-
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన నీలం మధు, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్నగర్లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
మీర్పేటలో టెన్షన్ టెన్షన్
మీర్పేట: లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం మీర్పేట కార్పొరేషన్ సిర్లాహిల్స్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించడంతో ఇరువర్గాల నేతలు ఒకరినొకరు దూషించుకున్నారు. అక్కడ ఉన్న టెంట్లను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుపార్టీల నాయకులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల ఘర్షణ టెంట్లు ధ్వంసం,రోడ్డుపై బైఠాయించి నిరసన పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ -
పోలింగ్ ప్రశాంతం: ఎస్పీ
అనంతగిరి: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయిందని ఎస్పీ కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇందుకు సహకరించిన అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు. 1.50 కోట్ల మంది బస్సుల్లో స్వగ్రామాలకు... ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గచ్చిబౌలి: తెలంగాణ వ్యాప్తంగా గడచిన రెండు రోజుల్లో 1.50 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమతమ స్వగ్రామాలకు తరలివెళ్లారని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. కొండాపూర్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 5 వేల టీఎస్ఆర్టీసీ బస్సులను నడిపామని వివరించారు. ప్రస్తుతం వర్కింగ్ డేస్ కావడంతో వెళ్లిన వారంతా ఓటు వేసిన తర్వాత తిరిగి అదే రోజు తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, సంతోష్నగర్, లింగంపల్లి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా అన్ని టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించామని ఎండీ వివరించారు. రెండు రోజులుగా డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీసర్లు, సిబ్బంది చాలా కష్టపడ్డారని తెలిపారు. వారందరినీ యాజమాన్యం పక్షాన, సంస్థ పక్షాన అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా ఒత్తిడి ఉన్నా వారంతా ప్రయాణికుల శ్రేయస్సు కోసం చేసిన సేవలు మరువలేనివని వీసీ సజ్జనార్ కొనియాడారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం తథ్యం హైదరాబాద్: అత్యధిక లోక్సభ స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి వి.సదానంద్ అన్నారు. ఓటర్లంతా కాంగ్రెస్ పక్షాన మొగ్గు చూపారని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటింగ్ సరళి చూసిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిన నేపధ్యంలో లబ్ధిపొందుతున్న ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 12–14స్థానాలు లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకోని కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లంతా ఊరెళ్లిపోయినందుకేనా.. ● లక్షలాదిగా సొంత ఊళ్లకు తరలిన జనం ● గ్రేటర్లో 50 శాతంలోపే పోలింగ్ సాక్షి, సిటీబ్యూరో: ఎండలు నిప్పులు చెరగలే దు. వడగాలులు వీచలేదు. వడగండ్ల వానలు లేనేలేవు. సోమవారం ఉదయం నుంచి సా యంత్రం వరకు నగర వాతావరణం చల్లగానే ఉంది. కానీ పోలింగ్ మాత్రం మందకొడిగానే సాగింది. ప్రతి ఎన్నికల్లో నమోదైనట్లుగానే సాయంత్రం ఐదింటి వరకు 50 శాతం లోపే ఓట్లు పోలయ్యాయి. సాధారణంగా ఈసారి ఎండల కారణంగా సిటీలో ఓటింగ్ తగ్గవచ్చు నని విశ్లేషకులు భావించారు. కానీ అందుకు భిన్నంగా వాతావరణం సహకరించింది. అయి నప్పటికీ ఓటింగ్ ఆశించిన స్థాయిలో పెరగలేదు. నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్ల కు తరలి వెళ్లడం వల్లనే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో ఆ రాష్ట్రానికి చెందిన నగరవాసులు లక్షలాదిగా తరలి వెళ్లారు. నగరంలో ఓటింగ్ శాతం పెరగకపోవడానికి ఇది ప్రధాన కారణం. అదే సమయంలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నగర వాసు లు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పెద్ద సంఖ్యలోనే సొంత ఊళ్లకు వెళ్లారు. వేసవి సెలవుల కారణంగా చాలా మంది ఇంటిల్లిపాది కలిసి పర్యాటక ప్రాంతాలకు, సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఓటింగ్ తక్కువగా నమోదు కావడానికి వేసవి సెలవులు కూడా కారణమే. -
బార్డర్ దాటారంటూ..
పర్వేద పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప లాఠీచార్జి చేవెళ్ల: శంకర్పల్లి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలో 72.14శాతం పోలింగ్ నమోదైంది. మాసానిగూడలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ గ్రామస్తులతో కలిసి ఓటు వేశారు. అక్కడే గ్రామస్తులతో కలిసి ఓటింగ్ తీరును చర్చించారు. మండలంలోని పర్వేద పోలింగ్ కేంద్రం వద్ద పలు రాజకీయ పార్టీల నాయకులు ఒక్కసారిగా గుమ్మిగూడి పోలీసులు నిర్ధేశించిన బార్డర్ దాటి వచ్చారు. దీంతో పోలీసులు వారిని దూరంగా పోవాలని చెప్పినా వినకపోవటంతో శంకర్పల్లి డీఐ ఇన్ప్సెక్టర్ నాగరాజు సిబ్బందితో కలిసి లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. దీంతో వారంతా ఆందోళన చేశారు. దీంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని దీనిని ఎవరు అతిక్రమించవద్దని హెచ్చరించారు. ఈ విషయాన్ని చెప్పకుండా పోలీసులు లాఠీచార్జి చేయటం సరైనది కాదని మండిపడ్డారు. పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలింగ్ కోసమే వచ్చామని ఇలా కొట్టడమేమిటని ప్రశ్నించారు. పలువురు నాయకులు, పోలీసులు సర్ది చెప్పటంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. ఓటు వేసిన మాజీ మంత్రి తుక్కుగూడ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ హోంశాఖ మంత్రి తూళ్ల దేవేందర్గౌడ్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామంలో ఓటు అత్యంత విలువైన ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేసి.. తల్లి అంతిమయాత్ర నిర్వహించి తాండూరు: తల్లి ఇంట్లో విగత జీవిగా మారింది. మరికాసేపట్లో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి. కానీ ఓ కొడుకు ఓటు హక్కును వినియోగించి అనంతరం తల్లికి అంత్యక్రియలు చేశారు. తాండూరు మున్సిపల్ పరిఽధిలోని 11వ వార్డుకు చెందిన మాసప్ప తల్లి ఆదివారం రాత్రి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి తరలి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే తల్లి మృతదేహం ఇంట్లో ఉండగానే ప్రభుత్వ నంబర్–1 పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మాసప్ప తన కొడుకుతో కలిసి వచ్చి ఓటు వేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు తల్లి మృతదేహాన్ని అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ విషయం తాండూరు పట్టణంలో చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరో ఇద్దరికి గాయాలు దౌల్తాబాద్: మండలంలోని బిచ్చాల గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్గౌడ్(20), భాస్కర్, రవిలు ఓకే బైక్పై కోస్గి పట్టణానికి స్విమ్మింగ్ఫూల్కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ముష్రీఫా గ్రామ సమీపాన బైక్ అదుపుతప్పి ఓ చెట్టుకు ఢీకొట్టడంతో విష్ణువర్ధన్గౌడ్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేస్తుండేవారు. రెండు నెలలుగా ఇంటి దగ్గరనే ఉంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటిపోయాయి. బైక్పై ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోస్గి ఆస్పత్రికి తరలించారు. ఈవీఎంల మొరాయింపు బడంగ్పేట్ పరిధిలో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ బడంగ్పేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో భాగంగా సోమవారం బడంగ్పేట మున్సిపాలిటీలోని 235, 237 పోలింగ్ బూతులను స్థానికంగా ఉన్న శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంలు మొరాయించడంతో రెండు చోట్ల 50 నిమిషా లు ఆలస్యంగా మొదలయ్యాయి. టెక్నీషియన్ వచ్చి మరమ్మతు చేసేవరకు ఓటర్లు క్యూలైన్లోనే పడిగాపులు కాశారు. అనంతరం వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలాపూర్ మండలంలోని అల్మాస్గూడ, బాలాపూ ర్, నాదర్గుల్, వెంకటాపూర్, మామిడిపల్లిలో పరిధిల్లోని పోలింగ్ బూత్ల్లో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
వృద్ధురాలు కింద పడ్డారని..
అద్దె బస్సు అద్దం ధ్వంసం చేసిన స్థానికులు యాలాల: మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్లో సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ అద్దె బస్సు అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు డిపో నుంచి ఓ ఆర్టీసీ అద్దె బస్సు మహబూబ్నగర్కు వెళుతుంది. లక్ష్మీనారాయణపూర్ సమీపంలోకి రాగానే ఓ వృద్ధురాలు బస్సు దిగేందుకు యత్నిస్తుండగా కిందపడింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు బస్సు ముందు అద్దాన్ని పగులగొట్టారు. కాగా అదే మార్గంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళుతున్న రూరల్ సీఐ అశోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణను సద్దుమణిగించారు. -
పోల్.. కూల్
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతం వికారాబాద్: చెదురుమదురు సంఘటనలుమినహా జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ధారూరు మండలం అల్లీపూర్లో మధ్యాహ్నం ఈవీఎం మొరాయించగా సరి చేశారు. గంట తర్వాత పోలింగ్ మళ్లీ ప్రారంభమయ్యింది. సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్తో సహా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారివారి ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికలు ముగిసే సమయానికి 68 శాతం ఓటింగ్ నమోదయ్యింది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్నవారందరూ ఓటు వేసేలా చేస్తామని అధికారులు తెలిపారు.కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఓటు వేసిన ప్రముఖులు జిల్లాలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి కు టుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో ఓటు వేశా రు. మర్పల్లి మండల కేంద్రంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఓటేశారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, వికారాబాద్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాలాల మండలం దౌలాపూర్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఓటు వేశారు. దోమ మండలం శివారెడ్డిపల్లిలో పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్(వికారాబాద్లో), మహేశ్రెడ్డి(పరిగిలో) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 9,83,740 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4,85,748, మహిళలు 4,97,957, ట్రాన్స్ జెండర్లు 35 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,148 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని వీడియో రికార్డింగ్ చేశారు. పోలింగ్ సరళి పరిశీలన అనంతగిరి: జిల్లాలో ఓటింగ్ సరళిని వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రా పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్లో ఓటింగ్ను పరిశీలించారు. 68 శాతం పోలింగ్ ధారూరు మండలం అల్లీపూర్లో మొరాయించిన ఈవీఎం గంట తర్వాత మళ్లీ ప్రారంభం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు కొడంగల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం రేవంత్రెడ్డి కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ జిల్లాలో 68 శాతం పోలింగ్ నమో దైంది. పరిగిలో 66 శాతం, వికారాబాద్లో 70 శాతం, తాండూరులో 67.30శాతం, కొడంగల్లో 70శాతం పోలింగ్ నమోదైంది.వేసవి కావడంతో ఉదయమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మధ్నాహ్నం అవుతున్న కొద్దీ కాస్త నెమ్మదించింది. సోమవారం ఎండ కాస్త తక్కువగానే ఉండటంతో జనాలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 7నుంచి 9గంటల వరకు 11శాతం, 11గంటల వరకు 26 శాతం, ఒంటి గంటవరకు 45 శాతం, 3గంటల వరకు 56శాతం, సాయంత్రం 5గంటల వరకు 64.44 శాతం ఓటింగ్ నమోదవ్వగా పోలింగ్ ముగిసే సమయానికి 68శాతం నమోదైంది. -
ఎవరి ధీమా వారిదే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో గెలుపుపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే చేవెళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ కన్పిస్తోంది. నేనే గెలవబోతున్నానని ఒకరు అంటే..కాదు నేనే గెలుస్తానంటూ మరొకరు దీమాగా ఉన్నారు. మైనార్టీల, మహిళల ఓట్లు గంపగుత్తగా తమకే పడ్డాయని.. ఈ ఓట్లు తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ చెబుతుండగా, ఐటీ ఉద్యోగులు, యువత, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు, పట్టణ ఓటర్లు కమలం వైపు మొగ్గుచూపినట్లు ఆ పార్టీ చెబుతోంది. బీఆర్ఎస్ ఓటుబ్యాంకు కూడా బీజేపీ వైపు మళ్లిందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత అంశం సహా ఆరు గ్యారంటీల హామీ, సీఎం రేవంత్రెడ్డి సుడిగాలి పర్యటనలు కాంగ్రెస్కు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. దీనికితోడు చివరి నిమిషంలో నిర్వహించిన పోల్మేనేజ్మెంట్ కూడా ఇందుకు దోహదం చేస్తుందని వారు దీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత రెండు ఎన్నికల్లోనూ హవా కొనసాగించిన బీఆర్ఎస్ ఆఖరి నిమిషంలో చేతులెత్తేసింది. బీసీ కార్డు ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా, మెజార్టీ మండలాల్లో బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి డైవర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలోని షాద్నగర్లోనూ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. షాద్నగర్ పట్టణం సహా గ్రామీణ ప్రాంతాలు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి లోక్సభ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన క్యామ మల్లేశ్ జిల్లా వాసి అయినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయన కూడా చేతులెత్తేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ కేడర్లో చీలిక వచ్చి.. కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా, మరికొంత మంది బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలోని ఎల్బీనగర్లోని మెజార్టీ ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఈటల రాజేందర్ గెలుపు దాదాపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలోని కల్వకుర్తిలోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పోటీ నెల కొంది. ఇక్కడ ఎవరికి వారు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ! చివరి నిమిషంలో చేతులెత్తేసిన బీఆర్ఎస్ బూత్ల వారీగా ఓటింగ్ సరళిపై ఆరా.. -
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
మర్పల్లి: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 58 పోలింగ్ కేంద్రాలలో 44,610 మంది ఓటర్లు ఉండగా ఇందులో 31,795 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 71.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తహసీల్దార్ గణేష్ తెలిపారు. మండల కేంద్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఓటు హక్కు వినియోగించుకోగా మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్రెడ్డి ఓటు వేశారు. తాండూరులో 67 శాతం పోలింగ్ తాండూరు: తాండూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తాండూరు అసెంబ్లీ పరిధిలో మొత్తం 67శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ పరిధిలో మొత్తం 2,43,192 ఓటర్లు ఉండగా అందులో 1,63,769 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకున్న వారిలో 81,248 మంది పురుషులు, 82,518 మంది మహిళలు, థర్డ్ జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ ప్రసాద్కుమార్ -
షాద్నగర్.. పోలింగ్ ప్రశాంతం
● కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు షాద్నగర్, షాద్నగర్రూరల్: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, ఫరూఖ్నగర్, నందిగామ నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండల నేపథ్యంలో షాద్నగర్ పట్టణంతో పాటుగా పలు గ్రామాల్లో ఉదయం 6.30 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అధికారులు పోలింగ్ కేంద్రానికి సంబంధించిన గేట్లను మూసి వేశారు. పోలింగ్ కేంద్రానికి సమయానికి వచ్చిన వారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఆలస్యంగా పోలింగ్ ఫరూఖ్నగర్ మండల పరిధిలోని పీర్లగూడ, ఎలికట్ట, షాద్నగర్ పట్టణంలోని 247 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. పీర్లగూడలో ఈవీఎం మొరాయిచడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. అదేవిధంగా ఎలికట్టలో పోలింగ్ మధ్యలోనే ఈవీఎం మొరాయించడంతో ఓట్లు వేసేందుకు వచ్చిన వారు కొందరు పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. దీంతో సుమారు 40 నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. అనంతరం అధికారులు ఈవీఎంలను సరి చేశారు. ప్రముఖుల సందడి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి తన స్వగ్రామమైన దూసకల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్నగర్ పట్టణంలోని వెంకటేశ్వర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిశీలించిన డీసీపీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా షాద్నగర్ ఏసీపీ రంగస్వామి, పట్టణ సీఐ ప్రతాప్లింగం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్నగర్ ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. -
అకాల వర్షం.. రైతన్నకు కష్టం
యాలాల: మండల పరిధిలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో బెన్నూరు గ్రామ శివారులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసింది. కొందరు రైతులు కవర్లు కప్పి ఉంచినప్పటికీ, ధాన్యం రాశుల కిందకు వరదనీరు చేరింది. దీంతో ఆ నీటిని దిగువకు పారించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. బెన్నూరు కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం -
కొడిచర్లతండా ఓటర్ల నిరసన
కొత్తూరు: తమ సమస్యలను పరిష్కరించాలని లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ కొత్తూరు మండలం కొడిచర్ల తండా ఓటర్లు ఆందోళన చేపట్టారు. నూతనంగా ఏర్పడిన తమ గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రం, రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసే వరకు ఓటు వేయబోమని సోమవారం నిరసనకు పూనుకున్నారు. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడం.. తండా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో అధికారులు వెంటనే స్పందించారు. మండల ఎన్నికల అధికారులు, తహసీల్దార్ రవీందర్రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు ఓటర్లు తమ సమస్యలను వారికి విన్నవించారు. తండా నుంచి పోలింగ్ కేంద్రం సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. తండా పంచాయతీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా రేషన్ దుకాణం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రతినెలా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడిచర్ల గ్రామానికి వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తుందని వాపోయారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తండాలోనే రేషన్ దుకాణం, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు తండావాసుల సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. త్వరలోనే రేషనన్ దుకాణం ఏర్పాటుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. అనంతరం వారికి వాహనాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రానికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బూత్ ఏర్పాటుకు నిరసన కందుకూరు: తమ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నిసార్లు వినతులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో మండల పరిధిలోని తిమ్మాపూర్ అనుబంధ గ్రామం చీమలవానికుంట ఓటర్లు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఓటు వేయకుండా సోమవారం గ్రామంలోనే బైఠాయించారు. చీమలవానికుంట గ్రామం తిమ్మాపూర్ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర దూరంలో ఉంటుంది. దాదాపుగా 350 మంది వరకు ఓటర్లు ఉన్నారు. కాగా పోలింగ్ బూత్ను గతంలో తమ గ్రామంలోనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతులు చేసినా ఉపయోగంలేదు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో సైతం చీమలవానికుంట ఓటర్లకు తిమ్మాపూర్లోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న పోలింగ్ బూత్కు 350 మంది వరకు ఓటర్లు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీంతో వారు సోమవారం ఉదయం 8 గంటల నుంచి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఓటు వేయమంటూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డితో పాటు ఎన్నికల అధికారులు వారి వద్దకు వెళ్లి భవిష్యత్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఇక్కడే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిరసన విరమించి సొంత వాహనాల్లో ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు తరలివెళ్లారు. పోలింగ్ కేంద్రం, రేషన్ షాపు కోసం రోడ్డుపై బైఠాయింపు అధికారుల హామీతో సద్దుమణిగిన వ్యవహారం -
ఓటర్ల అవస్థలు
● మొరాయించిన ఈవీఎంలు ● అల్లిపూర్లో గంట వరకు ఆగిన పోలింగ్ ● క్యూలైన్లో నిరీక్షించిన వృద్ధులు, మహిళలు ధారూరు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అల్లిపూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్(ఈవీఎం)లు ఒక్కసారిగా మొరాయించాయి. మధ్యాహ్నం 3:10 గంటలకు ఆగిన వీటిని సరిచేయడానికి టెక్నికల్ సిబ్బంది అరగంట పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్టోరియల్ ఆఫీసర్ శర్బలింగం తన వాహనంలో సీయూ, బీయూ, వీవీ ప్యాట్లను తీసుకురాగా టెక్నికల్ సిబ్బంది అమర్చి సాయంత్రం 4:10 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఓటర్లకు అవకాశం కల్పించారు. పోలింగ్ ఆగిన విషయాన్ని తెలుసుకున్న ధారూరు సర్కిల్ సీఐ రామకృష్ణ, తహసీల్దార్ సాజిదాబేగం అల్లిపూర్ చేరుకుని పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు ప్రత్యేక పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరూ గుమిగూడకుండా బందోబస్తు చేశారు. కాగా మొరాయించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను ప్యాక్చేసి సీల్ వేశారు. వీటిలో పడిన ఓట్లు ఎక్కడికీ పోవని, మీరు వేస్తున్న మిగిలిన ఓట్లు రెండో ఈవీఎంలో నిక్షిప్తమవుతాయని సెక్టోరియల్ ఆఫీసర్ శర్బలింగం ఓటర్లకు వివరించారు. గంటపాటు నిరీక్షణ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్లు మొరాయించడంతో ఓట్లు వేయడానికి వచ్చిన వృద్ధులు, మహిళలు గంటపాటు నిరీక్షించారు. మిషన్లు మొరాయించాయని తెలుసుకున్న ఇతర గ్రామస్తులు ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ బూత్లో మొత్తం 956 ఓట్లు ఉండగా 3:10 గంటల వరకు 631 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ గంటపాటు నిలిచిపోయినందున మరో గంట అదనపు సమయం కేటాయించాలని ఓటర్లు సెక్టోరియల్ ఆఫీసర్ శర్బలింగాన్ని కోరారు. అదనపు సమయం కేటాయించేందుకు వీలుండదదని సాయంత్రం 6 గంటల వరకు ఎంతమంది ఓటర్లు పోలింగ్ బూత్ ఆవరణలోకి ఉంటారో వారందరూ ఓట్లు వేసేలా చూస్తామని నచ్చజెప్పారు. నాగసమందర్లో.. మండల పరిధిలోని నాగసమందర్లోని ఓ బూత్లో బ్యాలెట్ యూనిట్ సమస్యరావడంతో 10 నిమిషాల పాటు ఓటింగ్ ఆగిపోయింది. ఆ సమయంలో ఓ వృద్ధుడు బ్యాలెట్ యూనిట్ బటన్ నొక్కి పట్టడంతో అది తిరిగి పైకి రాలేదు. టెక్నీషియన్లు దానిని సరిచేయడానికి 10 నిమిషాల సమయం తీసుకున్నారు. అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది. -
Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, వికారాబాద్: జిల్లోలోని తాండూర్లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క స్వైర విహారం చేసింది. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్కు చెందిన దత్తు, లావణ్య దంపతుల కుమారుడు ఐదు నెలల పసి కందును పెంపుడు కుక్క పీక్కుతింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను చంపేశారు. తాండూరు పట్టణం బసవేశ్వర నగర్లో ఘటన చోటుచేసుకుంది. -
‘జన’జాతర
తాండూరు: కాంగ్రెస్ పార్టీ శనివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన జనజాతర సభ సక్సెస్ అయ్యింది. ప్రియాంక గాంధీ ప్రసంగం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. పట్టణంలోని విలియం మూన్ స్కూల్ మైదానం జనాలతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకే వేలాది మంది తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జన సమీకరణలో సక్సెస్ అయ్యారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలిక్యాప్టర్లో ప్రియాంక గాంఽధీ, సీఎం రేవంత్రెడ్డి తోపాటు అగ్రనేతలు సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గాంధీ కుటుంబాన్ని గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించగానే అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ముఖ్యమంత్రి బీజేపీపై విమర్శలు గుప్పించారు. సభ ఆలస్యం కావడంతో.. ప్రియాంక గాంధీ జనజాతర సభ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం నాలుగు గంటలకు మొదలైంది. ఉదయం 10 గంటలకే గ్రామాల నుంచి తాండూరుకు వచ్చిన జనం నేతల కోసం నిరీక్షించక తప్పలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రియాంక గాంధీ ప్రసంగించే సమయానికి సభలో చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సభకు హాజరైన జనం కార్యకర్తల్లో జోష్ నింపినప్రియాంక గాంధీ సీఎం రేవంత్ ప్రసంగానికి అభిమానుల కేరింతలు సభ సక్సెస్తో నేతల సంబరాలు -
కమలం శ్రేణుల్లో జోష్
వికారాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్ సభ సక్సెస్ అయ్యింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఎస్ఏపీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి కుటుంబానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ అమిత్ షా ప్రసంగం సాగింది. ఉమ్మడి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కొండా వెంకట రంగారెడ్డికి నివాళులర్పించారు. అంతటి ఉన్నత విలువలు గల కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన మన అభ్యర్థి కొండాను గెలిపించాలని కోరారు. మధ్యా హ్నం 12.05 గంటలకు సభాస్థలికి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసి ప్రసంగాన్ని ప్రారంభించారు. 12.35 గంటలకు సభ ముగిసింది. అంతకుముందు లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, గుల్బర్గా ఎంపీ ఉమేశ్ జాదవ్, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, వీరేందర్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. దేశ అభివృద్ధి, అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. అవినీతి మరక లేని నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీకి విడదీయ రాని అనుబంధనం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశం మోదీ వైపు చూస్తోందని, హ్యాట్రిక్ పీఎం కావడం ఖాయమన్నారు. ఉర్రూతలూగించిన ‘షా’ ప్రసంగం స్టేజీపైకి వచ్చింది మొదలు సభ ముగిసే వరకు అమిత్ షా ప్రసంగం ఆద్యంతం ప్రజలు, కార్యకర్తలను ఉర్రూతలూగించింది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలతో పాటు పొరుగు దేశాలు, కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉగ్రవాదులు, నక్సలిజం గురించి మాట్లాడారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు, రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి, కేసీఆర్, ఒవైసీ, మజ్లీస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రసంగం మొత్తం రాహుల్ బాబా అంటూనే ప్రసంగం సాగింది. ఆర్ఆర్ టాక్స్ వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ప్రధాన ఆలయాలు, దేవతామూర్తుల పేర్లు ప్రస్తావిస్తూ ఉత్సాహపరిచారు. భారత్ మాతాకీ జై.. వందే మాతరం.. జై శ్రీరాం అంటూ నినదించారు. మధ్య మధ్యలో కార్యకర్తలు ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓవరాల్గా అమిత్ షా ప్రసంగం బీజేపీ కార్యకర్తలకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టయ్యింది. భారీగా జన సమీకరణ బీజేపీ నేతలు అనుకున్న స్థాయిలో సభ విజయ వంతం అయ్యింది. నాయకులు భారీగా జనాలను సమీకరించటంలో సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనుకున్న స్థాయిలో జనాలు రావటంతో ఆ పార్టీ నాయకులు, అభ్యర్థి సైతం ఊపి రి పీల్చుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్ అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు మర్రి శశిధర్రె డ్డి, జనార్దన్రెడ్డి, వీరేందర్గౌడ్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి, ప్రహ్లాద్రావు, అంజన్కుమార్, గుమ్మడి రాచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, రమేష్కుమార్, మిట్ట పరమేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ప్రభారీలు కసిరెడ్డి భాస్కర్రెడ్డి, బాలరాజు, రాజవర్ధన్, పార్లమెంట్ ప్రభారి విష్ణువర్ధన్రెడ్డి, జాయింట్ కన్వీనర్ అమరేందర్రెడ్డి, నాయకులు వడ్ల నందు, నవీన్కుమార్, విశ్వజిత్రెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ సక్సెస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన ప్రసంగం మోదీ, జై శ్రీరాం నినాదాలతోహోరెత్తిన సభ -
బీజేపీ గెలుపు ఖాయం
కొడంగల్: పాలమూరులో బీజేపీ గెలుపు ఖాయ మని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం మండలంలోని అన్నారం గ్రామ మాజీ సర్పంచ్ మురళీధర్రెడ్డి తోపాటు పలు గ్రామాలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సైతం బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేయాలని ప్రతి ఒక్కరూ సంకల్పించినట్లు తెలిపారు. పాలమూరు జిల్లాలో బీజేపీ బలం పెరిగిందని భావించిన కాంగ్రెస్ నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎంపీగా గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో మంచి స్థానం లభిస్తుందన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు, వికారాబాద్ కృష్ణా రైల్వేలైన్ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఓటమి భయంలో కాంగ్రెస్ నేతలు పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ -
రంజిత్రెడ్డిని గెలిపించాలి
స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్పీకర్ ప్రసాద్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్లో బైక్ ర్యాలీ, ఎన్టీఆర్ చౌరస్తా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీలోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్కు అండగా ఉండాలన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. హస్తం మన నేస్తమన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు: రాకేష్ రాజన్ ఇబ్రహీంపట్నం రూరల్: లోక్సభ ఎన్నికల వేల ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ ని యంత్రన పరిశీలకుడు కుమార్ రాకేష్ రాజన్ పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని బొంగ్లూర్లో ఎస్ఎస్టీ చెక్పోస్టును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్ని వాహనాలు తనిఖీ చేశారు.. పట్టుబడిన నగదెంత అని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పాలమూరు పోలింగ్కు సర్వం సిద్ధం
కొడంగల్: మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సామగ్రి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. సామగ్రి పంపిణీ సిబ్బందితో మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 91 మంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోగా 85 మంది వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలకు 104 మంది సెక్టోరియల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. సామాగ్రి తరలించేందుకు 90 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 76 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 146 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో 1,316 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పారు. అందులో 329 మంది పీఓ, 329 మంది ఏపీఓ, 658 మంది ఇతర సిబ్బంది ఉంటారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 282 పోలింగ్ కేంద్రాల్లో 2,41,794 మంది ఓటర్లున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, డీటీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ నేడు ఈవీఈఎంల పంపిణీ -
ఎలక్షన్కు ఏర్పాట్లు పూర్తి
పరిగి: లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరిగి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వాసుచంద్ర తెలిపారు. శనివారం ఆయన పరిగి మినీ స్టేడియంలో ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్ బూత్ల పరిధిలో 2,66,566 వేల మంది ఓటర్లున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓ. ఓపీఎస్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశౠమన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇద్దరు ఓపీఏస్, ఇద్దరు వెబ్కాస్టింగ్ సిబ్బంది మొత్తం ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. 27 రూట్లు.. 54 బస్సులు నియోజకవర్గంలో 305 బూత్లతో మొత్తం 1,830 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. 27 రూట్లలో 27 మంది రూట్ ఆఫీసర్లను, 27 మంది సెక్టోరియల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 165 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా 60 కెమెరాలు బయట ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మైక్రో అబ్జర్వర్లు 65 మంది ఉంటారని చెప్పారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఇతర సామగ్రి తరలించేందుకు 27 రూట్లలో 54 బస్సులను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డీఎస్పీ విజయ్కుమార్, సీఐ వెంకట్రామయ్య,, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్ఓ, ఆర్డీఓ వాసుచంద్ర -
భువనగిరి ఖిల్లా ఎవరిదో!
ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో పోటీ త్రిముఖం ఇబ్రహీంపట్నం: లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నాలుగైదు రోజులుగా ఎన్నికల ప్రచారంతో పల్లె, పట్టణం, ఊరు వాడ హోరెత్తింది. బైక్ ర్యాలీలు, మైక్ సౌండ్ రికార్డులు, కార్నర్ మీటింగ్లు, రోడ్డు షోలు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీ శ్రేణులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజవర్గం భువనగిరి లోక్సభ పరిధిలో ఉంటుంది. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్కుమార్రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, సీపీఎం నుంచి ఎండీ జహంగీర్ ప్రధాన పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేశ్ బీఆర్ఎస్ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం నింపింది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మల్రెడ్డి రంగారెడ్డి ఉండటం, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో చేపట్టడం కాంగ్రెస్కు కలిసోచ్చే అంశం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతోపాటు చేయబోయే ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బూర నర్సయ్యగౌడ్ గతంలో ఎంపీగా పనిచేయడంతో ఇక్కడి ప్రజలకు సుపరిచితులు. అప్పట్లో ఆయన చేసిన పనులతోపాటు ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకున్నారు. మోదీ చరిష్మాతోనే విజయం సాధిస్తామనే ధీమాలో బీజేపీ శ్రేణులున్నాయి. ఈ నియోజకర్గం పరిధిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కంటే లోక్సభ అభ్యర్థుల ప్రచారం మొదట్లో మందకొడిగా సాగిన చివరి దశలో ఊపందుకుంది. సోమవారం పోలింగ్, జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుతో నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారో స్పష్టం కానుంది. -
57 రోజుల్లో రూ.11.9 కోట్లు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: లోకసభ ఎన్నికల్లో రాచకొండ పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. కమిషనరే ట్ పరిధిలో మొత్తం ఎనిమిది అంతర్ జిల్లా చెక్ పోస్ట్లను, 29 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 25 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రారంభమైన మార్చి 16 నుంచి ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.11.9 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.2 కోట్లు విలువైన గంజాయి, ఓపియం, ఎండీఎంఏ, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.75.78 లక్షల విలువైన 12,240 లీటర్ల మద్యం, రూ.14.7 లక్షల విలు వైన ఆభరణాలతో పాటు రూ.9.26 లక్షల విలువైన వస్తువులను తనిఖీలలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ తరున్ జోషి శనివారం మీడియాకు వెల్లడించారు. రాచకొండలో 62 లక్షల జనాభా ఉండగా.. 35.27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో ఐదు లోక్సభ, 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 3,396 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా.. వీటిలో 533 క్రిటికల్ స్టేషన్లున్నాయి. ఆయా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. ● కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,114 లైసెన్స్డ్ ఆయుధాలు ఉండగా.. వీటిలో 806 ఆయుధాలు పోలీసుల వద్ద డిపాజిట్ అయ్యాయి. మిగిలినవి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మినహాయింపు ఇచ్చారు. 1,036 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా..4,892 మంది అనుమానితులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. ● 8 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కలెక్షన్ సెంటర్లను, మూడు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బందోబస్తులో 6 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఐటీ బృందంలోని 72 మంది పోలీసులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుంటారు. రూ.2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు కూడా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడి -
రైల్వేస్టేషన్లో ప్రత్యేక భద్రతా చర్యలు
సికింద్రాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కమారుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు తరలి వెళ్లేందుకు పెద్దసంఖ్యలోని ప్రయాణికులు రైల్వేస్టేషన్కు తరలివస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించడం, గందరగోళ పరిస్థితులు నివారించడం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు శనివారం ప్రత్యేక చర్యలు అమలులోకి తెచ్చారు. ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ బీఎస్ సరస్వత్ నేతృత్వంలో 60 మంది అదనపు రక్షణ బలగాన్ని రైల్వేస్టేషన్కు తరలించారు. రైళ్లు వచ్చి వేళ్లే సమయంలో ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ప్రయాణికుల క్యూ లైన్లు ఏర్పాటు చేసి గందరగోళ పరిస్థితులను నివారిస్తున్నారు. చోరీలు జరుగకుండా ఉండేందుకు గస్తీని పెంచారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా 139 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. -
రోడ్డు తవ్వకంపై ఫిర్యాదు
శంషాబాద్: పట్టణంలోని ఎయిర్పోర్టు ముఖద్వారం వద్ద ఉన్న ప్రధాన రహదారి పక్కనే గల రోడ్డును ఓ రిటైర్డ్ అధికారి తవ్వించాడని పక్కనే ఉన్న భూ యజమాని ఫసీయుద్దీన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్పోర్టు నిర్మాణం సమయంలో రోడ్డులో సంబంధిత వ్యక్తి భూమిని సేకరించినప్పటికీ ఆయన ప్రస్తుతం ఉన్న రహదారి కూడా తనదేనని వాదిస్తున్నారన్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసులు స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రహదారిని అడ్డంగా తవ్వడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. -
ప్రచారంలో మాటల తూటాలు
సాక్షి, సిటీబ్యూరో: మహాభారత కురుక్షేత్రంలో యోధానుయోధులు పాల్గొన్నట్లే.. ప్రజాస్వామ్య రణక్షేత్రంలో తమ పార్టీని గెలిపించేందుకు అతిరథ మహారథులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాము అమలు చేయబో యే సంక్షేమ కార్యక్రమాల కంటే ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు మాటల తూటాలనే ప్రధాన ఆయుధాలుగా మలచుకున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా అన్న చందంగా అవినీతి, రిజర్వేషన్లు, కరెంటు, రాజ్యాంగం, యూటీ తదితర అంశాలను ప్రస్తావించారు. గ్రేటర్ పరిధిలో 4 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గెలిస్తే మూడొంతుల ప్రజల మనసులు గెలుచుకున్నట్లు కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పాతబస్తీ పరిధిలో సైతం గతానికి భిన్నంగా పరిస్థితి మారింది. ప్రచా రం కంటే చేసే పనులే గెలిపిస్తాయని నమ్మే మజ్లిస్ పార్టీ సైతం ఈసారి ప్రచారంలోకి దిగడం పోటీ తీవ్రతను చాటింది. మిగతా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారాలతో దుమారం రేపాయి. ప్రధాని మోదీ, అమిత్ షా.. ప్రధాని మోదీ గ్రేటర్ పరిధిలోని నియోజక వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మల్కాజిగిరిలో రో డ్షోలో, ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పా ల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహిస్తున్న హోంమంత్రి అమిత్షా ఓల్డ్సిటీలో రోడ్షోతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో, చేవెళ్ల లోక్సభ పరిధిలోని వికారాబాద్లలో ప్రచారాల్లో పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ పార్టీకి చెందిన మరికొందరు జా తీయ నాయకులు రాజ్నాథ్ సింగ్, తేజస్వీ సూర్య, నవనీత్కౌర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రా ష్ట్రాల సీఎంలు భూపేంద్ర పటేల్, మోహన్ యాద వ్, భజన్లాల్ శర్మలు సైతం పర్యటనలు చేశారంటే ఎంతటి ప్రాధాన్యమిచ్చారో ఊహించుకోవచ్చు. రాహుల్.. ప్రియాంక.. రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ తదితరులు పార్టీ విజయం కోసం ప్రచారాల్లో పా ల్గొన్నారు. రాహుల్ గాంధీ సరూర్నగర్ ఇండోర్ స్టే డియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చే శారు. ప్రియాంకా గాంధీ తాండూరు, పటాన్చెరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్రతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. ఇలా ఎవరికి వారుగా అన్ని పార్టీల హేమాహేమీల ప్రచారాలకు ప్రజలు హాజరైనప్పటికీ, ఎవరికి ఓట్లేస్తారో చెప్పే పరిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపుగా ఇదే స్థాయిలోనేతలు వచ్చినా ఆ ప్రభావం పోలింగ్లో కనిపించకపోవడం తెలిసిందే. గతానికి భిన్నంగా అంశాల ప్రస్తావన -
ప్రచారానికి తెర
● మూతబడిన మద్యం దుకాణాలు ● మూగబోయిన ప్రచార వాహనాలు కుల్కచర్ల: లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శనివారం సాయంత్రంతో ప్రచారపర్వం ముగిసింది. ప్రచార వాహనాలు నిలిచిపోవడంతో పాటుగా స్థానిక లీడర్లు ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరిగేందుకు సిద్ధమయ్యారు. వైన్స్ తాత్కాలికంగా సీజ్ చేశారు. శనివారం సాయంత్రం కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో అబ్కారీశాఖ సిబ్బంది మద్యం దుకాణాలకు తాళం వేసి సీజ్ చేశారు. మంగళవారం ఉదయం వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. అమిత్షాకు ఆహ్వానం మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని హిమాయత్నగర్లోని ఇంటర్నేషనల్ స్వా మి నారాయణ గురుకుల్ పాఠశాలను సందర్శించాలని కేంద్రం హోంమంత్రి అమిత్షాను సుక్ వల్లభ్ స్వామి, కృష్ణచరణ్దాస్ స్వామి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైరదాబాద్కు వచ్చిన ఆయన్ను శనివారం స్వామిజీలు కలిసి గురుకుల్లో విద్యాభివృద్ధికి వారు చేస్తున్న కృషిని వివరించారు. అనంతరం షాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని అమిత్షా అభినందించారు. రూ.16,143 విలువైన మద్యం సీజ్ యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో శనివారం రూ.16,143 విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు సీఐ నర్సింహరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న పద్మ, గీతాబాయిలను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఓటేయండి.. రాయితీ పొందండి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పోలింగ్ శాతా న్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలూ నడుం బిగించాయి. రకరకాల ఆఫర్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చే స్తున్నాయి. ఇప్పటికే కమ్యూనిటీ యాప్ ర్యా పిడో ఓటర్లను పోలింగ్ రోజున ఉచితంగా సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘంతో ఒప్పందం చేసుకున్న సంగతి తె లిసిందే. ఈ నెల 13న ఓటర్లు ర్యాపిడో యా ప్లో ‘ఓట్ నౌ’ కోడ్ను ఉపయోగించి ఉచితంగా బైక్, ఆటో, క్యాబ్ సేవలను అందుకోవచ్చు. వండర్లా ఓటర్లకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. వేలిపై సిరా చుక్కను చూపిస్తే వండర్లా టికెట్పై 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 15 తేదీల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వండర్లా హాలిడేస్ ఎండీ అరు ణ్ చిట్టిలపిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. మ రోవైపు ప్రముఖ డైనింగ్ ఔట్ ఫ్లాట్ఫాం స్వి గ్గీ డైన్ఔట్ భోజన ప్రి యులకు భలే ఆఫర్ను ప్రకటించింది. ఓటర్లు వేలి పై సిరా చుక్కను చూపించి స్విగ్గీ డౌన్ఔట్లోని ఎంపిక చేసిన రెస్టారెంట్ల బిల్లులో 50 శాతం తగ్గింపు ఆఫర్ను అందిస్తుంది. అంతేరా కిచెన్ అండ్ బార్, పపాయ, ఎయిర్ లైవ్, ఫుడ్ ఎక్స్ఛేంజ్–నోవాటెల్, రెడ్ రీనో, కాఫీ కప్ వంటి పలు రెస్టారెంట్లలో ఈ ఆఫర్ను అందుకోవచ్చని స్విగ్గీ డౌన్ఔట్ హెడ్ స్వప్నిల్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్ప్రెస్: 'క్యూట్గా స్వీట్గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement