-
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. దీంతో సీఎంతో పాటు మంత్రులు సచివాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు.శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. అయితే ఒక వైపు లోక్సభ ఎన్నికల కోడ్, మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీని కోరింది. తెలంగాణ ప్రభుత్వ వినతిని సీఈవో వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ నిలిచిపోయింది. -
TG: మేడిగడ్డపై మరో కమిటీ?
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఇచ్చే నివేదిక(మధ్యంతర!).. అందులోని సిఫార్సుల ఆధారంగా నిపుణుల కమిటీ వేయొచ్చని సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మత్తుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలోనే మరో నిపుణుల కమిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న మేడిగడ్డ బ్యారేజీ 7వ గేటను ఇంజినీర్లు ఎత్తేశారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ పరిధిలోకి వచ్చే రిపేర్లు మాత్రమే చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఓకే చెప్పింది. దెబ్బ తిన్న ఏడో బ్లాక్లోని 20, 21 గేట్లను తెరిచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఇక బ్యారేజీకి మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పుణే సంస్థ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. -
వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్ భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలురుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయంధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చరాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చమేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చకొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చకేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. -
రుణమాఫీపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్ సచివాలయంలో జరగనుంది. లోక్ స భ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకా శం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణాల ను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లక్షల రూపాయల వర కు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఒక నిర్ణయం తీసు కుని.. నిధులు సమకూర్చే బాధ్యతను అధికార యంత్రాంగంపై పెట్టే అవకాశం ఉంది.ధాన్యం కొనుగోళ్లపై చర్చప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (కాళేశ్వరం) రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది.ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. -
భూమి విలువ పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయండి ‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలి. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి. తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు ఆదాయం ఎందుకు పెరగలేదు? గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులతో మాట్లాడిన సీఎం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.బంజారాహిల్స్లోని ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి దెబ్బతిన్న నాలా ప్రాంతాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్, గచ్చిబౌలి, చార్మినార్, మలక్పేట్, నాగోల్ కుండపోత వర్షం కురిసింది.భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్ పాస్ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్ఘాట్, మలక్పేట నుంచి దిల్సుఖ్నగర్కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్
-
రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి నిధుల సర్దుబాటు అంశం ఆర్థిక శాఖను కలవరానికి గురి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులు, కేంద్ర గ్రాంట్లు, రాష్ట్రానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం.. రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు, గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంటే.. రుణమాఫీకి నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిధుల వేటలో తలమునకలైంది. రైతు రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని దాదాపు రూ.40 వేల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, గృహ నిర్మాణం ఎలా?ఎన్నికల సమయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు సంక్షేమ మండలి (ఎఫ్డబ్ల్యూసీ)కి రైతు రుణాలన్నింటినీ బదలాయించి, రైతుల పాస్ పుస్తకాలను విడిపించి వారికి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే కార్పొరేషన్కు రుణ మొత్తాన్ని బదలాయించినా..ఆ మొత్తం ‘ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఈ ఒక్క పథకానికే భారీ మొత్తంలో నిధులు తీసుకుంటే, మిగిలిన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం తదితర పథకాలకు నిధులెలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అప్పు చెల్లించడానికి అప్పు కుదురుతుందా?దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ, అసలు కలుపుకొని రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు అంగీకరించినా.. రుణమాఫీ కింద ప్రతినెలా చెల్లించేందుకు రూ.800 కోట్లకు పైగానే కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అనివార్య ఖర్చుల భారం పెరిగి ఇతర కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ఇప్పుడు కొత్తగా చేరే రుణమాఫీ పద్దు ఖజానాకు భారమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు అప్పు చెల్లించడం కోసం తిరిగి అప్పు చేయడానికి ఆర్థిక సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక మహాలక్ష్మి, ఉద్యోగుల పీఆర్సీ, ఇతర పథకాలు దశల వారీగా అమలు చేసినా.. వాటికి కూడా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారవర్గాలు అందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి.తొలి మూడు నెలల్లో రూ.11 వేల కోట్లుఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రణాళికల్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా తొలి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్) రూ.11 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. ఆ మొత్తంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లు పూర్తి కాగా, మే నెలలోనే మరో రూ.2 వేల కోట్ల రుణ సేకరణ ఆర్బీఐ వద్ద షెడ్యూల్ అయి ఉంది. జూన్లో మరో రూ.3వేల కోట్లను తీసుకోనుంది. మొత్తం మీద ఆర్బీఐకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ మూడు నెలల్లో రూ.11 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఎన్నికల వేళ అప్పుల మోతఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల మోత మోగించింది. ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించింది. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంది.ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.2 వేల కోట్లు తీసుకోగా, మే నెలలో రెండు దఫాల్లో రూ.4 వేల కోట్లను సేకరించింది. ఏప్రిల్ 23న రూ.1,000 కోట్లు, అదే నెల రెండో తేదీన రూ.1,000 కోట్లు, మే 7వ తేదీన రూ.3 వేల కోట్లు, మే 14న మరో రూ.1,000 కోట్లు తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నుంచి 28 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. -
మాఫీకి మార్గం చూడండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన విధి విధానా లతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, తన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి‘రైతుల సంక్షేమానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్తాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి..’ అని రేవంత్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి‘ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా త్వరగా ధాన్యం కొనాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలి..’ అని సీఎం ఆదేశించారు. -
రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో రైతులు పడుతు న్న ఇబ్బందులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను నెల రోజులుగా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పారు. తెలంగాణభవన్లో బుధవారం కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ లేదని, హమాలీలు, ధాన్యం సంచుల కొరత, తరు గు పేరిట క్వింటాల్కు మూడున్నర కిలోల చొప్పున కోత విధించడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వీటిపై కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులకు అండగా రోడ్డెక్కి ఆందోళన చేస్తామన్నారు. రైతాంగం ఆందోళన, ధైర్యం చెడొ ద్దని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కేటీఆర్ పిలుపుని చ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తోనే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, బోనస్ వంటి హామీలు అమలయ్యేంత వరకు రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.అప్పులపై రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ శ్వేతపత్రాల పేరిట చిల్లర రాజకీయం చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.3.89లక్షల కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక వెల్లడించిందన్నారు. అప్పులు చేయడం తప్పు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎందుకు అప్పులు చేస్తుందని ప్రశ్నించారు. కొత్తగా చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు చేయడానికి అప్పులు చేయడం దివాలాకోరు విధానం అని, దీనిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ విద్యుత్ ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదని, ఉద్యోగులతో తమది పేగుబంధం అని కేటీఆర్ పేర్కొన్నారు. నయీం లాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మె ల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిలర్, ఎన్నో పార్టీలు మారిన నయీం తరహా వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఐదున్నర నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వపాలన చూసి బీఆర్ఎస్కు మద్దతు పలకాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 30 వేల మంది ఉద్యోగులు భర్తీ కాగా, సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలతో తన ఖాతాలో వేసుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. నల్లగొండపైనే కాంగ్రెస్ ఆశలుఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచే అవకాశముందని కేటీఆర్ అన్నారు. కేవలం నల్లగొండ ఎంపీ స్థానంపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందన్నారు. తెలంగాణభవన్లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘పార్లమెంటు ఎన్నికలు ఆశావ హంగా జరిగినట్టు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థులతో జరిగిన భేటీలో చెప్పారు. నేను ప్రత్యేకంగా చేయించిన సర్వేలోనూ బీఆర్ఎస్ కు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ పడినట్టు తేలింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరు. సునీతా మహేందర్రెడ్డికి మల్కాజిగిరితో ఏమైనా సంబంధం ఉందా. బండి సంజయ్ను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్రావు లాంటి అడ్రస్ లేని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నాగర్కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తున్నాం. పెద్ద పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీతో బీఆర్ఎస్కు ప్రధానంగా పోటీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మళ్లీ గెలుస్తారని మాకు సమాచారం ఉంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
సన్న వడ్లకే బోనస్సా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతాంగాన్ని ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసీఆర్ మండిపడ్డారు. ‘పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన సీఎం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే వర్తింప చేస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేయడం, దగా చేయడమే..’ అని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందైతే తుక్కుతుక్కు చేసేవాళ్లు‘రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం తెలిసీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమే. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్కు రైతుల అవసరం తీరింది. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని ఎన్నికలకు ముందు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. రైతాంగ హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతోంది..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడంపై కూడా నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ సీఎం విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు, కల్లాల సందర్శన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. రైతుల రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు.కాగా, తెలంగాణభవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం రాజకీయాలు చేసుకుంటుంది. ప్రభుత్వ పట్టింపు లేకపోవడంతో రైతుల వడ్లు కొనేవాళ్ళు లేరు. హమాలీల కొరత, ధాన్యం బస్తాల కొరత ఉంది. కామారెడ్డిలో అయిదు రోజులుగా రైతులు రోడ్లు ఎక్కారు. తరుగు పేరుతో క్వింటాల్ ధాన్యం తేసేస్తున్నారు. నిర్మల్, యాదాద్రిలో, భువనగిరి, సిరిసిల్లలో కూడా రైతులు రోడ్డు ఎక్కారు.రైతుల ధాన్యాన్ని వెంటనే తీసుకోవాలి. తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. రౌతులు ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం కొనకుంటే రైతులపక్షాన రోడ్డెక్కుతాం. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ రైతుల తరపునే ఉన్నారు. రైతులకు అవసరమైన చోట కేసీఆర్ ఎప్పటికీ అండగా ఉంటారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికీ గులాబీ జెండానే ఎగిరింది. ఇప్పుడు కుడా గులాబీ జెండానే గెలుస్తుంది. మా అభ్యర్థి రాకేష్ రెడ్డి విద్యావంతుడు. యువకులకు అండగా ఉంటాడు మా అభ్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ అన్నారు. అది దగా డీఎస్సీగా మార్చారు. మా అభ్యర్థిని పట్టభద్రులు గెలిపిస్తే మీకు కావాల్సిన న్యాయంపైన చట్ట సభల్లో వారు ప్రశ్నిస్తారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాల ఏర్పాటు చేశాం. గెలిచినా మొదటి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ఏమీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు. బ్లాక్ మైలర్లను ఎన్నుకుంటే నష్టపోతారు. అలాంటి వారిని ఎన్నుకుంటే మరో నయీమ్లను మళ్లీ చూస్తాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
TG: పాలనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎన్నికలు ముగి శాయి. రాజకీయం అయిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకు సమయం అయిపోయింది. నా విమర్శకులు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. బుధవారం నుంచి సచివాలయానికి వెళ్తానని.. పాలనపై, ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడతానని తెలిపారు. రైతు రుణమాఫీ, తడిచిన ధాన్యం కొను గోళ్లు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్లు, హాస్టళ్లకు సన్నబియ్యం లాంటి కార్య క్రమాల అమలు పనిని ప్రారంభిస్తానని వివరించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు పలు అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ఒక్క మెదక్లోనే బీఆర్ఎస్ పోటీలో ఉందిలోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధిస్తాం.మహబూబ్నగర్ పార్లమెంటులో 50 వేల మెజా ర్టీతో గెలవబోతున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీలో 20 వేల మెజార్టీతో గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏం చేసిందన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ బలవంతంగా మాకు బీజేపీని ప్రత్యర్థిగా సృష్టించింది. బీఆర్ఎస్ వ్యవస్థనంతటినీ తీసుకెళ్లి బీజేపీకి ఔట్సోర్సింగ్ చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. ఆ పార్టీకి ఐదారు చోట్ల డిపాజిట్లు రావు. ఒక్క మెదక్లోనే పోటీలో ఉంది. ఈ ఎన్నికల్లో మోదీ గాలి లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 220కి ఓ పదిశాతం ఎక్కువో, తక్కువో వస్తాయి. కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాదు. 12 సీట్లు గెలిచి ప్రధాని రేసులో ఉంటానన్న కేసీఆర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయినా మాకేం అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం పడిపోవాలంటే బీఆర్ఎస్, బీజేపీలు కలిసే ప్రయత్నం చేయాలి కదా. అలా జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపునకే వెళ్లాలని ఏముంది? సగం మాతో కూడా రావచ్చు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీనే మిగలదు.రైతు రుణాల బాధ్యత తీసుకుంటాంరాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అన్ని విషయాలు చెప్పాం. రైతులకు ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందో లెక్కలు తీయమని చెప్పాం. ఈ రుణాలకు మేం బాధ్యత తీసుకుంటాం. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి ఆదాయం చూపించి రుణాలపై బ్యాంకర్లను ఒప్పిస్తాం. రైతులను అప్పుల నుంచి విముక్తులను చేస్తాం. అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలుబీఆర్ఎస్ గత పాలనలో వివాదాస్పదమైన అన్ని అంశాలపై అసెంబ్లీలో లేదంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటాం. రైతు సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటాం. రైతుకు పెట్టుబడి, గిట్టుబాటు ధరలు కల్పించడంపై నా ఫోకస్ 100 శాతం ఉంటుంది. రైతుబంధు ఇవ్వలేదన్నారు. మే ఆరోతేదీ కల్లా 100 శాతం వేసి చూపించాం. గతంలో డిసెంబర్ వరకూ వేసేవాళ్లు. రైతుబంధు కొత్త నిబంధనలపై ఆషామాషీగా నిర్ణయాలు తీసుకోబోం.రేషన్షాపుల్లో సంస్కరణలురేషన్షాపుల ద్వారా గతంలో మేం 9 వస్తువులిచ్చే వాళ్లం. ఇప్పుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తాజాగా రైతులు పండించే అన్ని పంటలను గిట్టు బాటు ధర కంటే కొంచెం ఎక్కువే ఇచ్చి కొనుగోలు చేసి వాటిని ఉత్పత్తుల కింద మార్చి రేషన్షాపుల ద్వారా పేదలకు తక్కువ ధరకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. వడ్లు కొని మేమే సన్న బియ్యం తయారు చేసి పేదలకిస్తాం. ఇక్కడ పండే దొడ్డు బియ్యాన్ని ఎఫ్సీఐకిస్తాం. మిల్లర్లు ఎక్కడైనా తేడా చేస్తే లోపల వేస్తా. రైతుకు, వినియోగదారుడికి మధ్య వారధిగా ప్రభుత్వం ఉంటుంది. పదేళ్లలో వందేళ్ల ప్రణాళికలుపదేళ్లు ఇక్కడే ఉంటా. 2024–34 వరకు తెలంగాణ రాష్ట్రమే నా ప్రపంచం. ఈ పదేళ్లలో వందేళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించి భావితరాలకు అందించడమే నా బాధ్యత. కొత్తగా మంత్రి పదవులు రెండయితే గ్యారంటీ వస్తాయి. నేనైతే అధిష్టానాన్ని నాలుగు భర్తీ చేసుకునేందుకు అనుమతి అడుగుతున్నా. అనుమతి లభిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి. యూటీ.. ఓ విఫల ప్రయోగంహైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తారనే చర్చ చేస్తున్న వారికి మెదడు లేనట్టే. తలకు మాసినోళ్లు చేసే చర్చ అది. యూటీ ఎందుకు చేస్తారు? అదో విఫల ప్రయోగం. ఏపీతో సానుకూల వైఖరితోనే ముందుకు..ఏపీ నుంచి ఎవరు సీఎం అయినా వారితో కలిసి పనిచేస్తా. సానుకూల వైఖరితోనే ముందుకెళ్తా. -
13 సీట్లు మాకే!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో అంచనాలకు అనుగుణంగా మెరుగైన ఫలితాలను సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వివిధ స్థాయిల్లో అభిప్రాయ సేకరణ తర్వాత 13 లోక్సభ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేస్తామనే తుది అంచనాకు వచ్చింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ సరళిని సమీక్షించారు.ఏయే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ ఇచ్చాయో ఆరా తీశారు. అన్నిచో ట్లా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గుచూపారని నేతలు పేర్కొన్న ట్టు తెలిసింది. మొత్తం మీద అన్నివర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైందనే అంచనాకు వచ్చారు. పెరగనున్న ఓట్ల శాతం!అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 39.40 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 4 నుంచి 5 శాతం వరకు పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. వివిధ సర్వే సంస్థల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని పార్టీ అంచనాకు వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనాకు అందడం లేదనే అభిప్రాయానికి వచ్చింది.గెలిచే స్థానాలు ఇవే..నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహ బూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ సహా నేతలు ధీమా వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు. మల్కాజిగిరి, కరీంనగర్ వంటి చోట్ల బీజేపీ పోటాపోటీగా ఉందని, ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గట్టెక్కుతారని పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. రెండో స్థానంలో బీజేపీ?ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలం పెరిగి అనూహ్యంగా రెండో స్థానానికి పోటీ పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి, వరంగల్, మెదక్, మహబూబాబాద్ లాంటి చోట్ల కూడా బీజేపీ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నాయి. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లే బీజేపీకి టర్న్ అయినట్లుగా పార్టీ నేతలు చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమేనని వారు పేర్కొన్నట్లు తెలిసింది.ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం సమీక్షసాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగను న్న ఉపఎన్నికపై సీఎం ఎ.రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న ఆ మూడు జిల్లాల ముఖ్య నాయకులతో మంగళ వారం రాత్రి ఆయన తన క్యాంపు కార్యాల యంలో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి పనిచేయాలని, తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు.ఈ మూడు ఉ మ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 33 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలకంగా వ్యవహరించి మంచి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నను గెలిపించేందుకు కృషి చేయాలని సీఎం ఆయా జిల్లాల నేతలకు చెప్పారు. -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. పెరిగినది పాజిటివ్ ఓటింగేనంటున్న కాంగ్రెస్.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్ టాక్ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు. బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ.. లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర ఊపుతో.. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు. -
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
-
జస్ట్ రిలాక్స్.. ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్ అవుతున్నారు. రేపు పోలింగ్ జరనుండటంతో ప్రచారం మూడ్ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్బాల్ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక.. ఇటీవల రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్ వేముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తామని హైదరాబాద్ సీసీ కొత్త శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.#Telangana Chief Minister @revanth_anumula visits @HydUniv on Sunday morning engaging in a game of football with the students.This comes after his government followed recent developments in the 2016 Dalit scholar #RohithVemula's suicide case. The police had filed a Closure… pic.twitter.com/Q48PfDbXE6— South First (@TheSouthfirst) May 12, 2024వీడియో క్రెడిట్స్: South First@TheSouthfirst -
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ప్రజల్లో మతపిచ్చి లేపి.. ప్రజలు కత్తులతో పొడుచుకుని, గొంతులు తెగి రక్తం చిందిస్తుంటే బీజేపీ అందులోంచి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ మాయలో పడి అధికారాన్ని కట్టబెడితే, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్షోలో సీఎం రేవంత్ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దయితే బడుగు, బలహీన వర్గాలు ఐపీఎస్, ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలుగా పదవులు పొందే అవకాశం లేకుండా పోతుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికన జరిగితే.. ఈ ఎన్నికలు రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చాలనే ప్రాతిపదికన జరుగుతున్నాయని, దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ, అమిత్షాలు ఏం తెచ్చారు? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వస్తే తెలంగాణకు నిధులు తెస్తారని తాము అనుకున్నామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, పటాన్చెరు వరకు మెట్రో పొడిగింపు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పరిశ్రమల కోసం నిధులు ఇస్తారని అనుకున్నామని, కానీ బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరుగుతుందని, కులాలు, మతాల పేరుతో కొట్లాడుకుంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు రావని అన్నారు. కుర్చీ మీద కుర్చీ వేస్తారా? బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డికి మల్లన్నసాగర్ నిర్వాసితులను పోలీసుల బూట్లతో తొక్కించిన చరిత్ర ఉందని అన్నారు. కేసీఆర్, హరీశ్రావులకు రూ.వంద కోట్లు ఇచ్చినందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామ్రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఎవరైనా కుర్చీ మీద.. కుర్చీ వేస్తారా అని ప్రశ్నించారు. పెగ్గు మీద పెగ్గు వేసినట్లు.. ఎమ్మెల్సీ ఉండగానే వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్టు ఇచ్చారని, పెగ్గులు వేసినప్పుడు టికెట్ ఇచ్చారో.. దిగేటప్పుడు ఇచ్చారో తెలియదని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్లో వందల ఎకరాల భూములు కబ్జా చేసి, ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓడితే ఆయన అక్రమంగా సంపాదించిన నాలుగైదు వందల కోట్లు పోతాయే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిర, వైఎస్ హయాంలోనే అభివృద్ధి మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్ వంటి సంస్థలు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వస్తే.. ఔటర్, శంషాబాద్ విమానాశ్రయం వంటి సంస్థలు దివంగత సీఎం వైఎస్ హయాంలో వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం వివిధ రాష్ట్రాలు, కులాలు, మతాల ప్రజలతో మినీ ఇండియాగా విలసిల్లుతోందన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉందని, ఈ కేసును పర్యవేక్షిస్తున్నది మంత్రి దామోదర రాజనర్సింహ అని అన్నారు. -
తెలంగాణలో రాహుల్, కాంగ్రెస్కు ఇచ్చిపడేసిన అమిత్ షా
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అలాగే, బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడుని సంచలన ఆరోపణలు చేశారు.కాగా, అమిత్ షా శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ దగ్గర ఆటమ్ బాంబ్ ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారు. బాంబ్ ఉందని పీవోకేని పాకిస్తాన్కు అప్పగిస్తామా?. బీజేపీ ఉన్నంత కాలం పీవోకేను పాకిస్తాన్కు అప్పగించడం ఎవరికీ సాధ్యం కాదు. కశ్మీర్ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. సర్జికల్ దాడులు చేసి పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాం. సర్జికల్ దాడులు చేసే ధైర్యం కాంగ్రెస్కు లేదు.రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు రాలేదు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తే.. తమ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అని కాంగ్రెస్ నేతలు భయపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రధాని కావాలా?.. వాళ్లను రక్షించే వాళ్లు కావాలా?. నరేంద్ర మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. కొంచెం వేడి ఎక్కువైతే ఫారిన్ టూర్లకు వెళ్లే రాహుల్ ఒకవైపు.. దీపావళి రోజు కూడా సెలవు తీసుకోని వ్యక్తి మోదీ మరోవైపు. మోదీ, రాహుల్లలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. బీజేపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేష్లను తొలగిస్తాం. కాళేశ్వరం అవినీతికి అడ్డాగా మారింది. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్. సర్జికల్ దాడుల గురించి రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కశ్మీర్ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. బుల్లెట్ ట్రైన్ తొలి స్టాప్ వికరాబాద్లో రాబోతోంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలా?. వద్దా?. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు. -
27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్రెడ్డి తన భుజాలపై వేసుకొని తెలంగాణ అంతా చుట్టివచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన జన జాతర సభతో ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచా రం మొదలవగా 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలలో రేవంత్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి ముఖ్యమంత్రి పలు సభల్లో పొల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదే శాల మేరకు కర్ణాటక, కేరళలలోనూ పర్యటించి బహిరంగ రోడ్ షోలలో ప్రచారం చేపట్టారు.ఈ ప్రచారంలో సీఎం ప్రధానంగా బీజేపీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని ఆయన వ్యాఖ్యనించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు కలిసి వచ్చాయని ఆ పార్టీ భావిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై మోదీ, అమిత్ షా మొదలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వరకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘గాడిద గుడ్డు’ తప్ప ఏమిచ్చిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం విజయం సాధించారని పేర్కొన్నారు. తమ ప్రచారానికి అనూహ్య రీతిలో ప్రజా స్పందన వచ్చిందని.. అందువల్ల 14 సీట్లలో గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా, సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్, అబిడ్స్‘నల్లమల మట్టిలో పుట్టిపెరిగాను. సాధారణ కార్యకర్తగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశా. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్వశక్తితో నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ప్రధాని మోదీ నన్ను అభినందించాల్సింది పోయి అక్రమార్కులను, అవినీతి పరులను పక్కన పెట్టుకుని, నాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.ఎవరు అవినీతి పరులో, అక్రమార్కులో చర్చకు సిద్ధమా? నేను అక్రమ వసూళ్లకు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే షాద్నగర్ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. ఒక వేళ నిరూపించకపోతే.. ప్రధాని మోదీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పగలరా?’ అని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా రోడ్షో అనంతరం షాద్నగర్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో, నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన జనజాతర బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు.అదేవిధంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ బేగంబజార్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. ఆయా సభల్లో రేవంత్ మాట్లాడుతూ.. ’’బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కుటుంబం దొంగసార అమ్మింది. భూములు కొల్లగొట్టింది. కల్లు దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడింది. ఇసుకు దందా చేసింది. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని, నా గడ్డకు వచ్చి నన్ను అవమానిస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు?’’ అని మోదీని నిలదీశారు.బీజేపీ వస్తే వందేళ్లు వెనక్కి..పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చు, మనుషుల మధ్య పంచాయితీలు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుందని, అభివృద్ధి వందేళ్లు వెనక్కి వెళుతుందని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బీజేపీ గెలిస్తే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి పెట్టుబడులు రాకుండా చేస్తారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకు పెట్టుబడులు పోతలేవు. నిత్యం పంచాయితీలు, విషం చిమ్ముతూ ఆ రాష్ట్రాన్ని నాశనం చేశారు.పార్లమెంట్ నుంచి 30 నిమిషాల దూరంలోనే నోయిడా సిటీ ఉన్నా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేక అభివృద్ధికి నోచుకోలేదు. తప్పిపోయి బీజేపీ కేంద్రంలో మళ్లీ వస్తే అభివృద్ధి వందేళ్లు వెనక్కు పోతుంది.’ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్కు ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గోదావరి జలాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.బీజేపీకి 400 సీట్లు కలేకేంద్రంలో 400 సీట్లు రావాలని కలలు కంటున్న బీజేపీకి అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని రేవంత్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోగా, బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో బీజేపీ, మజ్లిస్లు గొడవలకు దిగి హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యను సృషించాలని చూస్తున్నాయన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడితే రాష్ట్రానికి వచ్చే మలీ్టనేషనల్ కంపెనీలను గుజరాత్కు తరలించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. -
CM Jagan: కదిలించిన కడప చైతన్యం
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈరోజు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందో మీ అందరికీ తెలుసు. కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది.. నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మీరంతా చూశారు. ఆ సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక సింబల్ వచ్చి కేవలం 14 రోజులు మాత్రమే అయినా మీ బిడ్డతో మీరంతా నిలబడి 5,45,000 మెజారిటీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆ రికార్డు మెజారిటీతో మీ బిడ్డ ఆరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్? అని చూసింది. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప వన్టౌన్ సమీపంలోని మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఎవరు నిర్ణయించాలి?ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజలు, వైఎస్సార్ మీద అభిమానం ఉన్న వారు నిర్ణయించాలా? లేక ఆ పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్ శత్రువులు నిర్ణయించాలా? అనేది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి.. అదే కాంగ్రెస్, అదే టీడీపీతో ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీరందరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి వాళ్లా వైఎస్సార్ వారసులు?దుర్మార్గంగా అబద్ధాల ప్రచారం...వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును, ఆ కీర్తి ప్రతిష్టలను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఆయన కుమారుడిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ 16 నెలలు నాకు ఎవరు ఇస్తారు? ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించింది. ఆ ఛార్జ్షీట్లో నాన్నగారి పేరును మనంతట మనమే పెట్టించామట! ఇంత దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటే అసలా పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా? ఆ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా?రాజకీయ శూన్యత సృష్టించి...నా పక్కన అవినాష్ ఉన్నాడు. నాకన్నా 13 ఏళ్ల చిన్నోడు. మా అందరికన్నా చిన్న పిల్లోడు. ఈ పిల్లోడి జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు దగ్గర నుంచి కుట్రలు పన్నుతున్నారు. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి, టీవీ 5 దాకా కుట్రలు పన్నుతున్నారు. కడప జిల్లాలో ఒక రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులోకి వాళ్లు రావాలని కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్లంతా మనుషులేనా? అవినాష్ ఎలాంటి వాడో మీకు, నాకు తెలుసు. అవినాష్ మీద నాకు, మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్ను గొప్ప మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ కోరుతున్నా. ఇన్నేళ్లకు ఇడుపులపాయకు..నాన్న 2009లో హఠాన్మరణం పాలైతే ఆ తర్వాత వైఎస్సార్ కుటుంబాన్ని వాళ్లు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికి తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాన్న సమాధి దగ్గరకి వాళ్లు వస్తారట! ఇడుపులపాయ దగ్గరకు వస్తారట! చూడటానికి వస్తారట! ఢిల్లీ నుంచి వస్తారట! ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల వేళ వస్తారట..! ఎన్నికల కోసం వస్తారట! ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలో భాగస్తులం అయినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లే. కాంగ్రెస్కు ఓటు వేస్తే అది నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని, ఎన్డీఏని గెలిపించడం కాదా?పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్తో కాపురం..ఎన్నికల వేళ వీళ్లు ఎందుకు మన రాష్ట్రానికి వస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో గమనించండి. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ పెద్దమనిషి చంద్రబాబు పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రి పూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు! రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో గమనించండి. నాన్నగారు బతికున్నప్పుడు ఎవరితో విబేధించి యుద్ధం చేశారో, ఆయన్ను అభిమానించే ప్రతి కార్యకర్తా ఎవరితో యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్సార్ వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు అదే ఈనాడుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో, చంద్రబాబుతోనూ చెట్టాపట్టాలు వేసుకుని వాళ్లను గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చే యత్నం చేస్తున్నారంటే ఇంతకంటే హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఉంటాయా? -
బీజేపీ కేన్సర్ లాంటిది
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేన్సర్ లాంటిదని, దాన్ని రాష్ట్రంలోనికి ఎంతమాత్రం అనుమతించకూడదని సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో బీజేపీలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీకి చోటు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాచరణ అమలుకే బీజేపీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ మార్పు, రిజ ర్వేషన్లకు కోతే బీజేపీ ఎజెండా అని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. బీజేపీ మతాల పేరుతో చీలుస్తోంది ‘ఎన్నికల్లో ఓడి బలహీనపడ్డ బీఆర్ఎస్ నిస్సహాయతతోనో, వ్యూహాత్మకమో తెలియదు గానీ.. బీజేపీకి రాష్ట్రాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ప్రమాదకరమైన భావజాలం గల బీజేపీని నిలువరించగల శక్తి ఒక్క కాంగ్రెస్కే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు సరిగా లేవని పెట్టుబడులు రావడం లేదు. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోంది. అందు కే పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోనే విశ్వనగరంగా పేరు తెచ్చుకుంది. పొర పాటున బీజేపీ చేతుల్లోకి అధికారం పోతే, నిట్ట నిలువునా మతాల పేరుతో చీలుస్తుంది. మధ్యయుగ చరిత్రను గుర్తుకు తెస్తుంది..’ అని రేవంత్ హెచ్చరించారు. ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తోంది ‘భావోద్వేగాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా. రాజ్యాంగ మార్పు ద్వారా దేశానికి తీవ్ర నష్టం చేయాలని చూస్తోంది. కొన్ని వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ఎంతకైనా దిగ జారుతున్నారు. 2019లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాహూల్ గాం«దీపై విష ప్రచారం చేస్తున్నారు. ప్రాంతాల వారీగానూ బీజేపీ అసమానతలు సృష్టిస్తోంది.కేంద్ర మంత్రి పదవులన్నీ గుజరాత్, యూపీకే ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రధాని ఒక ప్రాంతానికి చెందిన వారుంటే, రాష్ట్రపతి మరో ప్రాంతం వారుండేవారు. గుజరాత్ పెత్తందారీ పోకడలకు చెక్ పెట్టకపోతే ప్రమాదం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. బీజేపీ మోసాన్ని ప్రజలు గుర్తించాలి ‘నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బీజేపీ ఆడాలనుకుంటున్న నాటకం తెలంగాణకు నష్టం చేస్తుంది. జనాభా ప్రాతిపదికన విభజన చేపడితే తెలుగు రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్ ఇండియా వన్ నేషన్ పేరుతో బీజేపీ చేయాలనుకునే మోసాన్ని ప్రజలు గుర్తించాలి. ఓటు వేయడం సామాజిక బాధ్యతగా ప్రజలు గుర్తించాలి. ప్రమాదకరమైన బీజేపీ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. బాండ్లపై విచారణకు సిద్ధం ‘ఎన్నికల బాండ్లపై విచారణకు మేం సిద్ధం. ఎన్నికల ఖర్చు, పార్టీలకు వస్తున్న ఆదాయంపై ఓ కమిటీని నియమించి విచారణ జరిపించాలి. ఇందుకు మా పార్టీ సిద్ధం. ఏ సంస్థ దగ్గరా డబ్బులు తీసుకోకుండా, తమ జేబుల్లోంచి తెచ్చి ఎన్నికల ఖర్చు చేస్తున్నామని భద్రాచలం రాముల వారి దగ్గర నరేంద్రమోదీ గానీ, ఆ పార్టీ వాళ్ళుగానీ ప్రమాణం చేసి చెప్పగలరా? తన పక్కనే అవినీతి పరులను కూర్చోబెట్టుకుని అవినీతి గురించి మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆస్తులు కూడబెడితే, నరేంద్రమోదీ సర్కార్ బడా పారిశ్రామిక వేత్తలకు వాటిని ధారాదత్తం చేసింది. ఇన్ని చేసిన మోదీ నిజాయితీపరుడినని చెప్పుకోవడం హాస్యాస్పదం..’ అని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్కు కొన్నిచోట్ల డిపాజిట్లు రావు ‘ఒవైసీని గెలిపించేందుకే బీజేపీ ఓల్డ్ సిటీలో వివాదాస్పదమైన వ్యక్తిని పోటీలో పెట్టింది. నరేంద్రమోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. కేసీఆర్ మానసిక ఒత్తిడితో నాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా రావు. కల్తీ కల్లు, డ్రగ్స్పై మా సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. బీసీ కులగణన చేపట్టడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలన్నదే మా విధానం ..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
సాక్షి, యాదాద్రి: ‘దేశంలో కుటుంబ పాలనకు, భార తీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికలు మోదీ, రాహుల్కు మధ్య జరుగుతు న్నాయి. మోదీ దేశం కోసం.. వారు కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తారు. ‘ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్.. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ అభివృద్ధి గ్యారంటీ’ మధ్య ఎన్ని కలు జరుగుతున్నాయి..’అని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిచిందని, రేవంత్రెడ్డీ చూస్కో.. ఈసారి 10 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవబోతోంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ బీజేపీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగ మం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని, రాహుల్ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అమలు కాలేదన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం ‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్కు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. అబద్ధాలతో ఈ ఎన్నికలు గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ మోదీ పదేళ్లుగా ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉండి కూడా రిజర్వేషన్లు తొలగించలేదనే విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం అందిస్తోంది. మేం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం. తెలంగాణలో బీజేపీని కనీసం పది సీట్లలో గెలిపించండి. దేశంలోనే నంబర్ వ¯న్గా తెలంగాణను మార్చుతాం..’అని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏబీసీలు మూడూ ఒక్కటే ‘తెలంగాణలో ఏబీసీలు (ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్) మూడూ ఒక్కటే. మూడూ ట్రయాంగిల్ లాంటివి. షరియత్, ఖురాన్ ప్రకారం పాలన కొనసాగించాలని చూస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలుచేస్తున్న వీరు హైదరాబాద్లో శ్రీ రామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతివ్వలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ట్రిపుల్ తలాక్ తీసుకురావాలనుకుంటున్నారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు ఆపింది. కానీ మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదేళ్లలో రామమందిరానికి భూమి పూజ చేయడంతో పాటు ఆలయ నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్టను పూర్తి చేశారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ అంతం చేశారు. నక్సలైట్ సిద్ధాంతాన్ని సమాప్తం చేశారు. 370 ఆర్టీకల్ రద్దుతో కశ్మీర్ మనదే అని తేలిపోయింది. కొత్త టెక్స్టైల్ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మీకులకు ఉపాధి లభించింది. రూ.1,500 కోట్లతో ఈ విధానం అమల్లోకి తెచ్చాం. మోదీ చేనేత పాలసీ తీసుకువచ్చారు..’అని వివరించారు. నర్సయ్యగౌడ్కు ఓటు వేస్తే మోదీకి, అభివృద్ధికి వేసినట్లే అని అన్నారు. ఈ సమావేశంలో నర్సయ్యగౌడ్తో పాటు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తాము గెలిస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని, ఖతం చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు. దేశ పేదల గొంతుక, వారి గుండెచప్పుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు రాజ్యాంగంతోనే లభించాయి. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, మారుస్తామని అనడం ద్వారా బీజేపీ నేతలు పేద ప్రజలపైనే కాకుండా భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నారు..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్, మహాత్మాగాం«దీ, నెహ్రూ లాంటి వారు పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, తమ రక్తం, చెమటను ధారపోశారు. ఆ మహానీయుల కర్మ ఫలాలకు నష్టం కలిగించాలని ఇప్పుడు బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ప్రపంచంలోని ఏ శక్తికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాం«దీ, ఖర్గే, దేశ ప్రజలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు, కూలీలు కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..’ అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో పేదలు, వెనుకబడిన, దళిత, ఆదివాసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న పేదరికాన్ని రూపు మాపుతామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభల్లో ఆయన మాట్లాడారు. మేం కోట్లాదిమందిని లక్షాధికారుల్ని చేస్తాం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల రిజర్వేషన్లను తొలగించేందుకే మోదీ సర్కారు పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు తొలగించాలంటున్న వారికి.. రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్న వారికి మధ్య పోరు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఓ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ల కోసమే అన్నీ చేశారు. దేశ ప్రజలు, రైతులు, శ్రామికుల కోసం కొద్దిగా కూడా పని చేయలేదు. మోదీ 22–25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు. బీజేపీ సర్కారు 22 మందిని కుబేరుల్ని చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మందిని లక్షలాధికారుల్ని చేస్తుంది. పేదల జాబితా తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాందీ, ఖర్గే, నేను, రేవంత్ రెడ్డి, తెలంగాణ నేతలందరం ఓ నిర్ణయానికి వచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాగానే దేశంలోని పేద కుటుంబాల జాబితా తయారు చేస్తాం. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏటా రూ.లక్ష జమ చేస్తుంది. నెలకు మరో రూ.8,500 వేస్తుంది. ఈ డబ్బులతో దేశంలోని పేద కుటుంబాల జీవితాలు బాగుపడతాయి. విద్య, వైద్యం పొందుకోవడంతో పాటు పేదలు అనుకుంది ఏదైనా ఈ డబ్బులతో చేయగలుగుతారు. మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినప్పుడు నోరు విప్పని మీడియా, ఇప్పుడు మేము పేదలకు డబ్బులిస్తామంటే.. వారి అలవాట్లను చెడగొడుతున్నామని విమర్శిస్తోంది. అదానీ మనుషులూ.. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పేదల ఖాతాల్లో మేము రూ.కోట్లు వేయబోతున్నాం..’ అని రాహుల్ స్పష్టం చేశారు. రైతులకు చట్టబద్ధంగా మద్దతు ‘దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము రైతుల కోసం జబర్దస్త్ పని చేయబోతున్నాం. మేనిఫెస్టోలో రెండు హామీలు పొందుపరిచాం. మా సర్కారు రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం. వారికి చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను అందిస్తాం. రైతుల కష్టానికి తగిన ఫలితం లభించని రోజులు ఇక ఉండవు. పక్కాగా తొలి కొలువు మోదీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను తయారు చేశారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, అగ్నివీర్ పథకాల ద్వారా నిరుద్యోగ్యాన్ని పెంచారు. నిరుద్యోగులకు అప్రెంటిస్íÙప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసినవారందరికీ ఈ హక్కుఇవ్వబోతున్నాం. దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 15లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. ఒక ఏడాది కాలం పక్కాగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉత్తమ శిక్షణ లభిస్తుంది. కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి రూ.లక్ష నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. నెలకు రూ.8,500 వేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. ఆశా, అంగన్వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..’ అని రాహుల్ ప్రకటించారు. కులగణనతో రాజకీయాల్లో శాశ్వత మార్పు ‘నరేంద్ర మోదీ ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేశారు. మా ప్రభుత్వం పేద, బలహీన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తుంది. తెలంగాణ తరహాలో మేము దేశ వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలోని పేద, వెనుకబడిన, దళిత, గిరిజన, పేద ఉన్నత కులాలు, మైనారిటీలకు జనాభాలో వారి దామాషా తెలిసిపోతుంది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఈ విప్లవాత్మక చట్టం అమల్లోకి వచ్చాక దేశ రాజకీయాలు శాశ్వతంగా మారిపోతాయి..’ అని ఏఐసీసీ నేత అన్నారు. రేవంత్ బృందం బాగా పనిచేశారు ‘రేవంత్, తెలంగాణ బృందం బాగా పనిచేశారు. 30 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా ఈ పథకాలను అమలు చేస్తాం. మోదీ ఎంత డబ్బు కుబేరులకు ఇచ్చారో అంతే డబ్బును దేశ, తెలంగాణ పేదలకు ఇస్తాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. నేను తెలంగాణ ప్రజల కోసం ఢిలీల్లో సైనికుడిలా పనిచేస్తా. తెలంగాణకు ఏది అవసరమైనా ఆ పని చేసేందుకు నేను ఢిల్లీలో సిద్ధంగా ఉంటా..’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, నేతలు మధుయాష్కీ, మహేందర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement