం కిందట అనారోగ్యంతో చనిపోయింది. పెళ్లీడు వచ్చిన కూతురు వివాహం చేయలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందేవాడు. ఆదివారం ఇంట్లోంచి బయలుదేరిన ఆగమయ్య తూప్రాన్ పట్టణ సమీపలలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోని హల్దీవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం హల్దీవాగులో మృతదేహం గుర్తించి దర్యాప్తు చేపట్టగా కాళ్లకల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
వైస్ ఎంపీపీ కోళ్లఫారంపై దాడులు
తొగుట(దుబ్బాక): తొగుట ఎంపీపీ ఉపాధ్యక్షుడు బాసిరెడ్డి శ్రీకాంత్రెడ్డి కోళ్ల ఫారాల్లో సోమవారం తెల్లవారుజామున గజ్వేల్ ఏసీపీ పురుషాత్తంరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కాన్గల్ శివారులో గల ఆయన కోళ్ల ఫారంలో రూ.3 కోట్ల నగదు ఓటర్లకు పంపిణీ చేసేందుకు దాచి ఉంచారని గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గజ్వేల్ ఏసీపీతోపాటు తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ లింగంతో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు తరలివచ్చారు. రాత్రి 1.00 గంట నుంచి 3.00 గంటల వరకు రెండు గంటలు తనిఖీలు చేశారు. కోళ్ల ఫారంలో గల అతడి కార్యాలయంతోపాటు కోళ్ల ఫారాల్లోనూ తనిఖీ చేపట్టారు. రెండు గంటల పాటు తనిఖీ చేసినా నగదు దొరకలేదు. డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలంటూ శ్రీకాంత్రెడ్డి పై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కాగా అదే గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ చింతమడక శ్రీధర్ కోళ్ల ఫారమ్లో ఆదివారం సాయంత్రం పోలీసులు కూల్ డ్రింక్స్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరోమారు అర్థరాత్రి గ్రామంలోకి పోలీసులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రూ.3 కోట్లు దాచినట్టు సమాచారం గజ్వేల్ ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీ -
సెల్ఫోన్తో పోలింగ్ కేంద్రంలోకి..
నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలో మంగలి గణేశ్ పోలింగ్ సిబ్బందికి తెలియకుండా సెల్ఫోన్తో కేంద్రంలోకి వెళ్లి ఓటు వేస్తూ చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా తాను ఓటు వేస్తున్న దృశ్యాన్ని పలు వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేశాడు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే యువకుడు సెల్ఫోన్తో కేంద్రలోకి వెళ్లాడని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. ఈ విషయమై ఎస్సై పుష్పరాజును వివరణ కోరగా.. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లక్ష మెజార్టీతో గెలుస్తా కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నర్సాపూర్: మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని పలు పోలింగ్ బూత్లలో ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజాపక్షం ఉన్న కాంగ్రెస్కు ప్రజల దీవెనలు నిండుగా ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ కోసం మంచి ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, నాయకులు మల్లేశ్, చిన్న ఆంజిగౌడ్, శ్రీనివాస్గుప్తా, రవీందర్రెడ్డి, సాగర్, రాధాకిషన్గౌడ్, నగేశ్, శ్రీశైలం యాదవ్ తదితరులు ఉన్నారు. ఓటేసిన దత్తత పుత్రికలు సిద్దిపేటజోన్: మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు రాధ, రాధిక అనే ఇద్దరూ అనాథ బాలికలను చేరదీసి దత్తత తీసుకొని బాలసదనంలో ఆవాసం కల్పించారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం వారిద్దరికీ ఓటుహక్కు సిద్దించిన నేపథ్యంలో స్థానిక సెయింట్ జాన్స్ స్కూల్లోని 132 పోలింగ్ కేంద్రంలో ఓటు హ క్కు వినియోగించుకున్నారు. మొదటిసారి ఓ టు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓటు ఎంతో విలువైంది బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నర్సాపూర్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నర్సాపూర్లోని పలు పోలింగ్ బూత్లలో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు హక్కుతో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, ప్రజలకు ఓటు ఆయుధం లాంటిదన్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ల వద్ద మంచి ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గోపి, నయిమొద్దీన్, సత్యంగౌడ్, బాల్రెడ్డి, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
నారాయణఖేడ్: అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఖేడ్ మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆర్డీఓ అశోక చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు గాను 35 రూట్లుగా విభజించి 38 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. పోలింగ్ నిర్వాహణ కోసం 1,404 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఇందులో పీవోలు 351 మంది, ఏపీవోలు 351 మంది, ఓపీవోలు 702 మంది ఉన్నారు. ఈనెల 12న ఉదయం నుంచి సిబ్బందికి సామగ్రి అప్పగించి కేంద్రాలకు తరలిస్తారు. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా కల్హేర్(నారాయణఖేడ్): వరి ధాన్యం కొనుగోలు చేయడంలేదని మండలంలోని మార్డిలో శనివారం రైతులు ధర్నా చేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు, బడా రైతుల ధాన్యం మాత్రమే తూకం చేస్తున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
సంగారెడ్డి టౌన్ : జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు తివారీ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యవేక్షణలో పూర్తి చేశారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ.. జుక్కల్ 255, కామారెడ్డి 266, ఎల్లారెడ్డి 270, బాన్సువాడ 258, అందోల్ 313, నారాయణఖేడ్ 298, జహీరాబాద్ 313 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ 2344మంది, సహాయ ప్రిసైడింగ్ 2344మంది, ఓపీఓలు 4688 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 1973 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు కేటాయింపులు జరిగాయని, డీఆర్సీ సెంటర్లలో ఆదివారం ఉదయం 7గంటలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు. రిజర్వ్ పోలింగ్ సిబ్బంది కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజారాణి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హస్తం పార్టీతోనే సుస్థిర పాలన
నారాయణఖేడ్: కాంగ్రెస్ ద్వారానే సుస్థిర పాలన అందుతుందని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్కు మద్దతుగా పట్టణం నుంచి వివిధ గ్రామాల మీదుగా శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇచ్చిన మాటను నిలుపుకునే సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సుధాకర్రెడ్డి, తాహేర్, రమేష్ చౌహన్, ముంతాజ్, సిద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోం
హత్నూర(సంగారెడ్డి): రాజకీయ బిక్ష పెట్టి.. రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిన కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి లేదని రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి మంగాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్రెడ్డికి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడం తగదన్నారు. కుటుంబ పాలన ఇప్పుడు గుర్తు కొచ్చిందా మదన్రెడ్డి అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఎంపీపీ నర్సింలు, దామోదర్ రెడ్డి, వీరేశం, శివశంకరరావు, శ్రీనివాస్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మలకు వందనం
పటాన్చెరు టౌన్: మండల పరిధి ఇస్నాపూర్లో శనివారం నిర్వహించిన మదర్స్ డే వేడుకల్లో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులైన బిడ్డలకు సేవ చేస్తున్న 20 మంది మాతృమూర్తులను సన్మానించి చీరలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయమైనా అందించడానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ చంద్రకళ, డీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయురాలు సంతోషమ్మ, శిరీష, ఏపీఎం శ్రీనివాస్, సామాజిక కార్యకర్త బాపు వెంకన్న, కంచిగారి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పది నిమిషాలకో బస్సు
నారాయణఖేడ్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు సొంత గ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి ఈనెల 13 వరకు ఖేడ్, జహీరాబాద్లకు ప్రతీ పది నిమిషాలకో బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ దైవాధీనం తెలిపారు. రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు శనివారం లింగంపల్లి పరిధిలోని బీహెచ్ఎల్ పాయింట్లో నారాయణఖేడ్, సంగారెడ్డి డీఎంలు మల్లేశయ్య, ఉపేందర్, ఖేడ్ పీఆర్వో పాండు, లింగంపల్లి పాయింట్ కంట్రోలర్ మొగులయ్యలతో కలిసి బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
కాంగ్రెస్ కదనోత్సాహం
పటాన్చెరు / పటాన్చెరు టౌన్: లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి రోజు సీఎం రేవంత్రెడ్డి పటాన్చెరులో పర్యటించారు. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం పట్టణంలో రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పటాన్చెరుకు విచ్చేసిన రేవంత్కు జనం నీరాజనం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్రోడ్ వద్ద సీఎంకు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్లు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా పటాన్చెరు అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రోడ్షోలో రేవంత్ రెడ్డి 23 నిమిషాలు మాట్లాడారు. సీఎం ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ రెడ్డి నేతృతంలో బందోబస్తు చేపట్టారు. కాటాను ఎమ్మెల్యేగానే చూస్తాం.. : సీఎం రేవంత్సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాటాను గెలిపించి ఉంటే ఈ ప్రాంతంలో నిధుల వరద పారేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికై నా ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిస్తే చట్టసభల్లో ఈ ప్రాంత సమస్యను వివరించే అవకాశం ఉంటుందని రేవంత్ చెప్పారు. ఎంపీగా మధును గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తానని రేవంత్ చెప్పారు. తన దృష్టిలో కాట శ్రీనివాస్ గౌడ్ కూడా ఎమ్మెల్యేనని రేవంత్ చమత్కరించారు. సంగారెడ్డి కింగ్ జగ్గన్న... జగ్గారెడ్డి సంగారెడ్డి కింగ్ అని సీఎం రేవంత్ సంబోధించారు. సీఎం ప్రసంగం కొనసాగుతుండగా జగ్గారెడ్డి వాహన టాప్పైకి ఎక్కారు. ఆ సందర్భంలో సంగారెడ్డి కింగ్ జగ్గారెడ్డి అంటూ సీఎం అనడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున హోరెత్తారు. సీఎం కార్యాలయం అంతా జగ్గారెడ్డిదే నడుస్తుందని, తాను ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే, అక్కడ పెడుతున్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. పటాన్చెరులో సీఎం రేవంత్ రోడ్షో సక్సెస్ భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు -
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ప్రజల్లో మతపిచ్చి లేపి.. ప్రజలు కత్తులతో పొడుచుకుని, గొంతులు తెగి రక్తం చిందిస్తుంటే బీజేపీ అందులోంచి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ మాయలో పడి అధికారాన్ని కట్టబెడితే, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్షోలో సీఎం రేవంత్ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దయితే బడుగు, బలహీన వర్గాలు ఐపీఎస్, ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలుగా పదవులు పొందే అవకాశం లేకుండా పోతుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికన జరిగితే.. ఈ ఎన్నికలు రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చాలనే ప్రాతిపదికన జరుగుతున్నాయని, దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ, అమిత్షాలు ఏం తెచ్చారు? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వస్తే తెలంగాణకు నిధులు తెస్తారని తాము అనుకున్నామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, పటాన్చెరు వరకు మెట్రో పొడిగింపు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పరిశ్రమల కోసం నిధులు ఇస్తారని అనుకున్నామని, కానీ బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరుగుతుందని, కులాలు, మతాల పేరుతో కొట్లాడుకుంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు రావని అన్నారు. కుర్చీ మీద కుర్చీ వేస్తారా? బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డికి మల్లన్నసాగర్ నిర్వాసితులను పోలీసుల బూట్లతో తొక్కించిన చరిత్ర ఉందని అన్నారు. కేసీఆర్, హరీశ్రావులకు రూ.వంద కోట్లు ఇచ్చినందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామ్రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఎవరైనా కుర్చీ మీద.. కుర్చీ వేస్తారా అని ప్రశ్నించారు. పెగ్గు మీద పెగ్గు వేసినట్లు.. ఎమ్మెల్సీ ఉండగానే వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్టు ఇచ్చారని, పెగ్గులు వేసినప్పుడు టికెట్ ఇచ్చారో.. దిగేటప్పుడు ఇచ్చారో తెలియదని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్లో వందల ఎకరాల భూములు కబ్జా చేసి, ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓడితే ఆయన అక్రమంగా సంపాదించిన నాలుగైదు వందల కోట్లు పోతాయే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిర, వైఎస్ హయాంలోనే అభివృద్ధి మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్ వంటి సంస్థలు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వస్తే.. ఔటర్, శంషాబాద్ విమానాశ్రయం వంటి సంస్థలు దివంగత సీఎం వైఎస్ హయాంలో వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం వివిధ రాష్ట్రాలు, కులాలు, మతాల ప్రజలతో మినీ ఇండియాగా విలసిల్లుతోందన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉందని, ఈ కేసును పర్యవేక్షిస్తున్నది మంత్రి దామోదర రాజనర్సింహ అని అన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్ప్రెస్: 'క్యూట్గా స్వీట్గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement